saturday
-
ఐఎస్ఎల్ 1000వ మ్యాచ్ ‘డ్రా’
చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) చరిత్రలో 1000వ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. శనివారం ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్, చెన్నైయిన్ ఫుట్బాల్ క్లబ్ మధ్య జరిగిన పోరు 1–1 గోల్స్తో ‘డ్రా’ అయింది. ముంబై జట్టు తరఫున నాథన్ రోడ్రిగ్స్ (63వ నిమిషంలో) ఒక గోల్ సాధించగా... చెన్నైయన్ ఎఫ్సీ తరఫున కెప్టెన్ ర్యాన్ ఎడ్వర్డ్స్ (60వ ని.లో) ఏకైక గోల్ సాధించాడు.మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. ఇరు జట్లు చెరో 14 షాట్లు ఆడగా... అందులో ప్రత్యర్థి గోల్పోస్ట్ లక్ష్యంగా నాలుగేసి సార్లు దాడులు చేశాయి. ముంబై జట్టు చిన్న చిన్న పాస్లతో ముందుకు సాగగా... చెన్నైయన్జట్టు 15 ఫౌల్స్ చేసింది. ఈ ఫలితంతో 8 మ్యాచ్ల్లో 3 విజయాలు, 3 పరాజయాలు, 2 ‘డ్రా’లు నమోదు చేసుకున్న చెన్నైయన్ జట్టు 12 పాయింట్లతో పట్టిక నాలుగో స్థానానికి చేరగా... 10 పాయింట్లు ఖాతాలో ఉన్న ముంబై జట్టు 8వ స్థానంలో ఉంది.ఈస్ట్ బెంగాల్, మొహమ్మదాన్ స్పోర్ట్స్ క్లబ్ మధ్య జరిగిన మరో మ్యాచ్ కూడా 0–0తో ‘డ్రా’గా ముగిసింది. ఇరు జట్లూ గోల్ సాధించడంలో విఫలమయ్యాయి. లీగ్లో భాగంగా ఆదివారం ఒడిశా ఫుట్బాల్ క్లబ్తో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు తలపడుతుంది. -
Rajasthan Assembly polls: రాజస్థాన్ ఎవరిదో!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగింపునకు వస్తోంది. మిజోరం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పోలింగ్ ఇప్పటికే ముగియగా కీలకమైన రాజస్థాన్ లో ప్రచార పర్వానికి గురువారం సాయంత్రంతో తెర పడింది. శనివారం పోలింగ్ జరగనుంది. అధికార కాంగ్రెస్, బీజేపీ రెండూ గెలుపుపై ధీమాగా ఉన్నా యి. ఏడు హామీలకు తోడు ప్రజాకర్షక పథకాలు కచ్చితంగా గట్టెక్కిస్తాయని ముఖ్య మంత్రి అశోక్ గెహ్లోత్ నమ్ముతున్నారు. దారుణంగా క్షీణించిన శాంతిభద్రతలు కచ్చితంగా సర్కారు పుట్టి ముంచుతాయని, మోదీ మేనియాకు హిందూత్వ కార్డు తోడై ఘనవిజయం సాధించి పెడుతుందని బీజేపీ అంటోంది. నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్ ముగిశాక డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జరిగి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్తాన్లో గత మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఓసారి చూస్తే... 2008పరిశీలకులతో పాటు అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ అధికార బీజేపీ అనూహ్యంగా ఓటమి చవిచూసింది! కాంగ్రెస్ మరోసారి విజయబావుటా ఎగరేసింది. గెహ్లోత్ మళ్లీ సీఎం అయ్యారు. ప్రజల ఆదరణ బీజేపీకే ఉన్నట్టు దాదాపుగా అన్ని సర్వేల్లోనూ తేలినా ఆ పార్టీ ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యమంత్రిగా వసుంధరా రాజె సింధియా అనుసరించిన లోప భూయిష్టమైన ఎన్నికల వ్యూహమే ఇందుకు ప్రధాన కారణమని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ఆమె అహంకారపూరిత ప్రవర్తన, సీనియర్లకు ప్రా ధాన్యం ఇవ్వకపోవడం, అభ్యర్థుల ఎంపికలో ఒంటెత్తు పోకడలు పార్టీని ముంచాయంటూ విమర్శలు వెల్లు వెత్తాయి. మొత్తం 200 స్థానా లకుగాను కాంగ్రెస్ 96 చోట్ల నెగ్గగా బీజేపీ 78 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్కు 36.8 శాతం ఓట్లు పోలవగా బీజేపీకి 34.3 శాతం పడ్డాయి. ఇతరులకు 21 శాతం ఓట్లు పోలవడం బీజేపీ విజయావ కాశాలను గట్టిగా దెబ్బకొట్టింది. ఎందుకంటే 2003 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్కు ఓట్లు కేవలం ఒక్క శాతం మాత్రమే పెరిగాయి. బీజేపీ ఏకంగా 5 శాతానికిపైగా ఓట్లను నష్టపోయింది! ఇక బీఎస్పీ 7.6 శాతం ఓట్లతో 6 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. 2013 ఆనవాయితీని కొనసాగిస్తూ బీజేపీ ఘనవిజయం సాధించింది. వసుంధరా రాజె మళ్లీ ముఖ్యమంత్రి పీఠమెక్కారు. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో బీజేపీ 163 సీట్లలో నెగ్గింది. కాంగ్రెస్ కేవలం 21 స్థానాలకు పరిమితమై ఘోర పరాభవం మూటగట్టుకుంది. రాష్ట్ర చరిత్రలో ఒక ప్రధాన పార్టీకి లభించిన అత్యల్ప స్థానాలు ఇవే! 1998 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 33 సీట్లొచ్చాయి. బీజేపీ 45.2 శాతం ఓట్లు సాధించగా కాంగ్రెస్కు 33.1 శాతం దక్కాయి. గుజ్జర్ నేత కిరోరీసింగ్ బైన్స్లా దన్ను కాంగ్రెస్కు పెద్దగా కలిసిరాలేదు. ఎప్పుడూ ఆదరించే మేవార్ ప్రాంతం ఈసారి బీజేపీకే జై కొట్టడంతో ఆ పార్టీ తేరుకోలేకపోయింది. 34 ఎస్సీ స్థానాల్లో కాంగ్రెస్ ఒక్కటి కూడా నెగ్గలేకపోవడం విశేషం. 25 ఎస్టీ సీట్లలో నాలుగే గెలిచింది. 2014 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ప్రధానంగా తెరపైకి వచ్చిన నరేంద్ర మోదీ మేనియానే బీజేపీ ఘన విజయానికి కారణమని సీఎం అశోక్ గెహ్లోత్ అంగీకరించడం విశేషం! బీఎస్పీ సగం అసెంబ్లీ సీట్లు కోల్పోయి మూడింటికే పరిమితమైంది. 2018 ప్రభుత్వాలను పడగొట్టే ధోరణి మరోసారి కాంగ్రెస్కు గెలుపు కట్టబెట్టింది. పీసీసీ చీఫ్గా యువ నేత సచిన్ పైలట్ అంతా తానై ఎన్నికల బాధ్యతలను చూసుకున్నారు. పార్టీ విజయంలో ఒకరకంగా కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ నెగ్గితే ఆయనే ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం పార్టీకి బాగా లాభించింది. 100 సీట్లతో పార్టీ ఘనవిజయం సాధించింది. 2013లో 59 ఎస్సీ, ఎస్టీ స్థానాలు నెగ్గిన బీజేపీ ఈసారి కేవలం 21 స్థానాలకు పరిమితమైంది. ఆళ్వార్, దౌసా, సవాయ్ మధోపూర్, టోంక్, ధోల్పూర్, కరౌలీ జిల్లాల్లోనైతే ఒక్క ఎస్సీ, ఎస్టీ స్థానం కూడా నెగ్గలేకపోయింది. ఫలితాల అనంతరం పైలట్ సీఎం అవుతారని అంతా భావించారు. కాంగ్రెస్ అధిష్టానం అనూహ్యంగా పాత కాపు మరోసారి గెహ్లోత్కే చాన్స్ ఇచ్చింది. రెండేళ్ల అనంతరం అవకాశమిస్తామంటూ పైలట్ను అనునయించి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది. మాట నిలుపుకోకపోవడంతో 2020లో ఆయన తిరుగుబాటు చేసినా రాహుల్గాంధీ జోక్యంతో రాజీ పడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘రింగ్ ఆఫ్ ఫైర్’ అంటే ఏమిటి? ఈ శనివారం ఆకాశంలో ఏం జరగనుంది?
వచ్చే శనివారం అంటే అక్టోబర్ 14న అంతరిక్షంలో ఒక ప్రత్యేక దృశ్యం కనిపించనుంది. సూర్యుని లోపల ఒక నల్లని ఆకారం ఏర్పడనుంది. ఫలితంగా సూర్యుని చుట్టూ అగ్ని వలయం కనిపించనుంది. దీనినే ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలుస్తారు. సూర్యగ్రహణం కారణంగా సూర్యుడు ఈ రీతిలో కనిపించనున్నాడు. సంవత్సరంలో చివరిసారిగా ఏర్పడే ఈ సూర్యగ్రహణం ప్రత్యేకంగా కనిపించనుంది. సూర్యగ్రహణం సంభవించే ప్రతీసారీ ఇలా జరగదు. చంద్రుని ప్రత్యేక స్థానం కారణంగా ఇలా జరగనుంది. భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు.. చంద్రుని నీడ భూమిపై పడనుంది. అక్టోబరు 14న ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే సూర్యగ్రహణం సాధారణమైనది కాదు. ఇది కంకణాకృతి సూర్యగ్రహణం. సూర్యగ్రహణం సమయంలో కొన్నిసార్లు సూర్యుడు మొత్తంగా చంద్రుని వెనుక దాక్కుంటాడు. కొన్నిసార్లు మెరుస్తున్న ఉంగరం మాదిరిగా కనిపిస్తాడు. సూర్యుని ప్రకాశాన్ని చంద్రుడు పూర్తిగా కప్పివేసినప్పుడు, సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కంకణాకార సూర్యగ్రహణంలో సూర్యుడు చంద్రుని బ్లాక్ డిస్క్ చుట్టూ ఉండే రింగ్ మాదిరిగా కనిపిస్తాడు. దీనినే యాన్యులస్ అంటారు. సాధారణ సంపూర్ణ సూర్యగ్రహణంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా అడ్డుకుంటాడు. అయితే వార్షిక సూర్యగ్రహణంలో, చంద్రుడు.. భూమి కక్ష్యలో దానికి దూరంగా ఉంటాడు. ఈ కారణంగా చంద్రుడు ఆకాశంలో సూర్యుడి కంటే కొంత చిన్నగా కనిపిస్తూ, సూర్యుడిని అడ్డుకుంటాడు. అంటే సూర్యుడిని పూర్తిగా కవర్ చేయడు. ఈ స్థితిలో సూర్యుని స్థానంలో అగ్ని వలయం కనిపిస్తుంది. కాగా ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఎందుకంటే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో రాత్రి సమయంలో సంభవిస్తుంది. గ్రహణం సమయంలో భారతదేశం చంద్రునికి వ్యతిరేక దిశలో ఉంటుంది. భారతదేశంలో చంద్రుడు కనిపించే సమయానికి, సూర్యగ్రహణం ముగుస్తుంది. ఈ గ్రహణం ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. అయితే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రత్యక్ష ప్రసారం ద్వారా భారతదేశ ప్రజలు ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు. నాసా తెలిపిన వివరాల ప్రకారం, ఈ సూర్యగ్రహణాన్ని భారత కాలమానం ప్రకారం రాత్రి 8.35 గంటలకు చూడవచ్చు. అమెరికాలో, ఒరెగాన్, కాలిఫోర్నియా, నెవాడా, టెక్సాస్, ఉటా, అరిజోనా, న్యూ మెక్సికో రాష్ట్రాల్లో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది. మెక్సికో, గ్వాటెమాల, బెలిజ్, హోండురాస్, నికరాగ్వా, పనామా, కొలంబియా, బ్రెజిల్లలో ఇది సూర్యాస్తమయానికి ముందు కనిపించనుంది. ఇది కూడా చదవండి: రీల్స్ కోసం సరయూలో అశ్లీల నృత్యం.. రంగంలోకి దిగిన పోలీసులు! -
రేపు ఆదిత్య–ఎల్1 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించనున్నారు. ఇందుకోసం శుక్రవారం ఉదయం 11.50 గంటలకు కౌంట్డౌన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. గురువారం షార్లోని బ్రహ్మప్రకాష్హాలులో మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహించారు. పీఎస్ఎల్వీ సీ57 రాకెట్కు అన్ని పరీక్షలు నిర్వహించి లాంచ్ ఆథరైజేషన్ బోర్డు(ల్యాబ్)కు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ రాజరాజన్ రాకెట్కు మరోసారి పరీక్షలు నిర్వహించి.. కౌంట్డౌన్, ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం ఇస్రో చైర్మన్ సోమనాథ్ షార్కు రానున్నారు. సహచర శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించి కౌంట్డౌన్ ప్రక్రియను పరిశీలిస్తారు. సూర్యుడు ఒక మండే అగ్నిగోళం.. అక్కడికి ఉపగ్రహాన్ని పంపిస్తే కాలిపోతుంది కదా.. అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. వాస్తవానికి ఈ ప్రయోగంలో భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్ బిందువు–1(ఎల్–1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి దాదాపు 1,470 కిలోల బరువున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల గ్రహణాలతో సంబంధం లేకుండా సౌరగోళంపై నిరంతరం అధ్యయనం చేసేందుకు అవకాశం లభిస్తుంది. అక్కడికి చేరుకోవాలంటే 175 రోజుల సమయం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
వెంకటేశ్వర స్వామికి శనివారం ఎందుకంత ప్రీతి ?
ఏయే వారాల్లో ఏ దేవుడుని పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుదనే వాటి గురించి పండితులు శాస్త్రాల్లో విపులంగా వివరించారు. అందులో భాగంగానే ఆదివారం సూర్యభగవానుడికి, సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయ స్వామి, సుబ్రమణ్యేశ్వర స్వామికి, బుధవారం గణపతి, అయ్యప్ప స్వామి, గురువారం సాయిబాబా, దత్తాత్రేయుడు, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామి అని ఇలా.. ఒక్కో రోజు ఒక్కోస్వామికి ప్రత్యేకం కేటాయించి మరి చెప్పారు. అయితే వెంకటేశ్వర స్వామికి మాత్రం శనివారం అంటేనే ఎందకంత ప్రత్యేకం అంటే.. శనివారమే శ్రీవారిని పూజించటానికి గల కారణం.. ఓంకారం ప్రభవించిన రోజు శనివారం శనివారం శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు శనివారం వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదటి సారి దర్శించిన రోజు శనివారం ఆలయం నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారం శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసింది, పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది శనివారమే ఇక వేంకటేశ్వర స్వామి సుదర్శనం పుట్టినది కూడా శనివారమే అందుకే ఏడుకొండలవాడికి శనివారం అంటే అత్యంత ప్రీతికరం. వెంకటేశ్వర స్వామికి కూడా శనివారం ప్రత్యేకం కావడంతో ..భక్తులు ఆ రోజు దేవుడికి పూజలు, మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే కలౌ వేంకట నాయకః అన్న నానుడి ప్రకారం..కలియుగంలో అత్యంత శక్తిమంతమైన దైవం శ్రీనివాసుడు. అందువల్ల భక్తులు తమకు ఎదురయ్యే కష్టాలు, సమస్యల నుంచి గట్టెక్కించి బయటపడేశావాడు ఆయనే అని విశ్వసిస్తారు. ఈ శనివారం రోజు వాడవాడల ఉన్న శ్రీనివాసుని ఆలయాలన్ని కిటకిటలాడుతుంటాయి. మాములు రోజుల కంటే శనివారం ఆయన్ను పూజిస్తే శనిశ్వరుడు పెట్టే బాధల నుంచి విముక్తి లభిస్తుంది. పైగా అనుకున్న పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా శ్రీనివాసుడు తమను అనుగ్రహిస్తాడనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. (చదవండి: గాంధారి వాన ఏమిటి?..అసలు దృతరాష్ట్రుని భార్యకు.. వానకు సంబంధం ఏమిటి) -
ఇకపై శనివారం కూడా బడి?
సాక్షి, చెన్నై: ఇకపై ప్రతి శనివారం కూడా పాఠశాలలో విద్యార్థులకు తరగతులు నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే తరగతుల నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శని, ఆదివారాలు సెలవులే. ఈ పరిస్థితుల్లో తాజాగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కొంత ఆలస్యమైంది. భానుడి ప్రతాపం పుణ్యమా రెండు సార్లు పాఠశాలల పునః ప్రారంభాన్ని వాయిదా వేశారు. సోమవారం నుంచి 6–12 తరగతులకు, ఈనెల 14 వతేదీ నుంచి 1–5 తరగతులకు పాఠశాలలు తెరచుకోనున్నాయి. అదే సమయంలో ఈ ఏడాది నైరుతి రుతు పవనాల ప్రభావంతోవ ర్షాలు ఆశాజనకంగా పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణకేంద్రం ప్రకటించింది. ఈ పవనాలు కేరళ తీరాన్ని తాకడంలో రాష్ట్రంలో అనేక జిల్లాలో తేలిక పాటి వర్షం మొదలైంది. శనివారం చెన్నై , శివారులలో అనేక చోట్ల వర్షం పడింది. ఈవర్షం ప్రభావం క్రమంగా పెరిగిన పక్షంలో పాఠశాలలకు తరచూ సెలవులు ఇవ్వక తప్పదు. దీంతో ఈ సెలవులతో విద్యా బోధనలు కుంటు పడే పరిస్థితి ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరం నుంచి శనివారం కూడా పాఠశాలలు పనిచేసే విధంగా చర్యలకు సిద్ధమైంది. ఈ విషయంగా విద్యా మంత్రి అన్బిల్ మహేశ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, పరిశీలన జరుపుతున్నామన్నారు. సకాలంలో సిలబస్ ముగించాలంటే శనివారం కూడా తరగతుల నిర్వహణ అవశ్యమని, అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా, సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్వస్థలాలకు, వివిధ ప్రాంతాలకు వెళ్లిన జనం చెన్నై వైపుగా తిరుగు ప్రయాణమయ్యారు. వీరి కోసం ప్రత్యేక బస్సులను శని, ఆదివారం కూడా నడిపేందుకు రవాణాశాఖ చర్యలు తీసుకుంది. -
Bank Holidays December 2022:13 రోజులు సెలవులు
సాక్షి, ముంబై: ఆర్బీఐ డేటా ప్రకారం డిసెంబర్ నెలలో బ్యాంకులు 13 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. డిసెంబర్లో వచ్చే రెండు, నాలుగు శనివారాలు 4 ఆదివారాలతో పాటు రిజర్వ్ బ్యాంకు ప్రతి నెల బ్యాంకుల సెలవులు జాబితాను విడుదల చేస్తుంది. బ్యాంక్ సెలవుల జాబితాను ఒకసారి చెక్ చేసుకొని దాని కనుగుణంగా ప్లాన్ చేసుకోవడం బెటర్. డిసెంబర్లో 3,4,10,11,18,24,25 తేదీల్లో దేశవ్యాప్త సెలవు. అలాగే డిసెంబర్ 24న, క్రిస్మస్, నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. డిసెంబర్లో బ్యాంకులకు సెలవులు: డిసెంబర్ 3 - శనివారం (సెయింట్ జేవియర్స్ ఫీస్ట్ , గోవాలో హాలిడే) డిసెంబర్ 4 -ఆదివారం డిసెంబర్ 10- రెండో శనివారం డిసెంబర్ 11 -ఆదివారం డిసెంబర్ 12- సోమవారం (పా టాగన్ నెంగ్మింజ సంగం, మేఘాలయలో సెలవు) డిసెంబర్ 18 - ఆదివారం డిసెంబర్ 19 - సోమవారం (గోవా లిబరేషన్ డే,గోవాలో సెలవు) డిసెంబర్ 24- శనివారం ( క్రిస్మస్, నాలుగో శనివారం దేశవ్యాప్త సెలవు) డిసెంబర్ 25 - ఆదివారం డిసెంబర్ 26- సోమవారం (క్రిస్మస్, లాసంగ్, నమ్సంగ్ మిజోరం, సిక్కిం, మేఘాలయలో హాలిడే) డిసెంబర్ 29- గురువారం (గురు గోవింద్ సింగ్ పుట్టినరోజు,చండీగఢ్లో హాలిడే) డిసెంబర్ 30- శుక్రవారం ( యు కియాంగ్ నంగ్వా మేఘాలయలో సెలవు డిసెంబర్ 31 - శనివారం (నూతన సంవత్సర వేడుకలు, మిజోరంలో సెలవు) రాష్ట్రాల పండుగల ఆధారంగా అక్కడ బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవని గుర్తించుకోవాలి. -
AP: రెండో శనివారం బడులు, కాలేజీలకు పనిదినమే
సాక్షి, అమరావతి: ఆజాదీ కా అమృతోత్సవాలను ఈనెల 15న ఘనంగా నిర్వహించడానికి, విద్యార్థులందరి భాగస్వామ్యాన్ని పెంచడానికి సన్నాహ కార్యక్రమాల కోసం ఈనెల 13వ తేదీ రెండో శనివారాన్ని పనిదినంగా పరిగణిస్తూ పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యా శాఖ సర్క్యులర్లు విడుదల చేశాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 15న పెద్ద ఎత్తున సంబరాన్ని నిర్వ హించడానికి ఆజాదీ కా అమృతోత్సవాల పేరిట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమా లను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం నుంచి హర్ ఘర్ జెండా కార్యక్రమం చేపట్టారు. పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. 13, 14 తేదీలు రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలుగా ఉండడంతో సన్నాహక కార్యక్రమాలకు ఆటంకంగా మారింది. విద్యార్థులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రిహార్సల్స్ వంటివి చేయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండో శనివారం సెలవు దినాన్ని పనిదినంగా కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్లు ఎస్.సురేష్కుమార్, ఎం.వి.శేషగిరిబాబు సర్క్యులర్లు విడుదల చేశారు. జూనియర్ కాలేజీలకు రెండో శనివారానికి బదులు మూడో శనివారాన్ని సెలవు దినంగా ప్రకటించాలని ఇంటర్మీడియట్ విద్య కమిషనర్.. రీజనల్ జాయింట్ డైరెక్టర్లకు సూచించారు. (క్లిక్: మార్పును పట్టుకుందాం) -
చినవెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
వరపల్లి : ద్వారకాతిరుమలేశుని క్షేత్రం శనివారం భక్తులతో పోటెత్తింది. కిక్కిరిసిన భక్తులతో ఆలయ పరిసరాలు కళకళలాడాయి. ప్రసాదం, టికెట్ కౌంటర్లు, దర్శనం క్యూలైన్లు, కేశఖండన శాల ఇతర విభాగాలు భక్తులతో నిండిపోయాయి. దర్శనం క్యూలైన్లు పూర్తిగా నిండిపోవడంతో ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలో భక్తులు బారులు తీరారు. దాదాపు 20 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించినట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు. సాయంత్రం వరకు ఆలయంలో రద్దీ కొనసాగింది. దాదాపు 5 వేల మందికి పైగా భక్తులు స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించినట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలరించిన కోలాట భజనలు శ్రీవారి ఆలయ పరిసరాల్లో తిరుమల తిరుపతి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట భజనలు ఆద్యంతం భక్తులను అలరించాయి. ముందుగా వారు స్వామి, అమ్మవార్లను దర్శించి పూజించారు. ఆ తరువాత ఆలయ ఆవరణలోను, శ్రీహరికళాతోరణ వేదికపైన భక్తిగీతాలను ఆలపిస్తూ కోలాట భజనలు జరిపారు. -
భీమవరంలో ’డ్రగ్స్’ తనిఖీలు
భీమవరం టౌన్: భీమవరంలో శనివారం ఔషధ నియంత్రణ అధికారుల బృందం మందుల దుకాణాలు, హోల్సేల్స్ ఏజెన్సీల్లో విస్తృత తనిఖీలు చేశారు. జిల్లా ఔసధ నియంత్రణ విభాగం ఏడీ వి.విజయశేఖర్ నేతృత్వంలో భీమవరం, తణుకు, జంగారెడ్డిగూడెం డ్రగ్ ఇన్స్పెక్టర్లు కె.అనిల్కుమార్, విక్రమ్, ఎం.విజయలక్ష్మిల బృందం తనిఖీలు చేశాయి. డ్రగ్ మాఫియా నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ (మత్తు కలిగించే మందులు)ను ఏ వ్యాపారులు ఎక్కువ మొత్తంలో క్రయవిక్రయాలు చేస్తున్నారో రికార్డులను పరిశీలిస్తున్నారు. భీమవరం వన్టౌన్, టూటౌన్ ప్రాంతాల్లో పలు మందుల దుకాణాలు, హోల్సేల్ ఏజెన్సీల్లో తనిఖీలు చేసి రికార్డులు పరిశీలించారు. డాక్టర్ల సూచనల మేరకు ప్రిస్కిప్షన్ ప్రకారం మందుల విక్రయించాల్సి ఉండగా దానిని ఎవరూ పట్టించుకోవడం లేదన్న దిశగా కూడా అధికారులు దృష్టిసారించారు. -
‘అంధ’గాడు సందడి
ఏలూరు(ఆర్ఆర్పేట) : అంధగాడు చిత్ర యూనిట్ శనివారం హేలాపురిలో సందడి చేసింది. ఈ చిత్రం ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా స్థానిక సాయి బాలాజీ థియేటర్ను చిత్ర బృందం సందర్శించింది. ప్రేక్షకులను పలకరించింది. హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ హెబ్బాపటేల్ వారితో ముచ్చటించారు. చిత్రంలోని సన్నివేశాలు, తమ నటన, పాటలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. డైలాగులు చెప్పి మెప్పించారు. అనంతరం రాజ్తరుణ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ తాను నటించిన అన్ని చిత్రాలనూ ప్రేక్షకులు ఆదరించారని ఆనందం వ్యక్తం చేశారు. తనపై విశేష ఆదరణ చూపుతున్న జిల్లా ప్రజల ప్రేమాభిమానాలు మరిచిపోలేనన్నారు. త్వరలో అన్నపూర్ణా స్టూడియోస్ సంస్థ నిర్మించే చిత్రంతోపాటు దిల్ రాజు నిర్మాణంలో మరో చిత్రం చేస్తున్నట్టు వివరించారు. అంధగాడు చిత్ర నిర్మాతలతోనే మరో చిత్రం చేయనున్నట్టు వెల్లడించారు. హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ రాజ్ తరుణ్తో తాను మూడు చిత్రాల్లో నటించానని, అన్నీ ప్రేక్షకాదరణ పొందాయని ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ రాజ్తరుణ్తో చేసే అవకాశం వస్తే వదులుకోనని పేర్కొన్నారు. దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో కథా రచయితగా బలుపు, పండగచేస్కో, బెండు అప్పారావు వంటి చిత్రాలకు కథలు అందించానని, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మాతలు, హీరో రాజ్ తరుణ్ ప్రోత్సాహంతోనే దర్శకుడిగా మారానని పేర్కొన్నారు. తొలిచిత్రమే విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో చిత్ర పంపిణీదారు ఉషా పిక్చర్స్ అధినేత వి.వి.బాలకృష్ణారావు మాట్లాడుతూ రాజ్తరుణ్ నటించిన ఏడు చిత్రాల్లో నాలుగు చిత్రాలను తానే పంపిణీ చేశానని వివరించారు. అనంతరం వారిని పుష్పగుచ్ఛాలతో అభినందించారు. సమావేశంలో విలన్ పాత్రధారి రాజారవీంద్ర, నిర్మాత కిషోర్ గరికపాటి, ఉషా పిక్చర్స్ మేనేజర్ ఎం శ్రీనివాసరావు, సాయిబాలాజీ థియేటర్ మేనేజర్ మొహిద్దీన్, సీహెచ్ సుదర్శనరావు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళాల వెల్లువ
దేవరపల్లి(ద్వారకాతిరుమల): ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిత్యాన్నదాన ట్రస్టుకు ఇద్దరు భక్తులు రూ.2.01లక్షలను విరాళంగా అందించారు. నిడమర్రు మండలం చిన నిండ్రకొలనుకు చెందిన పాతపాటి వెంకట రామలింగరాజు, పద్మ దంపతులు రూ.1,00,116లను అందించారు. అలాగే ఉండి మండలం యండగండికి చెందిన వేగేశ్న సత్తిరాజు, సూర్యకాంతమ్మ దంపతులు రూ.1,01,116లను అందించారు. ఈవో వేండ్ర త్రినాథరావు దాతల కుటుంబాలకు ఉచిత దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం వారికి ప్రసాదాలు అందించారు. -
ముగిసిన సాఫ్ట్బాల్ టోర్నీ
జంగారెడ్డిగూడెం : స్థానిక విద్యావికాస్ కళాశాలలో జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ట్ నాలుగో సీనియర్ సాఫ్ట్బాల్ పోటీలు శనివారంతో ముగిశాయి. పురుషులు, మహిళల విభాగాల్లో ఫైనల్ మ్యాచ్లు ఉత్కంఠగా సాగాయి. పురుషుల విభాగంలో గుంటూరు జిల్లా విజేతగా నిలిచింది. అనంతపురం ద్వితీయ స్థానం, వైఎస్సార్ కడప జిల్లా తృతీయ స్థానం సాధించాయి. మహిళల విభాగంలో అనంతపురం ప్రథమస్థానం, విజయనగరం, వైఎస్సార్ కడప ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. అనంతరం బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ముగింపు సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు మాట్లాడుతూ.. ఉత్తమ క్రీడాకారులను తయారు చేసుకోవాలి్సన బాధ్యత మనదేనన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. టోర్నీ నిర్వహణను చేపట్టిన విద్యావికాస్ కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. సహాయ సహకారాలు అందించిన మానవత స్వచ్ఛంద సంస్థ, జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ను కూడా అభినందించారు. ప్రభుత్వం కూడా క్రీడాభిృద్ధికి కృషి చేస్తోందని రామ్మోహనరావు చెప్పారు. అనంతరం విజేతలకు పతకాలు, ట్రోఫీని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ చైర్మన్ మేడవరపు అశోక్ శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, డీఎస్డీఓ ఎస్.ఎ.అజీజ్, మానతవ జిల్లా అధ్యక్షుడు కె.జె.మాథ్యూ, కోశాధికారి తాడేపల్లి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు చావా రమేష్బాబు, సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మిడత రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
కాళ్లకూరు వెంకన్నకు బంగారు పుష్పాలు సమర్పణ
కాళ్ల : కాళ్లకూరులో స్వయంభువుడిగా కొలువైన వేంకటేశ్వరస్వామికి భక్తులు శనివారం బంగారు పుష్పాలు సమర్పించారు. కాళ్లకూరు గ్రామానికి చెందిన చేకూరి అప్పలరాజు, సుశీల దంపతులు స్వామికి 54 గ్రాముల బరువైన 108 బంగారు పుష్పాలు సమర్పించారు. కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధరరావు భక్తులను అభినందించారు. స్వామి వారి శేష వస్త్రం, ప్రసాదాన్ని అందజేశారు. -
గూడెంలో పసుపు కొనుగోలు కేంద్రం
