మహిళా క్రికెట్‌ జిల్లా జట్టు ఎంపిక | women cricket district team selection | Sakshi
Sakshi News home page

మహిళా క్రికెట్‌ జిల్లా జట్టు ఎంపిక

Published Sat, Nov 5 2016 10:53 PM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

మహిళా క్రికెట్‌ జిల్లా జట్టు ఎంపిక

మహిళా క్రికెట్‌ జిల్లా జట్టు ఎంపిక

దుద్దుకూరు (దేవరపల్లి) : దేవరపల్లి మండలం దుద్దుకూరు జిల్లా పరిషత్‌ హైస్కూల్లో శనివారం మహిళా క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని ఐదు పాఠశాలల నుంచి క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన 15 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. జట్టు కెప్టెన్‌గా ఎస్‌.శైలజదేవి(దుద్దుకూరు), వైస్‌ కెప్టెన్‌గా ఒ.హేమ ఎంపికయ్యారు. ఎస్‌.ప్రసన్న(దేవరపల్లి), ఎస్‌. మంజు(దేవరపల్లి); పి.యామిని(దుద్దుకూరు), టి.సౌజన్య(దేవరపల్లి), ఎన్‌.రమణ(గూటాల), పి. నాగదేవి(గూటాల), కె.బ్లెసీ(గూటాల), ఎం.శిరీష్‌(దుద్దుకూరు), టి.రమ్య(దేవరపల్లి), యు.రమ్య(దేవరపల్లి), ఎం.సుధశ్రీ(దుద్దుకూరు), ఎం.సంధ్యారాణి(దుద్దుకూరు), ఎం.అనూష(దుద్దుకూరు) జిల్లా జట్టుకు ఎంపికైనట్టు పీఈటీ ఓరుగంటి కృష్ణంరాజు తెలిపారు. క్రీడాకారులను ప్రధానోపాధ్యాయులు డి.ఎస్‌. సుబ్రహ్మణ్యం, సర్పంచ్‌ సౌదామణి, పీఈటీలు వి.ఎం.కల్యాణ్‌ కుమార్, వి.ప్రవీణ, వి.రమాదేవి, కె.వి.డి.వి.ప్రసాద్‌ అభినం«దించారు.  
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement