Teacher transfers
-
సర్కారు చదువులు చతికిల!
సాక్షి, అమరావతి: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా రాష్ట్రంలో విద్యా రంగం పరిస్థితి తయారైంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ఎన్ని అనర్థాలకు కారణమైందో చెప్పడానికి ప్రతి మండలంలో లెక్కలేనన్ని ఉదాహరణలు కనిపిస్తున్నాయి. జిల్లా స్థాయిలో డీఈవో కార్యాలయం చేపట్టే సర్దుబాటు ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో నిర్వహించి, సవ్యంగా సాగుతున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ప్రభుత్వం గందరగోళం సృష్టించింది. ఈ విధానంతో అటు ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడంతో పాటు ఇటు ప్రభుత్వ పాఠశాలల్లో బోధన సరైన విధంగా సాగకుండా చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని నిర్ణయించి, అత్యంత జూనియర్ టీచర్లను మిగులుగా గుర్తించి, లేని పాఠశాలల్లో నియమించాలి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 29,992 మందిని మిగులు చూపించి.. 9,075 మందిని మాత్రమే సర్దుబాటు బదిలీ చేశారు.అయితే, ఈ ప్రక్రియలో ఎన్ని స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత ఉంది.. ఎక్కడ మిగులు ఉన్నారు.. వారిని ఏం చేయాలి.. అనే ప్రాథమిక ఆలోచన కూడా చేయకుండానే విద్యా శాఖ అడుగులు ముందుకు వేసింది. ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు రాష్ట్రంలోని 3,758 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3–8 తరగతులకు బోధిస్తున్న సబ్జెక్టు టీచర్లను హైస్కూళ్లకు బదిలీ చేసి, అక్కడున్న విద్యార్థుల బోధనను గాలికి వదిలేశారు. 502 హైస్కూల్ ప్లస్లను సర్దుబాటు నుంచి మినహాయించడంతో కొన్ని స్కూళ్లల్లో ఉపాధ్యాయులే లేకుండాపోయారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్ స్కూళ్లకు అనువుగా రూపొందించిన సర్దుబాటు నిబంధనలను మున్సిపల్ స్కూళ్లకు వర్తింపజేసి, అత్యంత జూనియర్ ఎస్జీటీలను హైస్కూళ్లకు.. ఉన్నత పాఠశాలల్లోని సీనియర్ ఉపాధ్యాయులను ప్రాథమిక పాఠశాలలకు పంపించారు.విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు » ఈ విద్యా సంవత్సరం జూన్ 13న పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం నూతనంగా ఏర్పడింది. జూన్ చివరి వారంలో ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించి, మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే అవి ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. దాంతో పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు సంఘాలతో సమావేశాలు నిర్వహించి, మార్గదర్శకాలు విడుదల చేశారు. ఇలా రెండుసార్లు జరగడంతో సెపె్టంబర్ నెలాఖరు దాకా సర్దుబాటు బదిలీలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఈ సర్దుబాటులో తమకు నష్టం జరిగిందని వందల సంఖ్యలో ఉపాధ్యాయులు పాఠశాల విద్య కమిషనరేట్కు వినతులు పంపుతున్నారు.» సర్దుబాటు మార్గదర్శకాల ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాలల్లో 98 మందికి మించి విద్యార్థులుంటే స్కూల్ అసిస్టెంట్లను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంతకంటే తక్కువ రోల్ ఉన్న స్కూళ్లలో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లను హైస్కూళ్లకు బదిలీ చేసి, వారి స్థానంలో ఐదు లేదా ఆరుగురు ఎస్జీటీలను సర్దుబాటు చేస్తామన్నారు.» వాస్తవానికి ఆయా స్కూళ్లల్లో ఉన్న సబ్జెక్టు టీచర్లను బదిలీ చేసినా, వారి స్థానంలో పాఠం చెప్పేందుకు ఒక్క టీచర్ను కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలోని 3 వేలకు పైగా యూపీ స్కూళ్లలో ఈ పరిస్థితి తలెత్తింది. చాలా వరకు ప్రాథమిక పాఠశాలల్లోనూ ఇదే దుస్థితి ఉండడం గమనార్హం. స్కూళ్లల్లో మిగులుగా ఉన్న