తాడేపల్లిగూడెం : పసుపు రైతుల సమస్యను పరిష్కరించేందుకు తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీలో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. జిల్లాలోని పసుపు రైతులు తమ సమస్యలపై మంత్రికి శనివారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం, నల్లజర్ల మండలాలతో పాటు ఆచంట. పెనుగొండ మండలాల్లో రైతులు పసుపు పండిస్తున్నారన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రితో మాట్లాడినట్టు చెప్పారు. రెండు, మూడు రోజుల్లో ఏఎంసీలో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సమాన పనికి సమానవేతనం రావడంలేదని 108 అంబులె న్స్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. జీవీకే సంస్థ నుంచి లీవ్ఎన్ క్యాష్మెంట్ సొమ్ములు రాక ఇబ్బందులు పడుతున్నట్టు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఈ సమస్యపై సీఎంతో మాట్లాడి అంబులె న్స్ సిబ్బందికి న్యాయం చేస్తామన్నారు. గోవధ నిరోధక చట్టం సంచలనం కేంద్రం తీసుకువచ్చిన గోవధ నిరోధక చట్టం సంచలనమని ఇలాంటి చట్టాన్ని తీసుకొచి్చన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు మంత్రి తెలిపారు. దేశంలో ఉండే అత్యధిక శాతం హిందువులు భగవంతునితో సమానంగా గోవును పూజిస్తారన్నారు. మోపురం ఉన్న దేశీయ ఆవుల పాల నుంచి తయారుచేసిన పదార్థాలలో రోగనిరోధకశక్తితో పాటు అద్భుతమైన ఆయుర్వేద గుణాలున్నాయని ప్రపంచం గుర్తించిదన్నారు. గత పాలకులు పిరికితనం, నిర్లక్ష్యం కారణంగా గోవులు కబేళాలకు తరలిపోతున్నాయన్నారు. ఎర్రకాల్వ ముంపు సమస్య పరిష్కారం కోసం నందమూరులో ఎర్రకాలువపై ఉన్న పాత అక్విడెక్ట్ను తొలగించే ప్రక్రియ తుదిదశకు చేరుకుందన్నారు. -
వైభవోపేతం.. శ్రీనివాసుని కల్యాణం
జంగారెడ్డిగూడెం : గోకుల తిరుమల పారి జాతగిరిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీని వాసుని కల్యాణాన్ని శని వారం వైభవంగా నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 4వ రోజు కల్యాణ మహోత్సవంలో తొలుత విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, హోమ కార్యక్రమాన్ని ఆలయ ప్రధానార్చకులు నల్లూరి రవికుమారాచార్యుల పర్యవేక్షణలో ఋత్విక్ స్వాములు జరి పారు. రెడ్డి శ్రీనివాసరావు దంపతులు, తానింకి సత్యనారాయణ దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. జంగారెడ్డిగూడెంకు చెందిన కోరా నాగేశ్వరరావు, రేవతి దంపతులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మ¯ŒS బిక్కిన సత్యనారాయణ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు పోలవరం రాక
పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు ఈ నెల 22న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు రానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో యంత్రాంగం బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. శనివారం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని ఎస్పీ భాస్కర్భూషణ్, జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి సోమవారం ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్న పనులను పరిశీలించి సంబంధిత అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో రివ్యూ సమావేశం జరపనున్నట్టు ఇంజనీరింగ్ అధికారులు చెప్పారు. ప్రాజెక్టు ఎస్ఈ వీఎస్ రమేష్బాబు, ఆర్డీవో ఎస్.లవన్న, పోలవరం డీఎస్పీ ఏటీవీ రవికుమార్ ఉన్నారు. -
పంటకుంటలకు ప్రాధాన్యమివ్వండి
కొవ్వూరు రూరల్ : రైతులు పొలాల్లో పంట కుంటలు తవ్వేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి కేఎస్ జవహర్ ఆదేశించారు. శనివారం కొవ్వూరులోని మంత్రి కార్యాలయంలో ఇంకుడు గుంతలు, పంటకుంటలపై మండల పరిషత్, రెవెన్యూ, పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోదావరి తీర ప్రాంతంలో ఉన్నప్పటికీ చాగల్లు మండలంలోని మల్లవరం, చిక్కాల గ్రామాల్లో భూగర్భజలాలు అతి తక్కువగా ఉన్నాయన్నారు. నీరు–ప్రగతి కార్యక్రమంలో చెరువుల పూడికతీత, కాలువల ఆధునికీకరణ, ఇంకుడుగుంతలు, ఫామ్పాండ్ల తవ్వకం ద్వారా భూగర్భ జలాలలను పెంపొందించుకోవచ్చన్నారు. దీనికి సంబంధించి గ్రామాల్లో కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కొవ్వూరు, తాళ్లపూడి తహసీల్దార్లు కె.విజయకుమార్, శ్రీనివాసరావు, ఎంపీడీవోలు ఎ.రాము, కె.పురుషోత్తమరావు, జ్యోతిర్మయి పాల్గొన్నారు. -
రాజకీయ చైతన్యంతోనే సమాజంలో మార్పు
కోడేరు (ఆచంట) : యువత రాజకీయ చైతన్యం పొందడం ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మంతెన సీతారామ్ అన్నారు. కోడేరులోని ఆత్మీయ సేవా కేంద్రంలో నిర్వహిస్తున్న యువ కమ్యూనిస్టుల అధ్యయన శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సీతారామ్ మాట్లాడుతూ పాలకులు యువతను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారన్నారు. యువతను కులం, మతం, ప్రాంతాల వారీగా విభజించి వారి ఐక్యతను దెబ్బదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత, విద్యార్థుల్లో రాజకీయ చైతన్యం పెంచేందుకు తోడ్పడుతున్న సెంట్రల్ యూనివర్సిటీలలో బీజెపీ, దాని అనుబంధ సంఘాలు ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. హెచ్సీయూలో వేముల రోహిత్, జేఎన్యూలో కన్హయ్యకుమార్లపై జరిగిన దాడులే ఇందుకు నిదర్శనమన్నారు. శిక్షణ తరగతులకు శివకుమార్ ప్రిన్సిపాల్గా వ్యవహరించారు. ఈ తరగతుల్లో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కేతాగోపాలన్, పార్టీ నాయకులు ఎస్వీఎస్ శర్మ, పి.అనూరాధ, ఎ. అరుణ్కుమార్, పి.మంగరాజు, బత్తుల విజయ్కుమార్, కె.సుధీర్, వద్దిపర్తి శ్రీనివాసు, తోటపల్లి సత్యనారాయణ, వద్దిపర్తి అంజిబాబు, పాల్గొన్నారు. -
విద్యార్థులు శాస్త్రీయంగా ఆలోచించాలి
పాలకోడేరు: విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనలతో అధ్యయనం చేయాలని జనవిజ్ఞాన వేదిక విద్యాభాగం జిల్లా కన్వీనర్ చింతపల్లి ప్రసాదరావు అన్నారు. మోగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వేసవి అధ్యయన శిబిరం శనివారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న చింతపల్లి ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ అవగాహన పెంచుకోవడం ద్వారా మూఢ నమ్మకాలను పారద్రోలవచ్చన్నారు. సమాజంలో పెరుగుతున్న అశాస్త్రీయ భావజాలం, మూఢ నమ్మకాలపై ఎస్ఎఫ్ఐ విద్యార్థులను చైతన్య పరచాలని కోరారు. రాజ్యం నుంచి మతాన్ని వేరుగా చూడడమే లౌకికవాదమని, నేటి పాలకులు లౌకిక స్ఫూర్తికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. యూటీఎఫ్ జిల్లా నాయకులు పెన్మెత్స శ్రీనివాసరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు కాగితపు అనిల్ పాల్గొన్నారు. -
ఆత్మీయ స్వాగతం
జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జిల్లా ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. శనివారం మధ్యాహ్నం భీమవరం చేరుకున్న ఆయన మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తనయుడు సాగర్–సుధ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం ఏలూరు చేరుకుని మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ కుమార్తె డాక్టర్ పావని, డాక్టర్ నిషాంత్ వివాహానికి హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డికి జిల్లా ప్రజలు అత్మీయ స్వాగతం పలికారు. ఆయన భీమవరం, ఏలూరులో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి అభిమాన నేతకు నీరాజనం పలికారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ జగన్కు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నేతలు విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి జాతీయ రహదారి మీదుగా ప్రయాణించి పెనుగొండ మండలం సిద్ధాతం వద్ద జిల్లాలో అడుగుపెట్టారు. ఆయన పర్యటన ఏ రూట్లో ఉంటుందో ప్రకటించకపోయినా.. అప్పటికప్పుడు ఆయన వస్తున్నారన్న విషయం తెలుసుకున్న అభిమానులు సెంటర్లలోకి చేరుకుని స్వాగతం పలికారు. సిద్ధాతం, ఉండ్రాజవరం జంక్షన్, తణుకు, దువ్వలో అభిమానులు ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. తాడేపల్లిగూడెం మీదుగా భీమవరం చేరుకున్న వైఎస్ జగన్ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. ఈనెల 9న భీమవరంలో గ్రంధి ఇంట జరిగిన వివాహ వేడుకకు అనివార్య కారణాల వల్ల రాలేకపోయిన వైఎస్ జగన్ శనివారం మధ్యాహ్నం వెళ్లి నూతన దంపతులు సాగర్, సుధలకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అనంతరం అక్కడి నుంచి ఏలూరు బయలుదేరి వచ్చారు. మండుటెండలోనూ ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో ఉండి, ఆకివీడు ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు వైఎస్ జగన్కు స్వాగతం పలికారు. ఆకివీడులో హారతులు పట్టారు. అక్కడ వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన వైఎస్ జగన్ ఏలూరు చేరుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) ఇంటికి వెళ్లారు. అక్కడ పార్టీ నగర, మండల శాఖ అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్, మంచెం మైబాబు ఆధ్వర్యంలో స్వాగతం లభించింది. నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నాని ఇంటికి తరలివచ్చారు. అనంతరం వట్లూరులోని శ్రీ కన్వెన్షన్ హాల్కు చేరుకున్న వైఎస్ జగన్ మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ కుమార్తె డాక్టర్ పావని, డాక్టర్ నిషాంత్ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్రబోస్, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, శ్రీకాకుళం జిల్లా పార్టీ ఇన్ చార్జి కొయ్యే మోషేన్ రాజు, నియోజకవర్గాల కన్వీనర్లు ముదునూరి ప్రసాదరాజు, కవురు శ్రీనివాస్, పాతపాటి సర్రాజు, కారుమూరి నాగేశ్వరరావు, తెల్లం బాలరాజు, పుప్పాల వాసుబాబు, తలారి వెంకట్రావు, తానేటి వనిత, దయాల నవీన్ బాబు, గుణ్ణం నాగబాబు, దూలం నాగేశ్వరరావు, పార్టీ నాయకులు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, తోట గోపి, చీర్ల రాధయ్య, మామిళ్లపల్లి జయప్రకాష్, వందనపు సాయిబాలపద్మ, పేరిచర్ల విజయనర్సింహరాజు, డాక్టర్ వేగిరాజు రామకృష్ణంరాజు, బొద్దాని శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పరిశోధనలతో రైతులకు మేలు
తాడేపల్లిగూడెం రూరల్ : రైతులకు మేలు చేసేలా విద్యార్థులు పరిశోధనలు జరపాలని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ చిరంజీవి చౌదరి అన్నారు. మండలంలోని వెంకట్రామన్నగూడెం ఉద్యాన కళాశాల 10వ వార్షికోత్సవం శనివారం రాత్రి జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి చౌదరి మాట్లాడుతూ వ్యవసాయంలో క్షేత్రస్థాయి పరిశీలన చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. చదువుతో పాటు మానసిక వికాసాన్ని పెంపొందించే సాంస్కృతిక అంశాల్లో విద్యార్థులు నైపుణ్యం కనబర్చాలన్నారు. అనంతరం చదువు, పాటల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.శ్రీనివాసులు, డీ న్ ఆఫ్ హార్టీకల్చర్ డాక్టర్ ఎం.లక్ష్మీనారాయణరెడ్డి, లైబ్రేరియ న్ డాక్టర్ ఎంబీ నాగేశ్వరరావు, డాక్టర్ డి.శ్రీహరి, డాక్టర్ జె.దిలీప్రెడ్డి, డాక్టర్ ఆర్వీఎస్కె.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
కొవ్వూరులో వడగళ్ల వాన
కొవ్వూరు : పట్టణంలో శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. ఉదయం నుంచి వేసవి తాపంతో జనం ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం వర్షం కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో జనం సేదతీరారు. వీధుల్లో చిన్నారులు కోలాహలంగా వర్షంలో తడుస్తూ చిందులు వేస్తూ, వడగళ్లను ఏరుకున్నారు. చాగల్లు, తాళ్లపూడి మండలాల్లోనూ వర్షం కురిసింది. రైతుల ఉరుకులు పరుగులు భీమవరం : ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై చిరుజల్లులు కురిశాయి. శనివారం సాయంత్రం వాతావరణం చల్లబడి కారుమబ్బులు కమ్మాయి. జిల్లాలో కొన్ని చోట్ల వర్ష పడింది. దాళ్వా మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్న వేళ చిరుజల్లులు పడడం రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. జిల్లావ్యాప్తంగా దాళ్వా పంట ఆశాజనకంగా ఉండడంతో పాటు ధర కూడా రైతులకు కొంతమేరకు అనుకూలంగా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా డెల్టా ప్రాంతంలో దాళ్వా మాసూళ్లతో రైతులు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. వరికోత యంత్రాలతో మాసూళ్లు చేసిన ధాన్యం ఎక్కడికక్కడ చేలల్లోనే రైతులు ఆరబెట్టే ప్రయత్నంలో బరకాలపై వేసి ఉంచడంతో ఆకాల వర్షం ఎటువంటి నష్టం కలిగిస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఉరుకులు.. పరుగులు ధాన్యం ఎక్కడికక్కడ చేలలోను, రోడ్లు వెంబడి ఉంచడంతో శనివారం నాటి వర్షం జల్లులకు రైతులు బెంబేలెత్తిపోయారు. దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి శ్రీలంకలోని కొమరిన్ ప్రాంతం వరకు కర్ణాటక, తమిళనాడు మీదుగా విస్తరించిన అల్పపీడన ద్రోణి కారణంగా శని, ఆదివారాలు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు చెప్పడంతో రైతుల్లో మరింత గుబులు పుట్టింది. రైతులు చేల వద్ద, రోడ్లుపైనే ఎండబెట్టిన ధాన్యాన్ని రాశులుగా చేసి చీకటిలో కూడా చార్జింగ్ లైట్ల వెలుతురులో భద్రపర్చే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఈదురుగాలులకు పలుచోట్ల చేలు నేలనంటాయి. -
చంద్రబాబుకు ఝలక్
సీఎం పర్యటన, పోతవరంలో, శనివారం cm tour, in pothavaram, saturday అందరూ సంతోషంగా ఉన్నారా’ నల్లజర్ల మండలం పోతవరం గ్రామస్తులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు అడిగిన ప్రశ్న ఇది. ‘లేదు.. లేదు.. ఎవరికీ సంతోషం లేదు’ గ్రామస్తులిచ్చిన సమాధానం అదిరిపడిన సీఎం ‘ఎంతమంది సంతృప్తికరంగా లేరో చేతులెత్తుండి’ అనగానే.. సభా ప్రాంగణంలో ఉన్న వారిలో 70 శాతం మంది చేతులెత్తారు. సర్దుకున్న చంద్రబాబు కారణం ఏమిటో చెప్పండని అడగ్గా.. ‘ఎక్కడికక్కడ అవినీతి పెరిగిపోయింది. పాలన లంచాలమయంగా మారింది’ అంటూ ఘాటుగానే జవాబిచ్చారు. నల్లజర్ల మండలం పోతవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నల్లజర్ల మండలం పోతవరం గ్రామస్తులు ఝలక్ ఇచ్చారు. ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన చంద్రబాబు అక్కడి పాఠశాలలో డిజిటల్ అక్షరాస్యత భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. బహిరంగ మలవిసర్జన లేని జిల్లాగా పశ్చిమ గోదావరిని ప్రకటిస్తున్నానని ఘనంగా చెప్పారు. ‘ఈ గ్రామానికి అన్నీ చేశాం. అందరూ సంతోషంగా ఉన్నారా’ అని వేదికపై నుంచి ప్రజలను సీఎం ప్రశ్నించారు. దీనికి జనం నుంచి ‘లేదు.. లేదు’ అనే సమాధానం రావడంతో ముఖ్యమంత్రి కంగుతిన్నారు. ఎంతమంది అసంతృప్తితో ఉన్నారని ప్రశ్నించగా.. సభలోని 70 శాతం మంది చేతులు పైకెత్తారు. వారిలో కొందరిని మీ సమస్యలేమిటని చంద్రబాబు ఆరా తీశారు. లంచం ఇస్తేనే పని చేస్తారట గ్రామానికి చెందిన అబ్బూరి లక్ష్మి మాట్లాడుతూ తన మామగారు చనిపోయారని, తమకున్న పొలానికి పట్టాదార్ పాస్బుక్ మంజూరు చేసి.. 70 సెంట్ల పొలాన్ని తన భర్త పేరుపై మార్చేందుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను అడుగుతుంటే... రూ.30 వేలు లంచమిస్తేనే పని చేస్తామని చెబుతున్నారని వాపోయింది. ఎవరు అడిగారని ముఖ్యమంత్రి ప్రశ్నించగా.. వీఆర్ఓ ఫణిబాబు అని సమాధానం చెప్పింది. దీంతో ముఖ్యమంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ రెవెన్యూ అధికారిపై విచారణ జరిపి 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ను ఆదేశించారు. మూడేళ్లుగా పెన్షన్ రావడం లేదు మరో వృద్ధురాలు శ్యామలను సంతృప్తిగా ఉన్నావా అని ముఖ్యమంత్రి ప్రశ్నించగా.. తనకు మూడేళ్లుగా పెన్షన్ రావడం లేదని, సంతృప్తి ఎలా ఉంటుందని బదులిచ్చింది. రేషన్ కార్డు ఉందా అన్ని అడగ్గా.. ‘కార్డు లేదు. రేషన్ లేదు. పింఛన్ కూడా రావడం లేదు’ అని బదులిచ్చింది. కంగుతిన్న ముఖ్యమంత్రి నీ కుటుం బంలో ఎవరికైనా పింఛను వస్తుందేమో.. అందుకే తొలగించి ఉంటారన్నారు. తన కుటుంబంలో ఎవరికీ పెన్షన్ లేదని, తనకూ రావడం లేదని వాపోయింది. అధికారులు నీ సమస్యను పరిష్కరిస్తారని చెప్పిన ముఖ్యమంత్రి వేరే వ్యకితో మాట్లాడారు. ఇల్లు మంజూరు కాలేదు గ్రామానికి చెందిన మరో వ్యక్తిని ‘నీవు సంతృప్తిగా ఉన్నావా’ అని సీఎం అడగ్గా.. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో ఇంటి కోసం మూడేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని చెప్పాడు. సీఎం బదులిస్తూ.. ‘ఇప్పుడే శంకుస్థాపన చేశాను. త్వరలో నీకు ఇల్లు వస్తుందిలే. అప్పుడు సంతృప్తిగా ఉందువు’ అని ముఖ్యమంత్రి సర్ధి చెప్పారు. అవినీతి ఎక్కడ జరిగినా వెంటాడతానని సీఎం హెచ్చరించారు. అవినీతిపరులపై దాడులు చేయిస్తామని.. పట్టుబడిన సొమ్మును స్వాధీనం చేసుకుని పేదల సంక్షేమానికి ఖర్చు పెడతామని అన్నారు. దాడుల్లో పట్టుబడిన అధికారులు రెండు నెలల అనంతరం తమ ఉద్యోగం తిరిగొస్తుందనే భావనలో ఉన్నారని.. ఇకనుంచి అలాంటి పరిస్థితి ఉండదన్నారు. ఇదిలావుండగా నల్లజర్లలో జెడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సభకు జనం రాలేదు. ఉపాధి కూలీలు, డ్వాక్రా మహిళలు, అంగన్ వాడీ కార్యకర్తలను తీసుకొచ్చినా.. సభావేదిక ముందు కుర్చీలు ఖాళీగా కనిపించాయి. రైతులు భూములివ్వాల్సిందే ఏలూరు (మెట్రో) : రైతులు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి భూములు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. నల్లజర్లలో బహిరంగ సభలో మాట్లాడుతూ రోడ్లు అభివృద్ధి చేయాలంటే భూమి అవసరమన్నారు. అందువల్ల రైతులు ఉదా రంగా భూములు ఇవ్వాలని కోరారు. చేపల, రొయ్యల పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవస రం ఉందని, అటువంటి పరిశ్రమలకు అడ్డుపడకూడదని పరోక్షంగా ఆక్వాపార్క్ అంశాన్ని ప్రస్తావించారు. నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు. అంతకుముందు పోతవరం విచ్చేసిన చంద్రబాబుకు స్వాగతం లభించింది. మంత్రులు దేవినేని ఉమ, పైడికొం డల మాణిక్యాలరావు, పితాని సత్యనారాయణ, కేఎస్ జవహర్, జెడ్పీ చైర్మన్ ఎం.బాపిరాజు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ఎంపీలు తోట సీతారామలక్ష్మి, మురళీమోహన్, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, ముప్పిడి వెంకటేశ్వరరావు, గన్ని వీరాంజనేయులు, ఆరిమిల్లి రాధాకృష్ణ, పులవర్తి రామాం జనేయులు, ఎం.శ్రీనివాసరావు, కలెక్టర్ కె.భాస్కర్, డీసీసీబీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు, పోతవరం సర్పంచ్ పసుమర్తి సతీష్ పాల్గొన్నారు. -
ముగిసిన రాట్నాలమ్మ తిరునాళ్లు
రాట్నాలకుంట (పెదవేగి రూరల్): కన్నుల పండువగా రాట్నాలమ్మతల్లి తిరునాళ్లు శనివారంతో ముగిశాయి. తిరునాళ్ల చివరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సీహెచ్ ప్రభాకర్ పాల్గొన్నారు. ఉత్సవ మూర్తికి అవబృతోత్సవం, కుంభాభిషేకం, పుష్పయాగోత్సవం విజయవాడకు చెందిన మండలి హనుమంతరావు, పద్మ దంపతులు నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజు ఉదయం 9 గంటల నుంచి అన్నసమారాధన, రాత్రి 7 గంటలకు వృక్ష కల్యాణం, కూచిపూడి నృత్య ప్రదర్శన, తెప్పోత్సవం భక్తులను అలరించాయి. రాత్రి 9 గంటలకు సత్యహరిశ్చంద్ర నాటకం ప్రదర్శించారు. -
భక్త జన సంద్రం
మొగల్తూరు: పేరుపాలెం బీచ్లో వేంచేసియున్న వేళాంకిణిమాతను దర్శించుకునేందుకు శనివారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి వచ్చారు. గుడ్ఫ్రైడే పురస్కరించుకుని 40 రోజులు ముందుగా ప్రత్యేక మాల ధరించిన విశ్వాసులు శుక్రవారం రాత్రి బీచ్కు చేరుకున్నారు. శనివారం వేకువ జామున సముద్ర స్నానం ఆచరించి తలనీలాలు సమర్పించుకొని వేళాంకిణి మాతను దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్చి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. -
నాటక రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
వీరవాసరం : నాటకరంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కోరారు. వీరవాసరం కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిలభారత స్థాయి నాటిక పోటీల్లో పాల్గొని శనివారం ఆయన మాట్లాడారు. నాటకాల ద్వారా సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక అంశాలు ఎన్నో మిళితమై ఉంటాయన్నారు. నాటక ప్రదర్శనలకు థియేటర్లు ఏర్పాటు చేసి కళాకారులకు, కళాభిమానులను ప్రోత్సహించాలన్నారు. ఎంతో మంది కవులు, కళాకారులను, న్యాయ నిపుణులను ఏటా సన్మానించడం, నిర్విరామంగా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర సమాచారహక్కు చట్టం కమిషనర్ లామ్ తాంతియాకుమారి, రిటైర్డ్ డెప్యూటీ హైకోర్టు రిజిస్ట్రార్ పాలకోడేటి కృష్ణమూర్తిలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కళాపరిషత్ అధ్యక్షుడు గుండా రామకృష్ణ, వైసీపీ మండల కన్వీనర్ కోటిపల్లిబాబు, పట్టణాధ్యక్షుడు నూకల కనకారావు, ఎంపీటీసీలు చికిలే మంగతాయారు, రెడ్డి రాంబాబు, పాలా లక్ష్మీకుమారి, మోగంటి నాగేశ్వరరావు, ఆవాల కనకదుర్గ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, కామన నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్లో అంతిమతీర్పు
ఏలూరు (సెంట్రల్) : అప్పీలు లేని, న్యాయబద్ధమైన అంతిమ తీర్పు పొందేందుకు లోక్అదాలత్ను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.సునీత అన్నారు. శనివారం స్థానిక జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిరకాలంగా కోర్టుల్లో అపరిష్కృతంగా నిలిచిపోయిన 2,700 పెండింగ్ కేసులు శనివారం జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించటం జరుగుతుందన్నారు. జిల్లాలోని 10 కోర్టుల్లో 22 బెంచీలు ఏర్పాటు చేశామని, జిల్లా కోర్టులో 4 బెంచీలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ మహిళ కుటుంబానికి ఇన్సూరెన్స్ కింద రూ. 4 లక్షల చెక్కును జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత చేతులమీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు కె.సాయిరమాదేవి, రమాదేవి, కె.సునీత, ఎస్.శ్రీదేవి, ఎల్.శ్రీధర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్బినేని విజయ్కుమార్ పాల్గొన్నారు. -
మోటార్ సైకిల్ దగ్ధం
ఎర్రకాలువ సమీపంలో, శనివారం, షార్ట్ సర్క్యూట్ near red canal, saturday, short circuit టి.నరసాపురం: టి.నరసాపురం ఎర్రకాలువ సమీపంలో శనివారం వేకువజాము ఐదు గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్తో మోటార్ సైకిల్ దగ్ధమైంది. వివరాలిలా ఉన్నాయి.. టి.నరసాపురం మండలం ఏపుగూడెం పంచాయతీ పరిధిలోని కన్నప్పగూడెంకు చెందిన పాయం కిరణ్ మరో యువకుడు కలిసి చింతలపూడి మండలం కొమ్ముగూడెం బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్నారు. మార్గమధ్యంలో ఎర్రకాలువ సమీపంలో రోడ్డుపై వ్యవసాయ మోటార్లకు వెళ్లే విద్యుత్ తీగ తెగిపడి ఉంది. దీనిని చూడకుండా కిరణ్ బైక్పై వెళుతుండగా విద్యుదాఘాతానికి గురై కిందపడ్డారు. వీరిద్దరికీ తృటిలో ప్రమాదం తప్పగా, బైక్ పూర్తిగా కాలిబూడిదైంది. -
కొత్తగా జంగారెడ్డిగూడెం పోస్టల్ సబ్డివిజన్
కుక్కునూరు (పోలవరం): సబ్ పోస్టాఫీస్ను అభివృద్ధి చేసేందుకు విలీన మండలాల ప్రజలు సహకారం అందించాలని ఏలూరు పోస్టల్ సూపరింటెండెంట్ ఎస్ఎంఎస్ఎస్వీ ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం కుక్కునూరులో సబ్పోస్టాఫీస్ సేవలను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు బూర్గంపాడు సబ్పోస్టాఫీస్తో అటాచ్ అయి ఖమ్మం సర్కిల్ పరిధిలో పనిచేసిన మండలానికి చెందిన బీపీవోలు ఇకపై ఏలూరు సర్కిల్ కింద పని ప్రారంభించారన్నారు. ఇకపై కుక్కునూరు పిన్కోడ్ 534444 అమలులోకి వస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో విలీనమైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను జీలుగుమిల్లి సబ్ ఆఫీస్కు అటాచ్ చేయాలని ఆదేశాలు కూడా వచ్చాయన్నారు. కుక్కునూరులో సబ్ పోస్టాఫీస్ ఏర్పాటుతో 103 సబ్ ఆఫీసులతో జంగారెడ్డిగూడెం సబ్డివిజన్గా ఏర్పడిందని తెలిపారు. కుక్కునూరు సబ్పోస్టాఫీస్ ద్వారా మండల ప్రజలకు ఐఎంటీఎస్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయని, రూ.100 సేవింగ్ ఖాతాలు కూడా పొందవచ్చన్నారు. కుక్కునూరు సర్పంచ్ మడకం సుజాత, ఉప సర్పంచ్ నారాయణరాజు, డీసీసీబీ డైరెక్టర్ కోటగిరి సత్యనారాయణ, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ శ్రీనివాస్, ఎన్ఎఫ్పీఈ, ఎఫ్ఎన్పీవో యూనియన్ నాయకులు, బీపీఎంలు పాల్గొన్నారు. -
దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండటం తప్పు
