బుక్కాపురంలో మహిళా బ్యాంక్
వెల్దుర్తి రూరల్ : మండల పరిధిలోని బుక్కాపురంలో గురువారం మహిళా బ్యాంక్ను ఏర్పాటు చేశారు. గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ(సెర్ప్) గౌరవ సలహాదారురాలు విజయభారతి, గ్రామాన్ని దత్తత తీసుకున్న ఢిల్లీ ఇంటర్ గ్లోబ్ ఫౌండేషన్ నిర్వాహకులు రోహిణీ, నీలాంజన్లు పొదుపు మహిళలకు ప్రత్యేక కార్యాలయం, అందులో కుట్టుశిక్షణా కేంద్రం, కంప్యూటర్ సెంటర్ను ప్రారంభించారు. పొదుపు మహిళల డిపాజిట్లతో(20మంది ఒకొక్కరు రూ.5,200లు) మహిళాబ్యాంకును ఏర్పాటు చేశారు. గ్రామంలో వర్మీ కంపోస్ట్ యూనిట్లను ప్రారంభించారు. అనంతరం గ్రామ సచివాలయ ఆవరణలో స్వయం సహాయక మహిళా సంఘాలతో సమావేశమయ్యారు. ఎంపీడీఓ అబ్దుల్ వహీద్, ఉపాధి ఏపీడీ పద్మావతి, ఏపీఓ లక్ష్మన్న, ఆర్డబ్లూ్యఎస్ ఏఈ ప్రవీష, సర్పంచ్ రాజమ్మ పాల్గొన్నారు.