biscuits
-
సముద్రపు నాచుతో బిస్కెట్లు
ఏయూ క్యాంపస్: సముద్రపు నాచుతో బిస్కెట్లు.. నత్తల పొడితో సూప్.. చేపల నూనెతో శరీర సౌందర్య సంబంధిత క్యాప్సూల్స్.. ఇలా ఎన్నో సముద్ర ఆధారిత ఉత్పత్తులను సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ(సీఐఎఫ్టీ) ప్రపంచానికి పరిచయం చేస్తోంది. సముద్ర జీవులపై పరిశోధనలు చేస్తూ.. వాటిలోని ప్రతీ భాగాన్ని వినియోగిస్తూ కొత్తకొత్త ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెస్తోంది. సముద్రంలో లభించే ప్రతి జీవి నుంచి ఆహార, ఆరోగ్య ఉత్పత్తుల తయారీ లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తోంది. సీఐఎఫ్టీ అభివృద్ధి చేసిన సముద్ర ఆధారిత ఉత్పత్తులు దేశవిదేశాల్లో సైతం మన్ననలు పొందుతున్నాయి.చేపలోని ప్రతి భాగాన్నీ ఉపయోగిస్తూ ఉత్పత్తులు..జీరో వేస్ట్ ప్రాసెసింగ్ దిశగా సీఐఎఫ్టీ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. చర్మం సహా చేపలోని ప్రతీ భాగాన్ని ఉపయోగిస్తూ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. మిగిలిన వ్యర్థాలను సైలేజ్గా మార్చి మొక్కలకు ఎరువుగా వినియోగిస్తున్నారు. చేపల్లోని నూనెను సేకరించి.. క్యాప్సూల్స్ను అభివృద్ధి చేశారు. ఇవి ఎలాంటి వాసన రాకుండా.. అందరూ వినియోగించే విధంగా అందుబాటులోకి తెచ్చారు. అలాగే ఇమ్యూన్ బూస్టర్లు, శరీర సౌందర్యాన్ని కాపాడే ఉత్పత్తులు, న్యూట్రా సూటికల్స్ను తయారు చేస్తున్నారు. రొయ్య పొట్టు నుంచి తయారు చేసిన కాప్సూల్స్.. భోజనానికి ముందు తీసుకుంటే ఆహారంలోని నూనెను సంగ్రహించి బయటకు పంపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తద్వారా శరీరంలో కొవ్వు పెరగకుండా ఉంటుందని వెల్లడించారు. అలాగే చేపలు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి, తాజాగా కనిపించడానికి ఉపయోగించే ఫార్మలిన్ రసాయనాన్ని సులభంగా గుర్తించే కిట్ను కూడా శాస్త్రవేత్తలు తయారు చేశారు. వీరు అభివృద్ధి చేసిన చిన్నపాటి పేపర్ను.. చేపపై రుద్దాల్సి ఉంటుంది. చేప రంగు మారిపోతే ఫార్మలిన్ను ఉపయోగించారని అర్థం. అలాగే చిన్న చేపలను పొడి చేసి పోషకాల సమాహారంగా తయారు చేశారు. దీనిని ఇప్పటికే ఒడిశాలోని పాఠశాలల్లో, ఆదివాసీ ప్రాంతాల పిల్లలకు పోషకాహారంగా అందిస్తున్నారు. చేపల పొలుసు నుంచి డెంటల్ ఫిల్లింగ్ మెటీరియల్ను తయారు చేశారు. సముద్రపు నాచు నుంచి తయారుచేసిన బిస్కెట్లతో పాటు చేపలు, రొయ్యల పచ్చళ్లు, రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు నిల్వ ఉండే రెడీ టు ఈట్ ఫిష్ కర్రీ ప్రత్యేకమైన మూడు పొరల ప్యాకింగ్లలో లభిస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలకు ఇక్కడి ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.. భవిష్యత్లో వీటి సంఖ్య మరింత పెరుగుతుందన్నారు.సముద్రంలోని ప్రతి జీవి నుంచీఆరోగ్య ఉత్పత్తులే లక్ష్యం..జీరో వేస్ట్ ప్రాసెసింగ్ దిశగా అడుగులు వేస్తున్నాం. ఇంకా కొన్ని అంశాలపై పరిశోధనలు జరగాల్సి ఉంది. సముద్రంలో లభించే ప్రతి జీవి నుంచి పూర్తిస్థాయిలో ఆహార, ఆరోగ్య ఉత్పత్తులు తయారు చేయడమే లక్ష్యం. – డాక్టర్ బి.మధుసూదనరావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, సీఐఎఫ్టీసాంకేతికతను బదలాయిస్తున్నాంసీఐఎఫ్టీ అభివృద్ధి చేసిన సాంకేతికతను ఇతర సంస్థలకు, వ్యక్తులకు కూడా బదలాయిస్తున్నాం. వారు ఉత్పత్తులను తయారు చేసి విదేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. – డాక్టర్ పి.విజ్జి, సీనియర్ సైంటిస్ట్, సీఐఎఫ్టీ -
భీకర ఎన్కౌంటర్.. మధ్యలో బిస్కెట్!
శ్రీనగర్: సుధీర్ఘ చర్చలు, మంతనాల వేళ మధ్యమధ్యలో ఛాయ్తోపాటు బిస్కెట్లు తినడం పరిపాటి. మిత్రదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల వేళ పనికొచ్చే బిస్కెట్లు శత్రువుతో పోరాడేవేళ అక్కరకు రావడం విశేషం. పాకిస్తాన్ విద్వేషాగి్నని ఎగదోస్తుంటే దానిని కశ్మీర్లో విస్తరింపజేస్తున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు బలగాలు బిస్కెట్లను వాడుకుని విజయం సాధించారు. శనివారం జరిగిన లష్కరే కమాండర్ ఉస్మాన్ ఎన్కౌంటర్ వివరాలను సీఆర్పీఎఫ్ బలగాలు ఆదివారం వెల్లడించాయి. మొరిగితే అసలుకే మోసం కశ్మీర్లో కీలకమైన ఉగ్రకమాండర్ ఉస్మాన్ శ్రీనగర్ శివారులోని ఖన్యాయ్ ప్రాంతంలో దాక్కున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. 2000 నుంచి లోయలో మెరుపుదాడులు చేయడంలో ఉస్మాన్ సిద్ధహస్తుడు. గత ఏడాది పోలీస్ ఇన్స్పెక్టర్ మస్రూర్ వనీని చంపేసిన ఘటనలో ఇతని ప్రమేయముంది. ఇంతటి కరడుగట్టిన ఉగ్రవాది జాడ తెలియడంతో సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు పక్కా ప్రణాళిక రచించారు. అయితే ఖన్యాయ్లో శునకాల బెడద ఎక్కువ. కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే మొరుగుతాయి. ఈ శబ్దాలకు ఉస్మాన్ అప్రమత్తమవడం ఖాయం. దీనికి పరిష్కారంగా బలగాలు తమ వెంట బిస్కెట్లు తీసుకెళ్లాయి. అంతా జల్లెడ పడుతూ కుక్కలు అరవకుండా బిస్కెట్లు వెదజల్లుతూ వాటి నోరు మూయించారు. దీంతో వీరి పని సులువైంది.ఏకే47తో సిద్ధం ఉస్మాన్ ఎల్లప్పుడూ అత్యాధునిక ఏకే47 గన్తో అప్రమత్తంగా ఉంటాడు. గ్రనేడ్లు, పిస్టల్ ధరిస్తాడు. వేగంగా దాడిచేస్తాడు. దీంతో తమ రాక విషయం తెలీకుండా జాగ్రత్తపడుతూ బలగాలు అతడిని సమీపించాయి. చివరి నిమిషంలో ఉస్మాన్ దీనిని కనిపెట్టి బలగాలపైకి ఎదురుకాల్పులు జరిపాడు. గ్రనేడ్లు విసిరాడు. ఈ క్రమంలో నలుగురు జవాన్లు గాయపడినా ఎట్టకేలకు ఉస్మాన్ను సైన్యం హతమార్చింది. గత రెండేళ్లలో కశీ్మర్ లోయలో సైన్యం సాధించిన అతిపెద్ద విజయంగా ఈ ఘటనను చెబుతారు. లష్కరే తోయిబా విభాగమైన రెసిస్టెంట్ ఫ్రంట్కు ఈ ఎన్కౌంటర్ కోలుకోలేని దెబ్బ. స్థానికేతర కారి్మకులు, భద్రతా బలగాలపైకి ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ సభ్యులు తరచూ కాల్పులకు తెగబడటం తెల్సిందే. వీరికి సూచనలు చేసే ఉస్మాన్ను సైన్యం ఎట్టకేలకు తుదముట్టించి ఉగ్రవ్యతిరేక కార్యక్రమాల్లో ఘన విజయం సాధించింది. -
ఈ క్రిస్మస్ వేళ..సరదాగ ఐస్క్రీమ్ శాండ్విచ్ ట్రైం చేయండిలా!
ఐస్క్రీమ్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు ఐస్క్రీమ్ – ఒకటిన్నర కప్పు పైనే (నచ్చిన ఫ్లేవర్) మినీ చాక్లెట్ చిప్స్ లేదా కలర్ స్ప్రింకిల్స్ – 2 టేబుల్ స్పూన్ల పైనే బిస్కట్స్ – కొన్ని (మార్కెట్లో దొరికే బిస్కట్స్ లేదా ఇంట్లో చేసుకునే కుకీస్ తీసుకోవచ్చు) తయారీ విధానం: ముందుగా నచ్చిన షేప్లో రెండేసి బిస్కట్స్ లేదా కుకీస్ తీసుకుని.. వాటి మధ్యలో.. సేమ్ షేప్లో ఐస్క్రీమ్ బిట్ పెట్టుకుని శాండ్విచ్లా చేసుకోవచ్చు. అనంతరం వాటిని చాక్లెట్ చిప్స్లో లేదా కలర్ స్ప్రింకిల్స్లో దొర్లించి వెంటనే సర్వ్ చేసుకోవాలి. ఇలాంటి వెరైటీలను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. (చదవండి: -
ఈ ట్రిక్ వాడారో 'కరకరలాడే బిస్కెట్లు' ఇక మీ సొంతమే!
'మనం తినేవాటిలో అనేక పదార్థాలుంటాయి. అందులో మెత్తవైనా ఉండొచ్చు, గట్టివిగానూ ఉండొచ్చు. అయితే అప్పడాలు, బిస్కెట్లలో చాలామటుకు కరకరలాడే వాటినే ఇష్టపడుతుంటాం. బిస్కెట్లను తీసుకున్నట్లయితే వీటిలో కూడా చాలా రకాలుంటాయి. మనకు ఇష్టమైనటువంటి కొన్ని రకాల బిస్కెట్లలో ఈ కరకరలాడే బిస్కెట్లు తోడైతే ఆ రుచి, అనుభూతియే వేరు. మరెందుకు ఆలస్యం వాటిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం!' కరకరలాడాలంటే.. బిస్కెట్లు మెత్తగా అవ్వకుండా కరకరలాడాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి! • ప్లాస్టిక్, అల్యుమినియం డబ్బాలు, గాజు పాత్రల్లో బిస్కెట్లు, కుకీలను నిల్వచేయాలి. • గాలి చొరబడకుండా పెడితే ఎక్కువరోజులపాటు క్రిస్పీగా ఉంటాయి. • డబ్బాల్లో నిల్వచేసేటప్పుడు అడుగు భాగంలో రెండుమూడు వరుసల్లో టిష్యుపేపర్లు వేసి తరువాత బిస్కెట్లు పెట్టాలి. • బిస్కెట్లపైన మరో రెండు వరుసల్లో టిష్యూపేపర్లు వేసి పైన బిస్కెట్లు పెట్టాలి. • ఇలా నిండుగా పెట్టి గాలిచొరబడకుండా మూత పెట్టాలి. • జిప్లాక్ పౌచ్లలో నిల్వచేస్తే కూడా కుకీలు తాజాగా ఉంటాయి. • గాలి చొరబడని డబ్బాలు, జిప్లాక్ పౌచ్లను రిఫ్రిజిరేటర్లో పెడితే మరిన్ని రోజులు బిస్కెట్లు తాజాగా ఉంటాయి. • అనుకోకుండా సరిగా నిల్వచేయనప్పుడు మెత్తబడిన కుకీలను అవెన్ లేదా ఎయిర్ఫ్రైయర్లో ఉంచి వేడిచేస్తే మళ్లీ క్రిస్పీగా మారతాయి, వీటిని కూడా నిల్వచేసుకోవచ్చు. ఇవి కూడా చదవండి: చలికాలంలో బెల్లం ఎందుకు తినాలి?నకిలీ బెల్లాన్ని ఎలా గుర్తించాలి? -
వర్షాకాలంలో ఇలా చేస్తే బిస్కెట్లు క్రిస్పీగా ఉంటాయి..
వర్షాకాలంలో కూడా బిస్కెట్లు మెత్తగా అవకుండా కరకరలాడాలంటే ఇలా చేసి చూడండి... ప్లాస్టిక్, అల్యమినియం డబ్బాలు, గాజు పాత్రల్లో బిస్కెట్లు, కుకీలను నిల్వచేయాలి. గాలిచొరబడకుండా పెడితే ఎక్కువ రోజులపాటు క్రిస్పీగా ఉంటాయి. డబ్బాల్లో నిల్వచేసేటప్పుడు అడుగు భాగంలో రెండుమూడు వరుసల్లో టిష్యపేపర్లు వేసి తరువాత బిస్కట్లు పెట్టాలి. బిస్కట్లపైన మరో రెండు వరుసల్లో టిష్యపేపర్లు వేసి పైన బిస్కెట్లు పెట్టాలి. ఇలా నిండుగా పెట్టి గాలిచొరబడకుండా మూత పెట్టాలి. జిప్లాక్ పౌచ్లలో నిల్వచేస్తే కూడా కుకీలు తాజాగా ఉంటాయి. గాలిచొరబడని డబ్బాలు, జిప్లాక్ పౌచ్లను రిఫ్రిజిరేటర్లో పెడితే మరిన్ని రోజులు బిస్కెట్లు తాజాగా ఉంటాయి. అనుకోకుండా సరిగా నిల్వచేయనప్పుడు మెత్తబడిన కుకీలను అవెన్ లేదా ఎయిర్ఫ్రైయర్లో పదినిమిషాలు వేడిచేస్తే మళ్లీ క్రిస్పీగా మారతాయి. వీటిని కూడా నిల్వ చేసుకోవచ్చు. -
చిరు ధాన్యాలతో బిస్కెట్స్.... మహిళలకు ఊహించని ఆదాయం
-
చిరుధాన్యాల బిస్కెట్లు నెలకు లక్ష యాభై వేలు సంపాదన
-
రెడీమేడ్ బిస్కెట్స్ కు ధీటుగా ఆర్గానిక్ బిస్కెట్ల తయారీ
-
కాలంచెల్లిన చాక్లెట్లు,బిస్కెట్లకు కొత్త లేబుల్స్ వేసి విక్రయం.. ముఠా గుట్టు రట్టు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బొడిప్పల్లో అతిపెద్ద రీసైక్లింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా కాలంచెల్లిన చాక్లెట్లు, బిస్కెట్లను రీసైకిల్ చేస్తోంది. ప్రముఖ బ్రాండ్ల నుంచి ఎక్స్పైర్ అయిన వస్తువులు, ఆహార పదార్థాలను సేకరించి వాటికే కొత్త లేబుల్స్ వేసి తిరిగి మార్కెట్లో విక్రయిస్తోంది. సబ్బులు, షాంపులు, తిను బండారాలు వంటి వంటి మొత్తం 300 రకాల వస్తువులను ఈ ముఠా రీసైకిల్ చేసి భారీ మోసానికి పాల్పడటటేగాక.. ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతోంది. హైదరాబాద్ శివార్లలోని గోదాములు, కోఠిలోని హరిహంత్ కార్పోరేషన్ కార్యాలయంలో పోలీసులు తనిఖీలు చేయగా ఈ రీసైక్లింగ్ ముఠా బాగోతం బట్టబయలైంది. ఈ సోదాల్లో రూ.కోట్లు విలువ చేసే ఆహారపదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అరెస్టు చేశారు. -
కాలంచెల్లిన చాక్లెట్లు, బిస్కెట్లుకు కొత్త లేబుల్స్ వేసి విక్రయం.. రీసైక్లింగ్ ముఠా గుట్టు రట్టు..