ఉండి: దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండటం చాలా పెద్ద తప్పని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అభిప్రాయపడ్డారు. మాజీ ఎమ్మెల్యే, జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు సొంత నిధులు రూ.కోటి ఖర్చుతో నిర్మించిన శివాలయం రాజగోపురం, కలశస్థాపన కార్యక్రమాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ నటుడు తనికెళ్ళ భరణి స్వామికి అభిషేకాలు నిర్వహించారు. ముఖ్య అతిథి పాల్గొన్న మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ దేవాలయాలు దేవుడి సొత్తని, దానిపై ప్రభుత్వ అజమాయిషీ తగదని అన్నారు. తనే స్వయంగా నిర్మించిన ఒక దేవాలయ కమిటీ అధికారులతో కుమ్మక్సై 10 ఎకరాలు అమ్ముకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అటువంటి నాయకులపై వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. నాయకులు దేవాలయాలను కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆలయాల పునఃనిర్మాణంలో ప్రజలు, దాతలు పాలుపంచుకోవాలని పిలుపు నిచ్చారు. రంగనాథరాజు సుమారు రూ.కోటి సొంత ఖర్చుతో ఇంతటి గొప్ప కార్యం చేయడం అభినందనీయమన్నారు. ఆలయ «నిర్వాహకుడు రంగనాథరాజు మాట్లాడుతూ ఎంత సంపాదించినా కలగని ప్రశాంతత దైవభక్తితో సమకూరుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు తనికెళ్ల భరణిని బంగారు కంకణంతో, ప్రముఖ గజల్స్ గాయకుడు గజల్ శ్రీనివాస్, శతావధాని కోటలక్ష్మీనరసింహంలను బంగారు గొలుసులతోనూ మంత్రి మాణిక్యాలరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందరరావు తదితరులు పాల్గొన్నారు. అంతా శివోహం.. జగమంతా శివోహం.19 ఏళ్ల నుంచి నాటకరంగంపై మక్కువతో ఇంకా ప్రదర్శనలిస్తున్నాను. ఆధ్యాత్మికతపై మక్కువతో శివ భక్తుడిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాను. మా పూర్వీకులు యండగంగి వాస్తవ్యులు కావడం, తెలుగు జాతి గర్వించదగ్గ కవులు కావడం నాకు చాలా ఆనందం. -తనికెళ్ల భరణి, సినీ నటుడు సంస్కృతీ సంప్రదాయాలు కాపాడాలి దేశంలో చాలా వరకు హిందూ దేవాలయాలు పాడుపడ్డ స్థితిలో ఉన్నాయి. వాటి పునఃనిర్మాణానికి ప్రజలు, దాతలు ,ప్రభుత్వం ముందుకు రావాలి. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలి. అలాగే పెద్దపెద్ద చదువులు చదివిన వారంతా విదేశాల బాటపట్టి భారతదేశంలో హిందుత్వానికి దూరమవుతున్నా. అలాంటి వారంతా దేవాలయాల అభివృద్ధికి సాయమందించాలి. నిర్మించిన ఆలయాలను ఆయా గ్రామాల ప్రజలంతా కాపాడుకోవాలి.-గజల్ శ్రీనివాస్, గజల్ గాయకుడు -
పారిజాతగిరిలో ప్రత్యేక పూజలు
జంగారెడ్డిగూడెం: గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఉదయం 5 గంటల నుంచి పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకులు నల్లూరి రవికుమారాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్టు ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. బాలభోగ నివేదన, తీర్థప్రసాదగోష్టి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు జంగారెడ్డిగూడేనికి చెందిన మానికల వేంటేశ్వరరావు, దుర్గ దంపతులు, చింతపల్లి బాలకృష్ణ, చాందిని దంపతులు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ చైర్మన్ బిక్కిన సత్యనారాయణ, సభ్యులు పొన్నాడ సత్యనారాయణ, గొట్టుముక్కల రాయపరాజు, అన్నప్రగడ వీరరాఘవులు, బోడ వేంకటేశ్వరరావు, మారిశెట్టి బాలకృష్ణ, యిళ్ల రామ్మోహనరావు, తోట రామకృష్ణ, అభివృద్ధి కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
నైపుణ్యాభివృద్ధి శిక్షణతో ఆర్థికాభివృద్ధి
అత్తిలి : యువత, మహిళలు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని రిటైర్డ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఐఏఎస్), ఉదయం ట్రస్టు చైర్మన్ ఓగిరాల చాయారతన్ అన్నారు. కొమ్మరలో నెలకొల్పిన ఓగిరాల వెంకటాచలం విజ్ఞాన కేంద్రంలో వృత్తి శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం గ్రామ సర్పంచ్ మంతెన బంగారమ్మ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చాయారతన్ మాట్లాడుతూ తాను పుట్టిన ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నానని, స్మార్ట్ విలేజ్గా తీర్చిదిద్దడానికి అవసరమైన వనరులను సమకూరుస్తున్నట్టు చెప్పారు. ఉదయం ట్రస్టు ద్వారా గ్రామంలో మహిళలకు కుట్లు, అల్లికలు, టైలరింగ్ తదితర అంశాలలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. విజ్ఞాన కేంద్రంలో డిగ్రీ, ఇంజినీరింగ్ చేసిన విద్యార్థులకు పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణను చెన్నై నుంచి ఐఐటీ విద్యార్థులచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గ్రామ సర్పంచ్ మంతెన బంగారమ్మ, గోపాలకృష్ణంరాజు దంపతులను, ఉపాధ్యాయులను ఆమె సన్మానించారు. ఎంపీడీవో ఆర్.విజయరాజు, సదరన్స్ రైల్వే చీఫ్ ఇంజినీర్ రాజశేఖర్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్, తహసీల్దార్ జి.కనకరాజు పాల్గొన్నారు. -
పర్యాటక రంగ అభివృద్ధికి కృషి
యలమంచిలిలంక (యలమంచిలి) : రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యాటకం అభివృద్ధికి ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తున్నట్టు రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ శ్రీకాంత్ చెప్పారు. యలమంచిలిలంకలోని పాలవెల్లి రిసార్ట్స్లో శనివారం జరిగిన కోనసీమ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్లో ఆయన మాట్లాడారు. పర్యాటకాన్ని ప్రోత్సాహించి ఇతర దేశాల, రాష్ట్రాల పర్యాటకులను ఆకర్షించడం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడం లక్ష్యమన్నారు. గతేడాది రాష్ట్రంలో పర్యాటక రంగంలో 6.9 శాతం వృద్ధి రేటు సాధించామని, దానిని 10 శాతానికి పెంచడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. పర్యాటకం అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలు ఉన్న విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న ఇన్వెస్టర్లకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ కాంటంనేని భాస్కర్ మాట్లాడుతూ జాతీయ రహదారులు అందుబాటులో ఉన్న ప్రాంతంలో పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందన్నారు. మన జిల్లా మీదుగా మూడు జాతీయ రహదారులు, రెండు రాష్ట్ర రహదారులు వెళ్లడం అదృష్టమన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుని పర్యాటక ప్రాజెక్టులు పెట్టే పారిశ్రామిక వేత్తలకు కావాలి్సన అనుమతులు వారం రోజుల్లో మంజూరుచేస్తామని చెప్పారు. జిల్లాలో 2.7 లక్షల ఎకరాల్లో ఉద్యాన తోటలున్నాయని వాటిని సద్వినియోగం చేసుకునే ప్రాజెక్టులు చేపడితే అవి విజయవంతమవుతాయన్నారు. కార్యక్రమంలో ఏపీపీసీసీఐఎఫ్ చైర్మన్ కె.లక్ష్మీనారాయణ, పశ్చిమ బెంగాల్ అటవీశాఖ అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ టీవీఎ న్ రావు, ఏపీ టీడీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్కండేయులు, చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు ముత్తవరపు మురళీకృష్ణ, జి.సాంబశివరావు, కేవీఎస్ ప్రకాష్, పొట్లూరి భాస్కరరావు, పాలవెల్లి రిసార్ట్స్ ప్రతినిధి సుధారాణి, నరసాపురం సబ్కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం ఆర్డీవోలు బి.శ్రీనివాసరావు, ఎస్.లవణ్, గోవా, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన పర్యాటక రంగ ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. -
పట్టిసంలో కొనసాగిన రద్దీ
పోలవరం రూరల్(పోలవరం) : పట్టిసం మహాశివరాత్రి ఉత్సవాలకు రెండో రోజు కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి శనివారం ఉదయం పట్టిసం చేరుకుని లాంచీలపై నది దాటి పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకున్నారు. భక్తులు స్నానాలు చేసే చోట సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో భక్తులు ఎక్కడపడితే అక్కడ స్నానాలు చేశారు. ఒక వ్యక్తి స్నానం చేస్తూ సమీపంలోని గోతిలోకి జారిపోతున్న సమయంలో అక్కడున్న వారు రక్షించడంతో ప్రమాదం తప్పింది. శుక్రవారం రాత్రి ఇసుక తిన్నెలు యాత్రికులతో కిటకిటలాడాయి. ఒకదశలో క్యూలై న్ను అదుపు చేసేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. 10 గంటలకే నిలిచిన ఆర్టీసీ బస్సులు ఉత్సవాల సందర్భంగా మూడు రోజులు ఆర్టీసీ బస్సులు నడుపుతామని అధికారులు ప్రకటించినప్పటికీ శనివారం ఉదయం 10 గంటలకే బస్సులు నిలిచిపోయాయి. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వీరేశ్వరస్వామిని దర్శించుకుని తిరిగి ఆటోలో గమ్యం చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. విధులకు హాజరైన వివిధ శాఖల సిబ్బంది, పోలీసులు ఉదయం నుంచి వెనుదిరిగారు. సుమారు లక్ష మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా వేదపండితులను ఉత్సవ కమిటీ చైర్మ న్ ఆర్డీఓ ఎస్.లవన్న ఘనంగా సత్కరించారు. -
శాంతి కల్యాణంలో పాల్గొన్న హీరో సునీల్
దేవరపల్లి (ద్వారకాతిరుమల) : ధన్వంతరీ సంపుటిత జ్వాలా నరసింహ సుదర్శన మహాయజ్ఞం ముగింపును పురస్కరించుకుని సుందరగిరిపై నృసింహ క్షేత్రంలో శనివారం ఉదయం శాంతి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన సుదర్శన మహాయజ్ఞంలో సినీ హీరో సునీల్ పాల్గొని యజ్ఞక్రతువును నిర్వహించారు. ఈ యజ్ఞం శనివారం తెల్లవారుజామున జరిగిన మహాపూర్ణాహుతితో ముగిసింది. అనంతరం రుత్వికులు, పండితులు సాలిగ్రామాలను అభిషేకించారు. మంగళకర శాంతి మంత్రాలతో రుద్రం, రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. -
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం
కొవ్వూరు : పట్టణంలో రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలను జిల్లా అదనపు సెషన్స్ జడ్జి వైవీఎస్జీబీ పార్ధసారథి శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు. గౌతమీ స్పోర్ట్స్ అండ్ కల్చలర్ అసోసియోషన్ పదేళ్లుగా పోటీలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. రానున్న రోజుల్లో జాతీయస్థాయి పోటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. క్రీడాకారులు ఇటువంటి టోర్నమెంటులను సద్వినియోగ పరచుకుని జాతీయస్థాయిలో రాణించాలని సూచించారు. అసోసియోషన్ అధ్యక్షుడు పరిమి హరిచరణ్ మాట్లాడుతూ పదిహేనేళ్లుగా రాష్ట్రస్థాయి పోటీలతో పాటు వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. తమ అసోసియోషన్ వద్ద శిక్షణ పొందిన ఎంతో మంది క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణిస్తున్నారన్నారు. ఆర్డీవో బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కొవ్వూరులో క్రీడలను ప్రోత్సహించే ఔత్సహికులుండడం అభినందనీయం అన్నారు. శాశ్వత క్రీడా సదుపాయాలు ఏడాదిలో సమకూరే అవకాశం ఉందన్నారు. కొవ్వూరులో స్టేడియం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. వచ్చే ఏడాదికి గ్రౌండ్ సమస్య తీరుతుందన్నారు. అసోసియోషన్ కార్యదర్శి సూరపనేని చిన్ని, వైస్ చైర్మన్ దుద్దుపూడి రాజారమేష్, బ్యాడ్మింటన్ అసోసియోషన్ కార్యదర్శి పొట్రు మురళీకృష్ణ, టీడీపీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు పొట్రు శ్రీనివాసరావు, నాయకులు సూర్యదేవర రంజిత్, బొబ్బా సుబ్బారావు మాట్లాడారు. అనంతరం అతిథులు సర్వీసు చేసి పోటీలను ప్రారంభించారు. ప్రకాశం, కృష్ణ జిల్లా జట్లు తొలిమ్యాచ్లో తలపడ్డాయి. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు జాతీయ చీఫ్ రిఫరీ డి.నేతాజీ తెలిపారు. నేషనల్ రిఫరీలు బి.శ్రీనివాసరావు, పి.సుబ్బారెడ్డి, రాష్ట్రస్థాయి రిఫరీలు ఆర్.సురేష్, ఎస్కే మస్తాన్ వలీ, కె.రామ్కుమార్ ఎంఫైర్లుగా వ్యవహరిస్తున్నారు. నాయకులు పరిమి రామకృష్ణ, పరిమి రాజేష్, పోలవరం ప్రాజెక్టు డీఈఈ ఎన్ పీ రాజేశ్వరరావు పాల్గొన్నారు. -
డ్వాక్రా వసూళ్లపై విచారణ
పాలకోడేరు: పసుపు, కుంకుమ పేరిట డ్వాక్రా మహిళలకు ఇస్తున్న సొమ్ములకు కమీషన్లు గుంజుతున్న వైనంపై ‘సాక్షి’లో ప్రచురించిన ‘పిండేస్తున్నారు’ కథనానికి డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసులు స్పందించారు. దీనిపై విచారణకు ఏరియా కో–ఆర్డినేటర్ సూరజ్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కో–ఆర్డినేటర్ సూరజ్ పాలకోడేరు మండలంలో డ్వాక్రా మహిళలను శనివారం విచారించారు. మోగల్లు, పాలకోడేరు తదితర గ్రామాల్లో డ్వాక్రా గ్రూపుల నుంచి రూ.1,300 వసూలు చేశారనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ విషయంపై పలువురు మహిళలు ఆయన వద్ద మొరపెట్టుకున్నట్టు తెలిసింది. మరో రెండు రోజులపాటు విచారణ చేస్తామని, సమగ్ర నివేదికను డీఆర్డీఏ పీడీకి అందిస్తామని చెప్పారు. విచారణలో ఐకేపీ సీసీ కుమారి, మండల సమాఖ్య అధ్యక్షురాలు సుజాత, యానిమేటర్లు, గ్రామ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న నల్లజర్ల రోడ్డు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : ఏలూరుకు చెందిన గరికపాటి ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో 5వ వార్షిక నాటిక పోటీలు సందేశాత్మక ప్రదర్శనలతో ఆహూతులను ఆకట్టుకున్నాయి. స్థానిక వైఎంహెచ్ఏ హాలులో రెండోరోజు శనివారం ప్రదర్శించిన నాటికల్లో నల్లజర్ల రోడ్డు, కృష్ణబిళం, దగ్ధగీతం నాటికలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిట్ ఆఫీసర్ పి.సీతారామారావు, నగరపాలక సంస్థ కమిషనర్ వై.సాయిశ్రీకాంత్, గుప్త విద్యా దివ్యజ్ఞాన సమాజం అధ్యక్షుడు తల్లాప్రగడ సుబ్బారావు, గరికపాటి సంస్థ అధ్యక్షుడు గరికపాటి కాళిదాసు, మైలవరపు గురుశర్మ తదితరులు పాల్గొన్నారు. -
మీనం.. మృత్యుతీరం
నరసాపురం రూరల్ : జిల్లాలోని తీర ప్రాంతం మృత్యు చేపలతో నిండిపోతోంది. భారీ సంఖ్యలో చేపలు కొట్టుకువస్తున్నాయి. కొద్దిరోజుల కిందట చెన్నై సమీపంలో రెండు నౌకలు ఢీ కొనడంతో చమురు భారీగా సముద్రంలో కలవడంతో జలాలు కలుషితమయ్యాయి. చమురు ప్రభావానికి సముద్రంలోని చేపలు భారీగా చనిపోయి కొట్టుకువస్తున్నాయి. నాలుగు రోజుల కిందట డాల్ఫిన్ లు, తాబేళ్లు కొట్టుకురాగా శనివారం భారీసంఖ్యలో చేపలు కొట్టుకొచ్చాయి. అంతేకాకుండా శనివారం మత్స్యకారుల ఐలు వలకు టన్నుల కొద్దీ మత్స్యసంపద చిక్కడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వీటిలో ఎక్కువ శాతం జెల్ల, గొరక జాతులకు చెందిన చేపలు ఉన్నట్టు మత్స్యకారులు తెలిపారు. వేములదీవి పెద్ద ఐలు వలకు చిక్కిన చేపలను రూ.1.5 లక్షలకు, మరో వలకు చిక్కిన చేపలను రూ.90 వేలకు విక్రయించారు. వీటిని కేవలం ఫీడ్ తయారీకి ఉపయోగిస్తారని తెలిపారు. కొట్టుకొచ్చిన చేపలతో తీరంలో దుర్వాసన వెదజల్లుతోంది. -
పరిశ్రమల స్థాపనకు రుణాలు
ఏలూరు (మెట్రో): జిల్లాలో నిరుద్యోగులు చిన్నతరహా పరిశ్రమలను స్థాపించేందుకు రు.25 లక్షల వరకు రుణాలు మంజూరు చేయనున్నట్టు బీసీ కార్పొరేష న్ ఈడీ ఎ న్ .పుష్పలత చెప్పారు. కలెక్టరేట్లోని గోదావరి కాన్ఫెరెన్స్ హాల్లో రెండురోజుల పాటు ఎంటర్పెన్యూర్ అభివృద్ధి కార్యక్రమాన్ని (ఈడీపీ) నిర్వహించారు. శనివారం ఈడీ పుష్పలత మాట్లాడుతూ లబ్ధిదారులు తమ వాటాగా రూ.5 లక్షలు, బ్యాంకు రుణంగా రూ.10 లక్షలు, సబ్సిడీగా రూ.10 లక్షలతో పరిశ్రమలు స్థాపించవచ్చన్నారు. నాబ్కా న్స్ ,మెప్డా ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో టి.శ్రీనివాసరావు, ప్రదీప్చంద్, ప్రమీలారాణి పాల్గొన్నారు. -
షార్ట్ఫిల్మ్స్పై ఆసక్తి చూపండి
పాలకొల్లు సెంట్రల్ : విదేశాల్లో ఇద్దరు తెలుగువాళ్లు కలిస్తే ఇంగ్లిష్లో మాట్లాడుకుంటారు.. అదే ఇద్దరు తమిళులు కలిస్తే తమిళంలోనే మాట్లాడుకుంటారు.. ఇది తెలుగు భాషకు మనవాళ్లు ఇచ్చే గౌరవమని దర్శకుడు వీరశంకర్ అన్నారు. శనివారం స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్లో క్షీరపురి అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవ కమిటీ, లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో సినిమా రంగంపై విద్యార్థులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. యువత తెలుగు భాషను మర్చిపోతే భవిష్యత్లో తెలుగు సినిమాలు చూడలేమని, సంకరజాతి సినిమాలే వస్తాయని శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సినిమా రంగంలో 25 శాతం మంది కళాకారులు పాలకొల్లు నుంచి వచ్చినవారే ఉన్నారని, కళారంగానికి క్షీరపురి పుట్టినిల్లు వంటిదన్నారు. యువత షార్ట్ఫిల్మ్స్పై ఆసక్తి చూపాలని, దీనిలోనూ మంచి ఆదాయం వస్తుందని సూచించారు. యూ ట్యూబ్లో రోజుకు 200 షార్ట్ ఫిల్్మలు అప్లోడ్ అవుతున్నాయని చెప్పారు. దర్శకులు సముద్రాల రఘునా«థ్, ఆకుమర్తి బాబూరావు దర్శకత్వం, స్క్రీన్ప్లే, కథా రచనలపై విద్యార్థులకు వివరించారు. కెమెరామెన్ ధనిశెట్టి రాంబాబు ఫొటోగ్రఫీలోని మెలకువల తెలిపారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దర్శకులకు సన్మానం చేశారు. చిత్రోత్సవ కమిటీ చైర్మన్ ముత్యాల శ్రీనివాస్, కన్వీనర్ డాక్టర్ కేఎస్పీఎన్ వర్మ, క్లబ్ సభ్యులు కొమ్ముల ముర ళి, రేపాక ప్రవీణ్భాను, చాంబర్స్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
పాలకొల్లులో దక్షిణ భారత ఆర్ట్ ఎగ్జిబిషన్
పాలకొల్లు సెంట్రల్ : స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాలు నందు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దక్షిణ భారత చిత్రకారులచే చిత్రకళా ప్రదర్శన క్యాంపు ఏర్పాటు చేశారు. శనివారం ప్రారంభించిన ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్టు క్లబ్ అధ్యక్షులు అధికారి కృష్ణ తెలిపారు. వడ్డాది పాపయ్య, బాపుల పేరున వపా బాపు ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపకుడు డి. రామకృష్ణారావు నిర్వహణలో ఈ ప్రదర్శనను ఏర్పాటుచేశారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు వేసిన చిత్రాలు చూపరులను ఆకట్టుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ చిత్రకళాకారులు ఇంత దూరం వచ్చి పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా మద్రాసుకు చెందిన లెటరింగ్ ఆర్టిస్ట్ అంకయ్యను ఘనంగా సన్మానించారు. లయన్స్ క్లబ్ సెక్రటరీ బోడా చక్రవర్తి, ట్రెజరర్ పాటపళ్ల ప్రసాద్, ఎన్వీఎస్ఎస్ పాపారావునాయుడు, కొమ్ముల మురళి, వపాబాపు ఆర్ట్ అకాడమీ సెక్రటరీ కొత్తపల్లి శ్రీను, గొన్నాబత్తుల సత్యనారాయణ, ముగడ నాగేశ్వరరావు, రావూరి అప్పారావు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా 5 కే మినీ ర న్
నరసాపురం :నరసాపురం 7 ఆంధ్రా నేవల్ యూనిట్ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో 5కే మినీ మారథా న్ ర న్ నిర్వహించారు. పీచుపాలెం నుంచి వలంధర్రేవు మీదుగా ఉత్సాహంగా ర న్ జరిగింది. కార్యక్రమాన్ని వైఎ న్కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీసీఎస్ అప్పారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నేవల్ యూనిట్ కమాండర్ కెప్టె న్ కె.చంద్రశేఖర్ మాట్లాడుతూ 68వ రిపబ్లిక్ డే వేడుకలను ప్రతి ఒక్కరికీ తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని, ఇలాంటి కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనాలని కోరారు. నేవల్, ఎ న్సీసీ అధికారులు ఏఆర్ఎస్ కుమార్, కె.వెంకటేశ్వర్లు, వైఎ న్వీవీఆర్ రామారావు, ఎస్ఎ న్ సింగ్, ఎం.రాము, 60 మంది క్యాడెట్లు పాల్గొన్నారు. -
రేపటి నుంచి జాతీయస్థాయి కబడ్డీ పోటీలు
నరసాపురం : స్థానిక రుస్తుంబాద కబడ్డీ స్టేడియంలో శనివారం నుంచి 18వ తేదీ వరకూ జాతీయస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 22 సంవత్సరాలుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మొత్తం దేశవ్యాప్తంగా 25 జట్లు పోటీలకు హాజరుకానున్నాయని గురువారం విలేకరుల సమావేశంలో పోటీల కన్వీనర్ కొత్తపల్లి జానకీరామ్ తెలిపారు. కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.రంగారావు మాట్లాడుతూ ఇండియా తరఫున ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించిన ఆంధ్రా జట్టు మహిళా క్రీడాకారిణులు కె.గౌరి, కె.గాయత్రి, కేఎన్వీ దుర్గ ఈ ఏడాది మ్యాచ్లకు అదనపు ఆకర్షణగా ఉంటారని చెప్పారు. ఫ్లడ్లైట్ల వెలుగుల్లో లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తామన్నారు. గెలుపొందే జట్లకు రూ 5 లక్షలు ప్రైజ్మనీ అందిస్తామన్నారు. -
కువైట్లో చాకిబండ వాసి మృతి
చిన్నమండెం(రాయచోటి రూరల్): చిన్నమండెం మండల పరిధిలోని చాకిబండ గ్రామం బలిజపల్లెకు చెందిన పి. నాగరాజ(38) శనివారం కువైట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు అతని సమీప బంధువులు పేర్కొన్నారు. జీవనోపాధి కోసం కువైట్కు వెళ్లి, నిత్యం కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వస్తున్న వ్యక్తి ఆకస్మికంగా రోడ్డుప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, భార్య లక్ష్మీ కన్నీరుమున్నీరయ్యారు. బుధవారం స్వగ్రామం బలిజపల్లెలో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మృతి చెందడంతో భార్య, పిల్లలు దీపక(8), రిషిక(4), శ్రీహాన్(2)లు ఆదరణ కోల్పోయారు. ప్రభుత్వం సాయం అందించి కుటుంబానికి అండగా ఉండలాని పలువురు కోరుతున్నారు. -
ముగిసిన కోటసత్తెమ్మ తిరునాళ్లు
నిడదవోలు : మండలంలోని తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న కోట సత్తెమ్మ అమ్మవారి తిరునాళ్లు ఉత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయం వద్ద చండీ పారాయణ, సాయంత్రం చండీ హోమం, ఊయల సేవ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో రాత్రి గరగనృత్యాలు, పూల గరగలు ఆకట్టుకున్నాయి. తణుకు పట్టణానికి చెందిన అంబికా డా¯Œ్స అకాడమీ ఆధ్వర్యంలో చిన్నారులు కూచిపూడి నృత్యాలు చేశారు. కనక తప్పెట్లు, తాసమరపాలు, రామడోలు, వీరణం, రాజరాజేశ్వరి, కాళీమాత నృత్య ప్రదర్శనలు, కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఘనంగా బాణా సంచా కాల్చారు. కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ దేవులపల్లి రామసుబ్బరాయశాస్త్రి, ఈవో యాళ్ల శ్రీధర్, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. -
పారిజాతగిరిలో తిరుప్పావై ప్రవచనం
జంగారెడ్డిగూడెం : గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ధనుర్మాసం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి తిరుప్పావై ప్రవచనం, బాలభోగ నివేదన, తీర్థ ప్రసాద గోష్టి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో అర్చకస్వాములు ఈ కార్యక్రమాలను జరిపించినట్టు ఆలయ చైర్మన్ బిక్కిన సత్యనారాయణ తెలిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు జంగారెడ్డిగూడెంకు చెందిన పోల్నాటి శ్రీను, పిల్లి శ్రీను, సింగంశెట్టి రామాంజనేయుల దంపతులు అన్నప్రసాద వితరణ చేశారు. ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
దేవాదాయశాఖ ఈఓల బదిలీ
కడప కల్చరల్ : జిల్లాలోని పలువురు దేవాదాయ, ధర్మాదాయశాఖ ఈఓలను బదిలీ చేశామని అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య తెలిపారు. తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జె.రవిశేఖర్రెడ్డిని మైదుకూరుకు గ్రేడ్–2 నుంచి గ్రేడ్–1 ఈఓగా బదిలీ చేశామన్నారు. కర్నూలుజిల్లా నుంచి మన జిల్లాకు కేటాయించిన ముగ్గురు ఈఓలలో మహేశ్వర్రెడ్డిని గ్రేడ్–3 నుంచి గ్రేడ్–2కు బదిలీ చేశామన్నారు. వేంపల్లె ఎద్దుల కొండ ఈఓ ఎస్ఏ ప్రతాప్ను గ్రేడ్–2 నుంచి అక్కడే గ్రేడ్–1గా నియమించామన్నారు. ప్రొద్దుటూరుకు చెందిన బి.చంద్రశేఖర్రెడ్డి అక్కడే ముక్తిరామేశ్వరం, వెంకట సుబ్బయ్య సత్రం ఈఓగా నియమించామన్నారు. జి.వెంకట సుబ్బయ్యను సీకే దిన్నె గంగమ్మ ఆలయ ఈఓగా నియమించామన్నారు. టి.మద్దిలేటిని ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, హనుమంతేశ్వర ఆలయాలకు ఈఓగా నియమించామన్నారు. అనంతపురం నుంచి వచ్చిన ఇద్దరు ఈఓలలో బీఆర్ వెంకటేశ్వరరావును ప్రొద్దుటూరు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్కు ఈఓగా నియమించామని వెల్లడించారు. -
ముగిసిన బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
చాగల్లు : స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన అంతర జిల్లాల అండర్–17 స్కూల్ గేమ్స్ బాలబాలికల బాల్ బ్యాడ్మింటన్ పోటీలు శనివారంతో ముగిశాయి. బాలుర విభాగంలో ప్రథమస్థానంలో తూర్పు గోదావరి జిల్లా జట్టు, ద్వితీయస్థానంలో విశాఖపట్టణం, తృతీయస్థానంలో గుంటూరు, నాలుగోస్థానంలో విజయనగరం జట్లు నిలిచాయి. బాలికల విభాగంలో విశాఖపట్టణం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లా జట్లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచాయి. ముగింపు కార్యక్రమానికి మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యే కేఎస్ జవహర్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఏఎంసీ చైర్మన్ ఆళ్ల హరిబాబు, ఎంపీపీ కోడూరి రమామణి, సర్పంచ్లు జొన్నకూటి వెంకాయమ్మ, ఓబా దుర్గ, స్కూల్ గేమ్స్ జిల్లా ఆర్గనైజేషన్ కార్యదర్శి సాయి శ్రీనివాస్, పోటీల ఆర్గనైజింగ్ కార్యదర్శి సీహెచ్ సతీష్కుమార్, కె.రామ్కుమార్, పీఈటీలు పాల్గొన్నారు. -
పాలిటెక్నిక్ క్రీడా పోటీలు ప్రారంభం
నరసాపురం రూరల్ : మండలంలోని స్వర్ణాంధ్ర విద్యా సంస్థల ప్రాంగణంలో శనివారం 21వ అంతర పాలిటెక్నికల్ జిల్లా స్థాయి క్రీడాపోటీలు ఘనంగా ప్రారంభం అయ్యా యి. తొలుత ఈ పోటీలను ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, మున్సిపల్ చైర్ పర్స న్ రత్నమాల క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంబించారు. కాకినాడకు చెందిన టెక్నికల్ ఎడ్యుకేషన్ రీజనల్ డైరెక్టర్ జె. సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ డిపార్డ్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రా యూనివర్సిటీ రీజనల్ డైరెక్టర్ కాకినాడ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీలకు జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన 600 మంది విద్యార్థులు హాజరయ్యారు. మూడు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించనున్నారు. సర్పంచ్ అడబాల అయ్యప్పనాయుడు, ప్రిన్సిపాళ్లు శ్రీనివాసకుమార్, తెన్నేటి మధు, పోలిటెక్నికల్ కో–ఆర్డినేటర్ సత్యనారాయణ, వ్యాయామోపాధ్యాయులు, కే ఎస్వీస్ఎస్ మూర్తి, వి.జయచంద్ర, పి.నరసింహరాజు, కుమార్రాజు, నర్సింహరావు, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