టీచర్లను లేనిచోటకు పంపించాల్సి ఉంది. అయితే మండలాన్ని యూనిట్గా తీసుకోవడంతో అక్కడ ఉన్న టీచర్లను స్థానికంగానే సర్దుబాటు చేశారు. మిగిలిన టీచర్లను సైతం విద్యార్థులు లేకున్నా అక్కడే ఉంచారు. టీచర్లు లేని చోటుకు పక్క మండలం నుంచి పంపాల్సి ఉన్నా పట్టించుకోలేదు. జీవో 117 రద్దుకు కూటమి సర్కారు చర్యలు » పలు సర్వేల అనంతరం విద్యా రంగంలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)–2020 సంస్కరణలను తీసుకొచ్చింది. దీని ప్రకారం దేశంలోని విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించాలని, జాతీయ స్థాయిలో, రాష్ట్రాల్లో ఒకే విధమైన విధానాలు అనుసరించాలని పేర్కొంది. ఇందుకోసం ఉపాధ్యాయ–విద్యార్థుల నిష్పత్తిని తగ్గించాలంది. » విద్యా బోధనను 5+3+3+4 విధానంలో పునర్నిర్మించాలని సూచించింది. ఎన్ఈపీ–2020 సంస్కరణల్లో భాగంగా గత ప్రభుత్వం 2022లో జీవో 117 జారీ చేసింది. దీని ప్రకారం గతేడాది ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్న 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లోకి మార్చారు. ఇలా 4,900 ఎలిమెంటరీ స్కూళ్లలోని 2.43 లక్షల మంది విద్యార్థులను కి.మీ. లోపు దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో చేర్చారు. » 8 వేల మంది అర్హులైన ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి కల్పించి సబ్జెక్టు టీచర్ బోధన అందుబాటులోకి తెచ్చారు. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధన అందించడంతో పాటు ఉపాధ్యాయులపై బోధన ఒత్తిడి తగ్గించేందుకు టీచర్ విద్యార్థుల నిష్పత్తిని 1:20 ఉండేలా చర్యలు తీసుకున్నారు. » దేశ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఏపీ మోడల్ విద్యా విధానాన్ని రద్దు చేసే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వచ్చే సంవత్సరం నుంచి 1– 5 తరగతులను పూర్తిగా తెలుగు మీడియంలోకి మార్చడంతో పాటు ప్రస్తుతం హైస్కూళ్లల్లో సబ్జెక్టు టీచర్ బోధన పొందుతున్న 3– 5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయనుంది. హైస్కూల్ స్థాయిలో (6–10) ఇంగ్లిష్ మీడియం కొనసాగించాలని నిర్ణయించింది. అంటే ఐదో తరగతి వరకు తెలుగు మీడియం చదివిన విద్యార్థులు ఒకేసారి ఆరో తరగతిని ఇంగ్లిష్ మీడియం ఎలా చదవగలరన్న కనీస అవగాహన లేకుండా మార్పులకు శ్రీకారం చుడుతోంది. మున్సిపల్ స్కూళ్లు, హైస్కూల్ ప్లస్ల్లో బోధన గాలికి.. » బాలికల విద్యను ప్రోత్సహించేందుకు, వారికి సమీపంలోనే జూనియర్ కాలేజీ ఉంటే మేలు జరుగుతుందన్న లక్ష్యంతో గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు.. వాటిలో ఒకటి బాలికలకు ఉండాలన్న నిబంధన తీసుకొచ్చింది. దీని ప్రకారం రాష్ట్రంలో మండల స్థాయిలో ఎక్కువ మంది విద్యార్థులున్న హైస్కూళ్లలో 502 స్కూళ్లను హైస్కూల్ ప్లస్గా మార్చి, ఇంటర్ విద్యను ప్రారంభించారు. దీంతో గతేడాది 294 బాలికల జూనియర్ కాలేజీలు, మరో 208 కో ఎడ్యుకేషన్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించి బోధనకు స్కూల్ అసిస్టెంట్లలో సీనియర్లను నియమించారు. ఈ ఏడాది ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయుల సర్దుబాటులో హైస్కూల్ ప్లస్లను మినహాయించడం, ఉన్న అధ్యాపకుల్లో కొందరు రిటైర్ అవ్వడంతో అక్కడ ఇంటర్ విద్యా బోధనకు ఆటంకం ఏర్పడింది. » మున్సిపల్ హైస్కూళ్లల్లో కొన్నేళ్లుగా ఉపాధ్యాయుల కొరత ఉంది. దీంతో గత ప్రభుత్వంలో అర్హత ఉన్న సీనియర్ ఎస్జీటీలను కొరత ఉన్న హైస్కూళ్లకు డీఈవో కార్యాలయం ద్వారా సర్దుబాటు లేదా డెప్యుటేషన్పై నియమించి బోధన అందించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల కోసం రూపొందించిన సర్దుబాటు నిబంధనలను మున్సిపల్ స్కూళ్లకూ వర్తింపజేయడంతో ఇప్పటి వరకు డెప్యుటేషన్పై వచ్చి హైస్కూళ్లల్లో బోధన