-
ఇషా అంబానీ దూకుడు: శ్రీలంక కంపెనీతో డీల్, వాటికి బిగ్ షాకే!
సాక్షి,ముంబై: రిలయన్స్ మరో వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. ఆయిల్నుంచి టెలికాం దాకా అడుగుపెట్టిన ప్రతీ రంగంలోనూ దూసుకుపోతున్న రిలయన్స్ త్వరలోనే ఇండియా బిస్కెట్ల వ్యాపారంలోకి ప్రవేశించనుంది. ఇందుకోసం శ్రీలంక ఆధారిత మాలిబాన్ బిస్కెట్ మాన్యుఫాక్టరీస్ (ప్రైవేట్) లిమిటెడ్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. మాలిబాన్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు రిలయన్స్ ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) తెలిపింది. దేశీయ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వినియోగదారు బ్రాండ్ను ఇండియాకు తీసుకురావడమే లక్ష్యమని తెలిపింది. ఇందులో భాగంగానే మాలిబన్ బిస్కెట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. అయితే దేశీయ బిస్కెట్ల మార్కెట్లో 80 శాతం వాటా ఉన్న దిగ్గజాలు బ్రిటానియా,ఐటీసీ, పార్లేకు గట్టిపోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై రిలయన్స్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ సంతోషం ప్రకటించారు. తమ ఎఫ్ఎంసీజీ పోర్ట్ఫోలియోను గొప్ప బ్రాండ్ ద్వారా బలోపేతం చేయడమే కాకుండా, తమ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తుల ద్వారా అద్భుత సేవలందించ గలుగుతామన్నారు. కాగా ఏడాది డిసెంబరులో గుజరాత్లో మేడ్-ఫర్-ఇండియా కన్స్యూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్ బ్రాండ్ ‘ఇండిపెండెన్స్’ ను ప్రారంభించిన సంగతి తెలిసిదే. RCPLతో భాగస్వామ్యంపై మాలిబాన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కుముదిక ఫెర్నాండో మాట్లాడుతూ, “రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ మాలిబన్తో భాగస్వామ్యాన్ని ఎంచు కోవడం సంతోషమని, దాదాపు 70 సంవత్సరాలుగా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను కొనసాగించడంలోతమ అంకితభావానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. 1954లో స్థాపితమైన మాలిబాన్ శ్రీలంకలో రెండవ అతిపెద్ద బిస్కెట్ కంపెనీగా పాపులర్. బిస్కెట్లు, క్రాకర్లు, కుకీలు, ఇతర ఉత్పత్తులను 35 దేశాలకు ఎగుమతి చేస్తోంది. -
బ్రిటానియా గూటికి కెన్యా బిస్కెట్ల తయారీ కంపెనీ
న్యూఢిల్లీ: బేకరీ ప్రొడక్టుల దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ తాజాగా కెన్యా కంపెనీ కెనాఫ్రిక్ బిస్కట్స్ను హస్తగతం చేసుకుంది. పూర్తి అనుబంధ సంస్థ బీఏడీసీవో ద్వారా 51 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు బ్రిటానియా పేర్కొంది. ఇందుకు నగదు రూపేణా 13.87 కెన్యన్ షిల్లింగ్స్(రూ. 9.2 కోట్లు) చెల్లించినట్లు వెల్లడించింది. తద్వారా ఆఫ్రికా మార్కెట్లలోనూ అమ్మకాలను విస్తరించే వీలు ఏర్పడినట్లు తెలియజేసింది. కెన్యాసహా ఆఫ్రికా మార్కెట్లలో బిస్కట్ల తయారీ, విక్రయాలు చేపట్టే లక్ష్యంతో కెనాఫ్రిక్ను సొంతం చేసుకున్నట్లు వివరించింది. ఈ నెల 3కల్లా లావాదేవీని పూర్తిచేసినట్లు తెలియజేసింది. వెరసి కెనాఫ్రిక్ బిస్కట్స్ అనుబంధ సంస్థగా మారినట్లు తెలియజేసింది. మిగిలిన 49% వాటా కెనాఫ్రిక్ గ్రూప్ కలిగి ఉన్నట్లు వెల్లడించింది. -
సామాన్యులకు మరో శుభవార్త! నూనెలతో పాటు వీటి ధరలు తగ్గనున్నాయ్!
దేశ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. క్రూడ్ సోయా బిన్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్తో పాటు క్రూడ్ పామాయిల్పై డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ట్యాక్స్ను, పాయిల్పై 10శాతం ఇంపోర్ట్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో రోజురోజూకీ పెరుగుతున్న నూనె ధరలతో పాటు ఇతర వస్తువులు భారీగా తగ్గనున్నాయి. వంటనూనెలేనా ఇంకా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వంటనూనెలతో పాటు ఫుడ్ ఐటమ్స్, కాస్మోటిక్స్ ధరలు అదుపులోకి రానున్నాయి. ఎందుకంటే ఫాస్ట్ మూవీంగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) సంస్థలు తయారు చేసేందుకు ముడి పదార్ధాలైన సన్ ఫ్లవర్ ఆయిల్, పాయిల్ను వినియోగిస్తుంటాయి. నూనె ధరలు తగ్గడంతో ఎఫ్ఎంసీజీ కంపెనీలు రా మెటీరియల్పై పెట్టే ఖర్చును తగ్గించడంతో అటోమెటిగ్గా.. తయారు చేసే ప్రొడక్ట్ల ధరలు తగ్గుతాయి. వచ్చే మూడునెలల్లో మనదేశంలో ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ తక్కువ.అందుకే భారత్ సంవత్సరానికి 55 శాతం 60శాతం వరకు వంట నూనెను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. కేంద్రం నూనెలపై ట్యాక్స్ తగ్గింపుతో రాబోయే 3నెలలో సామాన్యులు విరివిరిగా వినియోగించే వస్తువుల ధరలు భారీ తగ్గనున్నాయని ప్రాక్సిస్ గ్లోబల్ అలయన్స్ పార్ట్నర్ సుమన్ జగ్దేవ్ తెలిపారు. నూనెల తగ్గింపుతో త్వరలో తగ్గనున్న వంట నూనెల ధర ప్రభావం ఇతర ఉత్పత్తులపై పడనుంది. నూనెతో తయారు చేసే బిస్కెట్లాంటి ఫుడ్ ఐటమ్స్తో పాటు నెయ్యి, కోకోనట్ ఆయిల్, హెయిర్ ఆయిల్ ధరలు అదుపులో ఉండడనున్నాయని వెంచురా సెక్యూరిటీస్ రీసెర్చ్ విభాగం అధినేత వినీత్ బోలిజ్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండేళ్ల నుంచి ధరలు పైపైకి కరోనా, ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం, సప్లయ్ చైన్ సమస్య, పెరిగిన ఇన్ పుట్ కాస్ట్ తో పాటు ఇతర కారణాల వల్ల దేశీయ ఎఫ్ఎంసీజీ సంస్థలైన నెస్లే ఇండియా, మారికో, హిందుస్తాన్ యూనిలివర్, రుచి సోయా, బ్రిటానియా, డాబర్,కోల్గెట్, ఇమామీ, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్, విప్రో కన్జ్యూమర్ కేర్ సంస్థలు గత రెండేళ్లలో పలు ప్రొడక్ట్లను భారీగా పెంచాయి. తాజా, కేంద్ర నిర్ణయంతో పై సంస్థలు తయారు చేస్తున్న ఉత్పత్తుల్ని తగ్గించనున్నాయి. చదవండి👉దేశంలో భారీగా తగ్గనున్న సిమెంట్, స్టీల్ ధరలు! -
సామాన్యులకు మరో షాక్..భారీగా పెరగనున్న బిస్కెట్ ధరలు..!
రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో క్రూడాయిల్ నుంచి వంటనూనె ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అధిక ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించేందుకుగాను హెచ్యూఎల్, యూనిలీవర్ వంటి ఎఫ్ఎంసీజీ కంపెనీలు నిత్యవసర వస్తువుల ధరలను భారీగా పెంచేందుకు సిద్దమయ్యాయి. ఇప్పుడు ధరల పెరుగుదల జాబితాలోకి బిస్కట్లు కూడా వచ్చి చేశాయి. రానున్న రోజుల్లో బిస్కెట్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ధరల పెంపుకు బ్రిటానియా సిద్ధం..! భారత అతిపెద్ద బిస్కెట్ల తయారీదారు బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్..బిస్కెట్ల ధరలను 7 శాతం మేర పెంచాలని ప్రణాళికలను రచిస్తోంది. ద్రవ్యోల్బణ ప్రభావంతో తొలుత 3 శాతం మేర ధరల పెంపును సూచించగా...ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ధరల పెంపును 8 నుంచి 9 శాతం మేర పెంచాలని కంపెనీ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటానియా మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ బెర్రీ అభిప్రాయపడ్డారు. గత రెండేళ్లలో ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎప్పుడూ చూడలేదని వరుణ్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ ప్రభావంతో గత త్రైమాసికంలో బ్రిటానియా నికర ఆదాయంలో 19 శాతం తగ్గుదలను నమోదుచేసింది. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య ప్రకటించినప్పటీనుంచి...కార్మికుల కొరత, సప్లై చైన్ వంటి పరిమితులతో ఎఫ్ఎంసీజీ కంపెనీలకు భారంగా మారింది. ఒత్తిళ్లను తగ్గించేందుకుగాను ధరల పెంపు అనివార్యమైందని ఎఫ్ఎంసీజీ కంపెనీలు ప్రకటించాయి. కాగా బ్రిటానియాతో పాటుగా...ఇతర బిస్కెట్ కంపెనీలు కూడా ధరలను పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ధరలను పెంచే బదులుగా క్వాంటిటీ తగ్గించి అమ్మకాలు జరపాలనే నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదని నిపుణులు భావిస్తోన్నారు. చదవండి: ఆల్టైం రికార్డు ధరకు సన్ఫ్లవర్ ఆయిల్..! -
కొత్త ఏడాదిలో..కొత్త బాదుడు..ధరలు పెరగనున్న వస్తువులు ఇవే!
ముంబై: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి అటు ప్రజల ఆరోగ్యంతోపాటు.. ఇటు పలు ఉత్పత్తుల ధరలనూ ప్రభావితం చేస్తోంది. ఈ ఏడాది లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 100 స్థాయికి చేరి మంటపుట్టించగా.. ఇటీవల కొంతమేర దిగివచ్చినప్పటికీ వంట నూనెలు రూ. 180కు చేరి వినియోగదారులకు షాకిచ్చాయి. ఈ ప్రభావంతో కొన్నేళ్లలోలేని విధంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని మించుతూ టోకు ధరలు నవంబర్లో 14.23 శాతాన్ని తాకాయి. ఇక మరోపక్క రవాణా, ప్యాకేజింగ్, శ్రామిక వ్యయాలు పెరగడంతో పలు రంగాలపై ప్రతిలకూ ప్రభావం పడుతోంది. వెరసి ప్రధానంగా నిత్యావసర వస్తువుల జాబితాలోకి వచ్చే ప్రొడక్టులను విక్రయించే ఎఫ్ఎంసీజీ రంగం సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో ఇప్పటికే పలు ఎఫ్ఎంసీజీ ప్రొడక్టుల ధరలు 5–10 శాతం మధ్య పెరిగినట్లు తెలియజేశారు. ఈ బాటలో జనవరి నుంచి సైతం ధరలు మరోసారి హెచ్చనున్నట్లు అభిప్రాయపడ్డారు. వివరాలు చూద్దాం.. అదానీ, పార్లే, డాబర్ రెడీ వచ్చే నెల నుంచి ప్యాకేజ్డ్ గోధుమ పిండి ధరలను 5–8 శాతం, బాస్మతి బియ్యం ధరలను 8–10 శాతం మధ్య పెంచనున్నట్లు అదానీ విల్మర్ సీఈవో అన్షు మాలిక్ తాజాగా జాతీయ మీడియాకు వెల్లడించారు. ఇటీవల ప్యాకేజింగ్ వ్యయాలు 15–18 శాతంమేర పెరిగినట్లు పేర్కొన్నారు. ఇక అక్టోబర్–డిసెంబర్లో ఇప్పటికే కొన్ని బిస్కెట్ ప్యాకింగుల ధరలను 5–10 శాతం మధ్య పెంచినట్లు పార్లే ప్రొడక్టస్ వెల్లడించింది. జనవరి–మార్చి మధ్య మరోసారి ధరలను 4–5 శాతంమేర హెచ్చించనున్నట్లు తెలియజేసింది. అయితే ద్రవ్యోల్బణం దిగివస్తుందని వేచిచూస్తున్నట్లు డాబర్ పేర్కొంది. ఇప్పటికే కొన్ని ఉత్పత్తుల ధరలను 3–4 శాతం మధ్య పెంచిన కంపెనీ ద్రవ్యోల్బణం తగ్గకుంటే మార్చి నుంచి మళ్లీ ప్రొడక్టుల ధరల పెంపును చేపట్టవచ్చని సంకేతమిచ్చింది. ఇటీవల 9 శాతాన్ని దాటిన ద్రవ్యోల్బణం ఆందోళనలకు తావిస్తున్నదని, ఈ ప్రభావాన్ని తట్టుకునేందుకు వ్యయనియంత్రణలను పాటిస్తున్నామని డాబర్ ఇండియా సీఈవో మోహిత్ మల్హోత్రా తెలియజేశారు. కెవిన్కేర్ సైతం సై వ్యక్తిగత సంరక్షణా ఉత్పత్తుల కంపెనీ కెవిన్కేర్ సైతం ద్రవ్యోల్బణం ధాటికి ధరలను పెంచకతప్పడంలేదని తెలియజేసింది. వచ్చే నెల నుంచి షాంపూలు, చర్మ సంరక్షణ ప్రొడక్టుల ధరలను 2–3 శాతం మధ్య హెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే కంపెనీ ఈ ఏడాది తొలి అర్ధభాగంలో 3 శాతం వరకూ ఉత్పత్తుల ధరలను పెంచింది. షాంపూల విభాగంలో ప్రధానంగా నాన్సాచెట్స్ ప్రొడక్టుల ధరలనే పెంచనున్నట్లు కెవిన్కేర్ సీఈవో వెంకటేష్ విజయ రాఘవన్ పేర్కొన్నారు. కోవిడ్–19 సవాళ్లతో సరఫరాల అంతరాయాలు, తదితరాల కారణంగా గోధుమల ధరలు వార్షికంగా 20 శాతం పెరిగినట్లు పరిశ్రమరంగ నిపుణులు తెలియజేశారు. ఇక ముడిపామాయిల్ ధరలు 36 శాతంౖò జంప్చేసినట్లు పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలను తగ్గించడంతో గత 45 రోజుల్లో అదానీ విల్మర్ వంట నూనెల ధరలలో కోత పెట్టింది. సోయాబీన్ నూనెల లీటర్ ధరలను రూ. 175 నుంచి రూ. 155కు కుదించింది. ఇదేవిధంగా వంట నూనెల ధరలను సైతం రూ. 170 నుంచి రూ. 150కు దించింది. చదవండి: వంట నూనెల ధరలు తగ్గాయ్ -
ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణం తీసిన బిస్కెట్లు, చిప్స్..?