భక్తజన సంద్రం.. చిన తిరుపతి క్షేత్రం
ద్వారకా తిరుమల : శ్రీవారి దివ్యక్షేత్రం శనివారం భక్తులతో కిక్కిరిసింది. అలాగే నూతన వధువరులతో కళకళలాడింది. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున ముహూర్తాల్లో వివాహాలు జరుపుకున్న నూతన వధూవరులు, వారి బంధువులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకోవడంతో సందడి నెలకొంది. దాదాపు 20 వేల మందికి పైబడి భక్తులు స్వామివారిని దర్శించినట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాధరావు తెలిపారు. 5 వేల మందికిపైగా యాత్రికులు స్వామివారి ఉచిత అన్న ప్రసాదాన్ని స్వీకరించినట్టు చెప్పారు. తిరుమల తిరుపతి దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు ప్రాంతాలకు చెందిన భజనమండళ్లు ఆలయ పరిసరాల్లో నిర్వహించిన కోలాట భజనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలోని శ్రీహరి కళాతోరణ వేదికపై కోలాటాలు నిర్వహించారు. -
దివ్యాంగుల పింఛన్లకు రూ.805 కోట్లు
తాడేపల్లిగూడెం రూరల్ : రాష్ట్రంలో దివ్యాంగులకు ఏటా రూ.805 కోట్లతో పింఛన్లు అందిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. శనివారం స్థానిక సుబ్బారావుపేట ఎలిమెంటరీ మునిసిపల్ పాఠశాలలో సర్వశిక్షాభియాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో మంత్రి మాణిక్యాలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రూ.72 కోట్లు ఏటా పింఛన్లుగా అందిస్తున్నామన్నారు. విభిన్న ప్రతిభావంతులను సకలాంగులు వివాహం చేసుకుంటే రూ. 50 వేలు ప్రోత్సాహకంగా అందిస్తున్నట్టు చెప్పారు. మునిసిపల్ పాఠశాలలో ప్రత్యేక గది, ప్రత్యేక మరుగుదొడ్డి ఏర్పాటుకు తల్లిద్రండులు కోరగా మంత్రి స్పందించి వెంటనే ప్రత్యేక గదులు, మరుగుదొడ్డి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అంగవైకల్యం పొందిన పిల్లలను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. ఎస్ఎస్ఏ పీవో బ్రహ్మానందరెడ్డి, దత్త విశ్వరూప సమితి అధ్యక్షుడు వలవల సూరిబాబు మాట్లాడారు. అనంతరం మంత్రి మాణిక్యాలరావు కేక్ కట్ చేసి పిల్లలకు తినిపించారు. ఎంపీపీ గన్నమని దొరబాబు, ఎంపీడీవో వై.దోసిరెడ్డి, మండల యువమోర్చా అధ్యక్షుడు వన్నెంరెడ్డి నవీన్కుమార్ పాల్గొన్నారు. -
జిల్లాకు రూ.160కోట్లు రాక
సాక్షి, కడప : ప్రస్తుతం పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో జిల్లాను నగదు కొరత వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి కానీ, శనివారం ఉదయంలోపు దాదాపు రూ.160కోట్లు జిల్లాకు వస్తున్నాయి. శనివారం ఆ నగదు వచ్చిన తర్వాత పరిస్థితిని బట్టి బ్యాంకులకు ఆ మొత్తాలను సరఫరా చేయనున్నారు. జిల్లాకు రూ.160కోట్లు వస్తున్నట్లు ఎల్డీఎం లేవాకు రఘునాథరెడ్డి సాక్షికి స్పష్టం చేశారు. అయితే ఈ మొత్తం వస్తే కొంత ఊరట లభించవచ్చన్నారు. రూ. 2,103 కోట్లకు చేరిన డిపాజిట్లు నవంబర్ 8వ తేదీన ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో రూ.2103 కోట్లు డిపాజిట్లు జరిగాయి. అయితే బ్యాంకు అధికారులు అప్పటినుంచి ఇప్పటివరకు రూ. 953కోట్లను ప్రజలకు పంపిణీ చేశారు. శుక్రవారం కూడా రూ.35కోట్లు డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు మొత్తం రాగా.. మరో రూ. 32కోట్లు బ్యాంకు అధికారులు ఉద్యోగులకు, పెన్షనర్లకు, ప్రజలకు పంపిణీ చేశారు. ఈ విషయాన్ని ఎల్డీఎం రఘునాథరెడ్డి నిర్ధారించారు. -
మద్ది అంజన్నకు ప్రత్యేక పూజలు
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి లక్ష తమలపాకులతో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు కల్యాణ పూజలను వేదమంత్రాలతో జరిపారు. తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి దేవస్థానం ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు, హైమా పార్వతి దంపతులు, వీరి కుమార్తెలు తులసి లక్ష్మి, హైదరాబాద్కు చెందిన కనుమూరి రఘురామ కృష్ణంరాజు, రమాదేవి దంపతులు స్వామివారికి తమలపాకులతో పూజలు జరిపారు. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. జంగారెడ్డిగూడెంకు చెందిన వనపర్తి సుబ్బారావు జ్ఞాపకార్థం వారి కుమారుడు వనపర్తి శ్రీనివాసరావు, రమాదేవి దంపతులు, బచ్చు రామమోహనరావు, వెంకట లక్ష్మి దంపతులు, బయ్యనగూడెంకు చెందిన సందక శ్రీనివాసులు, సూర్యకుమారి దంపతులచే అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక్కరోజు ఆదాయం రూ. 1,87,710 వచ్చినట్టు ఈవో పెన్మెత్స విశ్వనాథ రాజు తెలిపారు. ఆలయ చైర్మ¯ŒS ఇందుకూరి రంగరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మద్దిలో నేడు : మద్దిక్షేత్రంలో ఆదివారం ఆంజనేయస్వామికి సువర్చలా హనుమద్ కల్యాణం నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటలకు కల్యాణం ప్రారంభమవుతుందన్నారు. -
గోష్పాద క్షేత్రంలో జ్వాలాతోరణం
కొవ్వూరు: కార్తీక పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని ఏటిగట్టుపై ఉన్న అన్నపూర్ణ, విశాలాక్షి సమేత కాశీవిశ్వేశ్వరస్వామి పంచాయతన శివాలయంలో సోమవారం ప్రత్యేక మంచులింగం ఏర్పాటు చేయనున్నట్టు ఆలయ నిర్వాహకులు మల్లిన సత్యనారాయణ తెలిపారు. సాయంత్రం 5 నుంచి భక్తుల దర్శనం కోసం అందుబాటులో ఉంచుతామన్నారు. గోదావరికి నీరాజనం, జ్వాలాతోరణం కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం స్వామి వారికి ఊరేగింపు ఉంటుంది. గోష్పాదlక్షేత్రంలోని సుందరేశ్వరస్వామి ఆలయంలో సాయంత్రం జ్వాలాతోరణం నిర్వహించనున్నట్టు ఆలయ నిర్వాహకులు మానేపల్లి శ్రీనివాసమూర్తి తెలిపారు. ఆలయంలో స్వామి వారికి విశేష పూజలతో పాటు పల్లకీ సేవ నిర్వహిస్తామని సత్యనారాయణ చెప్పారు. -
నేత్రపర్వం.. శ్రీవారి విహారం
ద్వారకా తిరుమల : సుదర్శన పుష్కరణిలో హంస వాహన రూరుడైన చినవెంకన్న ఉభయ దేవేరులతో కలసి శనివారం రాత్రి విహరించారు. క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ తెప్ప ఉత్సవం భక్తులకు నేత్రపర్వమైంది. మిరమిట్లు గొలిపే విద్యుద్దీప కాంతులు, డప్పు వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణలు, అర్చకులు, పండితుల వేదమంత్రోచ్ఛరణల నడుమ ఈ ఉత్సవం భక్తులకు కనువిందు చేసింది. ముందుగా తొళక్కవాహనంపై ఉయభదేవేరులతో శ్రీవారిని ఉంచి, ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా వాహనం క్షేత్ర పురవీధులకు పయనమైంది. తిరువీది సేవ అనంతరం వాహనాన్ని సుదర్శన పుష్కరణి వద్దకు అట్టహాసంగా తీసుకొచ్చారు. దేదీప్యమానంగా వెలుగొందుతున్న పుష్కరణిలో హంసవాహనంగా అలంకరించిన తెప్పలో స్వామి, అమ్మవార్లను ఉంచారు. ఆలయ చైర్మ¯ŒS ఎస్వీ సుధాకరరావు, ఈవో వేండ్ర త్రినాథరావు కుటుంబ సమేతంగా పాల్గొని తెప్పలో ఉభయ దేవేరులతో కొలువుదీరిన చినవెంకన్నకు విశేషపూజలు జరిపారు. అనంతరం భక్తుల గోవింద నామస్మరణల నడుమ స్వామివారు పుష్కరణిలో వహించారు. పుష్కరణి మద్యలో ఉన్న మండపంలో శ్రీవారిని, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లను ఉంచి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. కొత్త జంటలతో కళకళలాడిన క్షేత్రం శ్రీవారి క్షేత్రం శనివారం భక్తజన సంద్రంగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. క్లోక్ రూములు నిండిపోవడంతో యాత్రికుల బ్యాగులను అనివేటి మండపంలో భద్రపరిచారు. క్షేత్రంలో శనివారం తెల్లవారుజామున వివాహాలు అధికంగా జరిగాయి. కొత్త జంటలు, వారి బంధువులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.2.02 లక్షల విరాళం ద్వారకా తిరుమల : శ్రీ వారి నిత్యాన్నదాన ట్రస్టుకు ఇద్దరు భక్తులు వేర్వేరుగా రూ.2,02,232లను శనివారం విరాళంగా అందించారు. భీమవరానకి చెందిన మోహ¯ŒSదాస్ అనే భక్తుడు గంధం వెంకట విశ్వేశ్వరరావు, వెంకట ఉష దంపతుల పేరున రూ.1,01,116లను, కొవ్వూరుకు చెందిన ఏలూరిపాటి శ్రీరామచంద్రమూర్తి రూ. 1,01,116 విరాళాన్ని నిత్యాన్నదాన సదనంలో జమచేశారు. దాతలకు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు విరాళం బాండ్ పత్రాలను అందించి అభినందించారు. -
మద్ది అంజన్నకు ప్రత్యేక పూజలు
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి వారికి లక్ష తమలపాకులతో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు పర్యవేక్షణలో అర్చకుల బృందం ఈ పూజా కార్యక్రమాలు జరిపింది. టి.నర్సాపురం మండలం శ్రీరామవరం గ్రామానికి చెందిన బాలభక్త భజన సమాజం సభ్యులు భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు వేల మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఒక్కరోజు ఆదాయం రూ.1,62,465 లభించినట్టు ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. రావికంపాడుకు చెందిన కనుమూరి భవ్య రూ.10,116 విరాళాన్ని ఆలయానికి అందజేశారు. ఆలయ చైర్మన్ ఇందుకూరి రంగరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం మద్దిక్షేత్రంలో సువర్చలా హనుమత్ కల్యాణం నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. -
శనీశ్వర క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
మందపల్లి (కొత్తపేట) : శనిత్రయోదశి పర్వదినం సందర్భంగా కొత్తపేట మండలం మందపల్లి ఉమా మందేశ్వర క్షేత్రానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శనివారం త్రయోదశి తిధి కలిసి రావడం, శనీశ్వరునికి ప్రత్యేక పూజలు చేసి, తైలాభిషేకం జరిపితే శనిదోషం తొలగుతుందని భక్తుల విశ్వాçÜం. ప్రసిద్ధి చెందిన ఈ శనీశ్వర క్షేత్రానికి శుక్రవారం రాత్రి నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దేవస్థానం పాలక మండలి చైర్మ¯ŒS బండారు సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వెత్సా దేముళ్ళు పర్యవేక్షణలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. స్వామివారికి రూ.10,89,969 ఆదాయం వచ్చినట్టు ఏసీ అండ్ ఈఓ దేముళ్ళు తెలిపారు. పాలక మండలి సభ్యులు ఆలయ సిబ్బంది భక్తులకు సేవలందించారు. -
ఈ శని, ఆదివారాల్లో బ్యాంకులు పనిచేస్తాయ్
-
ఈ శని, ఆదివారాల్లో బ్యాంకులు పనిచేస్తాయ్
కొత్త కరెన్సీ నోట్లు నేటి నుంచే నోట్ల మార్పిడికి మరిన్ని కేంద్రాలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: దేశంలో చెలామణిలో ఉన్న పెద్ద నోట్లను మార్పు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని సదుపాయాలు కల్పించింది. నోట్ల మార్పిడిలో ప్రజలకు ఇబ్బందులు ఎదురవకుండా వచ్చే శని, ఆదివారాల్లోనూ (వాస్తవానికి రెండవ శనివారం బ్యాంకులకు సెలవు) బ్యాంకులు పనిచేసేలా ఆదేశాలు జారీచేసింది. ప్రజల తాకిడిని దృష్టిలో పెట్టుకొని వచ్చే శని, ఆదివారాల్లో బ్యాంకులు ఫుల్డే పనిచేసేలా ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతోపాటు నేడు, రేపు (గురు, శుక్రవారాల్లోనూ) సాధారణం కంటే ఎక్కువ సమయం బ్యాంకులు పనిచేయాలని ఆదేశించింది. అలాగే ఈనెల 11వ తేదీ అర్ధరాత్రి వరకు రూ.500, రూ.వెయి నోట్లను మార్చుకునేందుకు మరికొన్ని ప్రాంతాలను పెంచింది. రైల్ టికెట్లు, హైవే - రోడ్ టోల్, వైద్యుల ప్రిస్క్రిప్షన్తో ప్రభుత్వ, ప్రైవేట్ ఫార్మసీలో మందులు, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు, రైల్వే కేటరింగ్, పురావస్తు శాఖ చారిత్రక కట్టడాల ప్రవేశ టిక్కెట్ల కొనుగోలుకు కూడా పాత 500, వెయి నోట్లను వినియోగించవచ్చని తెలిపింది. తొలుత ప్రభుత్వ ఆస్పత్రులు, రైల్వే టికెట్లు, ప్రజా రవాణా, విమాన టికెట్ కౌంటర్లు, పాల కేంద్రాలు, శ్మశానాలు, పెట్రోల్ బంకుల వద్ద నోట్లను మార్చుకోవచ్చని కేంద్రం చెప్పిన సంగతి తెలిసిందే. బ్యాంకులకు కొత్త నోట్లు పాత 500/1000 నోట్లను తొలగించి కొత్త నోట్లను పెట్టేందుకు బ్యాంకులు, ఏటీఎంలను బుధవారం మూసివేశారు. రిజర్వ్ బ్యాంక్ ట్రక్కుల కొద్దీ కొత్త నోట్లను దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు, పోస్టాఫీసులకు పంపిం దని, అన్ని బ్యాంకులు గురువారం పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు వెల్లడించారు. కొన్ని ఏటీఎంల నుంచి నగదును కూడా తీసుకోవచ్చన్నారు. పెద్ద నోట్లను పూర్తిస్థాయిలో మార్చేందుకు మరో 2-3 వారాల సమయం పడుతుందన్నారు. ‘ఏటీఎం కార్డు విత్డ్రాలపై రోజుకు రూ.2వేల పరిమితి ఉంటుంది. అదే బ్యాంకు ఖాతా నుంచి అరుుతే రోజుకు రూ.10వేలు, వారానికి రూ.20 వేలు తీసుకోవచ్చు. ఈ పరిమితి కొన్ని రోజులపాటు కొనసాగుతుంది. మరింత కరెన్సీ బ్యాంకింగ్ వ్యవస్థకు చేరితే అప్పుడు ఈ పరిమితిపై పునరాలోచన చేస్తాం’ అని చెప్పారు. నోట్ల మార్పిడి వల్ల దేశ ఎకానమీ విసృ్తతమవుతుందని, రెవెన్యూ మూలాలను కూడా పెంచుతుందన్నారు. నోట్ల మార్పిడి వల్ల తొలుత ప్రజలకు ఇబ్బందులు ఎదురైనప్పటికీ దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలంలో భారీ ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు. -
విద్యుదాఘాతానికి గురై ఎలక్ట్రీషియన్ మృతి
టి.నరసాపురం : బందంచర్ల గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ ఎస్కే సుభానీ(37) విద్యుదాఘాతానికి గురై శనివారం మృతిచెందాడు. స్థాని కుల కథనం ప్రకారం సుభానీ పదేళ్లుగా రాజుపోతేపల్లిలో నివా సం ఉంటూ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నా డు. శనివారం రాజుపోతేపల్లిలోని పొలంలో మోటార్ను బాగుచేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతనిని స్థానికులు చింతలపూడి ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతిచెందాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నారు. -
మహిళా క్రికెట్ జిల్లా జట్టు ఎంపిక
దుద్దుకూరు (దేవరపల్లి) : దేవరపల్లి మండలం దుద్దుకూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో శనివారం మహిళా క్రికెట్ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని ఐదు పాఠశాలల నుంచి క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన 15 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. జట్టు కెప్టెన్గా ఎస్.శైలజదేవి(దుద్దుకూరు), వైస్ కెప్టెన్గా ఒ.హేమ ఎంపికయ్యారు. ఎస్.ప్రసన్న(దేవరపల్లి), ఎస్. మంజు(దేవరపల్లి); పి.యామిని(దుద్దుకూరు), టి.సౌజన్య(దేవరపల్లి), ఎన్.రమణ(గూటాల), పి. నాగదేవి(గూటాల), కె.బ్లెసీ(గూటాల), ఎం.శిరీష్(దుద్దుకూరు), టి.రమ్య(దేవరపల్లి), యు.రమ్య(దేవరపల్లి), ఎం.సుధశ్రీ(దుద్దుకూరు), ఎం.సంధ్యారాణి(దుద్దుకూరు), ఎం.అనూష(దుద్దుకూరు) జిల్లా జట్టుకు ఎంపికైనట్టు పీఈటీ ఓరుగంటి కృష్ణంరాజు తెలిపారు. క్రీడాకారులను ప్రధానోపాధ్యాయులు డి.ఎస్. సుబ్రహ్మణ్యం, సర్పంచ్ సౌదామణి, పీఈటీలు వి.ఎం.కల్యాణ్ కుమార్, వి.ప్రవీణ, వి.రమాదేవి, కె.వి.డి.వి.ప్రసాద్ అభినం«దించారు. -
తెలంగాణ టు తూర్పుగోదావరి వయా చింతలపూడి
చింతలపూడి: పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి అక్రమంగా రేషన్ బియ్యాన్ని దిగుమతి చేసుకుని తూర్పుగోదావరి జిల్లాలోని మిల్లర్లకు పంపించేందుకు సిద్ధం చేసిన నిల్వలను శనివారం పౌరసరఫరాల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చింతలపూడి మండలంలోని రాఘవాపురం గ్రామంలో అక్రమంగా నిల్వచేసిన 128 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. గ్రామంలోని రవి, ఆంజనేయులు అనే వ్యక్తుల ఇళ్లల్లో అక్రమంగా నిల్వచేసిన ఈ బియ్యాన్ని గ్రామస్తుల సమాచారం మేరకు దాడి చేసినట్టు పౌరసరఫరాల అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో రాఘవాపురం కేంద్రంగా చాలా కాలం నుంచి పేదల కోసం పంపిణీ చేస్తున్న సబ్సిడీ బియ్యం అక్రమంగా సేకరించి, నిల్వ చేసి ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తున్నారు. దీనిపై చాలాకాలంగా గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు అందుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాఘవాపురంలో భారీ నిల్వలను స్వాధీనం చేసుకోవడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చాకచక్యంగా తెలంగాణ నుంచి రేషన్ బియ్యాన్ని ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు. తర్వాత గుట్టుచప్పుడు కాకుండా తూర్పుగోదావరి జిల్లాలో మిల్లర్లకు పంపి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో ఇదే మాదిరిగా రాఘవాపురం నుంచి వాహనాల్లో తరలిస్తున్న బియ్యాన్ని చింతలపూడి, టి.నరసాపురం మండలాల్లో అధికారులు పట్టుకుని స్వాధీనం చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. దీనిపై తహసీల్దార్ పి.మైఖేల్రాజు మాట్లాడుతూ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని 6ఏ కేసులు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెంచామని, పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పట్టించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
సత్తా చాటిన ఫుట్బాల్ జట్లు
తాడేపల్లిగూడెం : జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా స్థానిక డాక్టర్ తేతలి సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించిన పుట్బాల్ పోటీలు శనివారం సాయంత్రం ముగిశాయి. బాలుర విభాగంలో జి.పంగిడిగూడెం ఫుట్బాల్ క్లబ్ జట్టు, సీనియర్ మెన్స్ విభాగంలో ఏలూరు, దేవరపల్లి జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. అండర్ –16 బాలుర రన్నరప్గా దేవరపల్లి పుట్బాల్ క్లబ్ నిలిచింది. విజేతలకు పట్టణ సీఐ ఎంఆర్ఎల్ఎస్ మూర్తి బహుమతులను అందజేశారు. పోటీలకు రిఫరీగా ఎన్.ఓం ఫణి వ్యవహరించారు. ఈ పోటీల ద్వారా జిల్లాలో ప్రతిభ కలిగిన వంద మంది క్రీడాకారులను ఎంపికచేసినట్టు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బెల్లంకొండ సుబ్బారావు తెలిపారు. జ్యోతి నర్సింగ్ స్కూల్ నిర్వాహకుడు దత్తు వెంకటేశ్వరరావు, ప్లో సీఈవో రాజేష్ రావూరి పాల్గొన్నారు . -
నిత్యాన్నదాన ట్రస్ట్కు రూ.5 లక్షల విరాళం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్ట్కు ఇద్దరు భక్తులు వేర్వేరుగా శనివారం రూ.5 లక్షల విరాళం అందించారు. పాలకొల్లుకు చెందిన అడ్డాల వెంకట సత్యనారాయణ రూ.4 లక్షలు తన కుటుంబసభ్యుల పేరున అందజేశారు. పెనుగొండకు చెందిన పిల్లి సత్తిరాజు, లక్ష్మీ శైలజ దంపతులు వారి పేరున రూ.లక్ష జమచేశారు. దాతలకు ఈవో వేండ్ర త్రినాథరావు విరాళం బాండ్లు అందజేసి అభినందించారు. -
శ్రీవారి పుష్కరిణికి మోక్షం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి పుష్కరిణికి ఆలయ అధికారులు మోక్షం కలిగించారు. చెత్తాచెదారం, మురుగు పేరుకుపోయి భక్తులు స్నానాలు ఆచరించేందుకు వీలులేనంతగా తయారైన పుష్కరిణి దుస్థితిపై ఈనెల 20న ‘సాక్షి’లో ’శ్రీవారి పుష్కరిణికి ఏమిగతి’ అన్న శీర్షికన ప్రచురితమైన కథనానికి దేవస్థానం అధికారులు స్పందించారు. పుష్కరిణిని శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా శనివారం పుష్కరిణి ఒడ్డున పేరుకుపోయిన చెత్తాచెదారం, కోనేరు గట్లపై ఉన్న ముళ్ల చెట్లను తొలగించారు. మెట్లదారిని, పరిసరాలను శుభ్రం చేశారు. పుష్కరిణి పవిత్రతను కాపాడేందుకు, శుభ్రంగా ఉం చేందుకు స్థానికులు సహకరించాలని ఆల య ఈవో వేండ్ర త్రినాథరావు కోరారు. స్నానాలకు వీలుగా బోరు నీటిని పుష్కరిణిలోకి తోడుతున్నామని చెప్పారు. -
నిప్పు రాజేసిన ‘ చేపల చెరువు లీజు’
ప్రత్తికోళ్లలంక (ఏలూరు రూరల్) : చేపల చెరువుల లీజు వ్యవహారం కొల్లేరు గ్రామం ప్రత్తికోళ్లలంకలో మరోసారి నిప్పు రాజేసింది. గ్రామంలో రెండు వర్గాల మధ్య తగాదా జరగడంతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటుచేశారు. ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలతో పాటు పదుల సంఖ్యలో పోలీసులు గ్రామంలో గస్తీ తిరుగుతున్నారు. గ్రామస్తుల మధ్య వివాదానికి టీడీపీ నాయకులు కేంద్ర బిందువుగా నిలిచారు. గ్రా మంలో 261 ఎకరాల వివాదస్పద చేపల చెరువులు ఉన్నా యి. వీటిలో చేపలు పట్టరాదంటూ హైకోర్టు రెండేళ్ల క్రితం ఉత్తర్వులు జారీచేసింది. వీటిని బేఖాతరు చేస్తూ కొద్దిరోజుల క్రితం టీడీపీ నాయకులు కోట్ల రూపాయల విలువ చేసే చేప లు పట్టి అమ్మేశారు. అధికారులూ చూసీచూడనట్టు వ్యవహరించారు. ఈ నేపథ్యంలో చెరువులను మళ్లీ కొత్తగా వేలం వేసేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిని కొందరు గ్రామస్తులు వ్యతిరేకించారు. వీరిని అధికారపార్టీకి చెందిన వారు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఎలాగైన చెరువుల వేలం నిర్వహించాలని భావించిన అధికార పార్టీ నేతలు పోలీసులను ఉసిగొల్పారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సమక్షంలో వేలం పా ట జరిగింది. దీనిని వ్యతిరేకిస్తున్న గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. -
సినీఫక్కీలో కారు మాయం
ద్వారకాతిరుమల (పశ్చిమగోదావరి): కారు అద్దెకు తీసుకుని వచ్చిన ప్రయాణికులు డ్రైవర్కు మస్కా కొట్టి అతడి వద్ద ఉన్న సొత్తుతో పాటు కారునే దొంగిలించిన సంఘటన ద్వారకాతిరుమలలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, బా ధిత డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం ఉమ్మి గ్రామానికి చెందిన దాసరి వెంకట్రావు తన ఏపీ 30 కే 2703 నెంబర్ గల టాటా ఇండికా కారును కిరాయికి నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రాజాం నుంచి గుంటూరు వెళ్లాలని తన పేరు క ల్లూరి జగదీశ్ అని చెప్పిన ఓ వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో శుక్రవారం ఇదే కారులో గుంటూరు బయలుదేరారు. మార్గమధ్యలో ద్వారకాతిరుమల వచ్చారు. రాత్రి కావడంతో స్థాని క టీటీడీ సత్రంలో గది అద్దెకు తీసుకుని విశ్రాంతి తీసుకున్నా రు. వెంకట్రావు మాత్రం కారులోనే నిద్రపోయాడు. శనివా రం ఉదయం ప్రయాణికులు కారు వద్దకు వచ్చి గుంటూరు వెళ్లాలని, త్వరగా సిద్ధం కావాలని డ్రైవర్ వెంకట్రావుకు సూ చించారు. దీంతో ప్రయాణికులు తీసుకున్న గదిలో దుస్తులు విడిచి వెంకట్రావు స్నానానికి వెళ్లాడు. ఇదే అదనుగా వెంకట్రావు దుస్తుల్లోని రెండు సెల్ఫోన్లు, నగదు ఉన్న పర్సు, కారు తాళాలు తీసుకుని ప్రయాణికులు కారుతో ఉడాయిం చారు. స్నానం ముగించుకుని వచ్చిన వెంకట్రావు కారు కనిపించకపోవడంతో ఖంగుతిన్నాడు. చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులు ఆశ్రయించాడు. ద్వారకాతిరుమల ఎస్సై పి.నాగవెంకటరాజు సత్రం వద్ద ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను, పరిసరాలను పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
పశ్చిమ డెల్టాకు 6 వేల క్యూసెక్కులు
కొవ్వూరు : జిల్లాలో వ్యవసాయ పంటల అవసరాల నిమిత్తం పశ్చిమ డెల్టా కాలువకు 6 వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శనివారం ఉదయం 6 గంటలకు 38,444 క్యూసెక్కులున్న ఇన్ఫ్లో సాయంత్రానికి 32,112 క్యూసెక్కులకు తగ్గింది. దీంతో 11,800 క్యూసెక్కుల నీటిని ఉభయ గోదావరి జిల్లాలోని మూడు డెల్టా కాలువలకు విడుదల చేస్తున్నారు. మిగిలిన 20,319 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. -
సినీఫక్కీలో కారు మాయం
ద్వారకాతిరుమల (పశ్చిమగోదావరి): కారు అద్దెకు తీసుకుని వచ్చిన ప్రయాణికులు డ్రైవర్కు మస్కా కొట్టి అతడి వద్ద ఉన్న సొత్తుతో పాటు కారునే దొంగిలించిన సంఘటన ద్వారకాతిరుమలలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, బా ధిత డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం ఉమ్మి గ్రామానికి చెందిన దాసరి వెంకట్రావు తన ఏపీ 30 కే 2703 నెంబర్ గల టాటా ఇండికా కారును కిరాయికి నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రాజాం నుంచి గుంటూరు వెళ్లాలని తన పేరు క ల్లూరి జగదీశ్ అని చెప్పిన ఓ వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో శుక్రవారం ఇదే కారులో గుంటూరు బయలుదేరారు. మార్గమధ్యలో ద్వారకాతిరుమల వచ్చారు. రాత్రి కావడంతో స్థాని క టీటీడీ సత్రంలో గది అద్దెకు తీసుకుని విశ్రాంతి తీసుకున్నా రు. వెంకట్రావు మాత్రం కారులోనే నిద్రపోయాడు. శనివా రం ఉదయం ప్రయాణికులు కారు వద్దకు వచ్చి గుంటూరు వెళ్లాలని, త్వరగా సిద్ధం కావాలని డ్రైవర్ వెంకట్రావుకు సూ చించారు. దీంతో ప్రయాణికులు తీసుకున్న గదిలో దుస్తులు విడిచి వెంకట్రావు స్నానానికి వెళ్లాడు. ఇదే అదనుగా వెంకట్రావు దుస్తుల్లోని రెండు సెల్ఫోన్లు, నగదు ఉన్న పర్సు, కారు తాళాలు తీసుకుని ప్రయాణికులు కారుతో ఉడాయిం చారు. స్నానం ముగించుకుని వచ్చిన వెంకట్రావు కారు కనిపించకపోవడంతో ఖంగుతిన్నాడు. చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులు ఆశ్రయించాడు. ద్వారకాతిరుమల ఎస్సై పి.నాగవెంకటరాజు సత్రం వద్ద ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను, పరిసరాలను పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
విజయం కోసం పోటాపోటీ..