అందిస్తున్న ఉపాధ్యాయులను తొలగించి, వారి స్థానంలో ఎలిమెంటరీ స్కూళ్లల్లో అత్యంత జూనియర్ మిగులు ఉపాధ్యాయులను హైస్కూళ్లలో సర్దారు. దీంతో ఈ విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాలపై తీవ్ర ప్రభావం పడనుంది. గతంలో జిల్లా స్థాయిలోనే సర్దుబాటు» విద్యా రంగానికి తొలి ప్రాధాన్యం ఇచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం గతంలో జిల్లా యూనిట్గా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టింది. జీవో నంబర్ 117 ప్రకారం ప్రభుత్వ మేనేజ్మెంట్లోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులను విద్యార్థులకు అవసరం ఉన్న చోటుకు జిల్లా స్థాయిలోనే సర్దుబాటు చేశారు. ఉపాధ్యాయులు ఇబ్బంది పడకుండా పక్క మండలాల స్కూళ్లలోనే సర్దుబాటు చేసేవారు. » విద్యార్థులకు నాణ్యమైన బోధనే లక్ష్యంగా చేసిన ఈ మార్పుతో విద్యా సంవత్సరంలో ఎక్కడా బోధనకు ఆటంకం ఏర్పడలేదు. ఎక్కడా ఉపాధ్యాయుల కొరత అనేది రాలేదు. తాజాగా కూటమి సర్కారు అసంపూర్ణ సర్దుబాటుతో ఈ ఏడాది విద్యా ఫలితాలు అత్యంత దారుణంగా పడిపోతాయని విద్యా రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు విద్యా సంవత్సరాల్లో పదో తరగతిలో రాష్ట్ర టాపర్లు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే నిలవగా, ఈసారి ఆ పరిస్థితి ఉండేలా లేదని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో విద్యా రంగం నాశనమైంది. బడుల్లో ఉపాధ్యాయులు లేకుండా చేసింది. దాన్ని గాడిన పెట్టడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాధ్యత. అందుకే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్న చోటు నుంచి లేని చోటుకు సర్దుబాటు చేస్తున్నాం. – ఆగస్టులో విద్యా శాఖ మంత్రి లోకేష్, ఉన్నతాధికారులు కాకినాడ జిల్లా తుని మండలంలో 58 మంది ఉపాధ్యాయులు మిగులు ఉన్నట్టుగా విద్యా శాఖ గుర్తించింది. అయితే సర్దుబాటులో ఒక్కరు కూడా బదిలీ కాలేదు. ఈ మండలానికి పక్కనే ఉన్న రౌతులపూడిమండలంలోని ఆరు ప్రాథమికోన్నత పాఠశాలలకు గాను.. ఐదు స్కూళ్లల్లో స్కూల్ అసిస్టెంట్లను తొలగించారు. పైగా 20 మంది ఉపాధ్యాయులు అవసరం ఉన్నా ఒక్కరినీ ఇవ్వలేదు. -
ఏపీలో టీచర్ల బదిలీలకు బ్రేక్
సాక్షి, విజయవాడ: ఎన్నికలకు ముందు జరిగిన ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్ పడింది. 1400 ఉపాధ్యాయుల బదిలీలు నిలిపివేశారు. గతంలో ఇచ్చిన బదిలీ ఉత్తర్వులు రద్దు చేయాలని పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. -
టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో జాప్యం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రి య మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రధానోపాధ్యాయుల సీని యారిటీ వ్యవహారం పీటముడిగా మారడ మే దీనికి కారణం. స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎం పోస్టులకు పదోన్నతి కోసం గురు వారం నుంచి ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. అయి తే రాత్రి పొద్దుపోయే వరకూ ఈ ప్రక్రియ మొదలుకాలేదు. ఆప్షన్లు ఇచ్చేందుకు టీచర్లు సిద్ధపడ్డా, వెబ్సైట్ ఓపెన్ కాలేదు. రోస్టర్ విధానం, మల్టీజోన్ల వారీగా సీనియారిటీ, నాట్–విల్లింగ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అవసర మైన సాఫ్ట్వేర్ ఏర్పాటులో సాంకేతిక సమ స్యలొచ్చినట్టు అధికారులు తెలిపారు. శుక్ర వారం నుంచి ఆప్షన్లు అందుబాటులోకి రావ చ్చని అధికారులు తెలిపారు. మల్టీజోన్–2లోని 14 జిల్లాల్లో కోర్టు ఆదేశాల కార ణంగా హెచ్ఎంల పదోన్నతి ప్రక్రియ ఆగిపోయింది. ఇది ముందుకెళితేనే స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలపై స్పష్టత వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,974 హెచ్ఎం పోస్టులను స్కూల్ అసిస్టెంట్ల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. 