లక్నో: పారి, పిహు, విధి ముగ్గురు అక్కాచెల్లెళ్లు. కలిసిమెలసి ఉండేవారు. ఆడుతూపాడుతూ.. అమ్మానాన్నతో కలిసి సంతోషంగా జీవించేవారు. జింకపిల్లలా చెంగుచెంగున పరుగులు తీసే చిన్నారులు.. ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యారు. 24 గంటల వ్యవధిలో ముగ్గురు మృతి చెందారు. చిన్నారుల మృతి వారి తల్లిదండ్రులతో పాటు.. గ్రామస్తులను కూడా కలచి వేసింది. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఎలా మరణించారో ఎవరికి అర్థం కావడం లేదు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ వివరాలు.. ఉత్తరప్రదేశ్, బరేలీకి చెందిన నవీన్ కుమార్ సింగ్కు పారి, పిహు, విధి అని ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నాలుగు రోజులు క్రితం వరకు కూడా ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. గత శుక్రవారం మధ్యాహ్నం ఈ అమ్మాయిలు బిస్కెట్లు, చిప్స్ కొనుక్కుని తిన్నారు. ఆ తర్వాత ఉన్నట్లుండి ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డారు. (చదవండి: వైరల్: ఇదేం వింత.. ఆ బాలిక ఏడిస్తే కంట్లోంచి రాళ్లు వస్తాయట!) ఇది గమనించిన చిన్నారుల తండ్రి నవీన్ కుమార్ వారిని స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అయితే హాస్పిటల్కు వెళ్లేలోపే పారి, పిహు మరణించారు. చికిత్స పొందుతూ విధి మృతి చెందింది. చిన్నారులకు ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నారుల మృతి గురించి పోలీసులకు తెలియడంతో వారు.. సంఘటన స్థలానికి చేరుకుని.. అంత్యక్రియలు ఆపేశారు. చిన్నారుల మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (చదవండి: టిక్టాక్కు ప్రత్యామ్నాయం ఇదే!) ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వారి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని అటాప్సీ పరిక్షలో వెల్లడయ్యింది. ప్రస్తుతం పోలీసులు చిన్నారుల కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. ఫోరెన్సిక్ అధికారులు బాలికలు తిన్న బిస్కెట్లు, చిప్స్ శాంపిల్స్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపారు. చదవండి: వింత నమ్మకం.. పెరిగిన పార్లేజీ బిస్కెట్ల అమ్మకాలు -
బెక్టర్స్ ఫుడ్.. బంపర్ లిస్టింగ్
ముంబై, సాక్షి: ఇటీవలే పబ్లిక్ ఇష్యూకి వచ్చిన ప్రీమియం బిస్కట్ల కంపెనీ బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్.. స్టాక్ ఎక్స్ఛేంజీలలో బంపర్ లిస్టింగ్ను సాధించింది. ఇష్యూ ధర రూ. 288కాగా.. ఎన్ఎస్ఈలో రూ. 500 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇది 74 శాతం(రూ. 212) ప్రీమియంకాగా.. ప్రస్తుతం రూ. 585 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 600 వద్ద గరిష్టాన్ని తాకింది. బీఎస్ఈలో రూ. 501 వద్ద లిస్టయ్యింది. ఇష్యూకి అన్ని వర్గాల నుంచీ బిడ్స్ వెల్లువెత్తడంతో 198 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సైతం 29 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 540 కోట్లు సమీకరించింది. ఐపీవో ప్రారంభానికి ముందు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 162 కోట్లు సమకూర్చుకుంది. షేరుకి రూ. 288 ధరలో హెచ్డీఎఫ్సీ లైఫ్, గోల్డ్మన్ శాక్స్, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్, ఎస్బీఐ డెట్ హైబ్రిడ్ తదితర 7 ఎంఎఫ్లకు షేర్లను కేటాయించింది. ఐపీవో నిధులను విస్తరణతోపాటు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్లో కంపెనీ పేర్కొంది. రాజ్పురా యూనిట్లో బిస్కట్ల తయారీకి కొత్త లైన్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది. (బెక్టర్స్ ఫుడ్ విజయం వెనుక మహిళ) దిగ్గజ కస్టమర్లు బర్గర్ కింగ్, మెక్డొనాల్డ్స్, కేఎఫ్సీ, పిజ్జా హట్ తదితర గ్లోబల్ ఫాస్ట్ఫుడ్ చైన్స్(క్యూఎస్ఆర్)కు బెక్టర్ ఫుడ్స్ బన్స్ సరఫరా చేస్తోంది. బెక్టర్స్ క్రీమికా పేరుతో సొంతంగా ప్రీమియం బిస్కట్లను తయారు చేస్తోంది. ఇంగ్లీష్ ఒవెన్ బ్రాండుతో సొంత బ్యాకరీ ప్రొడక్టులను సైతం రూపొందిస్తోంది. లూధియానాకు చెందిన కంపెనీ ఇంతక్రితం 2018లోనూ పబ్లిక్ ఇష్యూ ప్రయత్నాలు చేసింది. సెబీ అనుమతించినప్పటికీ మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విరమించుకుంది. (2020: ఐపీవో నామ సంవత్సరం) పోటీ ఎక్కువే.. లిస్టెడ్ దిగ్గజాలు ఐటీసీ, బ్రిటానియాతోపాటు.. పార్లే ఇండియా, మోడర్న్, హార్వెస్ట్ గోల్డ్ కంపెనీలతో బెక్టర్స్ ఫుడ్ పోటీ పడుతోంది. గ్లోబల్ ఫాస్ట్ఫుడ్ చైన్స్కు భారీ స్థాయిలో బన్స్ సరఫరా చేయడంతోపాటు.. ఫ్రోజెన్ డఫ్ విభాగంలోకీ ప్రవేశించింది. తద్వారా ఈ విభాగంలో మార్కెట్ లీడర్గా ఉన్న బేకర్స్ సర్కిల్తో పోటీని ఎదుర్కొంటోంది. 2019 మార్చికల్లా బెక్టర్స్ ఫుడ్ ఆదాయం రూ. 762 కోట్లను తాకింది. రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. దేశీయంగా బిస్కట్లు, బేకరీ ప్రొడక్టుల రిటైల్ మార్కెట్ విలువ 7 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 52,000 కోట్లు)గా అంచనా. గత ఐదేళ్లలో వార్షికంగా 9 శాతం వృద్ధిని సాధిస్తూ వస్తోంది. మార్కెట్ విలువలో బిస్కట్లు, రస్కులు, వేఫర్స్, కేకులు 89 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి. బన్నులు, పిజ్జా బేస్లు తదితరాల వాటా 11 శాతమని పరిశ్రమ నిపుణులు తెలియజేశారు! -
బెక్టర్స్ ఫుడ్ ఐపీవో- వెల్లువెత్తిన బిడ్స్
ముంబై, సాక్షి: ప్రీమియం బిస్కట్ల తయారీ కంపెనీ బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ పబ్లిక్ ఇష్యూకి అన్ని వర్గాల నుంచీ బిడ్స్ వెల్లువెత్తాయి. ఇష్యూ చివరి రోజు గురువారానికల్లా 198 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. ఐపీవోలో భాగంగా కంపెనీ 1.32 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 262 కోట్ల షేర్లకుపైగా బిడ్స్ దాఖలయ్యాయి. ప్రధానంగా సంపన్న వర్గాల నుంచి 621 రెట్లు అధికంగా దరఖాస్తులు రాగా.. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సైతం 29 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి 177 రెట్లు అధికంగా బిడ్స్ లభించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీల డేటా వెల్లడించింది. రూ. 288 ధరలో బెక్టర్ ఫుడ్ పబ్లిక్ ఇష్యూకి ధరల శ్రేణి రూ. 286-288కాగా.. తద్వారా కంపెనీ రూ. 540 కోట్లు సమీకరించింది. ఐపీవో ప్రారంభానికి ముందురోజు సోమవారం(14న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 162 కోట్లు సమకూర్చుకుంది. షేరుకి రూ. 288 ధరలో హెచ్డీఎఫ్సీ లైఫ్, గోల్డ్మన్ శాక్స్, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్, ఎస్బీఐ డెట్ హైబ్రిడ్ తదితర 7 ఎంఎఫ్లకు షేర్లను కేటాయించింది. ఐపీవో నిధులను విస్తరణతోపాటు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్లో కంపెనీ పేర్కొంది. రాజ్పురా యూనిట్లో బిస్కట్ల తయారీకి కొత్త లైన్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది. (బర్గర్కింగ్ పుష్- బెక్టర్స్ ఫుడ్ ఐపీవోకు రెడీ) దిగ్గజ కస్టమర్లు బర్గర్ కింగ్, మెక్డొనాల్డ్స్, కేఎఫ్సీ, పిజ్జా హట్ తదితర గ్లోబల్ ఫాస్ట్ఫుడ్ చైన్స్(క్యూఎస్ఆర్)కు బెక్టర్ ఫుడ్స్ బన్స్ సరఫరా చేస్తోంది. బెక్టర్స్ క్రీమికా పేరుతో సొంతంగా ప్రీమియం బిస్కట్లను తయారు చేస్తోంది. ఇంగ్లీష్ ఒవెన్ బ్రాండుతో సొంత బ్యాకరీ ప్రొడక్టులను సైతం రూపొందిస్తోంది. లూధియానాకు చెందిన కంపెనీ ఇంతక్రితం 2018లోనూ పబ్లిక్ ఇష్యూ ప్రయత్నాలు చేసింది. సెబీ అనుమతించినప్పటికీ మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విరమించుకుంది. (30 రోజుల్లో 100 శాతం లాభాలు) పోటీ ఎక్కువే.. లిస్టెడ్ దిగ్గజాలు ఐటీసీ, బ్రిటానియాతోపాటు.. పార్లే ఇండియా, మోడర్న్, హార్వెస్ట్ గోల్డ్ కంపెనీలతో బెక్టర్స్ ఫుడ్ పోటీ పడుతోంది. గ్లోబల్ ఫాస్ట్ఫుడ్ చైన్స్కు భారీ స్థాయిలో బన్స్ సరఫరా చేయడంతోపాటు.. ఫ్రోజెన్ డఫ్ విభాగంలోకీ ప్రవేశించింది. తద్వారా ఈ విభాగంలో మార్కెట్ లీడర్గా ఉన్న బేకర్స్ సర్కిల్తో పోటీని ఎదుర్కొంటోంది. 2019 మార్చికల్లా బెక్టర్స్ ఫుడ్ ఆదాయం రూ. 762 కోట్లను తాకింది. రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. దేశీయంగా బిస్కట్లు, బేకరీ ప్రొడక్టుల రిటైల్ మార్కెట్ విలువ 7 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 52,000 కోట్లు)గా అంచనా. గత ఐదేళ్లలో వార్షికంగా 9 శాతం వృద్ధిని సాధిస్తూ వస్తోంది. మార్కెట్ విలువలో బిస్కట్లు, రస్కులు, వేఫర్స్, కేకులు 89 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి. బన్నులు, పిజ్జా బేస్లు తదితరాల వాటా 11 శాతమని పరిశ్రమ నిపుణులు తెలియజేశారు! -
నేటి నుంచి బెక్టర్స్ ఫుడ్.. పబ్లిక్ ఇష్యూ
ముంబై, సాక్షి: ప్రీమియం బిస్కట్ల తయారీ కంపెనీ బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ పబ్లిక్ ఇష్యూ నేడు(15న) ప్రారంభమైంది. 17న(గురువారం) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 286-288కాగా.. తద్వారా రూ. 540 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా సోమవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 162 కోట్లు సమకూర్చుకుంది. షేరుకి రూ. 288 ధరలో హెచ్డీఎఫ్సీ లైఫ్, గోల్డ్మన్ శాక్స్, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్, ఎస్బీఐ డెట్ హైబ్రిడ్ తదితర 7 ఎంఎఫ్లకు షేర్లను కేటాయించింది. ఐపీవోలో భాగంగా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సంస్థలు వాటాలను విక్రయించనున్నాయి. ఐపీవో నిధులను విస్తరణ వ్యయాలు, తదితర సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్లో పేర్కొంది. రాజ్పురా యూనిట్లో బిస్కట్ల తయారీకి కొత్త లైన్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది. (బర్గర్ కింగ్ ఐపీవో.. స్పందన సూపర్) దిగ్గజ కస్టమర్లు బర్గర్ కింగ్, మెక్డొనాల్డ్స్, కేఎఫ్సీ, పిజ్జా హట్ తదితర గ్లోబల్ ఫాస్ట్ఫుడ్ చైన్స్(క్యూఎస్ఆర్)కు బెక్టర్ ఫుడ్స్ బన్స్ సరఫరా చేస్తోంది. బెక్టర్స్ క్రీమికా పేరుతో సొంతంగా ప్రీమియం బిస్కట్లను తయారు చేస్తోంది. ఇంగ్లీష్ ఒవెన్ బ్రాండుతో సొంత బ్యాకరీ ప్రొడక్టులను సైతం రూపొందిస్తోంది. లూధియానాకు చెందిన కంపెనీ ఇంతక్రితం 2018లోనూ పబ్లిక్ ఇష్యూ ప్రయత్నాలు చేసింది. సెబీ అనుమతించినప్పటికీ మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విరమించుకుంది. (బర్గర్ కింగ్ లిస్టింగ్.. అ‘ధర’హో) పోటీ ఎక్కువే.. లిస్టెడ్ దిగ్గజాలు ఐటీసీ, బ్రిటానియాతోపాటు.. పార్లే ఇండియా, మోడర్న్, హార్వెస్ట్ గోల్డ్ కంపెనీలతో బెక్టర్స్ ఫుడ్ పోటీ పడుతోంది. గ్లోబల్ ఫాస్ట్ఫుడ్ చైన్స్కు భారీ స్థాయిలో బన్స్ సరఫరా చేయడంతోపాటు.. ఫ్రోజెన్ డఫ్ విభాగంలోకీ ప్రవేశించింది. తద్వారా ఈ విభాగంలో మార్కెట్ లీడర్గా ఉన్న బేకర్స్ సర్కిల్తో పోటీని ఎదుర్కొంటోంది. 2019 మార్చికల్లా బెక్టర్స్ ఫుడ్ ఆదాయం రూ. 762 కోట్లను తాకింది. రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. దేశీయంగా బిస్కట్లు, బేకరీ ప్రొడక్టుల రిటైల్ మార్కెట్ విలువ 7 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 52,000 కోట్లు)గా అంచనా. గత ఐదేళ్లలో వార్షికంగా 9 శాతం వృద్ధిని సాధిస్తూ వస్తోంది. మార్కెట్ విలువలో బిస్కట్లు, రస్కులు, వేఫర్స్, కేకులు 89 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి. బన్నులు, పిజ్జా బేస్లు తదితరాల వాటా 11 శాతమని పరిశ్రమ నిపుణులు తెలియజేశారు! -
బిస్కెట్ కప్లో చాయ్: తాగి తినొచ్చు..!