తణుకు అర్బన్ : జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 62వ అంతర జిల్లాల క్రీడా పోటీలు తణుకు జెడ్పీ బాయ్స్ హైస్కూలులో శనివారం ప్రారంభమయ్యాయి. డీవైఈవో జంగం స్వామిరాజు అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు క్రీడల ద్వారా కూడా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని అన్నారు. ఈ పోటీలకు 13 జిల్లాలకు చెందిన క్రీడాకారులు హాజరయ్యారు. తొలిరోజు అండర్–14 బాస్కెట్బాల్, అండర్–17 టేబుల్ టెన్నిస్ విభాగాల్లో బాలురు, బాలికల మ్యాచ్లు ఉత్కంఠ భరితంగా సాగాయి. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, కౌన్సిలర్లు మల్లిన రాధాకృష్ణ, పరిమి వెంకన్నబాబు, జెడ్పీటీసీ ఆత్మకూరి బులి దొరరాజు, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ మునుకుట్ల రామారావు, జాతీయ బాస్కెట్ బాల్ క్రీడాకారులు నల్లజర్ల వెంకన్న, ఎంఈవో ఎస్.శ్రీనివాసరావు, రాష్ట్ర క్రీడాధికారి పేరం రవీంద్రనాథ్, ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎ.శ్రీనివాస్, హెచ్ఎం నారగాని రమేష్, ప్రాంతీయ క్రీడాధికారి పీఎస్ సుధాకర్ పాల్గొన్నారు. లీగ్ విజేతలు వీరే... తొలిరోజు బాస్కెట్ బాల్ అండర్ 14 బాలుర విభాగంలో శ్రీకాకుళం జట్టుపై 22–1 తేడాతో విశాఖపట్నం జట్టు, గుంటూరుపై 25–13 తేడాతో అనంతపురం, విజయనగరంపై 26–3 తేడాతో కృష్ణా జిల్లా జట్లు గెలుపొందాయి. బాలికల విభాగంలో కర్నూలుపై 11–6 తేడాతో పశ్చిమ గోదావరి, విశాఖపై 18–4 తేడాతో తూర్పుగోదావరి గెలిచినట్లు తెలిపారు. టేబుల్ టెన్నిస్ విభాగంలో.. టేబుల్ టెన్నిస్ అండర్–17 బాలికల విభాగంలో కృష్ణా, అనంతరపురం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లా జట్లు వరుసగా విజయం సాధించాయి. బాలుర విభాగంలో అనంతపురం, విశాఖపట్నం, కృష్ణా, తూర్పు గోదావరి జట్లు విజయం సాధించినట్టు నిర్వాహకులు తెలిపారు. -
వైభవంగా ద్వారకా తిరుమలేశుడి కళ్యాణం
-
గోదావరి మాతకు మహా నీరాజనం
కొవ్వూరు : స్థానిక గోష్పాదక్షేత్రంలో శనివారం రాత్రి గోదావరి మాతకు మహా నీరాజనం సమర్పించారు. దసరా శరన్నవరాత్ర మహోత్సవాలు ముగిసిన తర్వాత వచ్చే ఆశ్వీజ పౌర్ణమి ఎంతో విశిష్టమైనదని గోదావరి నీరాజన సమితి అధ్యక్షుడు కలిగొట్ల కృష్ణారావు పేర్కొన్నారు. చంద్ర బింబాన్ని గో క్షీరంలో దర్శించుకోవడం ద్వారా మంచి ప్రతిఫలం ఉంటుందన్నారు. ఈ పౌర్ణమిని శరత్ పౌర్ణమిగా కూడా పిలుస్తారన్నారు. ఇనగంటి ఉమా రామారావు, కనకదుర్గా, కలిగొట్ల కృష్ణారావు దంపతుల చేతుల మీదుగా ముందుగా గోదావరి మాతకు పూజలు చేశారు. గోదావరిమాతకు సహస్ర నామార్చన చేశారు. సెన్సార్బోర్డు సభ్యుడు టీఎన్వీ రమణమూర్తి, బొందలపాటి హనుమంతరావు, పమ్మి రవిబాబు, మంత్రిప్రగడ సత్యనారాయణ, వైవీఎస్ కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గోదావరి మాతకు నీరాజనం అనంతరం నదిలో దీపాలు విడిచిపెట్టారు. -
కల్యాణ వైభోగమే..
ద్వారకాతిరుమల : సర్వ జగద్రక్షకుడైన శ్రీనివాసుడు సర్వాభరణ భూషితుడై నుదుటన కల్యాణ తిలకం, బుగ్గన చుక్కతో సిగ్గులొలుకుతున్న ఉభయ దేవేరులను పెండ్లాడాడు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. దుర్ముఖినామ సంవత్సర ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి కల్యాణం భక్తజన సందోహాలు, గోవిందనావు స్మరణలు, వేదవుంత్రోచ్ఛరణల నడుమ కడురవుణీÄýæుంగా సాగింది. పాంచాహ్నిక దీక్షతో వైఖానస ఆగవూన్ని అనుసరించి జరిపిన ఈ కల్యాణ తంతును భక్తజనులు వీక్షించి తరించారు. కల్యాణ వేడుక ఇలా.. శ్రీవారి అనివేటి మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై చిన వెంకన్న తిరుకల్యాణ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా కళా సౌందర్యాలు, పచ్చిపూలతో కల్యాణ వేదికను ముస్తాబు చేశారు. అనంతరం ఆలయంలో తొళక్కవాహనంపై శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ మూర్తులను ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణలు చేశారు. అనంతరం అట్టహాసంగా ఆలయ అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్ఛరణల నడుమ, మేళతాళాలు, మంగళవాయిద్యాలతో శ్రీవారి వాహనాన్ని కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. వేదికపై ప్రత్యేకంగా అలంకరించిన రజిత సింహాసనంపై కల్యాణ మూర్తులను ఉంచి అర్చకులు కల్యాణ తంతును ప్రారంభించారు. కల్యాణ తంతులో వివిధ ఘట్టాలను పూర్తిచేసి శుభముహూర్త సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్రS, బెల్లం ధరింపజేసి, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకను భక్తుల గోవింద నామస్మరణల నడుమ నిర్వహించారు. దేవస్థానం తరపున శ్రీవారికి ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు పట్టు వస్త్రాలను సమర్పించగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అమ్మవార్లకు పట్టువస్త్రాలను అందించారు. ఈ కల్యాణ వేడుక ఆద్యంతం భక్తులను ఆనంద పారవశ్యంలో ఓలలాడించింది. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు పర్యవేక్షించారు. క్షేత్రంలో పెళ్లిళ్ల సందడి ద్వారకా తిరుమల : ఆశ్వయుజమాసంలో మంచి ముహూర్తం కావడంతో చిన వెంకన్న క్షేత్రంలో పెళ్లిబాజాలు మారుమోగాయి. శనివారం ఉదయం క్షేత్ర పరిసరాల్లో వివాహాలు అధికంగా జరిగాయి. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, కల్యాణ మండప ప్రాంతం, దేవస్థానం, ప్రై వేటు సత్రాల్లో ఈ వివాహాలు భారీగా జరిగాయి. దీంతో క్షేత్ర పరిసరాలు పెళ్లిజనాలతో కళకళలాడాయి. వివాహాలు జరుపుకున్న అనంతరం నూతన వధువరులు, వారి బంధువులు శ్రీవారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. వైభవం.. గరుడోత్సవం శ్రీవారి కల్యాణ తంతు ముగిసిన అనంతరం వెండి గరుడవాహనంపై స్వామివారు ఉభయ దేవేరులతో క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. గరుడు స్వామివారికి నిత్య సేవకుడు. అటువంటి గరుడ వాహనంపై మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణలు, గజసేవల నడుమ విశేష అలంకారాల్లో చినవెంకన్న ఉభయ దేవేరులతో కలసి తిరువీధుల్లో ఊరేగారు. బ్రహ్మోత్సవాల్లో నేడు ఉదయం 8 గంటల నుంచి – భజన సంకీర్తనలు ఉదయం 10 గంటల నుంచి – భక్తి రంజని సాయంత్రం 5 గంటల నుంచి – ఉపన్యాసం సాయంత్రం 6 గంటల నుంచి – భరతనాట్యం రాత్రి 7 గంటల నుంచి – మోహినీ భస్మాసుర నాటకం రాత్రి 7 గంటల నుంచి – శ్రీవారి దివ్య రథోత్సవం -
నేత్రపర్వం.. శ్రీవారి ఎదుర్కోలు ఉత్సవం
-
నేడు జూడో టీమ్స్ ఎంపిక
రాజంపేట: ఏఐటీఎస్(రాజంపేట)లో శనివారం జేఎన్టీయు(అనంతపురం) జూడో టీమ్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఫిజికల్ డైరక్టరు బీ.నాగముని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటలకు ఈ ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. ఈ ఎంపికలకు జేఎన్టీయు పరిధిలో జూడో క్రీడాకారులు హాజరవుతారని వివరించారు. -
నేత్రపర్వం.. శ్రీవారి ఎదుర్కోలు ఉత్సవం
ద్వారకా తిరుమల : ద్వారకా తిరువుల దివ్యక్షేత్రంలో శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారి నిత్య కల్యాణ వుండపంలో నిర్వహించిన చినవెంకన్న ఎదుర్కోలు ఉత్సవం ఆద్యంతం కనుల పండువగా సాగింది. శ్రీవారి కల్యాణానికి వుుందురోజున ఈ ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించడం సంప్రదాÄýæుబద్ధంగా వస్తోంది. ఈ వేడుకకు బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యం ఉంది. ఎదుర్కోలు వేడుక ఇలా.. శ్రీవారి ఆలయ ఆవరణలో తొళక్కం వాహనంపై ఉభయ దేవేరులతో స్వామివారిని ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణలు చేశారు. అనంతరం అర్చకుల వేద వుంత్రోచ్ఛరణలు, బాజాభజంత్రీలు నడువు వాహనాన్ని ప్రధాన రాజగోపురం మీదుగా నిత్య కల్యాణ వుండపం వద్దకు తీసుకువచ్చారు. కల్యాణ వుండపంలో విశేషంగా అలంకరించిన వెండి శేషవాహనంపై ఉత్సవమూర్తులను ఉంచి, హారతులు సమర్పించి అర్చకులు ఎదుర్కోలు ఉత్సవాన్ని ప్రారంభించారు. కల్యాణవుండపంలో అధికారులు, అర్చకులు, పండితులు, భక్తులు రెండు జట్లుగా విడిపోయి ఒక జట్టు స్వామివారి గుణగణాలను, ఆÄýæున విశిష్టతను కొనియాడారు. రెండో జట్టు అవ్మువార్ల గుణగణాలను, వారి కీర్తిని తెలిÄýæుజేశారు. వివాహం జరిగే వుుందురోజు వధూవరుల తరపు బంధువ#లు శుభలేఖను పఠించేందుకు జరిపే కార్యక్రవుమే ఈ ఎదుర్కోలు ఉత్సవంగా పండితులు చెబుతున్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ వేడుక అనంతరం స్వామి, అమ్మవార్లను వెండి శేషవాహనంపై ఉంచి నిర్వహించిన తిరువీధి సేవ భక్తులను పరవశింపజేసింది. శ్రీహరి కళాతోరణ వేదికపై జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. బ్రహ్మోత్సవాల్లో నేడు ఉదయం 7 గంటల నుంచి సింహవాహనంపై శ్రీవారి గ్రామోత్సవం ఉదయం 8 గంటల నుంచి భజన సంకీర్తనలు ఉదయం 9.30 గంటల నుంచి కూచిపూడి నృత్యం సాయంత్రం 5 గంటలకు ఉపన్యాసం సాయంత్రం 6 గంటలకు భరతనాట్యం రాత్రి 7 గంటలకు కూచిపూడి నృత్యం రాత్రి 9 గంటల నుంచి శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం. అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం. -
అదుపు తప్పి.. ఐదుగురిని ఢీకొట్టి..
-
అదుపు తప్పి.. ఐదుగురిని ఢీకొట్టి..
తణుకు అర్బన్: కారు అదుపుతప్పి హల్చల్ చేయడంతో రోడ్డుపై వెళుతున్న ప్రయాణికులు బెంబేలెత్తారు. హఠాత్తు పరిణామంతో స్థానికులు కంగారుపడ్డారు. శనివారం సాయంత్రం తణుకు పాత రూరల్ పోలీస్స్టేçÙన్ వద్ద జరిగిన ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెనుమంట్ర తహసిల్దార్ కార్యాలయ ఆర్ఐ కోట శ్రీనివాసకుమార్ కారులో పెరవలి వైపు వెళుతుండగా తణుకు పాత రూరల్ స్టేషన్ వద్దకు వచ్చేసరికి ఫిట్స్ వచ్చాయి. దీంతో కారు అదుపు తప్పింది. రోడ్డుపై వెళుతున్న పాదచారులు, రెండు మోటారుసైకిళ్లు, రెండు సైకిళ్లను ఢీకొట్టింది. ముందుగా పట్టణానికి చెందిన పాదచారుడు కొక్కిరాల నాగశ్రీనివాస్ను ఢీకొనగా అతడు పక్కన ఉన్న డ్రెయిన్లో పడ్డారు. తర్వాత ఆచంటకు చెందిన నెక్కంటి నగేష్ను, బొక్కా వెంకట కృష్ణారావును ఢీకొట్టింది. వీరితో పాటు మరో ఇద్దరినీ కారు ఢీకొంది. వీరిలో నెక్కంటి నగేష్ కడుపుపై నుంచి కారు వెళ్లడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతడికి మూడుచోట్ల ఎముకలు విరిగాయి. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అన్నారు. బొక్కా వెంకట కృష్ణారావుకు ఎముకలు విరగడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వల్పగాయాలైన నాగశ్రీనివాస్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన కోట శ్రీనివాసకుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా డ్రైవర్కు ఫిట్స్ వస్తే కారు రూరల్ పోలీస్స్టేçÙన్ నుంచి ఎన్టీఆర్ పార్కు వరకు ఎలా వెళ్తుందనే అనుమానాన్ని బాధితులు వ్యక్తం చేస్తున్నారు. -
అదుపు తప్పి.. ఐదుగురిని ఢీకొట్టి..
తణుకు అర్బన్: కారు అదుపుతప్పి హల్చల్ చేయడంతో రోడ్డుపై వెళుతున్న ప్రయాణికులు బెంబేలెత్తారు. హఠాత్తు పరిణామంతో స్థానికులు కంగారుపడ్డారు. శనివారం సాయంత్రం తణుకు పాత రూరల్ పోలీస్స్టేçÙన్ వద్ద జరిగిన ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెనుమంట్ర తహసిల్దార్ కార్యాలయ ఆర్ఐ కోట శ్రీనివాసకుమార్ కారులో పెరవలి వైపు వెళుతుండగా తణుకు పాత రూరల్ స్టేషన్ వద్దకు వచ్చేసరికి ఫిట్స్ వచ్చాయి. దీంతో కారు అదుపు తప్పింది. రోడ్డుపై వెళుతున్న పాదచారులు, రెండు మోటారుసైకిళ్లు, రెండు సైకిళ్లను ఢీకొట్టింది. ముందుగా పట్టణానికి చెందిన పాదచారుడు కొక్కిరాల నాగశ్రీనివాస్ను ఢీకొనగా అతడు పక్కన ఉన్న డ్రెయిన్లో పడ్డారు. తర్వాత ఆచంటకు చెందిన నెక్కంటి నగేష్ను, బొక్కా వెంకట కృష్ణారావును ఢీకొట్టింది. వీరితో పాటు మరో ఇద్దరినీ కారు ఢీకొంది. వీరిలో నెక్కంటి నగేష్ కడుపుపై నుంచి కారు వెళ్లడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతడికి మూడుచోట్ల ఎముకలు విరిగాయి. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అన్నారు. బొక్కా వెంకట కృష్ణారావుకు ఎముకలు విరగడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వల్పగాయాలైన నాగశ్రీనివాస్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన కోట శ్రీనివాసకుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా డ్రైవర్కు ఫిట్స్ వస్తే కారు రూరల్ పోలీస్స్టేçÙన్ నుంచి ఎన్టీఆర్ పార్కు వరకు ఎలా వెళ్తుందనే అనుమానాన్ని బాధితులు వ్యక్తం చేస్తున్నారు. -
చీటింగ్ కేసులో నిందితుడి అరెస్ట్
తాడేపల్లిగూడెం రూరల్ : చీటింగ్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రూ.8.14 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు పట్టణ సీఐ ఎంఆర్ఎల్ఎస్ఎస్ మూర్తి తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని 11వ వార్డుకు చెందిన భయ్యా రంగారావు చీటీల వ్యాపారం చేస్తూ పలువురిని మోసగించి రూ.12 లక్షలతో ఉడాయించాడు. దీనిపై ఈనెల 2న ముడికూటి సోమేశ్వరరావుతో పాటు మరో ఎనిమిది మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు రంగారావును శనివారం ఉదయం అతని ఇంటి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 27మందికి చెందిన రూ.8.14 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్టు సీఐ చెప్పారు. కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో సీఐ మూర్తి, ఎస్సై ఐ.వీర్రాజు కేసు దర్యాప్తు చేశారు. -
2018 నాటికి ‘చింతలపూడి’ని పూర్తి చేస్తాం
చింతలపూడి : 2018 ఆగస్ట్ నాటికి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. స్థానిక మార్కెట్ కమిటీ ఆవరణలో వర్షాలకు ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్థిక సహాయాన్ని అందచేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వచ్చే బడ్జెట్లో పథకానికి కావాల్సిన నిధులను కేటాయించనున్నట్టు చెప్పారు. అదేవిధంగా ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి దష్టిలో పెట్టనున్నట్టు చెప్పారు. దోమల నిర్మూలనపై ప్రజల ఆరోగ్యం ఆధారపడిందని, అందుకే దోమలపై దండయాత్ర చేపట్టామని తెలిపారు. మండలంలో నివాసాలు కోల్పోయిన 14 మందికి బియ్యం, కందిపప్పు, నూనెతో పాటు నగదు సాయాన్ని అందచేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ తాళ్లూరి రాధారాణి, ఎంపీపీ దాసరి రామక్క, తహసీల్దార్ టి.మైఖేల్రాజ్, ఎంపీడీవో ఎం.రాజశేఖర్, చింతలపూడి, రాఘవాపురం సొసైటీ అధ్యక్షుడు నలమాటి రామకృష్ణ, ఎం.శ్రీనివాసరావు, ఎంపీటీసీలు, చిన్నంశెట్టి సీతారామయ్య, సయ్యద్ బాబు, బందెల ఆశీర్వాదం పాల్గొన్నారు. -
వాలీబాల్ జిల్లా మహిళా జట్లు ఎంపిక
కొవ్వూరు : జిల్లా వాలీబాల్ అసోసియోషన్ పర్యవేక్షణలో కొవ్వూరులో గౌతమీ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా మహిళా విభాగం సీనియర్, యూత్ మహిళా జట్లను ఎంపిక చేశారు. ఎంపికైన జట్లు ఈ నెల 6,7,8,9 తేదీల్లో నెల్లూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని అసోసియోషన్ అధ్యక్షుడు పరిమి హరిచరణ్ తెలిపారు. అసోసియేషన్ కార్యదర్శి సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్(చిన్ని) పాల్గొన్నారు. జాతీయస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక దేవరపల్లి: జాతీయస్థాయి ఉమెన్ ఫుట్బాల్ పోటీలకు జిల్లా విద్యార్థినులు ఎంపికైనట్టు జిల్లా జట్టు కోచ్ కె.వి.డి.వి.ప్రసాద్ శనివారం దేవరపల్లిలో తెలిపారు. ఇటీవల తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు 3వ స్థానం సాధించిందన్నారు. ఎం.నీరజ(దేవరపల్లి), చెరిమళ్ల సుభద్ర(కొయ్యలగూడెం), బాలుర విభాగంలో కట్టా వెంకటేశ్(నిడదవోలు) జాతీయ పోటీలకు ఎంపికైనట్టు చెప్పారు. కొయ్యలగూడెం నుంచి.. కొయ్యలగూడెం : జాతీయ స్థాయి ఉమెన్ పుట్బాల్ పోటీలకు స్థానిక వీఎస్ఎన్ కళాశాలకు చెందిన విద్యార్థిని సీహెచ్ సుభద్ర ఎంపికైనట్టు ప్రిన్సిపాల్ వీఎస్ఎన్స్వామి శనివారం తెలిపారు. ఇటీవల తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో ఈమె ప్రతిభ చూపినట్టు తెలిపారు. -
స్పెక్ట్రమ్ మెగా వేలం నేటి నుంచే
-
స్పెక్ట్రమ్ మెగా వేలం నేటి నుంచే
♦ రేసులో ఏడు కంపెనీలు ♦ రిజర్వ్ ధర రూ.5.66 లక్షల కోట్లు న్యూఢిల్లీ: దేశ చరిత్రలోనే తొలిసారిగా భారీ స్థాయిలో నిర్వహిస్తున్న స్పెక్ట్రమ్ వేలం శనివారం నుంచి ప్రారంభమవుతోంది. ఏడు బ్యాండ్లలో మొత్తం 2,354.55 మెగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ వేలానికి రానుంది. రూ.5.66 లక్షల కోట్లను రిజర్వ్ ధరగా కేంద్ర సర్కారు ఖరారు చేసింది. పాల్గొనే కంపెనీలు: భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులర్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్సెల్, టాటా టెలి ధరావతు సొమ్ము: ఏడు టెలికం సంస్థలు రూ.14,653 కోట్లను ధరావతు సొమ్ము కింద జమ చేశాయి. ఓ ఆపరేటర్... తాను బిడ్ వేసే స్పెక్ట్రమ్ విలువలో సుమారు పది శాతాన్ని ధరావతు కింద జమ చేయాల్సి ఉంటుంది. రిలయన్స్ జియో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) రూ.6,500 కోట్లు, వొడాఫోన్ రూ.2,740 కోట్లు, ఐడియా రూ.2,000 కోట్లు, ఎయిర్టెల్ రూ.1,980 కోట్లు జమ చేశాయి. వేలం అంతా ఆన్లైన్లోనే: వేలం ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే కొనసాగుతుంది. ఈ బాధ్యతలను ఎం-జంక్షన్ సర్వీసెస్ అనే సంస్థకు సర్కారు అప్పగించింది. ఈ వారం ప్రారంభంలో డమ్మీ వేలం నిర్వహించి అంతా సాఫీగానే ఉన్నట్టు ప్రభుత్వం నిర్ధారించుకుంది. వేలం సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరుకు కొనసాగుతుంది. -
గుర్తుతెలియని వ్యక్తి మృతి
రాయచోటి రూరల్: రాయచోటి పట్టణ పరిధిలోని పాత రాయచోటి శివాలయం సమీపంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. అతనికి 55 ఏళ్లు ఉండవచ్చని వారు తెలిపారు. తల, తోడలకు గాయాలు ఉన్నట్లు సమాచారం. విషయం తెలియగానే ఎస్ఐ రమేష్బాబు సంఘటన స్థలానికి చేరుకుని, పరిశీలించారు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం రాయచోటి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతి
రాయచోటి రూరల్: రాయచోటి పట్టణ పరిధిలోని పాత రాయచోటి శివాలయం సమీపంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. అతనికి 55 ఏళ్లు ఉండవచ్చని వారు తెలిపారు. తల, తోడలకు గాయాలు ఉన్నట్లు సమాచారం. విషయం తెలియగానే ఎస్ఐ రమేష్బాబు సంఘటన స్థలానికి చేరుకుని, పరిశీలించారు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం రాయచోటి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొత్తగా 12 డిస్టలరీలు ఏర్పాటు
నరసాపురం : మన రాష్ట్రంలో అవసరాలకు తగిన విధంగా మద్యం ఉత్పత్తి జరగడం లేదని రాష్ట్ర ఎక్సైజŒ æశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం నరసాపురం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా 12 డిస్టలరీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రస్తుం ఉన్న 4 డిస్టలరీల ద్వారా ఉత్పత్తి అవుతున్న మద్యం, డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తి చేయలేకపోతున్నాయని చెప్పారు. కొత్త డిస్టలరీల ఏర్పాటుతో కొంతమేర ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయన్నారు. రాష్ట్రంలో నాటు సారా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని చెప్పారు. నవోదయం కార్యక్రమం ద్వారా నాటుసారా గ్రామాల్లో దాడులు చేయడం, నాటుసారా వ్యాపారులు తయారీదారుల్లో పరివర్తన తీసుకొచ్చే కార్యక్రమాలు, సత్ఫలితాలు ఇచ్చాయని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, మునిసిపల్ చైర్పర్సన్ పి.రత్నమాల పాల్గొన్నారు. -
కొత్తగా 12 డిస్టలరీలు ఏర్పాటు
నరసాపురం : మన రాష్ట్రంలో అవసరాలకు తగిన విధంగా మద్యం ఉత్పత్తి జరగడం లేదని రాష్ట్ర ఎక్సైజŒ æశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం నరసాపురం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా 12 డిస్టలరీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రస్తుం ఉన్న 4 డిస్టలరీల ద్వారా ఉత్పత్తి అవుతున్న మద్యం, డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తి చేయలేకపోతున్నాయని చెప్పారు. కొత్త డిస్టలరీల ఏర్పాటుతో కొంతమేర ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయన్నారు. రాష్ట్రంలో నాటు సారా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని చెప్పారు. నవోదయం కార్యక్రమం ద్వారా నాటుసారా గ్రామాల్లో దాడులు చేయడం, నాటుసారా వ్యాపారులు తయారీదారుల్లో పరివర్తన తీసుకొచ్చే కార్యక్రమాలు, సత్ఫలితాలు ఇచ్చాయని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, మునిసిపల్ చైర్పర్సన్ పి.రత్నమాల పాల్గొన్నారు. -
పుష్పపల్లకిలో గణనాథుని అభయం
కాణిపాకం(ఐరాల) : స్వయంభూ వరసిద్ధి వినాయకస్వామివారి ఆలయ ప్రత్యేకోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి పుష్పపల్లకి సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేకోత్సవాల్లో ఈసేవకు అ్యంత ప్రాధాన్యం ఉంది. మిరమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణలు. మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ పరిమళభరిత పుష్పమాలికలతో తయారు చేసిన పల్లకిపై కొలువుదీరిన గణనాథుడు పురవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఈసేవను తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు వేలసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులతో కాణిపాకం కిక్కిరిసింది. ఉదయం ఆలయంలో స్వామివారి మూలవిరాట్కు ప్రత్యేక అభిషేక పూజల అనంతరం చందనాలంకరణ చేశారు. రాత్రి 10–30 గంటలకు సిద్ధి,బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 45 అడుగుల పొడవు, 38 అడుగుల ఎత్తులో మిరమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణలు, ప్రత్యేక పుష్పాలంకరణతో సిద్ధం చేసిన పల్లకిపై ఉత్సవ మూర్తులను అధిష్టింపచేశారు. ప్రత్యేక వాయిద్యాలు, అశేష భక్తుల జై గణేష్ నామస్మరణల నడుమ ఊరేగింపు నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ఈఓ పూర్ణచంద్రరావు, ఏసీ వెంకటేషు, ఏఈవో కేశవరావు, సూపరింటెండెంట్లు రవీంద్ర బాబు, స్వాములు, ఇన్స్పెక్టర్లు చిట్టిబాబు, మల్లికార్జున పాల్గొన్నారు. భారీ బందోబస్తు పుష్పపల్లకి సేవ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చిత్తూరు డీఎస్పీ లక్ష్మినాయుడు ఆధ్వర్యంలో వెస్ట్ సీఐ ఆదినారాయణ, కాణిపాకం ఎస్ఐ నరేష్ బాబు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం పంచాయతీ అధికారులు మంచినీటి సౌకర్యం కల్పించారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడిపారు. స్థానికులు పలు ప్రాంతాల్లో భక్తులకు అన్నదానం చేశారు. -
తిరుచ్చిపై కల్యాణ శ్రీనివాసుడు
శ్రీనివాస మంగాపురం(చంద్రగిరి): శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వెంకటేశ్వరస్వామి వారు శనివారం తిరుచ్చి వాహనంపై నాలుగుమాడ వీధులలో విహరించా రు. పెరటాసి నెల సందర్భంగా వారపు ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతసేవతో మేల్కొలిపారు. అనంతరం స్వామివారికి ఫల, పుష్ప సుగంధ పన్నీటి ద్రవ్యాలతో అభిషేక సేవ నిర్వహించారు. తదుపరి స్వామివారిని పట్టుపీతాంబరాలు, వజ్ర వైఢూర్యాలు, మరకత మాణిక్యాలతో శోభాయమానంగా అలంకరిం చారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కల్యాణ æమండంపం లోకి వేంచేపు చేసి, వైఖానస ఆగమోక్తంగా కన్నుల పండువగా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. కల్యాణోత్సవాన్ని తిలంకిచడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వివాహం కాని యువతీ, యువకులు త్వరగా వివాహం కావాలని స్వామివారి కంకణాలను ధరించి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం ఉత్సవర్లకు ఆలయ ప్రాంగణంలో కన్నుల పండుగవగా ఊంజల్సేవను నిర్వహించారు. తిరిగి సాయంత్రం స్వామి, అమ్మవా ర్లు తిరుచ్చి వాహనంపై ఆశీనులై నాలుగుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా భక్తులు దేవేరులకు ధూప ధీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో ధనుంజయ, ఇన్స్పెక్టర్లు దినకర రాజు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