6,500 మంది ఎస్జీటీలకు పదోన్నతులు లభించాల్సి ఉంటుంది. తొలిదశలోనే సమస్యలు మొదలుకావడంతో మిగతాప్రక్రియ ఆలస్యం కావచ్చని అధికారులు అంటున్నారు. షెడ్యూల్ ప్ర కారం అక్టోబర్ 3, 4 తేదీల నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ బదిలీలు, పదో న్నతుల ప్రక్రియ పూర్తవ్వాల్సి ఉంది. అన్నిస్థాయిల్లోనూ ఆర్డర్లు కూడా ఇవ్వాలని పేర్కొన్నారు. అయితే హెచ్ఎంల సీనియారిటీ సరిగాలేదనే కారణంగా మల్టీజో న్–2లో ప్రక్రియ ఆగిపోవడంతో బదిలీలు, పదోన్నతులు కిందస్థాయిలోనూ బ్రేక్ పడుతున్నాయి. కోర్టు స్టే తొలగించేందుకు విద్యాశాఖ కృషి చేస్తోంది. ఇది కొలిక్కి వచ్చినప్పటికీ అక్టోబర్ నెలాఖరునాటికి అన్నిస్థాయిల్లో బదిలీలు, పదోన్నతులు ముందుకెళ్లే అవకాశం కన్పించడంలేదు. స్టే ఎత్తివేయడంలో ఆలస్యమైతే మరికొంత జాప్యం తప్పదని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
TS: టీచర్ల పదోన్నతులు, బదిలీలు షురూ
సాక్షి, హైదరాబాద్: టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ను విద్యాశాఖ రూపొందించింది. ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే జరుగుతుంది. 6, 7 తేదీల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసిన కాపీలను డీఈవో కార్యాలయంలో నేరుగా అందించాల్సి ఉంటుంది. ఈ నెల 12, 13 తేదీల్లో అన్ని జిల్లాల్లోనూ సీనియారిటీ జాబితాలను ప్రదర్శిస్తారు. సెప్టెంబర్15న ఆన్లైన్లోనే ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేపడతారు. ఆ తర్వాత వరుసగా అన్ని కేటగిరీల ఉపాధ్యాయుల బదిలీల ఆదేశాలు జారీ చేస్తారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ఏక కాలంలో చేపడతారు. అయితే, ముందుగా హెచ్ఎంలను బదిలీ చేస్తారు. ఈ విధంగా అయిన ఖాళీల్లో స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతుల కల్పించి, బదిలీలు చేస్తారు. తర్వాత స్కూల్ అసిస్టెంట్లు పదోన్నతుల ద్వారా భర్తీ అయిన స్థానాల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు కల్పించి, వారిని బదిలీలు చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం అక్టోబర్ 3వ తేదీ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. అక్టోబర్ 5 నుంచి 19 వరకూ బదిలీలు, పదోన్నతులపై అభ్యంతరాలుంటే అప్పీలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. సీనియారిటీ జాబితా రూపొందించేందుకు అవసరమైన మార్గదర్శకాలను విద్యాశాఖ విడుదల చేయాల్సి ఉంది. జనవరి షెడ్యూల్కు స్వల్ప మార్పులు ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన షెడ్యూల్కు స్వల్ప మార్పులు చేశారు. ఒకే స్థానంలో మూడేళ్ళు పనిచేసిన వారు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. టీచర్లు గరిష్టంగా 8 ఏళ్ళు, హెచ్ఎంలు 5 ఏళ్ళు ఒకేచోట పనిచేస్తే విధిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ సర్విస్ కటాఫ్ తేదీ గతంలో ఫిబ్రవరి 1గా ఉండేది. ఇప్పుడు దీన్ని సెపె్టంబర్ 1గా నిర్ణయించారు. ఈ కారణంగా మరికొంతమంది బదిలీలకు అర్హులవుతారు. రిటైర్మెంట్కు 3 ఏళ్ళలోపు సర్వీస్ ఉంటే బదిలీ నుంచి మినహాయింపు ఉంటుంది. కటాఫ్ తేదీ మారడంతో ఈ విభాగంలోనూ కొత్తగా వచ్చే సర్విస్ను పరిగణనలోనికి తీసుకుంటారు. ఆన్డ్యూటీ పొందే ఉపాధ్యాయ సంఘాల నేతలకు సీనియారిటీలో పది పాయింట్లు ఇవ్వడాన్ని కోర్టు వ్యతిరేకించింది. దీంతో ఈ ఆప్షన్ తొలగించి కొత్త సీనియారిటీ జాబితాను రూపొందించాల్సి ఉంది. సీనియారిటీ దగ్గరే తికమక ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో జిల్లా అధికారులు టీచర్ల సీనియారిటీ జాబితాను రూపొందిస్తున్నారు. దాదాపు 10 వేల మంది పదోన్నతులకు, 58 వేల మంది బదిలీలకు అర్హులని