చెన్నై: చాయ్ విత్ బిస్కెట్స్.. ఎవర్గ్రీన్ కాంబినేషన్. మనలో చాలా మంది ఉదయం చాయ్-బిస్కెట్తోనే ప్రారంభమవుతుంది అంటే అతిశయోక్తి కాదు. బయట టీ కోట్ల దగ్గర చాయ్ తాగేటప్పుడు కూడా బిస్కెట్ తినడం చాలా మందికి అలవాటు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఓ మధురై టీ కొట్టు యాజమాని ఓ వెరైటీ కాంబినేషన్ని తీసుకొచ్చారు. సాధారణంగా టీని గాజు గ్లాస్, కాగితపు కప్పు, పింగాణి కప్పులో పోస్తారని తెలుసు. అయితే ఈ టీ కొట్టు యాజమాని మాత్రం వెరైటీగా బిస్కెట్ టీ కప్పులు తీసుకొచ్చాడు. అంటే బిస్కట్స్తో తయారు చేసిన కప్పులు అన్నమాట. మధురైలోని ఆర్ఎస్ పాతి నీలగిరి టీ స్టాల్ చాక్లెట్-రుచిగల బిస్కెట్తో తయారు చేసిన తినే కప్పుల్లో తక్కువ మొత్తంలో టీని అందిస్తోంది. అంటే మీరు మీ టీని తాగవచ్చు, ఆపై కప్పు తినవచ్చు. దీని వల్ల వ్యర్థాలు ఉండవు.. మనకు భిన్నమైన అనుభూతి. ది బెటర్ ఇండియా వీడియో రిపోర్ట్ ప్రకారం ఆర్ఎస్ పాతి నీలగిరి టీ స్టాల్ 1909 నుంచి ఉంది. అక్టోబర్ 2019 లో భారత ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నెమ్మదిగా తొలగించి 2022 నాటికి పూర్తిగా నిషేధించాలని భారత్ యోచిస్తోంది. వీటిలో ప్లాస్టిక్ సంచులు, కప్పులు, ప్లేట్లు, సీసాలు, స్ట్రాలు వంటి రోజువారీ వినియోగ వస్తువులు ఉన్నాయి. అందుకే దేశవ్యాప్తంగా అనేక మంది వ్యాపారులు ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయ పరిష్కారాల కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో టీ స్టాల్ యజమాని వివేక్ సబాపతికి వినూత్న ఆలోచన వచ్చింది. పర్యావరణ అనుకూలమైన టీ కప్పులు కోసం శోధిస్తున్నప్పుడు బిస్కెట్ కప్పులపై సబపతి దృష్టి పడింది. అలా దాన్ని అమల్లోకి తెచ్చారు. (చదవండి: నోట్లో ‘కుకీసు’కుందాం) ఇక ఈ తినదగిన బిస్కెట్ టీ కప్పు ధర 20 రూపాయలు మాత్రమే. ఈ వినూత్న ప్రయోగం టీ ప్రియులకు కూడా బాగా నచ్చింది. జూలై నెలలో ప్రారంభించినప్పటి నుంచి జనాలు బిస్కెట్ కప్పులో అందించే టీని తాగడానికి తెగ ఆసక్తి చూపుతున్నారు. ఈ కప్లో సుమారు 60 మిల్లీలీటర్ల టీ పడుతుంది. అయితే ఈ బిస్కెట్ కప్పులో పోసిన టీని పది నిమిషాల్లోనే తాగాల్సి ఉంటుంది. ఆ తర్వాత కప్పు మెత్తగా అయ్యి చిరిగిపోతుంది. ఇక ఈ బిస్కెట్ కప్పులో మరిన్ని ఫ్లేవర్స్ తీసుకురావాలని భావిస్తున్నారు సభాపతి. ఒక్కసారి పరిస్థితులు చక్కబడితే దానిపై దృష్టి పెడతామని తెలిపారు. -
బర్గర్కింగ్ పుష్- బెక్టర్స్ ఫుడ్ ఐపీవోకు రెడీ
ముంబై, సాక్షి: ప్రీమియం బిస్కట్ల తయారీ కంపెనీ బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. వచ్చే వారం ఐపీవో చేపట్టనున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల గ్లోబల్ దిగ్గజం బర్గర్ కింగ్ పబ్లిక్ ఇష్యూ ఏకంగా 157 రెట్లు అధికంగా సబ్స్క్రిప్సన్ సాధించిన నేపథ్యంలో బెక్టర్స్ ఫుడ్ సన్నాహాలు వేగవంతమైనట్లు తెలియజేశాయి. బర్గర్ కింగ్, మెక్డొనాల్డ్స్, కేఎఫ్సీ, పిజ్జా హట్ తదితర గ్లోబల్ ఫాస్ట్ఫుడ్ చైన్స్కు కంపెనీ బన్స్ సరఫరా చేస్తుండటం ప్రస్తావించదగ్గ అంశం! కంపెనీ బెక్టర్స్ క్రీమికా పేరుతో ప్రీమియం బిస్కట్లను తయారు చేస్తోంది. ఇంగ్లీష్ ఒవెన్ బ్రాండుతో బ్యాకరీ ప్రొడక్టులను సైతం రూపొందిస్తోంది. 2018లోనూ.. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ త్వరితగతిన అనుమతులు సంపాదించింది. ఒక ప్రయివేట్ రంగ కంపెనీగా 29 రోజుల్లోనే గ్రీన్సిగ్నల్ సాధించినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఈ నెల 15కల్లా ఐపీవో ప్రారంభమయ్యే వీలున్నట్లు తెలియజేశాయి. లూధియానాకు చెందిన కంపెనీ ఇంతక్రితం 2018లోనూ పబ్లిక్ ఇష్యూ ప్రయత్నాలు చేసింది. సెబీ అనుమతించినప్పటికీ మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విరమించుకుంది. తాజా ఇష్యూలో భాగంగా సీఎక్స్ పార్టనర్స్, గేట్వే పార్టనర్స్ కంపెనీలో కొంతమేర వాటాను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా రూ. 550 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ కానున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దిగ్గజాలతో పోటీ లిస్టెడ్ దిగ్గజాలు ఐటీసీ, బ్రిటానియాతోపాటు.. పార్లే ఇండియా, మోడర్న్, హార్వెస్ట్ గోల్డ్ కంపెనీలతో బెక్టర్స్ ఫుడ్ పోటీ పడుతోంది. గ్లోబల్ ఫాస్ట్ఫుడ్ చైన్స్కు భారీ స్థాయిలో బన్స్ సరఫరా చేయడంతోపాటు.. ఫ్రోజెన్ డఫ్ విభాగంలోకీ ప్రవేశించింది. తద్వారా ఈ విభాగంలో మార్కెట్ లీడర్గా ఉన్న బేకర్స్ సర్కిల్తో పోటీని ఎదుర్కొంటోంది. 2019 మార్చికల్లా బెక్టర్స్ ఫుడ్ ఆదాయం రూ. 762 కోట్లను తాకింది. రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. దేశీయంగా బిస్కట్లు, బేకరీ ప్రొడక్టుల రిటైల్ మార్కెట్ విలువ 7 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 52,000 కోట్లు)గా అంచనా. గత ఐదేళ్లలో వార్షికంగా 9 శాతం వృద్ధిని సాధిస్తూ వస్తోంది. మార్కెట్ విలువలో బిస్కట్లు, రస్కులు, వేఫర్స్, కేకులు 89 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి. బన్నులు, పిజ్జా బేస్లు తదితరాల వాటా 11 శాతమని పరిశ్రమ నిపుణులు తెలియజేశారు! -
బంపర్ ఆఫర్: ఏడాదికి 38 లక్షల జీతం
లండన్: నెలకు మూడు లక్షల రూపాయలకు పైగా జీతం.. ఏడాదికి 35 సెలవులు.. ఇవి కాక బోనస్లు, ఇంక్రిమెంట్లు. ఆఫర్ టెంప్టింగ్గా ఉంది.. పని ఎంత కష్టమో అనుకుంటున్నారా. అది మరీ సులభం. కేవలం బిస్కెట్లు టేస్ట్ చేసి.. ఫీడ్ బ్యాక్ ఇవ్వాలి. ఇందుకు గాను ఏడాదికి అక్షరాల 38 లక్షల రూపాయల జీతం చెల్లించేందుకు సిద్ధం అంటూ ఓ కంపెనీ ప్రకటన ఇచ్చింది. ఇంకేముంది కుప్పల్లో అప్లికేషన్లు వచ్చి పడుతున్నాయట. కంపెనీ అడ్రెస్ ఇవ్వండి మేం కూడా అప్లై చేస్తాం అంటారా వెయిట్. ఇది మన దగ్గర కాదు. యూకేకు చెందిన స్కాటిష్ బిస్కెట్ సంస్థ బోర్డర్ బిస్కెట్స్ ఒక కొత్త ఉద్యోగాన్ని సృష్టించింది. అదే బిస్కెట్ రుచి చూసే పని. ఇందుకోసం ప్రత్యేకంగా నియమించిన మాస్టర్లకు బిస్కెట్ రుచి చూసినందుకు గాను సంవత్సరానికి 40 వేల పౌండ్లు చెల్లించనున్నారు. మన రూపాయిల్లో చెప్పాలంటే దీని విలువ సుమారు 40 లక్షలుగా ఉండనుంది. అంటే నెలవారీగా 3 లక్షల రూపాయలకు పైగా జీతం లభిస్తుంది. ఈ ఉద్యోగం కోసం, మీకు ప్రత్యేక ప్రతిభ ఉండాలి. (చదవండి: తొమ్మిదేళ్లుగా మెతుకు ముట్టడు) ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి పరీక్షలు నిర్వహిస్తారు, బిస్కెట్లపై మంచి పరిజ్ఞానం ఉండాలి. ఇది మాత్రమే కాక, నాయకత్వ నైపుణ్యాలు, సమాచార మార్పిడిలో మంచి అవగాహన ఉండాలి. దాంతో పాటు కస్టమర్లతో మంచి సంబంధాలు ఏర్పరచడానికి కావాల్సిన సూచనలు ఇచ్చే వారికి ప్రాధాన్యత లభిస్తుందన్నారు. బేకరీ ఉత్పత్తులు, ప్రక్రియలతో శాస్త్రీయ, ఆచరణాత్మక అనుభవం. మైక్రోసాఫ్ట్ ఔట్లుక్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వంటి ఐటి నైపుణ్యాలు ఉండాలని తెలిపారు. వీటితో పాటు యూకే చట్టాలు, సాంకేతికత, పరిశ్రమ సంకేతాల గురించి తగిన అవగాహన ఉన్న వ్యక్తి అవసరం అని కంపెనీ తెలిపింది. సెలక్టయిన వ్యక్తికి సంవత్సరానికి 35 రోజుల సెలవు, బోనస్ పథకం, 1000 కి పైగా రిటైలర్లలో డిస్కౌంట్, ఉచిత ఆన్లైన్ వ్యాయామ కార్యక్రమాలు, ఉచిత బిస్కెట్లు వంటి ప్రయోజనాలు లభిస్తాయి. -
చిన్నారుల మృతి కేసు: దర్యాప్తు ముమ్మరం
-
చిన్నారుల మృతి కేసు: దర్యాప్తు ముమ్మరం
సాక్షి, హైదరాబాద్: రోజ్ బిస్కెట్లు తిని పిల్లలు మృతి చెందిన కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్ రోజ్ బిస్కెట్ల తయారీ కంపెనీలో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. బిస్కెట్లకు సంబంధించిన శాంపిల్స్ను అధికారులు సేకరించారు. బిస్కెట్లు తయారీ యూనిట్ని అధికారులు సీజ్ చేశారు. బిస్కెట్లు తిని పిల్లలు అస్వస్థతకు గురికావడం అర్థం కావట్లేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. బిస్కెట్లను మార్కెట్ నుంచి వెనక్కి రప్పిస్తున్నామన్నారు.బిస్కెట్లలో లోపం ఎలా జరిగిందో అర్థం కావట్లేదని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. నివేదిక వచ్చిన తర్వాతే విషయాలు బయటపడతాయని అధికారులు వెల్లడించారు. (చదవండి: బిస్కెట్లా?.. విష ప్రయోగమా?) ‘బిస్కెట్’ ఘటనలో మూడో చిన్నారి మృతి.. కర్నూలు జిల్లా ఆళ్ల గడ్డ మండలం చింతకొమ్ముదిన్నె గ్రామంలో ఈ నెల 13న బిస్కెట్లు తిన్న తర్వాత అస్వస్థతకు గురైన మూడో చిన్నారి కూడా మృత్యువాత పడింది. ఘటన జరిగిన రోజు హుస్సేన్బాషా(6),తర్వాతి రోజు హుస్సేన్బీ(4) అనే ఇద్దరు మృతి చెందగా, కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న మూడో బాలిక జమాల్బీ(8) బుధవారం మరణించింది. -
బిస్కెట్లా?.. విష ప్రయోగమా?
ఆళ్లగడ్డ: మండలంలోని చింతకొమ్ముదిన్నె గ్రామంలో ఆదివారం రాత్రి టీ తాగి, బిస్కెట్లు తిన్న తర్వాత అస్వస్థతకు గురై హుస్సేన్బాష (6) అనే చిన్నారి మృతి చెందగా..మరో ఇద్దరు ఆసుపత్రులో చేరిన విషయం విదితమే. వీరిలో హుస్సేన్బీ (4) అనే చిన్నారి కూడా కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మరో చిన్నారి జమాల్మీ మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. బిస్కెట్లు వికటించడం ఏంటన్న చర్చ సర్వత్రా సాగుతోంది. ఘటనపై పోలీస్, రెవెన్యూ అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఈ ఏడాది ఆగస్టులో తయారైన బిస్కెట్ల ప్యాకెట్పై మరో 18 నెలల గడువు ఉంది. అందులో కల్తీ ఉంటే అస్వస్థతకు గురవడం తప్పా మరణాలు సంభవించే పరిస్థితి చాలా అరుదని అధికారులే అంటున్నారు. దీంతో బిస్కెట్లలోనే ఎవరైనా విషం కలిపారా? లేక పాలు / టీలో విష ప్రయోగం జరిగి ఉంటుందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. చదవండి : (చిన్నారి ప్రాణం తీసిన బిస్కెట్లు ) హోల్సేల్ దుకాణం సీజ్ చింతకొమ్ముదిన్నెలోని చిల్లర దుకాణానికి బిస్కెట్లు సరఫరా చేసిన ఆళ్లగడ్డ పట్టణంలోని సాయిరాం ఎంటర్ప్రైజెస్ హోల్సేల్ దుకాణాన్ని పోలీసుల సూచన మేరకు రెవెన్యూ అధికారులు సోమవారం సీజ్ చేశారు. ఆహార భద్రత అధికారులు వచ్చి పరిశీలించే వరకు దుకాణాన్ని మూసేయడంతో పాటు అందులో ఉండే బిస్కెట్లు బయటకు వెళ్లకుండా సీజ్ చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. చిన్నారుల మృతి ఘటనపై తహసీల్దార్ రవి, ఐసీడీఎస్ అధికారిణి సుశీల సోమవారం తమ సిబ్బందితో గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. చిన్నారులు బిస్కెట్లు కొనుగోలు చేసిన దుకాణం నిర్వాహకునితో పాటు గ్రామంలో పలువురితో మాట్లాడి వివరాలు సేకరించారు. చిన్నారుల మృతి ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. ఈ విషయంపై ఆహార భద్రత శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి..దుకాణాన్ని సీజ్ చేయించాం. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. ప్రత్యేక టీం కూడా ఏర్పాటు చేశాం. పోస్టుమార్టం నివేదికలు వస్తే ఎలా మృతి చెందారన్న విషయం బయటకు వస్తుంది' అని ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు తెలిపారు -
చిన్నారి ప్రాణం తీసిన బిస్కెట్లు
సాక్షి, ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా చింతకొమ్ముదిన్నె గ్రామంలో ఆదివారం బిస్కెట్లు తిని ఒక చిన్నారి మృతి చెందగా మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మాబు వద్ద ఆయన మనవడు, మనవరాళ్లు హుస్సేన్బాష (6), జమాల్బీ, హుస్సేన్బీ డబ్బులు తీసుకుని బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకున్నారు. అవి తిన్న కొద్దిసేపటికే కడుపునొప్పితో విలవిల్లాడారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆళ్లగడ్డలోని వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ హుస్సేన్బాష మృతి చెందాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు వైద్యశాలకు తీసుకెళ్లారు. చిన్నారులు కొన్న బిస్కెట్ల ప్యాకెట్పై ‘రోజ్ మ్యాంగో’ అనే పేరు ఉంది. -