11 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమల : శ్రీవారి ఆశ్వయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 11 నుంచి 18 వరకు జరగనున్నట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. ప్రారంభం రోజైన విజయదశమి నాడు స్వామివారిని పెండ్లికుమారునిగాను, అమ్మవార్లను పెండ్లికుమార్తెలుగా అలంకరించడంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఉత్సవాల్లో భాగంగా వచ్చేనెల 12న ధ్వజారోహణను ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు సర్వాది దేవతలను ఆహ్వానించే క్రమంలో ఈ ధ్వజారోహణను జరపడం పరిపాటి. 14న ఎదుర్కోలు ఉత్సవం, 15న చిన వెంకన్న దివ్య కల్యాణ మహోత్సవం జరపనున్నట్టు ఈవో చెప్పారు. 16న సాయంత్రం శ్రీవారి రథోత్సవం, 17న శ్రీచక్రవార్యూత్సవం, చూర్ణోత్సవం, వసంతోత్సవాలు, ధ్వజ అవరోహణ జరుపుతారు. 18న రాత్రి జరుగనున్న శ్రీపుష్పయాగోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని ఈవో చెప్పారు. ఉత్సవాల రోజుల్లో ఉదయం, సాయంత్రం స్వామివారు వివిధ వాహనాలపై క్షేత్ర పురవీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆయా రోజుల్లో శ్రీవారి నిత్యార్జిత కల్యాణం, ఆర్జిత సేవలు రద్దుకానున్నాయని ఈవో తెలిపారు. -
నేడు సీఎం పర్యటన ఇలా
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఏలూరు రానున్నారు. దోమలపై యుద్ధం–పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 9గంటలకు జెడ్పీ కార్యాలయం నుంచి ఫైర్స్టేçÙన్ సెంటర్ మీదుగా సురేష్ బహుగుణ స్కూల్ వరకూ జరిగే ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం స్కూల్లో జరిగే సమావేశంలో మాట్లాడతారు. ముఖ్యమంత్రి కార్యక్రమం నేపథ్యంలో నగరపాలక సంస్థ మేయర్, అధికారులు సమావేశమై కార్యక్రమం విజయవంతం చేసే అంశంపై చర్చించారు. గురువారం జరిగిన యువభేరి కార్యక్రమం విజయవంతం కావడంతో దానికి దీటుగా జనాన్ని సమీకరించాలని కార్పొరేటర్లకు లక్ష్యాలు ఇచ్చారు. -
నేడు జాబ్మేళా
కడప కోటిరెడ్డి సర్కిల్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శిక్షణతో నిమిత్తం లేకుండా షిర్డిసాయి ఎలక్ట్రికల్స్లో వివిధ ఖాళీల భర్తీకి శనివారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ అనిల్కుమార్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కడప నగరం రాజంపేట రోడ్డులోని టీటీడీసీ భవన్లో నిర్వహించే ఈ ఇంటర్వ్యూలకు పది, ఇంటర్మీడియేట్, ఐటీఐ చదివిన నిరుద్యోగులు అర్హులని, 18–25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు హాజరు కావచ్చన్నారు. -
తిరుమలలో పోటెత్తిన పెరటాశి భక్తులు
-
యాళి వాహనం పై వరసిద్ధుడి వైభవం
– వేడుకగా ప్రత్యేకోత్సవాలు కాణిపాకం(ఐరాల): స్వయంభువు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారు యాళి వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఉభయదారుల ఆధ్వర్యంలో స్వామివారి మూలవిగ్రహనికి వేదమంత్రోచ్చారణల నడుమ పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని చందనాలంకృతులను చేసి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. రాత్రి సిద్ధి బుద్ధి సమేతులైన స్వామివారి ఉత్సవ మూర్తులను అలంకార మండపంలోకి వేంచేపు చేసి, విశేషాలంకరణ చేశారు. తరువాత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను ఆలయం నుంచి పల్లకిపై ఊరేగింపుగా తీసుకువచ్చి యాళి వాహనంపై అధిష్టింపజేశారు. మంగళవాయిద్యాలు, మేళతాలాల నడుమ కాణిపాకం పురవీధులు, మాడవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమానికి దేవస్థానం వారు, అగరంపల్లికి చెందిన నరశింహరెడ్డి కుమారులు, చినకాంపల్లికి చెందిన సుబ్బారెడ్డి కుమారులు ఉభయదారులుగా వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ పి.పూర్ణచంద్రారావు, ఏసీ వెంకటేష్, ఏఈవో కేశవరావు, సూపరింటెండెంట్ రవీంద్ర బాబు, స్వాములు, ఇన్స్పెక్టర్లు చిట్టిబాబు, మల్లికార్జున, ఉత్సవ కమిటీ సభ్యులు, ఉభయదారులు పాల్గొన్నారు. -
టైల్స్ షాపులో చోరీ
చింతలపూడి: చింతలపూడి పట్టణానికి చెందిన గ్రాండ్ టైల్స్ అండ్ ఫర్నిచర్స్ షాపులో శనివారం తెల్లవారు జామున దొంగతనం జరిగింది. షాపు వెనుక ఉన్న సిమెంట్ కిటికీ బద్దలు కొట్టి లోపలికి ప్రవేసించిన దొంగలు డ్రాయర్ సొరుగులోని 22 వేల నగదును దొంగిలించుకుపోయారు. ఉదయం షాపు తెరిచి చూడగా దొంగతనం జరిగిన విషయం తెలుసుకున్న షాపు యజమాని హమీద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని పరిశీలించారు. ఎస్ఐ సైదానాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక
దేవరపల్లి : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక తయారు చేసినట్టు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. దేవరపల్లి కరుటూరి ఫంక్షన్lహాలు వద్ద శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడారు. అన్ని పంచాయతీల్లో ప్రజలకు అవసరమైన కనీస అవసరాలు మంచినీరు, అంతర్గత రోడ్లు నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ నిధులతో వచ్చే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మాణం చేయనున్నట్టు ఆయన వివరించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.646 కోట్లు విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. ఈ నిధులకు 50 శాతం ఉపాధి నిధులు కలిపి గ్రామాల్లో సీసీ రోడ్లు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సర్పంచ్లకు సూచించారు. జిల్లాకు రూ. 57.34 కోట్లు విడుదల చేసినట్టు మంత్రి తెలిపారు. ప్రతి గ్రామంలో అంగన్వాడీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. జిల్లాలో 365 భవనాల నిర్మాణానికి రూ.25.55 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. పంచాయతీ భవనాలకు నిధులు మంజూరు చేయనున్నట్టు చెప్పారు. పంట సంజీవిని కింద గ్రామంలో 100 నీటికుంటలు తవ్వితే రూ.3 లక్షలు పంచాయతీరాజ్ ద్వారా బహుమతిగా ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. త్వరలో పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ చేయనున్నట్టు చెప్పారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
తిరుమలలో పోటెత్తిన పెరటాశి భక్తులు
– కిక్కిరిసిన అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాలు – సా:6గంటల వరకు 69,502 మందికి స్వామి దర్శనం – 29,716 మంది మెట్లమార్గంలో రాక సాక్షి,తిరుమల: పెరటాశి (తమిళనెల) తిరుమల శనివారాల్లోని మొదటి శనివారం కావటంతో శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాలు నడిచివచ్చే భక్తులతో కిక్కిరిసిపోయాయి. వీరిలో ఎక్కువ మంది తమిళనాడు, చిత్తూరు జిల్లా వాసులే అధికంగా ఉన్నారు. సాయంత్రం 6 గంటల వరకు రెండు కాలిబాటల్లోనూ 29,716 మంది భక్తులు నడిచి తిరుమలకొండెక్కారు. దీంతో కాలిబాట భక్తులతో నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూలైన్లు నిండాయి. భద్రతా సిబ్బంది భక్తులను ఎక్కడికక్కడ కట్టడి చేసి క్యూలైన్లలోకి అనుమతించారు. క్యూలైన్లలో భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఆలయం, భద్రతా సిబ్బంది చొరవ తీసుకుని క్యూలైన్లను క్రమబద్దీకరించారు. సర్వదర్శనం క్యూలైన్లు కూడా భక్తులతో కిటకిటలాడాయి. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 69,502 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. పెరిగిన రద్దీ వల్ల గదులు ఖాళీ లేవు. అన్ని రిసెప్షన్కేంద్రాల్లోనూ భక్తులు గదుల కోసం నిరీక్షించారు. కల్యాణకట్టల్లోనూ తలనీలాలు సమర్పించేందుకు వేచి ఉండాల్సి వచ్చింది. -
‘మలబార్’లో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ ప్రదర్శన
భీమవరం : మగువలకు వన్నె తెచ్చే ఎన్నో రకాల బంగారు, వజ్రాభరణాలు భీమవరంలోనే అందుబాటులోకి రావడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ అన్నారు. శనివారం స్థానిల మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షాపులో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్లు ఫియాజ్, దీపక్ మాట్లాడుతూ ఈనెల 20 వరకూ ఆర్టిస్ట్రీ బ్రాండెండ్ జ్యువెలరీ ప్రదర్శన, అమ్మకం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయబాబు, ప్రమీల, జయశ్రీ, విజయలక్ష్మి, సుభాషిణి పాల్గొన్నారు. -
మద్ది అంజన్న సన్నిధిలో దిల్రాజు
జంగారెడ్డిగూడెం రూరల్ : సినీనటుడు సాయి ధరమ్ తేజ్ నటించిన సుప్రీమ్ సినిమా విజయవంతం కావడంతో మద్ది ఆంజనేయస్వామి దర్శించుకున్నామని సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామిని శనివారం రాత్రి నిర్మాత దిల్ రాజు, సుప్రీమ్ సినిమా దర్శకులు అనిల్ రావిపూడి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దిల్ రాజు విలేకరులతో మాట్లాడుతూ సుప్రీమ్ సినిమా రిలీజ్కు ముందు మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకుని సినిమా సూపర్ హిట్ కావాలని మొక్కుకున్నామని తెలిపారు. ఇక నుంచి ప్రతి సినిమాకు ముందు ద్వారకాతిరుమలతో పాటు మద్ది క్షేత్రాన్ని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ సుప్రీమ్ సినిమా హిట్ చేసి మద్ది ఆంజనేయస్వామి తన మహిమ చూపినట్టు పేర్కొన్నారు. దిల్రాజు, అనిల్ను ఆలయ చైర్మన్ దుశ్శాలువాతో సత్కరించారు. ఈవో పెన్మెత్స విశ్వనా«థరాజు స్వామి వారి చిత్రపటాలను, ప్రసాదాలను అందజేశారు. ఆదిత్య ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్వీఆర్, స్థానిక ఎగ్జిబ్యూటర్ కొండూరి అంజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కాణిపాకం భక్తుల రద్దీ
కాణిపాకం(ఐరాల): కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ అధికమైంది. స్వామివారి దర్శనానికి భక్తులకు రెండు గంటల సమయం పట్టింది. బ్రహ్మోత్సవ వేడుకల్లో ఐదవ రోజు రాత్రి వృషభ వాహనసేవలో స్వామి వారిని దర్శించుకునేందుకు తమిళనాడు,కర్ణాటక రాష్టాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. భక్తులందరికీ శీఘ్రదర్శనం కల్పించడం కోసం ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వంద,యాభై,పదిరూపాయల టికెట్ల క్యూలన్నీ భక్తుల రద్దీతో నిండాయి. -
కాణిపాకం వీధుల్లో ఏకదంతుడి ఊరేగింపు
కాణిపాకం(ఐరాల) స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శనివారం ఉదయం ఏకదంతుడు కాణిపాకం పుర వీధుల్లో విహరించారు. భక్తులు స్వామి వారికి నీరాజనం పలికారు. ఈ కార్యక్రమానికి కాణిపాకానికి చెందిన ఆర్యవైశ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం స్వామివారి మూల విగ్రహానికి సంప్రదాయ బద్ధంగా పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం దూపదీప నైవేద్యాలను సమర్పించిన తరువాత భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించారు. అనంతరం సిద్ధి బుద్ధి సమేతుడైన వరసిద్దుడిని సర్వాకృతులను చేసి ,ఆలయ అలంకార మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కాణిపాకం పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని మెక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ పూర్ణచంద్రారావు,పలువురు ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
సాహితీ వికాసం.. భావితరాలకు స్ఫూర్తిదాయకం
– ఘనంగా ప్రారంభమైన జిల్లా రచయితల మహాసభలు – 48 ఏళ్ల తర్వాత సాహితీ అమానుల సందడి – సమాజంలో విలువలు కాపాడే వారే కవులు ర^è యితలు తిరుపతి కల్చరల్: 48 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చిత్తూరు జిల్లా రచయితల మహాసభలు జరుపుకోవడం శుభపరిణామమనీ.. ఈ సభలు మరింత సాహితీ వికాసంతో భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని ప్రముఖ రచయిత కట్టమంచి బాలకృష్ణా రెడ్డి ఆకాంక్షించారు. తిరుపతిలోని గంధమనేని శివయ్య భవన్లో శనివారం జిల్లా రచయితల మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 400 మంది కవులు, రచయితలు, సాహితీ అభిమానులు హాజరయ్యారు. సాహితీ పండుగలా సాగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ ర^è యితలు కట్టమంచి బాలకృష్ణారెడ్డి, పద్మా నాయుని కృష్ణమూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుమ్మల కన్నయ్య నాయుడు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కట్టమంచి బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ 48 ఏళ్ల తర్వాత రచయితల సభలను జరుపుకోవడం.. ఇంతమంది కవులు, రచయితలు హాజరుకావడం ఆనందదాయకమన్నారు. ఈ సభలు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆకాంక్షించారు. తుమ్మల కన్నయ్య నాయుడు మాట్లాడుతూ సమాజంలో విలువలు కాపాడే వారే కవులు, రచయితలని తెలిపారు. నాటి భారత, భాగవత, పురాణ ఇతిహాసాల ఆధారంగానే నేడు కుటుంబాలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స, తెలుగు మధుర భాష అనే మాటలు కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యాయని, ఇవి ఆచారణలో రావాల్సిన అవసరం ఉందన్నారు. మానవీయ బంధాలతో ముడిపడిన అమ్మ, నాన్న, అవ్వ, తాత అనే తెలుగు పదాలు వాడుకలోకి వచ్చినప్పుడే మాతృభాష వికాసం చెందుతుందన్నారు. అనంతరం ‘చిత్తూరు సాహిత్యం నాటి నుంచీ నేటి దాకా’ అనే అంశంపై ఆచార్య మధురాంతక నరేంద్ర, ఇంద్రవెల్లి రమేష్ మాట్లాడుతూ అక్షరానికి వందనం, కవి మస్తానికి అభినందనం అంటూ కొనియాడారు. రాష్ట్ర గీతాన్ని అందించిన శంకరం బాడి సుందరాచారి జిల్లా వాసి కావడం మనందరికీ గర్వకారణమన్నారు. కంపెల్ల శైలజ, కొలకలూరి మధుజ్యోతి అన్నమయ్య, వేమన, వీరభ్రహ్మంల సామాజిక విప్లవాన్ని వివరించారు. సీమకథ –కొత్త సందర్భం అనే అంశంపై ప్రముఖ రచయితలు బండి నారాయణస్వామి, ఆర్ఎం.ఉమాహేశ్వరరావు మాట్లాడుతూ నాటి వందేళ్ల కథ సాగిన వి«ధాన్ని గురించి వివరించారు. ‘బాలసాహిత్యం –ఇంటా బయటా’ అనే అంశంపై ఎం.హరికిషన్, కుమారస్వామి మాట్లాడారు. ప్రముఖ కథా రచయిత సి.వేణు వారసుడైన భానుమూర్తి మాట్లాడుతూ ఇంట్లో తెలుగు మాట్లాడే విధానాన్ని ప్రోత్సహిస్తూ తెలుగు భాష మాధుర్యాన్ని పిల్లలకు తెలియజేసి భాషా వికాసానికి దోహదపడాలని తెలిపారు. జిల్లా రచయితల సభల్లో తొలి రోజు సంపాదకుడు రాఘవశర్మ అందించిన చిత్తూరు సాహితీ సౌగంధం, సుబ్రమణ్యం పిళ్లై గిరిధరన్ రచించిన భాగవతం కథలు, రావినూతల శ్రీరాములు రచించిన మరుపు రాని మహానిషి మాడభూషి అనంతశయనం అయ్యంగార్, దాసరి కృష్ణారెడ్డి రచించిన శ్రీబోయకొండ గంగమ్మ తల్లి ఆలయ సంగ్రహ చరిత్ర, కవిసంధ్య కవిత్వ పత్రిక మూడవ సంచికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు సాకం నాగరాజు, పలమనేరు బాలాజీ, గార్లపాటి దామోదరనాయుడు, మౌని, కలువగుంట రామ్మూర్తి, జిల్లేళ్ల బాలాజీ, మేడిపల్లి రవికుమార్, అట్టాడ అప్పల్నాయుడు, నాగసూరి వేణుగోపాల్, గంగవరం శ్రీదేవి, పేరూరు బాలసుబ్రమణ్యం, యువశ్రీ మురళి, గంటామోహన్, నాదెండ్ల శ్రీమన్నారాయణ, దేవరాజులు, మస్తానమ్మ, కుమారస్వామిరెడ్డి, తులసీనాథంనాయుడు, నెమిలేటి కిట్టన్న, రంగనాయులు పాల్గొన్నారు. -
రచయితల దృక్పథం మారాలి
పెనుగొండ: ప్రపంచీకరణతో మానవుడు సామాజిక సృహను కోల్పోతున్నాడని, ఆధునిక కాలంలోనూ స్త్రీ పరిచారికగానే మిగిలిపోతోందని కాకినాడ ఐడియల్ విద్యాసంస్థల సెక్రటరీ కరస్పాండెంట్, రచయిత్రి డాక్టర్ పి. చిరంజీవినీకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. పెనుగొండలో శనివారం ఎస్వీకేపీ అండ్ డాక్టర్ కేఎస్ రాజు కళాశాల, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) సంయుక్త నిర్వహణలో ‘తెలుగులో మహిళా రచయిత అనుభవాలు–ప్రభావాలు’ అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా చిరంజీవినీకుమారి మాట్లాడుతూ మానవుడు మనిషిగా కాకుండా సాహిత్యంలో వస్తువుగా మిగిలిపోతున్నాడన్నారు. రచయితలు తమపరిధిలో కాకుండా, స్త్రీ దృక్పథం, దళిత దృక్పథం, మైనార్టీ దక్పథంతో సాహిత్యాన్ని ముందుకు నడిపించాలన్నారు. స్త్రీలది వంటింటి సాహిత్యం కాదు మహిళా సాహిత్యానికి వంటింటి సాహిత్యమనే విమర్శ ఉందని, వంటింటికి మానవుడి జీవితంలో ఉన్న విలువ అనిర్వచనీయమని ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ కార్యదర్శి, జాతీయ అవార్డు గ్రహీత, కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య కాత్యాయనీ విద్మహే అన్నారు. మహిళా రచయిత్రులు వంటింటి విషయాలతో ప్రారంభించి సమాజంలో రాజకీయ, ఆర్థిక, సాంస్కతిక, విద్య, వ్యాపార, వాణిజ్య రంగాలను స్పహిస్తున్నారన్నారు. మహిళల గొంతుకగా ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ముందుకు సాగుతుందన్నారు. డాక్టర్ కె.అన్నపూర్ణ జ్యోతి ప్రజ్వలనంతో సదస్సును ప్రారంభించారు. ప్రరవే జాతీయ అధ్యక్షురాలు పుట్ల హేమలత, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నడింపల్లి సూర్యనారాయణ రాజు, కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు పితాని సూర్యనారాయణ, సెక్రటరీ కరస్పాండెంట్ డాక్టర్ కె.రామచంద్రరాజు, కోశాధికారి ఉద్దగిరి లవకుమార్, సదస్సు సంచాలకుడు రంకిరెడ్డి రామ్మోహనరావు, సుమారు 65 మంది రచయిత్రులు పాల్గొన్నారు. -
బీవీఆర్ఐటీలో కెంకాన్
నేటి నుంచి జాతీయ సదస్సు రెండు రోజల పాటు కొనసాగింపు 12 అంశాలపై ప్రజెంటేషన్ వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు, ప్రొఫెసర్లు రాక నర్సాపూర్:స్థానిక బీవీఆర్ఐటీ కళాశాలలో శనివారం నుంచి రెండు రోజుల పాటు జాతీయ స్థాయి సదస్సు జరగనుంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా దేశంలోని ఎంపిక చేసిన కళాశాలల్లో జాతీయ స్థాయి సదస్సులు జరుగుతాయి. ఈసారి బీవీఆర్ఐటీకి సదస్సు నిర్వహించే అవకాశం లభించింది. 12వ వార్షిక సెషన్ ఆఫ్, స్టూడెంట్స్ కెమికల్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ సదస్సుకు కెంకాన్-2016 పేరు పెట్టారు. ఈ సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యిమంది విద్యార్థులు, ప్రోఫెసర్లు హాజరు కానున్నారు. బీవీఆర్ఐటీ కాలేజీలో గతంలో పలు రాష్ట్ర జాతీయ స్థాయి సదస్సులు జరిగాయి. మరోసారి ఈ కాలేజీ వేదిక కానుంది. సదస్సులతో ఎంతో మేలు సదస్సులో పాల్గొనే విద్యార్థులు, ప్రొఫెసర్లు, కాలేజీ ప్రిన్సిపాల్తో సాక్షి మాట్లాడగా సదస్సులతో విద్యార్థులకు మేలు చేకూరుతుందని అన్నారు. సదస్సులో 12 అంశాలపై చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన ఆయా కాలేజీలకు చెందిన విద్యార్థులు తమ పేపర్ ప్రజెంటేషన్స్, పోస్టర్ పేపర్స్ అందచేశారు. వాటిని పరీశీలించి నిబంధనల మేరకు ఎంపిక చేసినట్లు తెలిసింది. ---------------------- అభిప్రాయాలు--------- ఆనందంగా ఉంది జాతీయ స్థాయి సదస్సును తమ కాలేజీలో చేపట్టడం ఆనందంగా ఉంది. తాను బోధించే బ్రాంచికి చెందిన సదస్సు చేపట్టడం సంతోషం. కాగా సదస్సులతో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశాలు వస్తాయి. సదస్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. - డాక్టర్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ బీవీఆర్ఐటీ మార్పులు తెలుసుకోవచ్చు సబ్జెక్టులలో రోజు రోజుకు మార్పులు వస్తున్నందున సదస్సులతో ఆయా సబ్జెక్టులలో ఎలాంటి మార్పులు వస్తున్నాయె విద్యార్థులకు తెలుస్తుంది. విద్యార్థుల ప్రతిభకు సదస్సులు వేదికలుగా వినియోగించుకోవచ్చు. జాతీయ సదస్సుకు తాను ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉండడం ఆనందంగా ఉంది. - డాక్టర్ రాధిక, సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆలోచనలకు కార్యరూపం సదస్సులో విద్యార్థులు తమ ఆలోచనలకు కార్యరూపం ఇవ్వొచ్చు. ఇతర ప్రాంతాల విద్యార్థులు రావడంతో విభిన్న మనస్థత్వం, ఆలోచనలతో ఉంటారు. వారితో కలిసి సాంకేతికపరమైన అంశాలు తెలుసుకోవడంతో పాటు నాలెడ్జ్ పెంపొందించుకునే అవకాశం లభిస్తుంది. - రమేష్, అసిస్టెంటు ప్రొఫెసర్, కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచి సదస్సుకు ఎంపిక కావడం సంతోషం నా పోస్టర్ ప్రజెంటేషన్.. సదస్సుకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. వాటర్ ప్యూరిఫికేషన్ అంశంపై పోస్టర్ ప్రజెంటేషన్ ఇచ్చాను. సదస్సులతో విద్యార్థులకు మేలు జరుగుతుంది. ప్రతిభను చాటేందుకు ఇదొక వేదికగా భావిస్తున్నాను. - దుసానె, విద్యార్థి, పూణె యూనివర్సిటీ అనుభవం పెరుగుతుంది సదస్సుకు తన ప్రజెంటేషన్ ఎంపిక కావడం సంతోషంగా ఉంది. సదస్సులతో విద్యార్థులలో అనుభవం పెరుగుతుంది. నైపుణ్యం పెంచుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశం. అనేక మంది పాల్గొనడంతో నాలెడ్జి పెంచుకునే అవకాశం ఉంటుంది. - క్షేమ, బీఫార్మసీ, వైపర్ కాలేజీ నర్సాపూర్ కెమికల్ ఇంజనీరింగ్లో కొత్తదనం సదస్సులలో పాల్గొనడంతో కెమికల్ ఇంజనీరింగ్లో కొత్తదనం తెలుసుకునే అవకాశం లభిస్తుంది. సదస్సులతో అనేక లాభాలున్నాయి. ఇతర రాష్ట్రాల విద్యార్థులతో కలిసి పాల్గొనడంతో వారి అనుభవాలు పాలు పంచుకునే అవకాశం ఉంటుంది. - అంకిత్ మిశ్రా, ఎస్ఆర్ఐసిటీ అంకులేశ్వర్, గుజరాత్ నమ్మకం పెరుగుతుందిః రాజేశ్వరీ, ఫార్మస్యూటికల్ ఇంజనీరీంగు బ్రాంచి, బీవీఆర్ఐటీ నర్సాపూర్ఃసదస్సులలో పాల్గొనడంతో విద్యార్థులలలోఉన్న నైపుణ్యతపై నమ్మకం పెరుగుతుంది. స్టేజీ ఫియర్ పోతుంది. విద్యార్థులు తమను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. తాను మొదటిసారి పాల్గొంటున్నాను. తనకు అవకాశం రావడం ఆనందంగా ఉంది. నైపుణ్యాన్ని నిరూపించె అవకాశంతో పాటు పెంచుకునే అవకాశం రావడడంతో సద్వినియోగం చేసుకుంటాను. సదస్సులతో కాన్ఫిడెన్స్ పెరుగుతుందిః శివకార్తిక్,బీవీఆర్ఐటీ నర్సాపూర్ః సదస్సులతో విద్యార్థులలో కాన్ఫిడెన్సు పెరుగతుంది. ఇతర రాష్రా్టల వాతావరణం తెలుస్తుంది. సదస్సులలో పాల్గొనడంతో అవగాహన కలుగుతుంది. నాలెడ్జ్ పుంచుకునేందుకు దాహద పడుతాయి. సదస్సులు నిర్వహంచడం అభినందనీయం. జాతీయ స్తాయి సదస్సు చేపట్టడం ఆనంందగా ఉంది. -
సమస్యలు తీరే వరకూ పోరాడతాం
ఏలూరు సిటీ: ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించకూడదని, విద్యాధికారుల విధానాలకు వ్యతిరేకంగా 12 ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో శనివారం ఉదయం స్థానిక జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు మొదలయ్యాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ ఎల్.విద్యాసాగర్ ప్రారంభించారు. శిబిరానికి పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎల్వీ సాగర్ మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖాధికారి తన వైఖరి మార్చుకుని తక్షణమే జిల్లా విద్యాశాఖలో ప్రశాంత పరిస్థితులు ఏర్పడేందుకు కృషి చేయాలని, లేకుంటే అతడ్ని సస్పెండ్ చేసేవరకూ రాష్ట్ర అధికారులు, నాయకుల దష్టికి ఈ విషయాలను తీసుకువెళతామని హెచ్చరించారు. ఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి ఆర్ఎస్ హరనాథ్ మాట్లాడుతూ విద్యార్థులకు భారమైన, స్కూల్æక్యాలెండర్లో లేని పరీక్షలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను ఎటువంటి బోధనేతర పనులకు ఉపయోగించకూడదని కోరారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ Sసాబ్జీ మాట్లాడుతూ డీఈవో వైఖరిపై ఉపాధ్యాయులు తీవ్ర అసంతప్తితో ఉన్నారని చెప్పారు. దీక్షల్లో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపీమూర్తి, ఏపీటీఎఫ్ 1938 జిల్లా ప్రధాన కార్యదర్శి గుగ్గులోతు కృష్ణ, యూటీఎఫ్ కోశాధికారి పీవీ నరసింహారావు, జిల్లా మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు వి.కనకదుర్గ, రాష్ట్ర కౌన్సిలర్ సుభానీబేగం, జిల్లా కార్యదర్శి పి.శివప్రసాద్, డి.పద్మావతి, టి.పూర్ణశ్రీ, ఆర్.కమలారాణి, ఎన్.వేళాంగిణి, సీహెచ్ మణిమాల పాల్గొన్నారు. దీక్షలకు ఆపస్ జిల్లా అధ్యక్షుడు రాజకుమార్, పీఆర్టీయూ నగర అధ్యక్షులు నెరుసు రాంబాబు, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.నరహరి, వైఎస్సార్ టీఎఫ్ జిల్లా అధ్యక్షులు జి.సుధీర్ తదితరులు మద్దతు తెలిపారు. -