లెక్కగట్టారు. అయితే, సినియారిటీ జాబితా రూపకల్పన చేయాలని అధికారులు ఆదేశించినా, అందుకు తగిన మార్గదర్శకాలు ఇవ్వలేదని డీఈవోలు అంటున్నారు. ఈ కారణంగా అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ల సీనియారిటీని పదోన్నతి కోసం రూపొందించడంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఎస్ఏల్లో ఫిజిక్స్, మేథ్స్.. ఇలా వివిధ సబ్జెక్టుల బోధకులు ఉంటారు. కేటగిరీ వారీగా సీనియారిటీని తీసినప్పుడు ఒకరి కన్నా ఎక్కువ మంది తేలినప్పుడు ఎవరిని మొదటి స్థానంలో ఉంచాలని, ఎవరికి హెచ్ఎం పదోన్నతి కల్పించాలనేది ఇబ్బందిగా ఉందని డీఈవోలు చెబుతున్నారు. హెచ్ఎం పోస్టులు మల్టీ జోనల్ అయినప్పుడు 14 జిల్లాల ఎస్ఏ సీనియారిటీని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో ఉద్యోగి చేరిన తేదీ, డీఎస్సీలో వచ్చిన మార్కులను పరిగణనలోనికి తీసుకుని సీనియారిటీ రూపొందిస్తారు. అప్పటికీ ఒకరికన్నా ఎక్కువ ఉంటే, డీఎస్సీలో ప్రతీ సబ్జెక్టులో వచ్చిన మార్కులు, జాయినింగ్ తేదీ, ఇంకా కావాలంటే పుట్టిన తేదీని పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి మార్గదర్శకాలు వస్తే తప్ప ఇది సాధ్యం కాదని డీఈవోలు అంటున్నారు. వికలాంగుల విషయంలోనూ ఇంత వరకూ నిర్ణయం తీసుకోలేదు. 40 శాతం అంగవైకల్యాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని కోర్టు తెలిపింది. గత షెడ్యూల్లో 70 శాతం వైకల్యాన్ని అర్హతగా పేర్కొన్నారు. -
గుడ్న్యూస్.. టీచర్ల బదిలీలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయులకు శుభవార్త. ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. టీచర్ల బదిలీలపై మధ్యంతర స్టే ఉత్తర్వులను హైకోర్టు సవరిస్తూ తీర్పును వెల్లడించింది. ఈ క్రమంలో ఉపాధ్యాయ దంపతులకు గుడ్న్యూస్ చెప్పింది. వివరాల ప్రకారం.. తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు కోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. టీచర్ల బదిలీలపై బుధవారం కోర్టు మధ్యంతర స్టే ఉత్తర్వులను సవరించింది. ఈ క్రమంలోనే టీచర్ యూనియన్ల నేతలకు పది అదనపు పాయింట్లను కోర్టు తప్పుపట్టింది. టీచర్ యూనియన్ల నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా బదిలీలకు హైకోర్టు అనుమతిచ్చింది. ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడానికి కోర్టు అనుమతిచ్చింది. ఇది భార్యాభర్తలు కలిసి ఉండాలన్నది నిబంధన ఉద్దేశమని కోర్టు స్పష్టం చేసింది. టీచర్ల బదిలీలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని కోర్టు పేర్కొంది. ఇది కూడా చదవండి: సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన పోలీసు.. మంత్రి హరీష్ అభినందన -
టీచర్ల బదిలీలు,పదోన్నతులకు లైన్క్లియర్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం తీపికబురు చెప్పబోతోందని ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ నేతలు తెలిపారు. విద్యాశాఖమంత్రి సబిత ఇంద్రారెడ్డిని సంఘం నేతలు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీఎమ్మెల్సీ పూల రవీందర్ కలిశారు. ప్రభు త్వం బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు గతంలో జారీ చేయగా, ఇందుకు సంబంధించిన జీఓ నంబరు 5కు అసెంబ్లీ చట్టబద్ధత లేదనే కారణంగా కొంతమంది కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదలైనా ఆగిపోయా యి. అయితే, జీఓ 5 అమలుకు శాసనసభ ఆ మోదం పొందే ప్రతిపాదనలు విద్యాశాఖ సమర్పించినట్టు మంత్రి సబిత శుక్రవారం పీఆర్టీయూ టీఎస్ నేతలకు తెలిపారు. ఇందుకు మంత్రి సబితకు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
మాస్టార్ల బదిలీలు, పదోన్నతులు ఎప్పుడు? రగులుతున్న అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముందుకెళ్ళకపోవడంతో ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి చోటు చేసుకుంటోంది. ఏడాదిగా అటు ప్రభుత్వం, ఇటు ఉపాధ్యాయ సంఘాలు తమతో ఆటలాడుతున్నాయని టీచర్లు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. టీచర్ల సంఘాల నేతలపై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవల విద్యాశాఖ మంత్రిని కలిసిన పలు ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. న్యాయ పరమైన చిక్కులు తొలగించేందుకు విద్యాశాఖ ఆసక్తి చూపడం లేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. నాన్–స్పౌజ్ పేరుతో న్యాయ వివాదం సృష్టించిన వ్యక్తుల వెనుక స్వార్థం ఉందని, దీన్ని న్యాయస్థానానికి సరిగా వివరించడంలో విద్యాశాఖ విఫలమైందంటున్నారు. హెచ్ఆర్ఏ కోసమేనా ఈ రగడ? భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒకే చోట ఉండేలా చూడాలనేది ప్రభుత్వ విధానం. ఈ నేపథ్యంలోనే బదిలీలు చేపడుతున్నారు. కానీ కొంతమంది నాన్–స్పౌజ్ పేరుతో కొత్త వివాదం తెరమీదకు తెచ్చారు. బదిలీ అయ్యే 80 వేల మంది టీచర్లలో 30 వేల మంది ఉపాధ్యాయులు స్పౌజ్ పాయింట్లు వాడుకుని 24 శాతం హెచ్ఆర్ఏ ఉంటే పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలకు వస్తున్నారనేది నాన్–స్పౌజ్ల వాదన. నిజానికి జిల్లా యూనిట్గానే టీచర్ల బదిలీలు ఉంటాయి. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో స్పౌజ్ అనే అంశంతో సంబంధం లేకుండానే జిల్లాల్లోని అందరికీ ఒకే హెచ్ఆర్ఏ ఇస్తారు. రంగారెడ్డి జిల్లాలోని 5 మండలాలు, సంగారెడ్డి జిల్లాలోని 3 మండలాలు తప్ప రాష్ట్రంలో మిగిలిన 30 జిల్లాలకు 24 శాతం హెచ్ఆర్ఏ వర్తించదు. స్పౌజ్ పాయింట్లు 8 ఏళ్ళకోసారి ఇస్తారు. అది కూడా దంపతుల్లో ఒకరికే వర్తిస్తుంది వాస్తవాలు గుర్తించరేం? వాస్తవాలు అలా ఉంటే నాన్ స్పౌజ్ల పేరుతో అభ్యంతరాలు లేవనెత్తే వ్యక్తులు అసత్య ప్రచారంతో నమ్మిస్తున్నారనేది మెజారిటీ టీచర్ల వాదన. స్పౌజ్లు అందరూ దీన్ని అడ్డం పెట్టుకుని హైదరాబాద్ పరిసర ప్రాంతాలను కోరుకుంటే, ఇలాంటి వాళ్ళు 60 వేల మంది వరకు ఉండాలి. కానీ ఈ విషయాన్ని విద్యాశాఖ గుర్తించడం లేదని టీచర్లు అంటున్నారు. అసలు కోర్టులో వివాదం లేవనెత్తిన వాళ్ళల్లో ఎక్కువ మంది అధిక హెచ్ఆర్ఏ పొందుతూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు. ఇలా కేసులు వేసి, వాళ్ళను వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఇది స్వార్థం కాదా? : జైపాల్ రెడ్డి (స్పౌజ్ ఉద్యోగుల నేత) వివాదం లేవనెత్తుతున్న నాన్ స్పౌజ్ల్లో 13 ఏళ్ళకుపైగా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 8 మండలాల్లోనే పనిచేస్తున్నారు. వీరికి 24 శాతం హెచ్ఆర్ఏ వస్తుంది. ఇందులో చాలా మంది రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వీరి ప్రయోజనం కోసం 80 వేల మంది టీచర్ల బదిలీల ప్రక్రియకు అడ్డం పడుతున్న వాస్తవాన్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు. ఇప్పటికైనా వివాదం వెనుక వాస్తవాలు గుర్తించి, బదిలీల ప్రక్రియ సాఫీగా సాగేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. గతేడాది బదిలీల షెడ్యూల్ ఇచ్చినా.. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు ప్రభుత్వం గత ఏడాది షెడ్యూల్ ఇచ్చింది. అయితే టీచర్లు ఆప్షన్లు ఇచ్చే దశలోనే నాన్ స్పౌజ్లు తమకు అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించారు. ఉపాధ్యాయుల బదిలీలు, సర్వీసుకు సంబంధించిన నిబంధనలను రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 ప్రకారం రాష్ట్ర శాసనసభ రూపొందించి గవర్నర్ ఆమోదంతో జారీ చేయాలని నాన్ స్పౌజ్లు వాదిస్తున్నారు. కానీ జీవో 5, శాసనసభ, గవర్నర్ ఆమోదం లేకుండా అధికారులే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 162, 163 (3) ప్రకారం గవర్నర్ ఇచ్చిన బిజినెస్ రూల్స్ ప్రకారం జారీ చేశారని, ఇది చట్టబద్ధం కాదని కోర్టుకు తెలిపారు. దీంతో బదిలీలు, పదోన్నతులపై కోర్టు స్టే విధించింది. ఈ దశలో విద్యాశాఖ వాస్తవాలు చెప్పడంలో విఫలమైందనేది టీచర్ల ఆరోపణ. -