తొమ్మిదేళ్లుగా మెతుకు ముట్టడు
సాక్షి, ప్రకాశం: మనిషి బతకటానికి కావాల్సినవి గాలి, నీరు, ఆహారం. ప్రధానంగా ఆహారం తినకుండా వుంటే మనిషి మనుగడకే ప్రమాదం. మరి తొమ్మిదేళ్లుగా అన్నం మెతుకే ముట్టకపోతే.. వినడానికే వింతగా ఉంది కదూ. సంతమాగులూరు మండలం సజ్జాపురానికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు పుట్టినప్పటి నుంచి అన్న అనేది తినకుండా కేవలం కుర్కురే, లేస్ లాంటి ప్యాకేజ్డ్ పదార్ధాలు తిని కాలం నెట్టుకొస్తున్నాడు. అన్నం తినమంటే ఆమడ దూరం పరుగెడతాడు. వివరాల్లోకెళితే.. సజ్జాపురం ఎస్సీ కాలనీకి చెందిన అనంతవరపు యాకోబు, ఏసమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు చార్లెస్. తొమ్మిదేళ్ల వయసుగల ఈ బాలుడు ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్నాడు. ఈ బాలుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నం మెతుకు ముట్టలేదు. తల్లిపాలు ఇవ్వడం ఆపేసిన నాటి నుంచి కేవలం కుర్కురే ప్యాకెట్లు, బిస్కెట్లు వంటివి తింటూ మంచినీళ్లు తాగి సరిపెట్టుకుంటాడు. పండుగ వచ్చినా ఇంట్లో భోజనం పెడతామని తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా అన్నం పళ్లెం పక్కకు నెట్టివేయటం, కింద పడేయటం చేస్తుంటాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. నానమ్మ భోజనం పెట్టే ప్రయత్నం చేస్తుండగా తిరస్కరిస్తున్న చార్లెస్ తొమ్మిదేళ్లు ఎలా .. మనిషి అనే వ్యక్తి ఒక పూట అన్నం లేకపోతే ఆకలికి తాళలేడు. కానీ చార్లెస్కు ఇన్ని సంవత్సరాలు పాటు ఎందుకు ఇలా చేస్తున్నాడో.. కేవలం ప్యాకెట్లు తిని ఎలా వుంటున్నాడో కాలనీ వాసులకు అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. మళ్లీ అతను అందరిలాగే ఆడుకోవటం.. చురుగ్గానే ఉండటం గమనార్హం. ఆదివారం వస్తే చికెన్తో అయినా భోజనం పెట్టాలని తల్లిదండ్రులు ప్రయత్నిస్తే రెండు చికెన్ ముక్కలు తినేసి భోజనం మాత్రం వద్దంటాడు. ఇంట్లో వాళ్లు మందలించినా మారాం చేయడం మినహా మార్పు మాత్రం రాలేదు. చదవండి: మళ్లీ చిరుత పంజా, వీడియో వైరల్ పోషకాహార లోపం వచ్చే అవకాశం ఉంది అనంతవరపు చార్లెస్ అనే బాలుడు అన్నం తినకుండా కేవలం ప్యాకేజ్డ్ ఫుడ్ తినటం వల్ల అతనికి భవిష్యత్లో పోషకాహార లోపం కలిగే ప్రమాదం ఉంటుంది. ఇదే పరిస్ధితి కాకుండా భవిష్యత్లో తల్లిదండ్రులు అతని ఆలోచన మారే విధంగా నడుచుకోని భోజనానికి అలవాటు చేస్తే మంచిది. డాక్టర్ వెంకటనారాయణ, సంతమాగులూరు ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం వాడికిదేం శాపమో బిడ్డ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నం అంటే ఏదో విషాన్ని చూసినట్లుగా చూస్తున్నాడు. ఇదేమిటో అంతుపట్టడం లేదు. ఎక్కడైనా డాక్టర్లుకు చూపిద్దామని తీసుకెళ్తున్నా సహకరించడు. అన్నం తినకపోవడం అనేది వాడికి ఒక శాపంగా మారింది. కూలీనాలీ చేసుకుంటే తప్ప మాకు ముద్ద నోటిలోకి పోదు.. మరో పక్క కొడుకు ఇలా అన్నం తినకుండా ఇన్నాళ్లు నుంచి ఇబ్బంది పెడుతున్నా ఏం చేయలేకపోతున్నాం. -ఏసమ్మ, బాలుడి తల్లి చూస్తే బాధేస్తుంది మేం కడుపునిండా అన్నంతింటూ కొడుక్కి పెట్టలేకపోవడం బాధేస్తుంది. చిన్నతనం నుంచి ఇప్పటి వరకు అన్నంను తినకుండా కుర్కురే ప్యాకెట్లు, బిస్కెట్లు, మంచినీళ్లతోనే కడుపు నింపుకుంటుండు. న్నిసార్లు అన్నం పెట్టకొచ్చి ప్రయతి్నంచినా ప్రయోజనం మాత్రం లేదు. మా ఊళ్లో ఉన్న గవర్నమెంటు బడిలో మూడో తరగతి చదువుతున్నాడు. బళ్లో అన్నం పెట్టే సమయంలో కూడా ఆ ప్రాంతంలోనే ఉండకుండా వెళ్లిపోతుంటాడు. -యాకోబు, బాలుడి తండ్రి నాకు అన్నం ఇష్టం లేదు నేను ప్యాకెట్లు తింటానే తప్ప అన్నం నాకు పడదు. చిన్నప్పుడు నుంచి అమ్మానాన్న అన్నం పెట్టినా తినే వాడిని కాదు. ఎన్నిసార్లు పెట్టాలని చూసినా ఇష్టం లేనిది తినబుద్ది కాలేదు. ప్యాకెట్లు, తింటూ మంచినీళ్లు తాగుతూ ఇలాగే వుండటం నాకిష్టం. అన్నం పెట్టమని ఇంట్లో ఎవరినీ ఇబ్బంది పెట్టను. పెడతానంటే మాత్రం ఆ దరిదాపుల్లో లేకుండా పోతా. -చార్లెస్ -
పది నిమిషాల్లోనే నోరూరించే చాకోచిప్
నచ్చిన వంటలు చేసుకుని తినడంలో వచ్చే కిక్కే వేరు. ఇక ప్రస్తుతం లాక్డౌన్లో ఇంట్లో బోరింగ్ ఫీల్ అవుతున్నవారు రకరకాల వంటలతో బిజీగా గడుపుతున్నారు. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు లాక్డౌన్లో గరిటె తిప్పడంపై శ్రద్ధ పెడుతున్నారు. వంటలు, స్నాక్స్, సలాడ్స్ ఇలా ఎన్నో రకాల రుచికరమైన వాటిని చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఎప్పుడూ ఒకే విధమైన వంటకాలు చేయడం నచ్చలేని వాళ్లు కొత్తగా ఏదైనా తయారు చేయాలనుకుంటారు. అలాంటి వారు ఓ సారి చాకోచిప్ కుకీలను తయారు చేసి చూడండి. ఇది తెలిసిన వంటకమే అయినా తక్కువ పదార్థాలతో, చాలా తొందరగా చేయడం తెలిస్తే ఇక ఎప్పుడు దీనిని వదలరు. (మాల్స్ను వీడి... వీధుల్లోకి రెస్టారెంట్లు) ఈ రకమైన బిస్కెట్లు తయారు చేయడానికి కేవలం పది నిమిషాలే సరిపోతుంది. అలాగే దీనికి ఓవెన్, ఎగ్స్ కూడా అవసరం లేదు. కావున శాఖాహార ప్రియులు కూడా లాగించేయవచ్చు. చిన్న వాళ్ల నుంచి ముసలి వాళ్ల వరకు అందరికి ఈ చాకోచిప్ కుకీలు నచ్చుతాయి. బయట భాగంలో క్రంచీగా, లోపల మృదువుగా ఉంటాయి. దీని తయారీకి మీకు కావలిసిందల్లా కేవలం మూడు పదార్థాలు. మరి అవేంటో తెలుసుకుందాం. (కాలక్షేపం కోసం వీటిని తినేస్తున్నారు..) దీనికి కావాల్సిన పదార్థాలు ♦ 2 టేబుల్ స్పూన్లు - చాకో చిప్స్ ♦ 100 గ్రా - వెన్న ♦ 1/2 కప్పు - పొడి చేసిన చక్కెర ♦ 1 కప్పు - మైదా పిండి చాకోచిప్ కుకీలు ఎలా తయారు చేయాలో చుద్దాం.. ► ముందుగా ఒక గాజు గిన్నె తీసుకొని అందులో 100 గ్రాముల వెన్న వేసి మెత్తటి మిశ్రమంలా అయ్యే వరకు గిలకొట్టండి. అందులో అర కప్పు పొడిగా చేసిన చక్కెర కలపండి. దీనిని మెత్తగా కలపాలి. ► తరువాత ఇందులో ఒకటి పావు మైదా పిండిని జోడించండి. రుచికి సరిపడా ఉప్పు వేసి మరీ మెత్తగా, మరీ గట్టిగా కాకుండా మామూలుగా ఉండే పిండి ముద్దలా తయారు చేసుకోవాలి. ► 2 టేబుల్ స్పూన్ల చోకో-చిప్ కుకీలను వేసి పూర్తిగా కలపాలి. నాన్-స్టిక్ పాన్ తీసుకోని ఆయిల్ వేసి దానిపై వెన్న కాగితాన్ని ఉంచి మరోసారి నూనెతో తడపాలి. ► చేతులోకి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని చిన్న బంతి లాగా చేసి అరచేతులతో దాన్ని కొంచెం వెడల్పు చేయాలి. పాన్లో సరిపోయేంతలా చిన్నగా చేసుకుని ప్రతి పిండి ముద్దకు మధ్యలో సరైన గ్యాప్ ఉంచాలి. ►ఇప్పుడు కుకీలకు కొద్దిగా చోకో-చిప్స్ జోడించండి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. పాన్పై మూత పెట్టి తక్కువ మంటతో 10 నిమిషాల పాటు వేడి చేయండి. స్టవ్ కట్టేసి,గా పాన్పై మూత తీసి కుకీలు పూర్తిగా చల్లబడేదాకా ఆగండి. అంతే నోరూరించే టేస్టీ, క్రంచీ కుకీలు రెడీ. ఇంకేందుకు ఆలస్యం టెస్ట్ చేయండి. -
కాలక్షేపం కోసం వీటిని తినేస్తున్నారు..
సాక్షి, సిటీబ్యూరో : చిన్న పిల్లలు నుంచి పెద్దవారి వరకు అందరూ ఎంతో ఇష్టపడేది స్నాక్స్, ఇన్స్టంట్ ఫుడ్ ఐటెమ్స్. లాక్డౌన్ కారణంగా ఇప్పుడు వాటికి కష్టకాలం వచ్చింది. సూపర్ మార్కెట్, కిరాణా దుకాణాల్లోనూ స్టాక్ లేక వినియోగదారులు నిరాశకు గురవుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు బిస్కెట్లు, చాక్లెట్లు, వేపర్స్, చిప్స్, కార్న్ఫ్లేక్, కుర్కురే, పల్లీ చిక్కీలు, ఐస్క్రీమ్, నూడిల్స్, పాస్తా, చుడువా, సూప్స్, నమ్కిన్, గులాబి జామున్ తదితర స్నాక్, ఇన్స్టంట్ ఫుడ్ ఐటమ్స్ నిల్వలు నిండుకున్నాయి. ఒక వైపు కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వినియోగదారులు ఇళ్లలో ఉండి కుటుంబ సభ్యులతో కలిసి కాలక్షేపం కోసం వీటిని ఎక్కువగా తింటున్నారు. దీంతో స్నాక్స్, ఇన్స్టంట్ ఫుడ్స్కు ఒకేసారి డిమాండ్ పెరిగింది. మరోవైపు లాక్డౌన్తో వాటి ఉత్పత్తి ఆగి సరఫరా లేకుండా పోయింది. ఈ కారణంగానే మార్కెట్లో ఇప్పుడు స్నాక్స్ కొరత ఏర్పడింది. తాజాగా ఇండస్ట్రీ సెక్టార్కు గ్రీన్ సిగ్నల్ లభించినా..కార్మికుల కొరతతో డిమాండ్కు సరిపడా ఉత్పత్తి కావడం లేదు. దీంతో వాటి సరఫరా తగ్గుముఖం పట్టింది. స్నాక్స్, ఇన్స్టంట్ ఫుడ్ ఐటెమ్స్కు ఇండెంట్ ఆర్డర్స్ పెడితే...పెట్టిన దాంట్లో కనీసం 30 శాతం కూడా సరఫరా కాని పరిస్థితి నెలకొందని వ్యాపారులు, సూపర్ మార్కెట్ల మేనేజర్లు పేర్కొంటున్నారు. (మహమ్మారి.. దారి మారి! ) లోకల్ ఉత్పత్తులు పెద్ద పెద్ద సంస్థలకు చెందిన స్నాక్స్, ఇన్స్టంట్ ఫుడ్ ఉత్పత్తుల సరఫరా నిలిచిపోవడంతో కొంతమేర లోకల్ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇక కొన్ని సూపర్ మార్కెట్స్ తమ సంస్థల పేర్లతో స్నాక్స్, ఇన్స్టంట్ ఫుడ్ ఐటమ్స్ తయారు చేసి అమ్మడం ప్రారంభించాయి. పేరొందిన సూపర్ మార్కెట్లు, స్థానిక చిన్న చిన్న సంస్ధలు సైతం సొంతంగా బిస్కెట్లు, చిప్స్, ఐస్క్రీమ్, నమ్కిన్, నూడుల్స్, సూప్స్ తదితర ఐటెమ్స్ను సొంతంగా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వినియోగదారులు మాత్రం బ్రాండ్ ఉత్పత్తులపైనే ఆసక్తి కనబర్చుతున్నట్లు తెలుస్తోంది. కిరాణా దుకాణాల్లో మాత్రం పేద, మధ్య తరగతి వర్గాల నుంచి మాత్రం లోకల్ ఉత్పత్తులకు ఆదరణ బాగానే లభిస్తోంది. (కరోనా: టాస్క్ఫోర్స్కు రిస్క్!) -
నోట్లో ‘కుకీసు’కుందాం
న్యూ ఇయర్ వస్తోందంటే ఇళ్లన్నీ కేకులు, కుకీస్, బిస్కెట్లతో నిండిపోతాయి. ఒకరికి ఒకరు బహుమతిగా ఇవ్వడానికి బేకరీలకు ఆర్డర్ చేస్తుంటారు. మరి మనకు కావలసినవారికోసం స్వయంగా మనమే తయారు చేస్తే! న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి మీ స్నేహితుల ఇంటికి వెళ్లి, ఈ కుకీస్తో వారి నోటిని తీపి చేసి, ‘హ్యాపీ న్యూ ఇయర్’ చెప్పండి. క్రంచీ పీనట్ బటర్ కుకీస్ కావలసినవి: బ్రౌన్ సుగర్ – ఒక కప్పు; పంచదార – ఒక కప్పు; పీనట్ బటర్ – ఒక కప్పు; (కప్పుడు పల్లీలకు ముప్పా వు కప్పు బటర్ జత చేసి, మిక్సీలో వేసి మెత్తగా చేస్తే హోమ్ మేడ్ పీనట్ బటర్ సిద్ధమైనట్లే) కోడి గుడ్లు – 2 (పెద్దవి); వెనిలా ఎక్స్ట్రాక్ట్ – ఒక టీ స్పూను; ఉప్పు – పావు టీ స్పూను; బేకింగ్ సోడా – ఒక టీ స్పూను; వేడి నీళ్లు – 2 టేబుల్ స్పూన్లు; మైదా పిండి – 2 కప్పులు; బటర్/నెయ్యి – కొద్దిగా తయారీ: ►ముందుగా అవెన్ను 375 డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేయాలి ►ఒక పెద్ద పాత్రలో బ్రౌన్ సుగర్, పంచదార, పీనట్ బటర్, కోడి గుడ్లు వేసి బాగా గిలకొట్టాలి (ఎలక్ట్రిక్ మిక్సర్ ఉంటే, అందులో వేసి బాగా మెత్తగా అయ్యేవరకు బ్లెండ్ చేయాలి) ►వెనిలా ఎక్స్ట్రాక్ట్, ఉప్పు, బేకింగ్ సోడా, వేడి నీళ్లు జత చేసి మరోమారు గిలకొట్టాలి ►మైదా పిండి జత చేసి అన్నీ కలిసేవర కు మరోమారు గిలకొట్టాలి ►కుకీస్ షీట్ లేదా అల్యూమినియం ఫాయిల్ తీసుకుని, దాని మీద బటర్ పూయాలి ►కుకీస్ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని ఫ్రిజ్లో సుమారు అర గంటసేపు ఫ్రీజ్ చేసి, బయటకు తీసి, చిన్న చిన్న బాల్స్లా చేతితో తయారుచేసి కుకీస్ షీట్ మీద ఉంచి, ప్రీ హీట్ చేసిన అవెన్లో ఉంచాలి ►సుమారు పావు గంట తరవాత బయటకు తీసి, చల్లారాక వాటిని గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. క్రిస్పీ చాకొలేట్ చిప్ కుకీస్ కావలసినవి: మైదా పిండి – రెండు కప్పులు (నిండుగా); బేకింగ్ సోడా – అర టీ స్పూను; బటర్ – ఒక కప్పు; పంచదార – ఒక కప్పు; ప్యాక్డ్ బ్రౌన్ సుగర్ – ఒక కప్పు; ఉప్పు – ఒక టీ స్పూను; వెనిలా ఎక్స్ట్రాక్ట్ – 2 టీ స్పూన్లు; కోడి గుడ్డు – 1 (పెద్దది); మిల్క్ చాకొలేట్ చిప్స్ – ఒక కప్పు; డార్క్ చాకొలేట్ – అర కప్పు (సన్నగా ముక్కలు చేయాలి) తయారీ ►అవెన్ను 375 ఫారెన్ హీట్ డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేయాలి ►చిన్న పాత్రలో మైదా పిండి, ఉప్పు, బేకింగ్ సోడా వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ►వేరొక పాత్రలో బ్రౌన్ సుగర్, పంచదార, బటర్ వేసి బ్లెండర్తో బాగా గిలకొట్టాలి ►పావుకప్పు నీళ్లు, వెనిలా, కోడిగుడ్డు జత చేసి మరి కాసేపు గిలకొట్టాలి ►మైదా పిండి మిశ్రమం జత చేసి బాగా గిలకొట్టాలి ►చాకొలేట్ చిప్స్ జత చేసి, సుమారు అరగంటసేపు ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్లో ఉంచి ఫ్రీజ్ చేసి, బయటకు తీసి, చిన్న చిన్న ఉండలుగా చేయాలి ►కుకీస్ షీట్ లేదా అల్యూమినియం ఫాయిల్ మీద బటర్ పూసి, ఆ పైన కుకీస్ను ఉంచి, ఆ షీట్ను అవెన్లో ఉంచి సుమారు పావు గంట సేపు బేక్ చేసి బయటకు తీయాలి ►బాగా చల్లారాక వీటిని గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. జింజర్ బ్రెడ్ కుకీస్ కావలసినవి: బటర్ – అర కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; బ్రౌన్ సుగర్ (బ్రౌన్ సుగర్ బదులు పంచదార కూడా వాడచ్చు) – ముప్పావు కప్పు; మొలాసెస్ లేదా బెల్లం పాకం – అర కప్పు కంటె కొద్దిగా ఎక్కువ కోడి గుడ్డు – 1; వెనిలా ఎక్స్ట్రాక్ట్ – ఒక టీ స్పూను; మైదా పిండి – మూడున్నర కప్పులు బేకింగ్ సోడా – ఒక టీ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; అల్లం పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు; దాల్చిన చెక్క పొడి – ఒక టేబుల్ స్పూను; గరం మసాలా – అర టీ స్పూను; లవంగాల పొడి – అర టీ స్పూను తయారీ ►అవెన్ను 350 ఫారెన్ హీట్ డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేసుకోవాలి ►ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్ సోడా, ఉప్పు, అల్లం పేస్ట్, దాల్చిన చెక్క పొడి, లవంగాల పొడి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ►వేరొక పాత్రలో బటర్, బ్రౌన్ సుగర్, పంచదార వేసి బాగా గిలకొట్టాలి ►బెల్లం పాకం లేదా మొలాసెస్ జత చేసి మరోమారు గిలకొట్టాలి ►కోడిగుడ్డు, వెనిలా జత చేసి బాగా కలియబెట్టాలి ►మైదా పిండి మిశ్రమం జత చేసి పదార్థాలన్నీ బాగా కలిసి మెత్తగా అయ్యేవరకు బీటర్తో బాగా గిలకొట్టాక ఈ మిశ్రమాన్ని ఒక రాత్రి అంతా ఫ్రిజ్లో ఉంచి ఫ్రీజ్ చేసి, బయటకు తీసి, చిన్న చిన్న బాల్స్ చేయాలి ►బటర్ పూసిన అల్యూమినియం ఫాయిల్ లేదా కుకీస్ షీట్ మీద ఈ బాల్స్ ఉంచి, షీట్ను అవెన్లో పది నిమిషాల పాటు బేక్ చేసి బయటకు తీసి, చల్లారాక గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. సుగర్ కుకీస్ కావలసినవి: మైదా పిండి – మూడు కప్పులకు కొద్దిగా తక్కువ బేకింగ్ సోడా – ఒక టీ స్పూను; బేకింగ్ పౌడర్ – అర టీ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; బటర్ – ఒక కప్పు; పంచదార – ఒక కప్పు + 2 టేబుల్ స్పూన్లు; బ్రౌన్ సుగర్ – 2 టేబుల్ స్పూన్లు; కోడి గుడ్డు – 1; వెనిలా ఎక్స్ట్రాక్ట్ – 2 టీ స్పూన్లు; పంచదార – పావు కప్పు తయారీ ►ముందుగా అవెన్ను 350 ఫారెన్ హీట్ డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేసుకోవాలి ►ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ►వేరొక పాత్రలో బటర్, బ్రౌన్ సుగర్, పంచదార వేసి బీటర్తో బాగా గిలకొట్టాలి ►కోడిగుడ్డు, వెనిలా జత చేసి మరోమారు బాగా గిలకొట్టాలి ►మైదా పిండి మిశ్రమం జత చేసి పదార్థాలన్నీ బాగా కలిసి మెత్తగా అయ్యేవరకు బీటర్తో బాగా గిలకొట్టి, ఈ మిశ్రమాన్ని అరగంట సేపు ఫ్రిజ్లో ఫ్రీజ్ చేసి, బయటకు తీసి, చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి ►వీటి మీద మనకు నచ్చిన చిప్స్ను చల్లుకోవాలి ►అల్యూమినియం ఫాయిల్ లేదా కుకీస్ షీట్కు బటర్ పూసి, ఆ పైన ఈ కుకీస్ను ఉంచి, అవెన్లో ఉంచి సుమారు పది నిమిషాల పాటు బేక్ చేసి బయటకు తీసేయాలి ►చల్లారిన తరవాత గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. వైట్ చాకొలేట్ బ్లూ బెర్రీ ఓట్మీల్ కుకీస్ కావలసినవి: బటర్ – అర కప్పు; పంచదార – అర కప్పు; బ్రౌన్ సుగర్ – అర కప్పు; కోడి గుడ్డు – 1 (పెద్దది); వెనిలా ఎక్స్ట్రాక్ట్ – 2 టీ స్పూన్లు; మైదా పిండి – ఒక కప్పు + 2 టేబుల్ స్పూన్లు; కార్న్ స్టార్చ్ – 2 టీ స్పూన్లు; ఉప్పు – అర టీ స్పూను; బేకింగ్ సోడా – అర టీ స్పూను; బేకింగ్ పౌడర్ – పావు టీ స్పూను; ఓట్స్ – ఒక కప్పు; వైట్ చాకొలేట్ చిప్స్ – అర కప్పు; తాజా బ్లూబెర్రీలు – ఒక కప్పు తయారీ ►ముందుగా అవెన్ను 350 ఫారెన్ హీట్ డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేసుకోవాలి ►ఒక పాత్రలో మైదాపిండి, కార్న్ స్టార్చ్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ►వేరొక పాత్రలో బటర్, బ్రౌన్ సుగర్, పంచదార వేసి బీటర్తో బాగా గిలకొట్టాలి ►కోడిగుడ్డు జత చేసి మరోమారు బాగా గిలకొట్టాలి ►మైదా పిండి మిశ్రమం జత చేసి పదార్థాలన్నీ బాగా కలిసి మెత్తగా అయ్యేవరకు బీటర్తో గిలకొట్టాక, ఓట్స్, వైట్ చాకొలేట్ చిప్స్ జత చేసి, గరిటెతో జాగ్రత్తగా కలియబెట్టాలి ►చివరగా తాజా బ్లూబెర్రీలు జత చేయాలి ►చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి ►అల్యూమినియం ఫాయిల్ లేదా కుకీస్ షీట్కు బటర్ పూసి, ఆ పైన ఈ కుకీస్ను ఉంచి, అవెన్లో ఉంచి సుమారు పది నిమిషాల పాటు బేక్ చేసి బయటకు తీసేయాలి ►చల్లారిన తరవాత గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. -
సిరి సంపాదన
పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉంటున్న ఆ గిరిపుత్రికలు జీవనోపాధి కోసం సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఆదినుంచీ తమ ఆహారంలో భాగమే అయిన రాగి, జొన్న, కొర్ర, సజ్జలు వంటి సిరిధాన్యాలకు నేటి ఆధునిక సమాజంలో లభిస్తున్న ఆదరణను చూసి.. వాటినే ఆదాయ వనరుగా మలచుకున్నారు. నాబార్డు సాయంతో ఇంటివద్దే బిస్కెట్లు తయారు చేస్తూ.. మార్కెట్లో వీటిని విక్రయిస్తూ.. ఆదాయం పొందుతున్నారు. ఒకప్పుడు రోజుకూలి దొరక్క అష్టకష్టాలు పడిన ఈ ఆడబిడ్డలు ఈరోజు వేలాది రూపాయలు ఆర్జిస్తూ.. మా సిరిసంపదలు సిరిధాన్యాలే అని ఆనందంగా చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామన్నగూడెంలో అన్నీ గిరిజన కుటుంబాలే జీవిస్తున్నాయి. కూలి పనులు చేసుకుంటేనే వీరికి ఇల్లు గడిచేది. అయితే.. రోజూ పని దొరక్కపోవడం, పుట్టి పెరిగిన మన్యం వీడి వలసపోలేని పరిస్థితిలో నలుగురు మహిళలు మొడియం రమాదేవి, నారం కుమారి, నారం వెంకటలక్ష్మి, మాడి లక్ష్మిలు సిరిధాన్యాలతో బిస్కెట్లు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. రోగాల నివారణకు, ఆరోగ్యానికి సిరిధాన్యాలు ఎంతో మేలు చేస్తాయని ఇటీవలి కాలంలో విస్తృత అవగాహన పెరుగుతున్న క్రమంలో వీరి ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోంది. వాస్తవానికి సిరిధాన్యాలు గిరిజన బిడ్డలైన వీరికి అనాదిగా ఆహారమే మరి. వీటినే.. ఇప్పుడు ఇలా ఉపాధికి ఎంచుకోవడం విశేషం. వీళ్ల ఆలోచనకు నాబార్డు వారి సహకారం తోడైంది. బిస్కెట్ల తయారీకి అవసరమైన యూనిట్ను సబ్సిడీపై రూ.75 వేలకు మంజూరు చేయడంతో.. గతేడాది అక్టోబర్లో ఇంట్లోనే దీనిని నెలకొల్పారు. నాటి నుంచి నలుగురూ కలిసికట్టుగా రాగి, జొన్న, కొర్ర, సజ్జలతో షుగర్, షుగర్ లెస్ బిస్కెట్లను తయారు చేస్తున్నారు. కేజీ పిండిని 52 బిస్కెట్లుగా మలుస్తూ వీటిని మార్కెట్లో రూ.300కు విక్రయిస్తున్నారు. ఈ యూనిట్ ద్వారా ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమిస్తే దాదాపు 40 కేజీల బిస్కెట్లు తయారవుతున్నాయి. ఇందుకోసం రూ.2వేలు పెట్టుబడికి వెచ్చిస్తుండగా.. విక్రయించడం ద్వారా రూ.12వేలు పొందుతున్నామని చెబుతున్నారు. అంటే పెట్టుబడి పోను రూ.10వేల వరకు ఆదాయం లభిస్తోంది. ఈ సొమ్మును ఈ గిరిజన మహిళలు నలుగురు సమంగా పంచుకుంటున్నారు. తద్వారా.. వీరికి రోజుకు ఒక్కొక్కరికీ రూ.2,500 లాభం దక్కుతోంది. తయారీ ఇలా.. మొడియం రమాదేవి, నారం కుమారి, నారం వెంకటలక్ష్మి, మాడి లక్ష్మి స్థానికంగా ఒక గృహంలో పిండిమరను ఏర్పాటు చేశారు. ముందుగా సిరిధాన్యాల రాశులను సిద్ధం చేసుకొని వీటిని మిల్లులో పిండి పట్టుకొని, జల్లెడ పట్టి, తర్వాత పిండిని ముద్దగా వత్తాలి. ఇలా సిద్ధం చేసిన ఒక కేజీ పిండిలో అరకేజీ బిస్ క్రీమ్, 45 గ్రాముల పంచదార, పైనాపిల్ లేదా వెనిలా ఫ్లేవర్ను రెండుమూతలు కలుపుతారు. తర్వాత పిండిని మరోసారి ఒత్తి, బిస్కెట్ కట్టర్తో కావాల్సిన ఆకారంలో కట్ చేస్తున్నారు. వీటిని.. ఒవెన్ను ప్రీ హీట్ చేసి గంట తర్వాత బయటకు తీస్తారు. చల్లారిన తర్వాత డబ్బాల్లో నింపి గాలి జొరబడకుండా గట్టిగా మూతలు పెడుతున్నారు. ఇవి దాదాపు నెల రోజులపాటు నిల్వ ఉంటాయి. వీటి తయారీ కోసం కొనుగోలు చేసిన యానిట్ ద్వారా.. ఖాళీ సమయాల్లో గోధుమలు, బొబ్బర్లు, శనగలు, పెసలు, మినుములు, బియ్యం (తడి, పొడి) పట్టడం ద్వారా అదనపు ఆదాయం కూడా పొందుతున్నారు. ఈ ప్రక్రియ గురించి తెలుసుకున్న భద్రాచలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పీఓ పమెల సత్పథి ఆశ్చర్యం వ్యక్తం చేసి, ఈ బిస్కెట్లను జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు అందించేలా ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సమాచారం. – ఎండి. ముజాఫర్ఖాన్, సాక్షి, అశ్వారావుపేట రూరల్, భద్రాది కొత్తగూడెం ప్రభుత్వం ప్రోత్సహించాలి మార్కెట్లో చాలా బిస్కెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. సిరిధాన్యాలతో చేసినవి పౌష్టికాహారం అని చాలామంది ఆసక్తితో కొంటున్నారు. మేం కూడా నాణ్యత దెబ్బతినకుండా వీటిని తయారు చేస్తున్నాం. అనేక రోగాలకు ఇవి సంజీవనిలా పని చేస్తాయి. ప్రభుత్వం ప్రోత్సహించి, వీటిని హాస్టళ్ల సరఫరాకు అవకాశం కల్పిస్తే చాలామందికి ఉపాధి లభిస్తుంది. – మొడియం రమాదేవి, రామన్నగూడెం అప్పట్లో కూలి దొరక్కఇబ్బంది పడ్డాం.. యూనిట్ పెట్టకముందు ఉపాధి కోసం ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కూలి పనులు లేని రోజుల్లో పైసలుండేవి కావు. ఈ యూనిట్ పెట్టిన తర్వాత ఇంటి వద్దే ఉండి పని చేస్తున్నా. ఈ బిస్కెట్లను గిరిజన సహకార సంస్థ (జీసీసీ) దుకాణాల్లో విక్రయించేలా అవకాశం కల్పించాలని కోరుతున్నాం. – నారం కుమారి, రామన్నగూడెం -
కర కరాచీ బిస్కెట్లు