అగ్రిగోల్డ్ డెయిరీ కార్మికుల రాస్తారోకో
లక్ష్మీనగర్ (ద్వారకాతిరుమల) : అగ్రిగోల్డ్ పాల డెయిరీని లాకౌట్ చేయడంతో రోడ్డున పడిన కార్మికులు శనివారం రాషీ్ట్రయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న ద్వారకాతిరుమల ఎస్సై టి.నాగవెంకటరాజు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మారంపల్లి పంచాయతీ లక్ష్మీనగర్లోని అగ్రిగోల్డ్ అమృతవర్షిణి పాలడెయిరీని గురువారం రాత్రి యాజమాన్యం లాకౌట్ను ప్రకటించిన విషయం విధితమే. దీంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న దాదాపు 70 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. అకస్మాత్తుగా యాజమాన్యం లాకౌట్ను ప్రకటిస్తే తమ పరిస్థితి ఏమిటంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తూ రాషీ్ట్రయ రహదారిపై బైఠాయించారు. కార్మికులకు సీఐటీయూ నాయకులు ఆర్.లింగరాజు, వై.సాల్మన్రాజు మద్దతు ప్రకటించారు. వీరు రాస్తారోకోలో కార్మికులతో పాటు పాల్గొని ఆందోళన చేశారు. కార్మికులకు యాజమాన్యం న్యాయం చేయకుంటే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం రాస్తారోకోను విరమించిన కార్మికులు ఫ్యాక్టరీ ఎదుట టెంట్ వేసి ఆందోళన చేపట్టారు. -
ప్రచారంలో విఫలమవుతున్నాం
తాడేపల్లిగూడెం (తాలూకాఆఫీస్ సెంటర్) : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రచారంలో విఫలమవుతున్నామని జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయలన్నారు. ఎంపీపీ ఛాంబర్ జిల్లా సమావేశం ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు పరిమి రవికుమార్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఛాంబర్ జిల్లా గౌరవాధ్యక్షుడు పిల్లి సత్తిరాజు, కార్యదర్శిలు కేతా సత్యనారాయణ, వడ్లపూడి ప్రసాద్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సమావేశంలో పలువురు ఎంపీపీలు మాట్లాడుతూ జిల్లాలో ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలు మాదిరిగా ఉండటం తప్ప ఏ పనీ చేయలేకపోతున్నారని, ఇటు విధులు లేక అటు నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విధులు, నిధులు లేకపోతే ఏ పనులు చేయగలమని, గుర్తింపు కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్మన్ బాపిరాజు మాట్లాడుతూ ఎంపీటీసీలకు విధులు, నిధుల విషయంలో ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమేనని అయినప్పటికీ విధులు, నిధులు ఉంటేనే పనులు చేస్తామన్న ఆలోచన నుంచి బయిటకు రావాలన్నారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కొవ్వూరు, ఉంగుటూరు, పాలకొల్లు ఎమ్మెల్యేలు జవహార్, గన్ని వీరాంజనేయులు, నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరడం లేదన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు జెడ్పీ చైర్మన్ను సత్కరించారు. -
రుష్యశృంగ మహర్షికి పూజలు
రత్నగిరిపై రెండో రోజూ కొనసాగిన వరుణజపాలు నేడు వరుణయాగం అన్నవరం : రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిలో వరుణ జపాలు రెండో రోజైన శనివారం కూడా కొనసాగాయి. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని కోరుతూ శతానువాక పారాయణలు, వారుణానువాక పారాయణలు, వరుణజపాలు, రుష్యశృంగ ఆవాహన తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం రుష్యశృంగ మహర్షి విగ్రహాన్ని పండితులు, రుత్విక్కులు శిరసున దాల్చి ఆలయ ప్రాకారం చుట్టూ వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల ఘోష నడుమ మూడుసార్లు ప్రదక్షిణలు చేశారు. ఆలయం నలుదిక్కులా సుబ్రహ్మణ్య ఆవాహన చేశారు. అనంతరం ఆ విగ్రహాన్ని తిరిగి స్వామి, అమ్మవార్ల పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. దేవస్థానం వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, ప్రధానార్చకుడు కొండవీటి సత్యనారాయణ, ప్రధాన వ్రత పురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, చామర్తి కన్నబాబు, మరో 18 మంది రుత్విక్కులు పాల్గొన్నారు. కాగా, ఆదివారం ఉదయం వరుణ యాగం ప్రారంభించి పది గంటలకు పూర్ణాహుతి నిర్వహించనున్నారు. అనంతరం రుష్యశృంగుని విగ్రహాన్ని పంపా నదిలో నిమజ్జనం చేస్తారు. -
బాస్కెట్బాల్ పోటీలు ప్రారంభం
మార్టేరు (పెనుమంట్ర) : మార్టేరులోని వేణుగోపాలస్వామి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శనివారం రాత్రి రాష్ట్రస్థాయి ఇన్విటేన్ బాస్కెట్బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మార్టేరులో క్రీడలకు సూర్తి ప్రదాతగా నిలిచిన పడాల ప్రహ్లాదరెడ్డి మెమోరియల్ తరఫున పోటీలు నిర్వహిస్తున్నారు. మూడు రోజులపాటు పోటీలు నిర్వహిస్తారు. పోటీల ప్రారంభోత్సవానికి పారిశ్రామికవేత్త గొలుగూరి శ్రీరామారెడి,్డ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కవురు శ్రీనివాసు తదితరులు హాజరయ్యారు. ముందుగా అతిథులు బాస్కెట్బాల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. మార్టేరు,ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం నుంచి జట్లు వచ్చాయి. పోటీల ప్రారంభ సమయానికి వర్షం కురవడంతో నిర్వాహకులు ఆదివారానికి వాయిదా వేశారు. దీంతో మొదటిరోజు ప్రారంభ సభ మాత్రమే జరిగింది. అంతర్జాతీయ బాస్కెట్బాల్ క్రీడాకారుడు సత్తి సుబ్బన్రెడ్డి, పీడీ భూపతిరాజు వెంకట నరసింహరాజు, గొలుగూరి శ్రీనివాసరెడ్డి, తాడి శ్రీనివాసరెడ్డి, కష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పశ్చిమ డెల్టాకు 7,300 క్యూసెక్కులు
కొవ్వూరు: గోదావరికి ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టింది. దీంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 28,766 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 14,500 క్యూసెక్కుల నీటì ని వదులుతున్నారు. తూర్పు డెల్టాకు 4,600, సెంట్రల్ డెల్టాకి 2,600, పశ్చిమ డెల్టాకు 7,300 క్యూసెక్కుల నీటిని యథావిధిగా విడుదల చేస్తున్నారు. జిల్లాలోని ఏలూరు కాలువకు 1,260, ఉండి కాలువకు 1,785, నరసాపురం కాలువకు 2,093, జీ అండ్ వీ కాలువకు 898, అత్తిలి కాలువకు 792 క్యూసెక్కుల నీరు చొప్పున వదులుతున్నారు. -
శ్రీవారి క్షేత్రంలో ఉట్లు పండుగ
ద్వారకాతిరుమల : శ్రీవారి క్షేత్రంలో ఉట్లు పండుగను శనివారం ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి మరుసటి రోజు ఈ వేడుకను జరపడం ఇక్కడ సాంప్రదాయ బద్ధమైంది. ఈ క్రమంలో చినవెంకన్న అమ్మవార్లతో కలసి క్షేత్రపురవీదుల్లో ఊరేగుతారు. అయితే మధ్యాహ్నం నుంచి అడపాదడప వర్షపు జల్లులు కురుస్తుండటంతో శ్రీవారి తిరువీధిసేవను ఆలయ అధికారులు రద్దు చేశారు. దీంతో ఆలయ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన ఉట్టిని కొట్టి, యువకులు ఆనందోత్సాహాలతో సందడి చేశారు. -
వాసవీ మాత.. ఆరాధ్య దేవత
పెనుగొండ: జై వాసవీ.. జై జై వాసవీ..జై వాసమాంబాయన నమః అంటూ పెనుగొండ క్షేత్రం మార్మోగింది. పెనుగొండ వాసవీ శాంతి ధాంలో అఖిల భారత శ్రీ వాసవీ పెనుగొండ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమ్మవారి నిజపాదాల ప్రతిష్ఠ వైభవోపేతంగా జరిగింది. దక్షిత భారతదేశంలోని పలు ప్రాంతాల నుంచి ఆర్యవైశ్యులు వేలాదిగా తరలివచ్చారు. పెనుగొండ పీఠాధిపతి కష్ణానందపురి స్వామీజీ, వేద పండితులు రామడుగుల లక్ష్మీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షుడు పీఎన్ గోవిందరాజులు, గౌరవ అధ్యక్షుడు ఎస్.రామమూర్తి నిజపాదుకల ప్రతిష్ఠను జరిపించారు. ఆర్యవైశ్యుల 102 గోత్రీకులకు సూచికగా 102 స్తంభాలతో 141 అడుగులు ఎత్తునిర్మించిన మందిరంలో 90 అడుగుల వాసవీ మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. 45 టన్నుల బరువు గల విగ్రహానికి గాను 1.55 టన్నుల పాదాలను పంచలోహాలతో తయారుచేశారు. అమ్మవారి పాదాల కింద తామ్ర, రజత, స్వర్ణ పత్రాలు నిక్షిప్తం చేసి పూర్ణాహుతి జరిపించారు. కలశాలతో భారీ ఊరేగింపు ముందుగా కర్ణాటక, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు 1008 కలశలతో భారీగా గ్రామోత్సవం నిర్వహించారు. వాసవీ మాత మూలవిరాట్ నగరేశ్వర మహిషాసురమర్దనీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో పూజలు చేశారు. అక్కడి నుంచి వాసవీ శాంతి ధాంకు చేరుకుని కలశాల్లోని పవిత్ర జలాలతో అమ్మవారి పాదాలను అభిషేకించారు. గ్రామోత్సవంలో కర్ణాటక కౌన్సిల్ చైర్మన్ డీహెచ్ శంకరమూర్తి, కర్ణాటక ఎమ్మెల్సీ టీఏ శరవణ, ఎమ్మెల్యే హెచ్పీ మంజునాథ్ పాల్గొన్నారు. వీరితో పాటు కోయంబత్తూరు నుంచి తరలి వచ్చిన ఆర్యవైశ్య మహిళలూ ఉన్నారు. 1.55 టన్నుల పాదాలు భారీ క్రేన్ సాయంతో 1.55 టన్నుల పాదాలను వేదికపై ఆశీనులు గావించారు. విగ్రహం 90 అడుగులు ఉండటంతో సుమారు 15 అడుగుల ఇనుప కమ్మిలను పాదాల మధ్యలో ఏర్పాటుచేసి ప్రతిష్ఠించారు. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా పెనుగొండ వాసవీ శాంతి ధాంతో పెనుగొండ ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా పేర్గాంచనుందని కర్ణాటక కౌన్సిల్ చైర్మన్ డీహెచ్ శంకరమూర్తి అన్నారు. వాసవీ పాదాల ప్రతిష్ఠ ఉత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రతి ఆర్యవైశ్యుడూ క్షేత్రాన్ని సందర్శించాలన్న ఉద్దేశంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. వాసవీ మాత ప్రపంచంలోనే తొలి శాంతిదూత అన్నారు. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా హింసకు తావివ్వకుండా శాంతి మార్గంలో వెళ్లాలన్న సందేశాన్ని అమ్మవారు ప్రపంచానికి తెలియజెప్పారన్నారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ప్రతిష్ఠ ఉత్సవాల్లో పాల్గొని పూజలు చేశారు. శాంతి ధాంలో రక్షిత మంచినీటి పథకాన్ని ప్రార ంభించారు. పీఠాధిపతులు రాక ప్రతిష్ఠ ఉత్సవాల్లో పెనుగొండ పీఠాధిపతి కష్ణానంద పురి స్వామిజీతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి పీఠాధిపతులు సదానందగిరి స్వామి, చిదానందగిరి స్వామి, సత్ చిత్త్ ఆనందగిరిస్వామి, శుద్ధ చైతన్యనందగిరి స్వామి, ఈశ్వరానంద స్వామి, వెంకటస్వామి, శంకర్ బాండు, మాత శివచైతన్యానంద, ప్రతిష్ఠానంద సరస్వతి స్వామి హాజరయ్యారు. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్, కర్ణాటక ఐటీ మంత్రి కార్యదర్శి నందకుమార్, ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.రామమూర్తి, అధ్యక్షుడు డాక్టర్ పీఎన్ గోవిందరాజులు, ఉపాధ్యక్షుడు ఎంవీ నారాయణ గుప్త, డాక్టర్ టీఏ శరవణ, కార్యదర్శి కేఆర్ కష్ణ, కోశాధికారి ఎన్ఎస్ శ్రీనివాసమూర్తి, కోట్ల వెంకటేశ్వరరావు, ఆర్పీ రవిశంకర్, ఎస్.సతీష్, టి.శ్రీనివాసమూర్తి, కోట్ల సూర్యారావు, కోట్ల కష్ణ మూర్తి పాల్గొన్నారు. -
డెల్టాకు నీటి విడుదల పెంపు
కొవ్వూరు : జిల్లాలో పశ్చిమ డెల్టా ఆయకట్టు పరిధిలో రైతుల సాగునీటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆదివారం నీటి విడుదలను స్వల్పంగా పెంచారు. గత రెండు రోజుల నుంచి ఏడు వేల క్యూసెక్కుల నీరు విడిచిపెడుతున్న అధికారులు అదనంగా మరో 300 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రధానంగా పశ్చిమడెల్టా పరిధిలోని ఏలూరు, అత్తిలి కాలువలకు శనివారం కంటే నీటి విడుదలను కాస్త పెంచారు. మిగిలిన కాలువలకు రెండు రోజుల నుంచి ఒకే మాదిరిగా సరఫరా చేస్తున్నారు. గోదావరి నుంచి విడిచిపెడుతున్న ఏడువేల క్యూసెక్కుల్లో ఉండి కాలువకు 1,714, నరసాపురం కాలువకు 2,020, గోస్తనీ(జీఅండ్వీ)కి 1,035 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. ఏలూరు కాలువకు 1,180 క్యూసెక్కుల నుంచి 1,246 క్యూసెక్కులకు, అత్తిలి కాలువకు 578 నుంచి 793 క్యూసెక్కులకు నీటి విడుదలను పెంచారు. తగ్గిన గోదావరి ఇన్ప్లో గోదావరిలో ప్రవాహ జలాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఇన్ఫ్లో 2,34,087 క్యూసెక్కులుగా నమోదైంది. సాయంత్రం ఆరు గంటలకు 2,22,341 క్యూసెక్కులకు ఇన్ఫ్లో తగ్గింది. -
రాష్ట్రస్థాయి బేస్బాల్ పోటీలు ప్రారంభం
పెదపాడు : రాష్ట్రస్థాయి బేస్బాల్ (సబ్ జూనియర్) పోటీలు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ప్రారంభమయ్యాయి. తొలుత ఈ పోటీలను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి బేస్బాల్ అసోసియేషన్ సంఘం అధ్యక్షతన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మరడాని అచ్యుతరావును అభినందించారు. తొలిరోజు బాలుర విభాగంలో కర్నూలు జిల్లాపై నెల్లూరు జిల్లా జట్టు, కృష్ణాపై చిత్తూరు, తూర్పు గోదావరి జట్టుపై ప్రకాశం జట్టు, గుంటూరు జట్టుపై పశ్చిమ గోదావరి జిల్లా జట్టు 11–4 స్కోర్తోనూ విజయం సాధించాయి. ఎంపీపీ మోరు శ్రావణి, జెడ్పీటీసీ కూరపాటి మార్తమ్మ, నాయకులు బొప్పిడి కాశీబాబు, గుత్తా అనిల్, సర్పంచ్లు పాల్గొన్నారు. -
దిగువపల్లెలో మహిళ హత్య
లింగాల : లింగాల మండలం దిగువపల్లెకు చెందిన జ్యోతి(40)ని శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో హత్య చేశారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల సమీపంలో పబ్లిక్ కుళాయి వద్ద తాగునీరు పట్టుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు అరటి పిలకలు కోసే ఢిల్లీ కొడవలితో దాడి చేసి హతమార్చారని ఎస్ఐ తిమ్మారెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కేతిరెడ్డి సూర్యనారాయణరెడ్డిని జ్యోతి, మురారిచింతల గ్రామానికి చెందిన రామాంజనేయులు, అశోక్, మస్తానయ్య, ఎన్.రామాంజనేయులు 2015 డిసెంబర్ 13న హత్య చేసి మురారిచింతల సమీపంలో ఎర్రబోటు కొండపై పూడ్చి వేశారు. ఈ కేసుకు సంబంధించి నిందితులు నాలుగు నెలల పాటు రిమాండులో ఉన్నారు. ఇటీవల ఆమె రిమాండు ముగియడంతో గ్రామానికి వచ్చింది. ఆమె మళ్లీ గ్రామంలో సంచరిస్తుండటంతో కేతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి బంధువులు జీర్ణించుకోలేక పోయారు. దీని కారణంగానే ఆమెను హత్య చేసి ఉంటారని ఎస్ఐ అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి సీఐ ప్రసాద్, ఎస్ఐ తమ సిబ్బందితో పరిశీలించారు. -
రూ.53 కోట్లతో సామాజిక సేవా కార్యక్రమాలు
నిడదవోలు : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ ద్వారా దేశంలో ఇప్పటివరకు రూ. 53 కోట్ల రూపాయలతో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు ఎల్ఐసీ సౌత్ ఇండియా జోనల్ చీఫ్ మేనేజర్ సునిల్కుమార్ పేర్కొన్నారు. మండలంలో శంకరాపురం గ్రామంలోని హృదయాలయానికి రూ.9 లక్షలు విలువ చేసే టాటా వింజర్ వాహనాన్ని శనివారం అందించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో ఆయన మాట్లాడుతూ 2006లో ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ ఏర్పడిందన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 341 ప్రాజెక్ట్ల ద్వారా విద్య, వైద్య, పేద విద్యార్థుల ఉపకార వేతనాలు స్వచ్ఛంద సంస్థలకు చేయూత, ఆసుపత్రులకు పరికరాల కొనుగోలు వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించమన్నారు. వీటి కోసం ఇప్పటి వరకు రూ. 53 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన పేద మెరిట్ విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారి చదువు కోసం ఎల్ఐసీ ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని చెప్పారు. దేశవ్యాప్తంగా పేద విద్యార్థులకు రూ. 20 కోట్ల మేర ఉపకార వేతనాలని అందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసీ రాజమండ్రి డివిజన్ మేనేజర్ జె.రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
గోదావరిలో వరద తగ్గుముఖం
కొవ్వూరు : గోదావరిలో వరద తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఇన్ఫ్లో తగ్గడంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శనివారం ఉదయం ఆరు గంటలకు గోదావరి నుంచి 2,62,086 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. సాయంత్రానికి ఇన్ఫ్లో మరింత తగ్గింది. ఆరు గంటల నుంచి 2,44,475 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీనిలో 14,100 క్యూసెక్కుల నీటిని ఉ«భయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు సరఫరా చేస్తున్నారు. తూర్పు డెల్టాకి 4,600, సెంట్రల్ డెల్టాకి 2,500, పశ్చిమడెల్టాకి ఏడు వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. ఆనకట్టకి ధవళేశ్వరం, మద్దూరు ఆర్మ్లలోని 109 గేట్లును 0.40 మీటర్లు, ర్యాలీ, విజ్జేశ్వరం ఆర్మ్ల్లోని 66 గేట్లును 0.50 మీటర్లు ఎత్తు లేపి వరదనీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. పశ్చిమ డెల్టాకి 7 వేల క్యూసెక్కుల నీరు విడుదల ఇది ఇలా ఉండగా జిల్లాలోని పశ్చిమ డెల్టా కాలువకు 7 వేల క్యూసెక్కుల నీటిని సాగునీటి అవసరాల నిమిత్తం విడిచిపెడుతున్నారు. జిల్లాలో ఏలూరు కాలువకు 1,180 క్యూసెక్కులు, ఉండి కాలువకు 1,714, నరసాపురం కాలువకు 2,020, గోస్తనీ(జీఅండ్వీ)కి 1,035, అత్తిలి కాలువకు 578 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. -
శ్రీవారి సేవలో జస్టిస్ దల్వీర్ బండారి
సాక్షి, తిరుమల: ఇంటర్ నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ జడ్జ్ జస్టిస్ దల్వీర్ బండారి శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలసి ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్ పట్టువస్త్రంతో సత్కరించి, లడ్డూప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట ప్రోటోకాల్ జడ్జి శేషాద్రి ఉన్నారు. -
ఉద్యోగులకు కనీస వసతులు కల్పించాలి
ఏలూరు (మెట్రో) : జిల్లాలో ప్రతి శాఖలో సిబ్బందికి మరుగుదొడ్డి, మంచినీళ్లు వంటి కనీస వసతులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో బయోమెట్రిక్, ఇ–కార్యాలయం విధానం అమలు ప్రగతిపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పలు శాఖా కార్యాలయాలను తాను స్వయంగా పరిశీలిస్తే ఆయా కార్యాలయాల్లో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నట్టు తెలిసిందని, పలువురు వారి వారి సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని కలెక్టర్ చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతి కార్యాలయంలో కనీస వసతులు కల్పించాలని కలెక్టర్ భాస్కర్ అధికారులను ఆదేశించారు. ప్రతి నెలలో మొదటి శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు సిబ్బంది వారి కార్యాలయాల్లో పరిశుభ్రత చేసుకోవాలని సూచించారు. -
కళకళా గోదారి
పావన వాహిని పరవళ్లు.. భక్తజన కేరింతలు.. కలగలసి గోదారమ్మ తీరం కళకళలాడింది. వెతలు తీర్చే దేవేరి.. వేదమంటి జీవధార‡ చెంతకు వారాంతాన యాత్రికులు పోటెత్తారు. పుణ్యస్నానమాచరించి పులకించారు. తన్మయత్వంలో మునిగారు. పసుపు, కుంకుమతో గంగమ్మను అర్చించారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : గోదావరి తీరం శనివారం భక్తజన సందోహంతో నిండిపోయింది. అంత్యపుష్కరాల ఏడోరోజు భారీ సంఖ్యలో యాత్రికులు తరలివచ్చారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 65వేల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్టు అంచనా. తెల్లవారుజామునుంచే అన్ని ఘాట్లలోనూ రద్దీ నెలకొంది. గోదారి తీరాన భక్తులు ప్రణమిల్లారు. పసుపు, కుంకుమలతో గంగమ్మను అభిషేకించారు. పూర్వీకులకు పిండప్రదాన క్రతువులు నిర్వహించారు. గత ఏడురోజులుగా కొవ్వూరులో సుమారు లక్షన్నర మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారని అంచనా. ఒక్క శనివారమే 32 వేల మంది స్నానం చేశారని సమాచారం. శనివారం నరసాపురంలోనూ భక్తులు పోటెత్తారు. వలంధర్రేవులో మధ్యాహ్నం వరకూ భక్తుల రద్దీ తగ్గలేదు. శ్రావణమాసం రెండో రోజు కావడంతో యాత్రికుల సంఖ్య పెరిగిందని తెలుస్తోంది. నరసాపురంలో సుమారు 20 వేల మందిపైనే స్నానాలు చేశారని అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా వలంధర్రేవులో ఏర్పాటు చేసిన జల్లుస్నానం చేయడానికి భక్తులు ఎక్కువ ఆసక్తి కనబరిచారు. గోదావరి వరద తీవ్రత కాస్త తగ్గడంతో కొవ్వూరు గోష్పాదక్షేత్రంలోని మొదటి, రెండు ఘాట్లలోనూ స్నానాలకు అధికారులు అనుమతించారు. శుక్రవారం వరద ఉధృతంగా ఉండడం వల్ల ఆ రేవులను మూసివేసిన సంగతి తెలిసిందే. వరద సమయంలో చేసిన రక్షణ ఏర్పాట్లను సడలించకపోవడంతో మెట్లపై తగిన నీరు లేక స్నానాలకు భక్తులు అవస్థలు పడ్డారు. అంత్యపుష్కరాల సందర్భంగా పలుచోట్ల గోదావరి మాతకు నిత్యహారతులు ఇస్తున్నారు. కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో గోదావరి నీరాజన సమితి ఆధ్వర్యంలో పూజలు చేశారు. పట్టిసీమలో గోదావరి మాతకు గంగ పూజలు నిర్వహించారు. -
కృష్ణా పుష్కరాలకు ట్రాఫిక్ మళ్లింపు
ఏలూరు (మెట్రో): కృష్ణా పుష్కరాల నేపథ్యంలో ఈనెల 12వ తేదీ నుంచి ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకుంటున్నట్టు ఏలూరు రేంజ్ డీఐజీ పీవీ రామకృష్ణ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం విలే కరుల సమావేశంలో డీఐజీ మాట్లాడారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. చెన్నై నుంచి విశాఖ వెళ్లే వాహనాలు, విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాల దారి మళ్లించేందుకు వేరే మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. త్వరలోనే ట్రయిల్ రన్ వేసి మార్గాలను ప్రకటిస్తామన్నారు. పుష్కరాల సమయంలో ట్రాఫిక్ మళ్లింపు విషయంలో ప్రజలు సహకరించాలని కోరారు. అదే విధంగా పుష్కరాలకు వచ్చే యాత్రికులు నిర్దేశించిన పార్కింగ్ స్థలాల వరకే వారి వాహనాలను అనుమతిస్తామన్నారు. ఘాట్లలోనూ ప్రత్యేకంగా లోపలికి, బయటకు వేర్వేరుగా మార్గాలను ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డీఐజీ రామకృష్ణ కోరారు. -
4,11,725 కుటుంబాల సర్వే పూర్తి
ఏలూరు (మెట్రో): జిల్లాలో ఇప్పటివరకూ 11 లక్షల 41 వేల 142 మంది సమగ్ర వివరాలను ప్రజాసాధికారి సర్వేలో నమోదు చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు తెలిపారు. విజయవాడ నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్లతో శనివారం సాయంత్రం ప్రజాసాధికారిత సర్వేలో సాంకేతిక లోపాల నివారణపై కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 39 లక్షల జనాభాకు సంబంధించి ప్రజాసాధికారి సర్వే ప్రారంభించి నెల రోజులు గడవగా 4 లక్షల 11 వేల 725 కుటుంబాలకు చెందిన సమగ్ర సమాచారాన్ని సేకరించామని జేసీ కోటేశ్వరరావు తెలిపారు. సర్వేలో కచ్చితంగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని కృష్ణా జిల్లా జేసీ బాబు సూచించారు. డీఆర్వో ప్రభాకరరావు, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ దొర, ప్రజాసాధికారి సర్వే సమన్వయకర్త గంగరాజు పాల్గొన్నారు. -
మత్స్యకార సొసైటీలకు రుణాలు
ఆకివీడు: జిల్లాలో మత్స్యకారుల వ్యాపార తోడ్పాటుకు రుణాలు అందజేయనున్నామని డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం తెలిపారు. స్థానిక రూరల్ బ్యాంక్ ఆవరణలో శనివారం మత్స్యకారులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. మత్స్యకారులు సొసైటీలుగా ఏర్పడితే సమగ్ర సహకార అభివృద్ధి పథకం(ఐసీడీపీ) ద్వారా సబ్సిడీతో కూడిన రూ.లక్ష రుణం అందజేస్తామని చెప్పారు. ఈ మేరకు జిల్లాలో రూ.30 లక్షలు రుణాలుగా అందజేసేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. మత్స్యకారులు వ్యాపార నిమిత్తం రుణాన్ని వినియోగించుకోవాలని కోరారు. రుణంలో రూ.20 వేలు సబ్సిడీ ఉంటుందన్నారు. జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు అండ్రాజు చల్లారావు మాట్లాడుతూ గతంలో మత్స్యకార సొసైటీలకు రుణాలు మంజూరుచేసేందుకు నిధులు విడుదల కాగా బీ–క్లాస్ సొసైటీలు ఉన్నందున వెనక్కి Ðð ళ్లిపోయాయన్నారు. నాబార్డు ద్వారా ఆ నిధులను మళ్లీ రాబట్టి డీసీసీబీ ద్వారా ఇచ్చేందుకు చైర్మన్ రత్నం అంగీకరించడం అభినందనీయమన్నారు. జిల్లాలో 250 మత్స్యకార సొసైటీలు ఉన్నాయని వాటిని ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు కొప్పనాతి నర్సింహరావు, బి.మధుసూదన రావు, బి.ఏడుకొండలు, అండ్రాజు రామన్న, డీసీసీబీ డైరెక్టర్ విజయ నర్సింహరావు, ఐసీడీపీ అధికారులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ ముద్రను చెరపగలరా!
