
'బాబుకు అనుకూలమైన వారికే మంచి పోస్టులు'
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్రెడ్డి మండిపడ్డారు. తనకు అనుకూలమైన వారికి ఉన్నతమైన పోస్టింగ్ లను ఇచ్చేందుకే చంద్రబాబు టీచర్ల బదిలీల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. ఏపీలో 8 వేల పాఠశాలలు మూసివేసి నారాయణ విద్యాసంస్థలకు మేలు జరిగిలా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. 2014 డీఎస్సీ నియామకాలు వెంటనే చేపట్టాలని వైఎస్ఆర్ సీపీ నేత విశ్వేశ్వర్ రెడ్డి ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.