తియ్యటి ఘుమఘుమల సువాసనలు కరిగించిన బటర్, కారమిలైజ్ చేసిన పంచదారల కలయిక నుండి వచ్చే మాధుర్యం.. నైపుణ్యం కలిగిన రెండు మూడు చేతుల మధ్యన మృదువుగా నలుగుతున్న పిండి... క్యాండీడ్ ఫ్రూట్స్ను జల్లుతున్న మరో కొన్ని చేతులు... వారి వెనకాలే పెద్ద పెద్ద అవెన్లు... అంతే... ఎంతో ఆదరణ పొందిన కరాచీ బేకరీ బిస్కెట్లు సిద్ధం... దేశవ్యాప్తంగా ఇంత ఆదరణ పొందిన ఈ బిస్కెట్ల ప్రయాణం సుమారు 60 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. ఈ బేకరీ ఖాన్చంద్ రామ్నాని ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది. కరాచీ బిస్కెట్లు... ఈ పేరుకి, పాకిస్థాన్లోని కరాచీకి ఏ మాత్రం సంబంధం లేదు. తన స్వస్థలం మీద మమకారంతో మాత్రమే ఈ పేరు పెట్టుకున్నారు. పుట్టుకతో సింధీ అయిన ఖాన్చంద్ రామ్నామీ, దేశ విభజన సమయంలో పాకిస్థాన్ కరాచీ నుంచి ప్రస్తుత ఇండియాకి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. 1953లో తనముద్రను ప్రతిబింబించేలా బిస్కెట్లు, కేక్లు, పేస్ట్రీల అమ్మకాలలో ప్రఖ్యాతి చెందారు. మొట్టమొదటి ఔట్లెట్ను ముజాంజాహి మార్కెట్లో ప్రారంభించారు. ఇటీవలే దుబాయ్లో కూడా వీరి ఔట్లెట్ తొలి అడుగు వేసింది.1960లో రామ్నామీ స్వయంగా తన సొంత బేకింగ్ యూనిట్ను ప్రారంభించి, తన మార్కులో ఫ్రూట్ బిస్కెట్లను తయారుచేయడం ప్రారంభించారు. అంతే, హైదరాబాదీల మనసులను ఇట్టే దోచేసుకున్నారు. నోటికి లవణ రుచిని కూడా చూపిస్తున్నారు. టూటీ ఫ్రూటీతో బిస్కెట్ల మీద నక్షత్రాల్లా మిణుకుమిణుకు మంటూ నోరూరేలా చేస్తున్నారు. టీ టైమ్ తినడానికి అనువుగా కాజు బిస్కెట్లు, ఉప్పు బిస్కెట్లు తయారుచేస్తున్నారు. ‘‘మా నాన్నగారు నాణ్యత మీదే మనసు లగ్నం చేశారు. ఆ నాణ్యతనే నేటికీ కొనసాగిస్తున్నాం. నా సోదరులిద్దరూ గతించారు. నా మేనల్లుళ్లు సోషల్మీడియాలో మా బేకరీ వస్తువుల గురించి ప్రచారం చేస్తుంటారు. నేను నిత్యం పనులలో బిజీగా ఉన్నా కూడా అందరికీ సకాలంలో డెలివరీలు అందేలా జాగ్రత్తపడుతుంటాను’’ అంటారు లేఖ్రాజ్ రామ్నాని. ఇక్కడి ప్రత్యేకతలు... ఎగ్లెస్ కుకీస్ కరాచీ బేకరీ ప్రత్యేకత. అలాగని వీరు కొత్తరకాలు తయారుచేయడంలేదని కాదు. ఇక్కడ పదిరకాల బిస్కెట్లు, షెర్మాల్ నుంచి ఒరిజానో వరకు 40 రకాల కుకీలు తయారుచేస్తున్నారు. కాజు, ఫ్రూట్స్, ఉస్మానియా... అన్నీ అప్పటికప్పుడు అమ్ముడైపోతాయి. హైదరాబాద్లో వీరికి విశేష ఆదరణ రావడంతో, నాణ్యత విషయంలో మరింత జాగ్రత్తలు పాటిస్తున్నారు. 2018 లో ముంబైలో కొత్తబ్రాంచ్ తెరిచారు. 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 ఔట్లెట్లు పూర్తిచేయాలనే సంకల్పంతో ఉన్నారు. స్థానిక దుకాణాలు మొదలు, అమెజాన్.కామ్ వంటి ఆన్లైన్ సంస్థల వరకు కరాచీ బిస్కెట్లను అమ్ముతున్నాయి. హైదరాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి ప్రయాణించేవారు ఈ బిస్కెట్లను తమ బంధువులకు తప్పనిసరిగా తీసుకువెళ్తారు. నానాటికీ పెరుగుతున్న ప్రజాదరణతో ఈ ఔట్లెట్ల సంఖ్య పెరుగుతోంది. లేఖరాజ్ మాటల ప్రకారం. ... నిజమైన హైదరాబాదీకి ఉదయం టీతో పాటు కరాచీ బిస్కెట్లతోనే తెల్లవారుతుంది. మా కుటుంబీకులకు ఒక నమ్మకం ఉంది. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. అందువల్లే మేం ఎక్కువ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇష్టపడం. చేతలతోనే మాట్లాడతాం. – లేఖ్రాజ్ రామ్నాని (ఖాన్చంద్ రామ్నాని కుమారుడు) కారం బిళ్లలు కావలసినవి: బియ్యప్పిండి – ఒక కప్పు; సెనగ పిండి – ఒక కప్పు; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – రుచికి తగినంత; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; నువ్వులు – ఒక టేబుల్ స్పూను; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙ఒక పాత్రలో బియ్యప్పిండి, సెనగ పిండి, అల్లం వెల్లుల్లి ముద్ద, మిరపకారం, ఉప్పు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి ∙నువ్వులు వేసి మరోమారు కలపాలి ∙ఈ మిశ్రమాన్ని సుమారు అర గంట సేపు పక్కన ఉంచాలి ∙చేతికి నూనె పూసుకుని పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ ఉండలా చేసి, చేతితో వడ మాదిరిగా ఒత్తి పక్కన పెట్టుకోవాలి ∙ఈ విధంగా అన్నీ చేసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచుకున్న కారం బిళ్లలను అందులో వేసి దోరగా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙ఇవి పదిహేను రోజుల దాకా నిల్వ ఉంటాయి. -
స్నాక్ సెంటర్
స్ట్రాబెరీ బిస్కెట్స్ కావలసినవి: సాల్టెడ్ బటర్ తురుము – అర కప్పు (మార్కెట్లో దొరుకుతుంది)మైదాపిండి – రెండున్నర కప్పులు, పంచదార – పావు కప్పు (మిక్సీ పట్టుకోవాలి)బేకింగ్ పౌడర్ – పావు టీ స్పూన్, చీజ్ – 1 కప్పుస్ట్రాబెరీ ముక్కలు – 1 కప్పు, సాల్టెడ్ బటర్ – 2 టేబుల్ స్పూన్స్ తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో మైదాపిండి, పంచదార పొడి, బేకింగ్ పౌడర్, అరకప్పు బటర్ తురుము వేసుకుని, బాగా కలిపి పదినిమిషాల పాటు ఆగాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో చీజ్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్ట్రాబెరీ ముక్కలు కూడా యాడ్ చేసుకుని, ఓ ఐదారు సార్లు కలుపుకుని మెత్తగా పిసికి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో బిస్కెట్స్ తయారు చేసుకుని ఓవెన్లో పెట్టుకోవాలి. 12 – 15 నిమిషాల మధ్యలో 2 టేబుల్ స్పూన్స్ సాల్టెడ్ బటర్ని బిస్కెట్స్పైన వేసి మెల్ట్ చేసుకోవాలి. ఓట్స్ కేక్ కావలసినవి: మైదాపిండి – 1 1/4 కప్పు, బేకింగ్ పౌడర్ – 1 1/2 టీ స్పూన్బ్రౌన్సుగర్ – అర కప్పు, బటర్ – అర కప్పు, ఓట్స్ – ముప్పావు కప్పు, వేడి నీళ్లు – 1 కప్పు, ఖర్జూరం – 1 కప్పు, వాల్నట్స్ – 1 కప్పు, అవిసె గింజల పొడి – 3 టేబుల్ స్పూన్స్, నీళ్లు – 6 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత తయారీ: ముందుగా ఖర్జూరాలను శుభ్రం చేసి, గింజలు తీసి వేడి నీళ్లలో వేసి పదిహేను నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత అవిసె గింజల పొడిలో 6 టేబుల్ స్పూన్ల నీళ్లు కలిపి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టాలి. (అభిరుచిని బట్టి ఈ అవిసె గింజల మిశ్రమానికి బదులుగా ఒక గుడ్డును ఉపయోగించుకోవచ్చు) ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ బౌల్ తీసుకుని, అందులో బ్రౌన్సుగర్, బటర్, ఖర్జూరం వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత వాల్నట్స్, అవిసె గింజల మిశ్రమం యాడ్ చేసుకుని మెత్తగా అయ్యేదాకా మరోసారి మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఓట్స్, మైదాపిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, బ్రౌన్సుగర్ మిశ్రమం కలుపుకుని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఓవెన్లో నలభై నుంచి నలభై ఐదు నిమిషాల వరకు ఉడకనిచ్చి మనకు కావల్సిన షేప్లో ముక్కలు కట్ చేసుకోవాలి. బనానా డోనట్స్ కావలసినవి: అరటి పండ్లు – 2 (మీడియం సైజ్), గుడ్డు – 1, పాలు – పావు కప్పు, నూనె – 4 టేబుల్ స్పూన్స్, వెనీలా సిరప్ – 1 టేబుల్ స్పూన్, మైదాపిండి – 1 కప్పు, పంచదార – అర కప్పు, బేకింగ్ సోడా – 1 టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, దాల్చినచెక్క పొడి – పావు టీ స్పూన్, బటర్ – పావు కప్పుబ్రౌన్సుగర్ – పావు కప్పు, బెల్లం తురుము – 1 టేబుల్ స్పూన్చీజ్ – 2 టీ స్పూన్ తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక అరటిపండు వేసుకుని గుజ్జులా చేసుకోవాలి. ఇప్పుడు అందులో గుడ్డు, పాలు, నూనె, వెనీలా సిరప్ వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పెద్ద బౌల్ తీసుకుని మైదా పిండి, పంచదార, బేకింగ్ సోడా, దాల్చిన చెక్క పొడి, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత అరటిపండు మిశ్రమాన్ని మైదా మిశ్రమంలో కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని నాన్స్టిక్ బౌల్లో బటర్ వేసుకుని, అది కరిగిన తర్వాత బ్రౌన్ సుగర్, బెల్లం తురుము, చీజ్ వేసుకుని సిరప్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు మిగిలి ఉన్న మరో అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత డోనట్స్ షేప్ ట్రే తీసుకుని, అందులో కొద్దికొద్దిగా బటర్–çసుగర్ సిరప్ వేసుకుని, మూడు నాలుగు అరటిపండు ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు అరటిపండు–మైదా మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పెట్టుకుని ఓవెన్లో ఉడికించుకోవాలి. డోనట్స్ తయారైన వెంటనే మిగిలి ఉన్న బటర్–సుగర్ సిరప్ను వాటిపై వేసుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. -
సాండ్విచ్ బిస్కెట్స్
బిస్కెట్ మీద బిస్కెట్ పెట్టి.. మధ్యలో ఇంత క్రీమ్ కొట్టి.. కట్టండి తియ్యటి బంధాలు. ఈ క్రిస్మస్ సీజన్లో కుటుంబ సభ్యులందరూ తియ్యటి బంధంలో సాండ్విచ్ బిస్కెట్స్ ఆస్వాదించండి హనీ యోగర్ట్ బిస్కెట్స్ కావలసినవి: మైదా – ఒకటిన్నర కప్పులు; ఉప్పు – టీ స్పూను; సాదా పెరుగు – ఒకటింపావు కప్పులు తయారి: ♦ ఒకపాత్రలో మైదాపిండి, ఉప్పు వేసి బాగా కలపాలి ∙పెరుగు జత చేసి ఫోర్క్తో ముద్దలా అయ్యేవరకు కలపాలి ♦ వెడల్పాటి గిన్నెలో పిండిని పొడిపొడిగా చల్లాలి. ♦ తయారుచేసి ఉంచుకున్న పిండి మిశ్రమాన్ని అర అంగుళం మందంగా వేసి మధ్యకు మడచాలి ♦ మరోసారి పొడి పిండి చల్లి మళ్లీ మధ్యకు మడచాలి ♦ మౌల్డ్తో క్రిస్మస్ ట్రీలా కట్ చేసి సన్నని పుల్లతో డిజైన్ గీయాలి ♦ వీటిని పాత్రలో ఉంచి ముందుగా వేడి చేసిన కుకర్లో ఉంచి మూత పెట్టాలి మంట బాగా తగ్గించాలి ♦ సుమారు పావు గంట తరవాత స్టౌ ఆపేయాలి ♦ అరగంట తరవాత కుకర్ మూత తీసి తయారయిన బిస్కెట్లను మరో ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారిన తరవాత, గాలిచొరని డబ్బాలోకి తీసుకోవాలి. క్రీమ్ ... ఒక పాత్రలో తేనె, కొబ్బరి పొడి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. మరోపాత్రలో బటర్, పంచదార పొడి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. తయారుచేసి ఉంచుకున్న బిస్కెట్లలో మొదటి బిస్కెట్ మీద తేనె, కొబ్బరి పొడి మిశ్రమం, రెండో బిస్కెట్ మీద బటర్ పంచదార పొడి మిశ్రమం వేసి పైన మరో బిస్కెట్ ఉంచితే, డబుల్ డెక్కర్ బిస్కెట్లు రెడీ. చాకొలేట్ అండ్ బటర్ బిస్కెట్స్ కావలసినవి: బటర్ – 120 గ్రా; పంచదార పొడి – 50 గ్రా; వెనిలా ఎసెన్స్ – 2 చుక్కలు; మైదా పిండి – 180 గ్రా; నీళ్లు – 3 టేబుల్ స్పూన్లు; డార్క్ చాకొలేట్/ మిల్క్ చాకొలేట్ – 300 గ్రా. తయారి: ♦ ఒక పాత్రలో మెత్తటి బటర్, పంచదార పొడి వేసి బాగా మెత్తగా అయ్యేవరకు కలపాలి ♦ వెనిలా ఎసెన్స్, మైదా పిండి జత చేసి మరోమారు బాగా కలిపి, ఎక్కడా పగుళ్లు లేకుండా చూసి మూత పెట్టి గంటసేపు ఉంచాలి ♦ చేతికి అంటకుండా కొద్దిగా మైదా పిండి అద్ది కొద్దిగా మందంగా ఉండేలా చేతితో అదమాలి ♦ కటర్తో కావలసిన ఆకారంలో బిస్కెట్లుగా కట్ చేయాలి ♦ సన్నని సూదితో రంధ్రాలు చేయాలి ∙ప్లేట్కి నెయ్యి రాసి, తయారుచేసి ఉంచుకున్న బిస్కెట్లను అందులో దూరం దూరంగా అమర్చి, ముందుగా వేడి చేసిన కుకర్లో ఉంచి, 20 నిమిషాల తరవాత దించేయాలి ♦ బాగా చల్లారిన తరవాత ప్లేట్లోకి తీసుకుని, మరో పావుగంట తరవాత డార్క్ చాకొలేట్ లేదా మిల్క్ చాకొలేట్ను ఉంచి పైన మరో బిస్కెట్ ఉంచి సర్వ్ చేయాలి. క్రీమ్... మొదటి బిస్కెట్ మీద డార్క్ చాకొలేట్ వేసి, పైన మరో బిస్కెట్ పెట్టి, దానిమీద మిల్క్ చాకొలేట్ వేసి, పైన మరో బిస్కెట్ ఉంచి అందించాలి. రాగి బిస్కెట్స్ కావలసినవి: రాగి పిండి – అరకప్పు; గోధుమ పిండి – అర కప్పు; బటర్ – అర కప్పు; పంచదార పొడి – అర కప్పు; పెరుగు – టేబుల్ స్పూను; బేకింగ్ పౌడర్ – పావు టీ స్పూను; ఏలకుల పొడి – టీ స్పూను; వెనిలా ఎసెన్స్ – టీ స్పూను తయారి: ♦ ఒక పాత్రలో రాగి పిండి, గోధుమపిండి వేసి దోరగా వేయించి, తీసే, చల్లారనివ్వాలి ♦ మరొక పాత్రలో బటర్, పంచదార పొడి వేసి మెత్తగా క్రీమీగా అయ్యేవరకు గిలకొట్టాలి ♦ చల్లారిన రాగి పిండి, గోధుమపిండి మిశ్రమాన్ని జత చేసి మరోమారు బాగా కలపాలి ♦ పెరుగులో బేకింగ్ పౌడర్ వేసి బాగా కలిపాక, ఏలకుల పొడి, వెనిలా ఎసెన్స్ వేసి మరోమారు కలపాలి ♦ అన్ని పదార్థాలను కలిపి, చపాతీ పిండిలా చేయాలి ∙చిన్న చిన్న ఉండలుగా చేసి చేతితో గుండ్రంగా అదమాలి. క్రీమ్... పంచదార పొడి, తాజా క్రీమ్, ఏలకుల పొడి, బాదం తరుగు, కుంకుమపువ్వు, చాకొలేట్ సిరప్లను ఒక పాత్రలో వేసి బాగా కలిపి, క్రీమీగా తయారుచేయాలి. తయారుచేసి ఉంచుకున్న బిస్కెట్ల మధ్య ఉంచి తింటే రుచిగా ఉంటాయి. గమనిక: అవెన్ బదులుగా ప్రెజర్ కుకర్లో బిస్కెట్లు తయారుచేయడానికి ప్రెజర్ కుకర్ లేదా మందపాటి అడుగు ఉన్న పాత్ర తీసుకుని, అంగుళం మందంలో రాళ్ల ఉప్పు లేదా ఇసుక వేయాలి. దాని మీద స్టాండు లేదా ప్లేట్ ఉంచాలి. ముందుగా కుకర్ను పెద్ద మంట మీద పది నిమిషాలు వేడి చేయాలి. ఆ తరవాత బిస్కెట్ల తయారీకి ఉపయోగించాలి. పాత కుకర్ని ఉపయోగించడం మంచిది. -
ఆ బిస్కెట్లు తిన్న చిన్నారులు...?