ఏలరు (ఆర్ఆర్ పేట) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల్లోంచి ఆయన ముద్రను చెరపలేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని అన్నారు. విజయవాడలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొలగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి స్వర్ణయుగాన్ని చూపిన మహానేతవైఎస్ రాజశేఖరరెడ్డి తీపి గుర్తులను ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని ఆయన పేర్కొన్నారు. అడిగిన వారికి, అడగని వారికి కూడా అనేక సంక్షేమ పథకాలు అమలుచేసి ప్రజల హృదయాల్లో ఆయన చిరస్మరణీయ ముద్ర వేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ ముద్రను ప్రజల హృదయాల నుంచి వేరు చేయడం సాధ్యం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దారుణాల మీద దారుణాలు చేస్తోందని, ఇప్పటికే ఆలయాలను కూల్చి మహాపాతకానికి ఒడిగట్టిన ప్రభుత్వం ఇప్పుడు మహా నాయకుల విగ్రహాల కూల్చివేస్తుండటం దురదృష్టకరమని నాని ధ్వజమెత్తారు. ప్రజల మనిషిగా కీర్తింపబడిన నాయకుడి విగ్రహాన్ని తొలగించడం ప్రభుత్వ దుశ్చర్య అని, ప్రజల నుండి వెల్లువెత్తే ప్రభుత్వ వ్యతిరేక ఉప్పెనలో ఈ పాలకులు కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. ప్రభుత్వం ఇటువంటి విధానాలన్నింటికీ సమాధానం చెప్పాల్సిన సమయం త్వరలోనే వస్తుందన్నారు. స్ఫూర్తిప్రదాతకు అవమానం : పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశవిదేశాలకు చెందిన ఎందరో నాయకులకు స్ఫూర్తిగా నిలిచాయని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు అటువంటి మహానేత విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గమన్నారు. ప్రజాభిమానాన్ని పొందిన అతికొద్దిమంది నాయకుల్లో ఒకరైన గొప్ప నాయకుడికి జరిగిన అవమానం తమకు జరిగినట్టుగా ప్రజలు భావిస్తున్నారని, ప్రభుత్వం చేసిన తప్పును వెంటనే సరిదిద్దుకుని విగ్రహాన్ని పునః ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. -
మన్యంలో జూనియర్ సివిల్ జడ్జి పర్యటన
బుట్టాయగూడెం : మండలంలోని మారుమూల గ్రామమైన దండిపూడిలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పాల్గొనేందుకు వెళ్లిన జంగారెడ్డిగూడెం కోర్టు జూనియర్ సివిల్ జడ్జి డి.అజయ్కుమార్ నక్సల్స్ ప్రభావిత అటవీ కొండ ప్రాంతంలో సుమారు కిలోమీటరున్నర నడుచుకుంటూ వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ ప్రాంతంలో పర్యటించిన తొలి న్యాయమూర్తి కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈయన పర్యటనలో ఆ ప్రాంత కొండరెడ్డి గిరిజనుల పోడు వ్యవసాయం, వారు పండించే పంటలు, వారి స్థితిగతులు, సంస్కతి సంప్రదాయాల గురించి అక్కడవారిని అడిగి తెలుసుకున్నారు. మారుమూల కుగ్రామమైన దండిపూడిలో మెడికల్ క్యాంపుకు జడ్జి పాల్గొంటున్నారని సమాచారం అందుకున్న పోలీసులు తొలుత అభ్యంతరం తెలిపారు. అయినా న్యాయవాదులు అంగీకరించలేదు. వైద్య శిబిరంలో పాల్గొన్న జడ్జి ఆ కొండ ప్రాంత వాతావరణం చూసిన వెంటనే అటువైపు పర్యటించారు. మధ్యాహ్న సమయానికి కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకొని జడ్జి వెళ్లిపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
కృష్ణా పుష్కరాల్లో ఆర్యవైశ్య సేవలు
ఏలూరు (ఆర్ఆర్పేట) : రానున్న కృష్ణా పుష్కారాలకు విచ్చేసే భక్తుల కోసం ఆర్యవైశ్యులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర వాసవీ సేవాదళ్ చైర్మన్ చుండూరు ఉమా మహేశ్వరరావు తెలిపారు. కష్ణా పుష్కరాల సందర్భంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో శ్రీ శివస్వామి ఆధ్వర్యంలో నిర్వహించనున్న అతిరుద్ర మహాయాగం కరపత్రాలను శనివారం స్థానిక వాసవీ కన్యకా పరమేశ్వరి సత్రంలో ఆవిష్కరించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా నగరానికి విచ్చేసిన ఉమా మహేశ్వరరావు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ, వాసవీ సేవాదళ్, ఆర్యవైశ్య యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణా పుష్కర భక్తులకు అల్పాహారం, మంచినీరు, భోజన సదుపాయాలు కల్పించనున్నట్టు తెలిపారు. అతిరుద్ర మహాయాగం 12 రోజులపాటు జరుగుతుందని, రోజూ 200 మంది పీఠాధిపతులు ఉదయం, సాయంత్రం 900 మంది దంపతులు ఈ యాగంలో పాల్గొంటారని చెప్పారు. ఈ యాగాన్ని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ప్రారంభిస్తారని చెప్పారు. కృష్ణా పుష్కరాల ముగింపు కార్యక్రమం తాళ్లాయపాలెంలో జరగనున్నట్టు వివరించారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు అంబికా రాజా మాట్లాడుతూ పుష్కరాల్లో సేవ చేయడానికి ముందుకు వచ్చేవారు తమ పాస్పోర్టు ఫొటో, ఆధార్ కార్డుతో సహా తాళ్లాయపాలెం రావచ్చన్నారు. గొంట్లా రామ్మోహనరావు, పయిడేటి రఘు, మద్దుల రవి కుమార్, మద్దుల ప్రసాదరావు, వాసవి సుబ్బారావు, పయిడేటి భవాని, టీవీ సుబ్బారావు, గూడవల్లి శ్రీనివాస్, ఎం.సదానందకుమార్ పాల్గొన్నారు. -
జాబ్మేళాకు భారీ స్పందన
భీమవరం : భీమవరం పట్టణంలోని శ్రీవిష్ణు కళాశాలల ప్రాంగణంలో శనివారం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీ జాబ్మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 7,500 మంది హాజరయ్యారు. ఈ మేళాలో టెక్ మహేంద్ర, అపోలో, ప్లిప్కార్డ్, వరుణ్ మోటార్స్, బిగ్ సీ వంటి ప్రసిద్ధి చెందిన 16 సంస్థలు పాల్గొన్నాయి. జాబ్మేళాకు 10వ తరగతి నుంచి పీజీ వరకు 7,600 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని జిల్లా స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ విభాగం అసోసియేట్ మేనేజర్ ఎ.కృష్ణారెడ్డి చెప్పారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.1.40 లక్షల నుంచి రూ.3.20 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉంటుందన్నారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలు తరువాత ప్రకటిస్తామని కృష్ణారెడ్డి చెప్పారు. జాబ్మేళాను ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ టీపీవో డాక్టర్ జగన్మోహన్రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు పర్యవేక్షించారు. -
రేపు బీసీ చైతన్య సదస్సు
హన్మకొండ : భూపాలపల్లిలో శనివారం బీసీ చైతన్య సదస్సు ఏర్పాటుచేసినట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్లకొం డ వేణుగోపాల్ తెలిపారు. హన్మకొండలోని హరితకాకతీయ హోట ల్లో గురువారం జరిగిన సంఘం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘాన్ని బలోపేతం చేయడంలో భాగంగా చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు భూపాలపల్లిలో 30వ తేదీన జరగనున్న సదస్సులో సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. సదస్సుకు రాజకీయాలకతీతంగా బీసీ ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, యువత, విద్యార్థులు హాజరుకావాలని కోరారు. దొడ్డపల్లి రఘుపతి, తాళ్ల సంపత్కుమార్, సబ్బు అనిల్కుమార్, ఇందారపు మహేష్కుమార్, చిట్యాల పురుషోత్తం, నాగపురి పవన్కుమార్ పాల్గొన్నారు. -
రెండిళ్లల్లో చోరీ
రూ.65 వేల నగదు, 3 సవర్ల బంగారు, రెండు సెల్ఫోన్ల చోరీ తడ : తడలో శనివారం రాత్రి గుర్తుతెలియని దొంగలు రెండిళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. పోలీసుల కథనం మేరకు.. స్థానిక రైల్వే క్వార్టర్స్లో నివాసం ఉంటున్న కుప్పంపాటి నాగరాజకు చెందిన 14ఏ క్వార్టర్స్, దానికి వెనుక వైపున కోనేటి కట్ట వద్ద ఉన్న వెంకటేశ్వర్లు ఇంట్లో దుండగులు చోరీలు చేశారు. నాగరాజ కుటుంబ సభ్యులు ఇంట్లో లేని విషయం గమనించి తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించి బీరువాలోని సుమారు రూ.50 వేల నగదు, మూడు సవర్ల బంగారు నగలను, విలువైన చీరలను అపహరించారు. ఉదయం ఇంటికి వచ్చిన చూసిన బాధితుడు చోరీ జరిగినట్లు గుర్తించాడు. మరో ఇంట్లో జరిగిన చోరీని పరిశీలిస్తే వెంకటేశ్వర్లుకు చెందిన ఇంట్లో శ్రీసిటీలో పనిచేసే ఉత్తరాది ప్రాంతానికి చెందిన యువకులు అద్దెకు ఉంటున్నారు. వారు తలుపులు తీసి నిద్రిస్తుండగా లోనికి ప్రవేశించిన దొంగలు వారి బ్యాగులు బయటకు తీసుకు వచ్చి అందులోని రూ.15 వేల నగదు, రెండు సెల్ఫోన్లను అపహరించారు. ఆదివారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో కూడా చోరీ జరగలేదని వీరు తెలిపారు. బాధితుల ఫిర్యాదు అందుకున్న తడ పోలీసులు సంఘటనా స్థలాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పంపుల బావిలో పడి రెండేళ్ల చిన్నారి మృతి
చినమిల్లిపాడు(ఆకివీడు) : చినమిల్లిపాడు మంచినీటి చెరువు సమీపంలోని పంపుల బావిలో ప్రమాదవశాత్తూ పడ డంతో ఓ రెండేళ్ల బాలుడు మరణించాడు. ఈ ఘటన శనివారం జరిగింది. చెరువు సమీపంలో నివశిస్తున్న నత్తా ఏసుబాబు ధనలక్ష్మిల రెండవ కుమారుడు రెక్కి(2) ఆడుకుంటూ వెళ్లి పంపుల బావిలో పడిపోయాడు. బావిపై మూత లేకపోవడంతోపాటు బాలుడిని ఎవరూ గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ తర్వాత బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రు లు వెతుకులాట ప్రారంభిం చారు. ఆఖరుకు బావిలో చిన్నారి మృతదేహం కనిపించింది. దీంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంపై ఏసోబు బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. -
కుంభవృష్టి
ఏలూరు (ఆర్ఆర్ పేట)/తాడేపల్లిగూడెం రూరల్ : జిల్లాలో పలుచోట్ల శనివారం కుంభవృష్టి వర్షం కురిసింది. అక్కడక్కడా చిరుజల్లులు పడ్డాయి. కొన్నిచోట్ల మోస్తరు వర్షం కురవగా.. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, కొవ్వూరు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. వర్షం కారణంగా తాడేపల్లిగూడెంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏలూరు, నిడదవోలు, తణుకు, దెందులూరు, అచంట ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. చింతలపూడి, పాలకొల్లు, భీమవరం, ఉండి, గోపాలపురం, పోలవరం ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. కుండపోత వర్షానికి తాడేపల్లిగూడెంలో నీట మునిగిన ప్రధాన రహదారి ఇది. -
అక్రమంగా నిల్వ చేసిన కలప స్వాధీనం
కొయ్యలగూడెం : కన్నాపురం గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన కలపను అటవీ శాఖ ఉన్నతాధికారులు శనివారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. స్క్వాడ్ డీఎఫ్వో గురుప్రభాకర్ నేతృత్వంలో రాజమండ్రి నుంచి వచ్చిన అధికారులు ఎస్సీ ఏరియాలోని ఓ ప్రాంతంలో దాడులు చేశారు. సుమారు రూ.30 వేల విలువైన కలపను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కన్నాపురం వాసులైన కె.రామకృష్ణ, చరిమళ్ల రాంబాబు నుంచి ఈ కలపను స్వాధీనం చేసుకున్నట్టు అటవీశాఖ కార్యాలయ డీఆర్వో శ్రీనివాస్ తెలిపారు. అలాగే ముప్పిడి శ్రీను అనే వ్యక్తి వద్ద అక్రమంగా కలప నిలవ ఉండడంతో రూ. 14 వేల జరిమానాను విధించామని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న కలపను కన్నాపురం కార్యాలయానికి తరలించామని వెల్లడించారు. -
పశ్చిమ డెల్టాకు 6,500 క్యూసెక్కులు విడుదల
కొవ్వూరు : జిల్లాలో గోదావరి డెల్టా ఆయకట్టు పరిధిలోని పశ్చిమ డెల్టా కాలువకి శనివారం 6,500 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. ఏలూరు కాలువకి 1,133 క్యూసెక్కులు, ఉండి కాలువకి 1,826, నర సాపురం(కాకరపర్రు) 1,983, జీ అండ్ వీ(గోస్తనీ) 636, అత్తిలి(గొడిచర్ల) కాలువకి 677 క్యూసెక్కులు విడిచిపెడుతున్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. -
టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరిక
వాదాలకుంట (గోపాలపురం): టీడీపీ నాయకులు కార్యకర్తలను పట్టించుకోకుండా కేవలం ఒక వర్గానికి మాత్రమే ముఖ్యమంత్రి అభివద్ధి, సంక్షేమాలను అందిస్తున్నారని వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు విమర్శించారు. మండలంలోని వాదాలకుంటలో శనివారం జరిగిన గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో టీడీపీకి చెందిన పలువురు కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి తలారి వెంకట్రావు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు ప్రజలు విసుగు చెందారన్నారు. రాబోయే రోజుల్లో జగన్ నాయకత్వంలో పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీలోకి చేరిన వారిలో ఇంజే నాగశ్రీనివాసరావు, దౌలూరి చిన వెంకటరావు, రాపాక చిన వెంకయ్య, ఏలిపిన వీర్రాజు, బెల్లపు ఏసురత్నం, ఏలిపిన నాగేశ్వరావు, దౌలూరి గంగరాజు, చింతల వెంకటేశు, పల్లంట్ల చినవెంకటేశు, బొందారాముడు, పెనుమాల దుర్గారావు, పొన్నాటి నరసింహారావు ఉన్నారు. గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు, సొసైటీ అధ్యక్షుడు వుండవల్లి సత్యనారాయణ (చిన్నబ్బులు), గ్రామ కమిటీ అధ్యక్షుడు ఉప్పలపాటి నాగేశ్వరావు, దుగ్గిరాల వీరరాఘవులు, మండల సేవాదళ్ అధ్యక్షుడు కొడమంచిలి విజయ్కుమార్, ఖండవల్లి సురేష్, జొన్నకూటి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
శనివారం టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ
-
టార్గెట్ శనివారమే!
సాక్షి, హైదరాబాద్: సోమవారం వచ్చిందంటే చాలు ఏ మూలన ఏ బ్యాంకు దొంగతనం వ్యవహారం వెలుగులోకి వస్తుందా అని చూడాల్సిన పరిస్థితి ప్రస్తుతం పోలీసు విభాగంలో నెలకొంది. బ్యాంకుల్లో ఉన్న లోపాలకు తోడు.. దొంగలు అనుసరిస్తున్న పంథానే దీనికి కారణం. తీరిగ్గా తమ పని పూర్తి చేసుకోవడంతోపాటు విషయం బయటకు పొక్కేలోపే సురక్షితమైన ప్రాంతానికి చేరుకోవడం కోసం దొంగలు ‘టార్గెట్ శనివారం’ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఇలాగే, రెండు తెలుగు రాష్ట్రాల్లో శనివారం జరిగిన మూడు బ్యాంకు దొంగతనాలు సోమవారం బయటపడ్డాయి. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెంలో ఉన్న సప్తగిరి గ్రామీణ బ్యాంకును శనివారం రాత్రి దొంగలు కొల్లగొట్టారు. అలాగే వరంగల్ జిల్లా భూపాలపల్లి, ఆజాంనగర్ ఏపీజీవీబీ బ్యాంకుల్లోనూ దొంగతనాలు జరిగాయి. అలాగే ఈ ఏడాది జనవరిలో మెదక్ జిల్లా జహీరాబాద్లో ముత్తూట్ ఫైనాన్స్, ఆగస్టులో మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లోని గ్రామీణ వికాశ్ బ్యాంకుల్లో జరిగిన భారీ చోరీలు శనివారమే చోటు చేసుకున్నాయి. ఇవే కాకుండా పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో చోరీ యత్నాలు కూడా శనివారమే జరిగి సోమవారం వెలుగులోకి వచ్చాయి. పొరుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్లకు చెందిన అనేక ముఠాలు బ్యాంకులు, భారీ ఫైనాన్స్ సంస్థల్నే టార్గెట్గా చేసుకుని పంజా విసురుతున్నాయని ఇప్పటికే నిర్ధారణైంది. ఏదైనా నేరం జరిగిన తరవాత విషయం ఎంత త్వరగా పోలీసులకు తెలిస్తే.. దొంగల్ని పట్టుకోవడానికి అంత ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే శనివారం చోరీ చేస్తే మరుసటి రోజు సెలవు కావడంతో బ్యాంకు సిబ్బంది సహా ఎవ్వరూ దాన్ని గుర్తించే అవకాశం ఉండదు. సోమవారం ఉదయం వరకు ఈ విషయం వెలుగులోకి రాదు. ఇలా తమ చేతిలో ఉంటున్న 24 గంటలకు పైగా కాలాన్ని వినియోగించుకుంటున్న పొరుగు రాష్ట్రాల ముఠాలు క్షేమంగా తప్పించుకుంటున్నాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న పోలీ సు విభాగం బ్యాంకుల్ని అప్రమత్తం చేయాలని భావిస్తోంది. సెలవు దినాల్లో సైతం ఓ బాధ్యతగల ఉద్యోగి వచ్చి బ్యాంకును పరిశీలించి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరనుంది. -
శనివారం సీఎం పదవికి పరిక్కర్ రాజీనామా!
-
ఘర్షణెందుకురా మగడా అంటే...?
ఉత్త(మ)పురుష మావారికి నాతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం అంటే చాలా సరదా. నాకేమో ఇంట్లో ప్రశాంతత ఇష్టం. ఏ చిన్న సంఘటన జరిగినా చాలు... దాంట్లోంచి ఏదో ఒక పాయింట్ను పట్టుకుని అదేపనిగా వాదిస్తుంటారాయన. ఆయన వాదనలెలా ఉంటాయంటే... నేనోరోజు పప్పు వండుతాను. ఆరోజు చికెన్ ఎందుకు చేయలేదని గొడవ. ఇవ్వాళ్ల శనివారం కదా అందుకే వండలేదంటాను నేను. అప్పుడు స్పీచ్ మొదలు... ‘‘నువ్వసలు జీవహింసే చేయదలచుకోలేదనుకో. ఇక చికెన్ తినడం పూర్తిగా మానెయ్. అంతేగానీ... శనివారం ఒక్కరోజు తినకుండా ఉండి, ఆ తర్వాతి రోజుల్లో తింటూ ఉంటే ఏం లాభం? పైగా నువ్వు ఆ ఒక్క రోజూ వండనంత మాత్రాన నిన్ను కోడిజనబాంధవురాలని ఎవరూ అనరు. అంతరించిపోతున్న కోడి జాతికి నువ్వు చేసిన సేవలకు నీకెవరూ పక్షివిభూషణ, పక్షిభూషణ, పక్షిరత్న లాంటి బిరుదేమీ ఇవ్వరు. కాబట్టి ఇలాంటివేవీ పెట్టుకోకు. ఇకనుంచి శనివారమైనా కోడి వండాల్సిందే’’ అంటూ లెక్చర్ ఇస్తారు. అసలు ఆయనకు ఇదేం బుద్ధో నాకు అర్థం కాదు. ఆయనకు తినాలని ఉంటే శనివారం మాత్రం నేను వండకుండా ఉంటానా? ‘‘ఇవ్వాళ్ల ఏం తింటారు మహానుభావా’’... అని నేను అడుగుతూనే ఉంటాను. ఓ పట్టాన జవాబివ్వరు. ఇక వంటకు ఆలస్యం అయిపోతోందంటూ హడావుడిగా ఏదో చేసేస్తాను. ఒకవేళ ఆయనకు నిజంగానే కోడి తినాలని ఉందే అనుకుందాం. మార్కెట్కు వెళ్లి చికెన్ తెచ్చి ఇవ్వవచ్చు కదా. అదేం చేయరు. కానీ... భోజనం తయారు అని నేననగానే ఆయనా తయారు... మళ్లీ గొడవకూ, ఘర్షణకు. ఆయన పెట్టే ఈ ఆరళ్లూ... ఈ అల్లర్లూ తట్టుకోలేక ఒక రోజున గట్టిగానే నిలదీశా. అలాంటి రియాక్షన్ నా నుంచి ఎదురు చూళ్లేదాయన. అందుకే కాస్త దెబ్బతిన్నట్టు చూశారు. కాస్త దార్లోకి వస్తూ వస్తూనే మళ్లీ ఎంత చెడ్డా ఆ పురుషాహంకారం కాస్త గాడి తప్పిస్తుంటుంది. ఆ పురుషాధిక్య బుద్ధి ఎక్కడికి పోతుందీ? అందుకే దిగి వస్తూ కూడా తన మాటల్లో కాస్త సైన్సూ, రొమాన్సూ కలగలిపి చెప్పారు. ‘‘ఏవోయ్... తరచు ఏదో ఒక విషయంపై గొడవ పడుతూ, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరెందుకూ, ఎప్పుడూ ఏదో ఘర్షణ లేకపోతే మీకు తోచదా?... గొడవ లేకుండా సంసార పడవ నడవదా అంటుంటావ్ కదా. ఎడ్డెమంటే తెడ్డెమంటూ అడ్డు వేస్తున్నామనుకో. అంటే ఏమిటన్నమాట? మన మధ్య ఘర్షణ ఉంటుందన్న మాట. ఘర్షణ అంటే మరేమిటో కాదు... ఫ్రిక్షన్. ఈ ఫ్రిక్షన్ వల్లనే గచ్చు మీద నడుస్తున్నా అడుగు కుదురుగా పడుతుంది. నడక చెదరకుండా సాగుతుంది. ఆ ఫ్రిక్షనే లేదనుకో. ఆ నడక గచ్చు మీద కాకుండా, రొచ్చులోన నడచినట్టయి, జర్రుమంటూ జారిపడతాం. కాబట్టి సంసారంలో నిత్యం కావాల్సిందే ‘ఘర్షణ’. అందుకే నిత్యం నీతో నా సంఘర్షణ’’ అంటూ ముగించారాయన. ఈ పురుషపుంగవులున్నారే! రొచ్చుమీద ఫ్రిక్షన్ తగ్గి కిందపడ్డా... తమ కాలుపైనే, పైపైనే అంటారు. ఏం మగాళ్లో ఏమో?! - వై! -
అలీ శనివారం స్పెషల్
కాళ్ల చెప్పుల దగ్గర నుంచి కట్టుకున్న బట్టలు, చేతికి చుట్టుకున్న వాచీ, నడుముకు పెట్టుకున్న బెల్ట్ ఇలా.. పైనుంచి కింది దాకా నలుపు ఆహార్యంతోహాస్యనటుడు అలీ శనివారంఓ కార్యక్రమంలో తారసపడ్డారు.ప్రతి శనివారం తన గెటప్ ఇలాగే ఉంటుందని ‘సిటీ ప్లస్’తో చెప్పారు. సాక్షి, సిటీప్లస్ -
బియాస్ నదిలో ఫలించని అన్వేషణ
సిమ్లా: బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం చేపడుతున్న గాలింపు చర్యలు శనివారం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. రోజంతా గాలించినా ఒక్క మృతదేహం కూడా దొరకలేదు. నదిలో 450 మంది జవాన్లతో ప్రతి అంగుళం గాలించామని మండి కలెక్టర్ దేవేష్ కుమార్ చెప్పారు. లార్జీ డ్యామ్ దిగువన నదిలో మూడు కిలో మీటర్ల వరకు ఆపరేషన్ జరిగినట్టు చెప్పారు. ఆదివారం కూడా ఆపరేషన్ కొనసాగించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. పాండో డ్యామ్కు ఎగువన తొమ్మిది కిలో మీటర్ల పరిధిలో మరోసారి గాలిస్తామని చెప్పారు. అత్యాధునిక స్కైట్ స్కానర్ రప్పిస్తున్నామని, శవాలు బురదలో ఉన్నా గుర్తించేందుకు వీలవుతుందని తెలిపారు. మూడో ప్రత్యామ్నాయంగా సోమవారం పాండో డ్యామ్లో ఉన్న నీటిని ఖాళీ చేయించి గాలింపు చర్యలు చేపడుతామని కలెక్టర్ చెప్పారు. హైదరాబాద్లోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 24 మంది బియాస్ నదిలో గల్లంతైన సంగతి తెలిసిందే. వీరిలో ఎనిమిది మంది మృతదేహాలను వెలికితీయగా, మిగిలిన వారీ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. -
సంతాన లక్ష్మి.....
సంతాన లక్ష్మి.. పేరంటాలమ్మ పెదకాకాని, : పెదకాకానిలోని పేరంటాలమ్మ తిరునాళ్లకు ఆలయూన్ని ముస్తాబు చేస్తున్నారు. 323వ తిరునాళ్ల మహోత్సవం నుంచి ఆరు రోజులపాటు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు. ఉత్సవాలకు బొల్లి ఆవులను సిద్ధం చేస్తున్నారు. గ్రామ పుర వీధుల్లో ఊరేగింపుగా భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు. తొలి సిడిమాను భాగవతులు తిరిగే సంప్రదాయంతో.. పెదకాకానికి చెందిన దానబోయిన వెంకుతాత, నానమ్మ దంపతులు సంతానం కోసం కృష్ణాజిల్లా వుయ్యూరులోని పేరంటాలమ్మ తిరునాళ్లకు వెళ్లి మొక్కుకున్నారు. అమ్మవారి అనుగ్రహంతో వారికి సంతానం కలగడంతో తరువాత ఏడాది సిడిమాను తిరిగేందుకు వెళ్లారు. అయితే ఆ ఆలయంలో తొలి సిడిమాను భాగవతులు తిరిగే సంప్రదాయం ఉండటంతో వీరిని నిరాకరించారు. దీంతో వెంకుతాత నిరాశతో వెనుదిరిగాడు. అమ్మా నీ మహిమ చూపుతూ పెదకాకాని వస్తే ఆలయం నిర్మించి ప్రతిఏటా తిరునాళ్ల నిర్వహిస్తానని వేడుకున్నారు. అదేరోజు రాత్రి స్వప్నంలో అమ్మవారు రావడం అప్పటి గ్రామ జమీందారు మన్నవ కోనయ్య సహకారంతో ఆలయం నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి తిరునాళ్ల మహోత్సవం నిర్వహిస్తున్నారు. సిడిమాను ప్రదర్శన ప్రత్యేకత సంతానం లేనివారికి సంతాన లక్ష్మిగా పేరంటాలమ్మ పేరొందింది. పేరంటాలమ్మ ఆలయంలో పూజలు చేసి సంతానం కలిగినవారు సిడిమాను తిరిగేలా మొక్కులు మొక్కుకుంటారు. సంతానం పొందినవారిలో భార్యగానీ, భర్త గానీ, పిల్లలుగానీ అమ్మవారికి పూజలు చేస్తారు. అనంతరం పండ్లు, కాయలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గంపలో కూర్చొని ఆలయం చుట్టూ సిడి తిరగడం ఆనవాయితీ. తరువాత పండ్లు, కాయలను భక్తులకు అందించడం, అవి అందుకున్నవారికి