సాక్షి, లక్నో : ఉత్తర్ ప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల చిన్నారులకు అందించే ఆహార పదార్థాల విషయంలో భారీగా అవినీతి జరుగుతోంది. తాజాగా భుదాయ్లోని ఆశ్రమ పదహతి విద్యాలయలో చిన్నారులకు గడువు ముగిసిన బిస్కెట్లను అధికారులు అందించారు. వీటిని తిన్న చిన్నారుల్లో తీవ్ర అస్వస్థతో ఆసుపత్రి పాలయ్యారు. చాలామంది చిన్నారులు వాంతులు, విరోచనాలు, కపుడు నొప్పతో బాధపడుతున్నారు. చిన్నారులకు గడువు ముగిసిన బిస్కెట్లను అందించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఆశ్రమ్ పాఠశాలను సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తోందని.. ఈ ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ విహాక్ తెలిపారు. -
బాబూ! బిస్కెట్ కావాలా?
మీరు ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నప్పుడు బాగా ఆకలేస్తే ఏం చేస్తారు? హోటల్లో స్పెషల్ ఏంటో ఎంక్వయిరీ చేసి, అవి తెప్పించుకుని మరీ తింటారు కదూ! కానీ, కాజల్ అగర్వాల్ కొంచెం డిఫరెంట్. స్టార్ హోటల్ కిచెన్లోకి వెళ్లి కుకింగ్ చేశారు. బాదం బిస్కెట్లు, డార్క్ చాక్లెట్ అండ్ సీ సాల్ట్ కుకీస్ తయారు చేశారు. ఎప్పుడూ సినిమా షూటింగులతో క్షణం తీరిక లేకుండా గడిపే కాజల్కు వంట చేయడం వచ్చా? అనే డౌట్ వచ్చిందా! నటన తర్వాత కాజల్ ఎక్కువగా ఇష్టపడేది వంట చేయడాన్నే. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు కిచెన్లోకి వెళ్లి గరిటె తిప్పడం కాజల్కు అలవాటు. కానీ, ఇప్పుడు ఇంట్లో కాకుండా బయట వంట చేశారు. కుకింగ్ చేస్తున్నప్పుడు తీసిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ‘‘ఇంటికి దూరంగా ఉన్నప్పుడు కూడా కుకింగ్పై నా ప్రేమను చూపించుకునే ఛాన్స్ వచ్చింది. బిస్కెట్స్, కుకీస్ తయారు చేశా. మా అమ్మ ద్వారా నాకు వంట అంటే ఇష్టం ఏర్పడింది’’ అని కాజల్ పేర్కొన్నారు. ‘బాబూ! బిస్కెట్ కావాలా?’ అన్నట్టు కాజల్ పోస్ట్ చేసిన స్టిల్స్ చూస్తే ప్రేక్షకుల నోరూరడం ఖాయమే. ఎవరైనా ఈ బిస్కెట్లు తినాలనుకుంటే కష్టమే. చెల్లెలు నిషా అగర్వాల్తో కలసి నగల వ్యాపారం ప్రారంభించిన కాజల్, భవిష్యత్తులో బేకరీ బిజినెస్ స్టార్ట్ చేస్తే... అప్పుడు ఆమె చేసిన కుకీలను తినవచ్చు. -
వివాహిత ఆత్మహత్య
నంద్యాల: స్థానిక ఎంఎస్ నగర్కు చెందిన మహాలక్ష్మి(32) ఆత్మహత్యకు పాల్పడింది. భర్త కలిసి ఆమె సాయి బాలాజీ ఫుడ్ ప్రొటెక్షన్స్ పేరుతో బిస్కెట్ల తయారీ సంస్థను నెలకొల్పింది. ఈ సంస్థ నిర్వహణకు కెనరా బ్యాంక్ నుంచి దాదాపు రూ.28 లక్షలు అప్పు చేశారు. ఈ అప్పు తీర్చక పోవడంతో బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ ఆవేదనను తట్టుకోలేక మహాలక్ష్మి ఉరేసుకొని మృతి చెందింది. ఈ మేరకు మృతురాలి తల్లి నాగశిరోమణి దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ పోలీసులు మంగళవారం తెలిపారు. -
బిస్కెట్ల లారీ దగ్ధం
గుత్తి రూరల్: అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులోని శ్రీకష్ణదేవరాయ (ఎస్కేడీ) ఇంజనీరింగ్ కళాశాల వద్ద 44వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున బిస్కెట్ల లారీ దగ్ధమైంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. లారీ నాగ్పూర్ నుంచి బెంగళూరుకు బిస్కెట్ల లోడుతో వెళుతోంది. గుత్తి శివారుకు రాగానే బ్యాటరీల వద్ద మంటలు చెలరేగాయి. డ్రైవర్ గమనించకుండా వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. పది కిలోమీటర్ల వరకూ అలాగే వెళ్లడంతో మంటలు వ్యాపించి.. బిస్కెట్ డబ్బాలు కాలిపోయాయి. మంటలు లారీ టైర్లకు కూడా పాకాయి. వెనుక వచ్చిన లారీ డ్రైవర్లు కేకలు వేయడంతో డ్రైవర్ అప్రమత్తమై లారీని అపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మంటలు భారీగా చెలరేగాయి. బిసెట్లన్నీ బూడిదయ్యాయి. -
ఇంటిప్స్
దోసెపిండి పులిసినట్టుగా అనిపించినప్పుడు కొద్దిగా గోధుమపిండిని కలిపితే... వాసన తగ్గడంతో పాటు దోసెలు రుచిగా వస్తాయి.ఉప్పులో కొద్దిగా నిమ్మరసం కలిపి తోమితే రాగి పాత్రలు కొత్త వాటిలా మెరుస్తాయి. బిస్కట్లు మెత్తబడకుండా ఉండాలంటే... వాటిని ఉంచిన డబ్బాలో కొన్ని బియ్యపు గింజలు వేయాలి. -
మినీ బేకరీ
ఒకప్పుడు చిరుతిళ్లు అంటే మురుకులు, గారెలు మాత్రమే. మహా అంటే షాపుల్లో దొరికే చాక్లెట్లు, బిస్కెట్లు. కానీ ఇప్పుడో... అన్నీ బేక్డ్ ఫుడ్సే. కుకీస్ అనీ చిప్స్ అనీ... రకరకాల వెరైటీలతో వచ్చేస్తున్నాయి. దాంతో చాలామంది అవన్ కొనేసి, ఇంట్లోనే బేక్డ్ ఫుడ్స్ను తయారు చేసి పిల్లలకు పెడుతున్నారు. అంతవరకు ఓకే. కానీ మనం బేక్ చేస్తున్నప్పుడు, పదార్థాలను సరైన మోతాదుల్లోనే వేస్తున్నామా? అన్న విషయాన్ని గమనించాలి. అలా ఎలా తెలుస్తుందండీ అంటారా? అయితే ఈ ‘పర్ఫెక్ట్ బేక్ సెట్’ ఇక మీ కోసమే. ఈ సెట్లో స్కేల్, ఫోన్/టాబ్లెట్ స్టాండ్, 3 మిక్సింగ్ బౌల్స్, అవన్ థర్మామీటర్, 3.5 ఎంఎం కేబుల్ ఉంటాయి. ఫోన్/ టాబ్లెట్ (అందులో ఈ పర్ఫెక్ట్ బేక్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి) ద్వారా మీ బేకింగ్ ఐటమ్ (రెసిపీ)ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్పై బౌల్ పెట్టి, అందులో బేకింగ్కు వాడే పదార్థాలను వేస్తూ ఉండాలి. ఎంత మోతాదైతే సరిపోతుందో, ఆ ఇండికేషన్ మనకు ఫోన్లో కనిపిస్తుంది. అలా అన్నీ పర్ఫెక్ట్గా వేస్తేనే... మీ బేకింగ్ ఫుడ్స్ (కుకీస్, కేక్స్,...) కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది బ్యాటరీతో పని చేస్తుంది. బేకింగ్ కిట్లాగే ‘పర్ఫెక్ట్ డ్రింక్ సెట్’ కూడా దొరుకుతుంది. -
గవాస్కర్ కోసం బిస్కెట్లు పంపేవాళ్లం!
ముంబై: టెస్టు క్రికెట్లో పదివేల పరుగులు సాధించిన మొదటి క్రికెటర్ గా , అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో 30కు పైగా సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా అరుదైన ఫీట్ ను సొంతం చేసుకున్న ఘనత భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ది. 1971లో మొదలైన గవాస్కర్ క్రికెట్ ప్రయాణం.. 1987 వరకూ కొనసాగింది. దాదాపు 16 ఏళ్ల గవాస్కర్ క్రికెట్ కెరీర్లో ఎన్నో ఘనతలను అతను సొంతం చేసుకున్నాడు. టెస్టు కెరీర్లో 34 సెంచరీలు, నాలుగు డబుల్ సెంచరీలు గవాస్కర్ సొంతం. సాంప్రదాయ టెస్టు క్రికెట్ను గవాస్కర్ శాసించాడంటే అతిశకియోక్తి కాదేమో. ప్రత్యేకంగా ఫాస్ట్ బౌలింగ్కు మారుపేరైన వెస్టిండీస్ జట్టును గవాస్కర్ ఓ ఆట ఆడుకున్నాడు. తన అరంగేట్రం సిరీస్లోనే విండీస్ను ఊచకోత కోశాడు. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్లో ఒక డబుల్ సెంచరీ సాయంతో 154.80 సగటుతో 774 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తన టెస్టు కెరీర్లో అత్యధిక స్కోరు కూడా వెస్టిండీస్పైనే గవాస్కర్ నమోదు చేయడం విశేషం. 1983లో మాల్కం మార్షల్, ఆండీ రాబర్ట్స్, మిచెల్ హోల్డింగ్లాంటి దిగ్గజ బౌలర్లను గడగడలాడించిన గవాస్కర్ 236 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించాడు. ఇదిలా ఉంచితే గవాస్కర్ ఎప్పుడు విండీస్ పర్యటనకు వెళ్లినా భారత్ నుంచి బిస్కెట్స్ మాత్రం కచ్చితంగా వెళ్లాల్సిందేనట. గవాస్కర్ విండీస్ పర్యటనకు వెళ్లే ముందు ముంబై నుంచి గ్లూకోజ్ బిస్కెట్స్ను పంపించే వాళ్లమని ఆమె సోదరి నూతన్ గవాస్కర్ స్పష్టం చేశారు. ఆదివారం గవాస్కర్ 67వ వసంతంలోకి అడుగుపెట్టిన తరుణంలో అతని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను నూతన్ వెల్లడించారు. ప్రత్యేకంగా పార్లే జీ గ్లూకోజ్ బిస్కెట్స్ అంటే గవాస్కర్ కు అత్యంత ఇష్టమని ఆమె పేర్కొన్నారు. 'మా అన్నయ్య విండీస్ పర్యటనకు వెళుతున్నాడంటే బిస్కెట్ల ప్యాకెట్లను ముందుగానే సిద్ధం చేసేవాళ్లం. పర్యటన షెడ్యూల్ ను బట్టి మూడు వారాల నుంచి నెల రోజుల వరకూ సరిపడా బిస్కెట్లను విండీస్కు పంపేవాళ్లం. జర్నలిస్టుల ద్వారా కానీ, అక్కడకు వెళ్లే తెలుసుకున్న వ్యక్తుల ద్వారా కానీ, స్నేహితుల ద్వారా కానీ బిస్కెట్లను చేరవేసే వాళ్లం. కాఫీ, టీ త్రాగేటప్పుడు బిస్కెట్లను తినడం సునీల్ కు ఇష్టం. అయితే ఇప్పుడు డయాబెటిస్ సమస్య వల్ల బిస్కెట్లను తినలేకపోతున్నానని మా అన్నయ్యకు కాస్త బాధగానే ఉంది. ఇప్పటికీ బిస్కెట్లను తినడానికి యత్నిస్తుంటాడు. వాటికి దూరంగా ఉంచేందుకు మేము ప్రయత్నిస్తున్నాం' అని నూతన్ తెలిపారు. -
బిస్కెట్లు ఇచ్చి దోచేశారు
విజయవాడ: మత్తు మందు చల్లిన బిస్కెట్లు ఇచ్చి నిలువు దోపిడీ చేసిన సంఘటన న్యూఢిల్లీ-కేరళ కేకే ఎక్స్ప్రెస్లో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. మహారాష్ట్రలోని నాగ్పూర్ స్టేషన్ వద్దకు రాగానే కొంతమంది ప్రయాణికులు రైల్లోకి ఎక్కారు. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ.. తోటి ప్రయాణికులకు బిస్కెట్లు ఇచ్చారు. ఆ బిస్కెట్లు తిన్నవారంతా నిద్రలోకి జారుకున్నారు. తర్వాత ఆ దుండగులు వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్నారు. ఇద్దరు దంపతులు మహారాష్ట్రలోని సేవాగ్రామ్లో దిగాల్సి ఉండగా మత్తు మందు చల్లిన బిస్కెట్లు తినడంతో నిద్రలోనుంచి లేవలేకపోయారు. విజయవాడ వచ్చినా వారు నిద్రలేవకపోవటంతో అనుమానం వచ్చిన ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆరా తీయగా విషయం తెలిసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తండ్రికే పాఠం నేర్పాడు!
స్ఫూర్తి చిన్నపిల్లలకు ఏమీ తెలియదు అనుకుంటాం. కానీ కొన్నిసార్లు వాళ్లు పెద్దవాళ్లకే పాఠాలు నేర్పుతుంటారు. కెన్ కూడా తన తండ్రికి ఓ పాఠం నేర్పాడు. కానీ అది పాఠం కాదు గుణపాఠమంటాడు కెన్ తండ్రి. ఫిలిప్పైన్సకు చెందిన తొమ్మిదేళ్ల కెన్లో ఉన్నట్టుండి ఏదో మార్పు కనిపించింది అతడి తండ్రికి. రోజూ స్కూలు నుంచి వచ్చాక ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్లిపోతున్నాడు కెన్. ఆడుకోవడానికి వెళ్తున్నాడేమో అనుకున్నాడు తండ్రి మొదట. కానీ రోజూ వీపునకు బ్యాగ్ ఒకటి తగిలించుకుని వెళ్లడం చూసి అనుమానమొచ్చింది. రెండు వారాలు చూసిన తరువాత ఓ రోజు కొడుకుని అనుసరించాడు తండ్రి. కెన్ చేస్తున్న పని చూసి అతడు అవాక్కయ్యాడు. తన ఇంటి చుట్టుపక్కల ఉన్న వీధులన్నీ తిరుగు తున్నాడు కెన్. ఎక్కడ వీధికుక్కలు కనిపిస్తే అక్కడ ఆగిపోతున్నాడు. తన బ్యాగ్లోంచి బిస్కట్లు, కేక్ ముక్కలు, తీసి... వెంట తెచ్చిన పేపర్ ప్లేట్లలో వేసి కుక్కలకు పెడుతున్నాడు. ఆ దృశ్యం చూసి విస్తుపోయాడు తండ్రి. వెంటనే వెళ్లి కొడుకుని హత్తుకున్నాడు. ఏమిటిదంతా అని అడిగితే... ‘‘నాకు నువ్వు తిండి పెడతావ్ కదా డాడీ! పాపం వీటికెవరు పెడతారు’’ అన్నాడు కెన్. కొడుకు అన్న ఆ మాటలు తండ్రి మనసును తాకాయి. ఆ రోజు నుంచి ప్రతిరోజూ తన కొడుకుతో పాటు తను కూడా ఆహారం తీసుకుని బయలుదేరడం మొదలుపెట్టాడు. ‘‘మురికిపట్టి వీధుల్లో తిరిగే ఆ కుక్కలను ఎన్నోసార్లు అసహ్యించుకుని తరిమికొట్టాను. కానీ నా కొడుకు వాటిని ప్రేమించాడు. నాకు చాలా సిగ్గుగా ఉంది’’ అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. వీధికుక్కల కడుపు నింపుతోన్న తన కొడుకు ఫొటోలను కూడా అప్లోడ్ చేశాడు. అవి చూసి చాలామంది కెన్కి ఫ్యాన్స అయిపోయారు. వాళ్లంతా కెన్ చిరునామా తెలుసుకుని విరాళాలు పంపడం మొదలు పెట్టారు. వాటితో కెన్ ‘హ్యాపీ యానిమల్స్ క్లబ్’ను ప్రారంభించాడు. తండ్రితో కలిసి దిక్కులేని మూగజీవులను తెచ్చి పెంచుతున్నాడు. హ్యాట్సాఫ్ కెన్!