దశాబ్ది వేడుకల వేళనైనా.. కనికరించండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల వేళనైనా తమపై కనికరించి బదిలీలకు మోక్షం కలిగించాలని 13 జిల్లాల్లోని ఉపాధ్యాయ దంపతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 20 జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతుల స్పౌజ్ బదిలీలు జరిగినా, మిగతా జిల్లాలకు సంబంధించి పెండింగ్లో పెట్టారు. 18 నెలలు కావస్తున్నా అతీగతీ లేకపోవడంతో దశాబ్ది ఉత్సవ వేడుకలు జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలోనైనా ఉపాధ్యాయ స్పౌజ్ బదిలీలకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. 2022 జనవరి నుంచి ఇప్పటి వరకు బదిలీల కోసం అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మంత్రులను కలుస్తూ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. అదే సమయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులకు గోడు వివరిస్తున్నప్పటికీ 13 జిల్లాల్లో నిలిచిపోయిన ఉపాధ్యాయ దంపతుల బదిలీలకు మాత్రం మార్గం సుగమం కావడం లేదు. జిల్లాల్లో ఖాళీలు ఉన్నప్పటికీ... దాదాపు అన్ని జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతుల బదిలీలు జరపడానికి అవసరమైన ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు సూర్యాపేట జిల్లాలో 21 మంది ఎస్జీటీలు స్పౌజ్ బదిలీ కోసం దరఖాస్తు చేసుకోగా, ఆ జిల్లాలో సుమారు 300 ఎస్జీటీ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అలాగే సంగారెడ్డి జిల్లాలో కేవలం 5గురు మాత్రమ స్పౌజ్ బదిలీ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు, కానీ అక్కడ వందల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. స్పౌజ్ బదిలీలు జరగని మిగతా జిల్లాలైన వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, మేడ్చల్, సిద్దిపేట, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, ఖమ్మం జిల్లాల్లో కూడా దాదాపు ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. మిగిలిపోయిన 13 జిల్లాల్లోని స్పౌజ్ ఖాళీలను భర్తీ చేయడానికి విద్యాశాఖ ఎందుకు ఆసక్తి చూపడం లేదో అర్థం కావడం లేదని ఉపాధ్యాయ దంపతులు ఆందోళన చెందుతున్నారు. భర్త ఓ చోట... పిల్లలు మరోచోట స్పౌజ్ బదిలీలు జరగకపోవడంతో మహిళా ఉపాధ్యాయుల బాధలు వర్ణణాతీతం. భర్త ఒకచోట, భార్య మరో చోట.. చదువుల కోసం పిల్లలు హైదరాబాద్లోనో.. ఉండాల్సి రావడంతో ఏమీ పాలుపోని పరిస్థితి నెలకొందని మహిళా ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. గడిచిన 18 నెలలుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న వారు కనీసం దశాబ్ది ఉత్సవాల సందర్భంగానైనా తీపి కబురు అందుతుందని ఆశిస్తున్నారు. -
విద్యార్థులకు నష్టం లేకుండా ఉపాధ్యాయ బదిలీలు
సాక్షి, అమరావతి: విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా, విద్యా సంవత్సరానికి అంతరాయం రానీయకుండా ఉపాధ్యాయ బదిలీలు చేపడతామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలని ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తులు చేశారని, బదిలీలను పారదర్శకంగా టైం టు టైం చేపట్టేందుకు విధివిధానాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. సీఎంతో చర్చి0చి విధివిధానాలు ప్రకటిస్తామని, సాధ్యమైనంత వరకు ఈ విద్యా సంవత్సరంలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. అలాగే విద్యారంగంలోని ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా డీఎస్సీ, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఉపాధ్యాయ ఖాళీల లెక్కలు తీస్తున్నామని.. దాదాపు 15 వేలకు పైనే పోస్టులున్నాయని, ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపైనా త్వరలో చర్యలు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపైనా చట్ట ప్రకారం త్వరలో చర్యలు తీసుకుంటామని, దీనిపై సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని బొత్స వెల్లడించారు. ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా క్రమబద్దీకరణ చేస్తామన్నారు. ఇప్పటికే ఈ అంశంపై సీఎం వైఎస్ జగన్ ఆదేశాలిచ్చారని, కసరత్తు ప్రారంభించినట్టు తెలిపారు. పాఠశాలల్లో రాగి జావ పంపిణీని ఎత్తివేసినట్టు ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని, ఇది అవాస్తవమన్నారు. ప్రస్తుతం ఒంటిపూట తరగతులు, పరీక్షలు ఉన్నాయని, పైగా ఉదయం విద్యార్థులు ఇంటి నుంచి వచ్చేటప్పుడు అల్పాహారం తీసుకుని వచ్చేవారికి వెంటనే రాగిజావ ఇస్తే మధ్యాహ్నం భోజనం చేయలేరన్నారు. అందువల్లే రాగిజావకు బదులు చక్కీ ఇస్తున్నట్టు చెప్పారు. పాఠశాలల పునః ప్రారంభం నుంచి తిరిగి రాగిజావ అందిస్తామన్నారు. త్వరలోనే పరిపాలన రాజధానిగా విశాఖ రాజధాని విషయంలో తమ విధానంలో మార్పు లేదని, మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. త్వరలోనే పరిపాలన రాజధానిగా విశాఖ మారుతుందన్నారు. శుక్రవారం విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. చంద్రబాబు రాజధానుల విషయమై పస లేని కామెంట్లు చేస్తున్నారని, మూడు రాజధానులైతే మూడు చోట్లా కాపురం చేయాలనడంపై ఆయన స్పందించారు. ‘గతంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్లో కాపురం చేశారు. ఆయనలా ఎవరూ చేయరు’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నది తమ పాలసీ అని, అందుకే విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. న్యాయపరమైన అంశాలు తేలగానే చట్టపరంగా మూడు రాజధానుల ఏర్పాటు చేస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. గడచిన రెండు రోజుల్లో వేర్వేరు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ ముగ్గురు టీచర్లు ఆకస్మికంగా మరణించడం పట్ల బొత్స విచారం వ్యక్తం చేశారు. ఎండలను తట్టుకునేలా వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. -
తెలంగాణ ఉపాధ్యాయులకు గుడ్న్యూస్
-
తెలంగాణలో టీచర్లకు గుడ్న్యూస్.. బదిలీలు, పదోన్నతులకు గ్రీన్సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో టీచర్స్ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్కు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో ఉపాధ్యాయ సంఘాలతో మంత్రులు హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. రెండు, మూడు రోజుల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. భేటీ సందర్బంగా బదిలీలు, పదోన్నతులపై చర్చించారు. ఇందుకు తగినట్టు మంత్రులు కార్యచరణను రూపొందిచనున్నారు. -
బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్కు వినతి
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ను తక్షణమే విడుదల చేయాలని ప్రధాన ఉపాధ్యాయ సంఘం పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్, ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు మంగళవారం మంత్రిని హైదరాబాద్లో కలిశారు. పదోన్నతులు, బదిలీలు చేపట్టకపోవడం వల్ల ఉపాధ్యాయులు మనోవేదనకు గురవుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్టు నేతలు తెలిపారు. -
జీవో 317పై స్టేకు హైకోర్టు నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించిన జీవో 317పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే తామిచ్చే తుది తీర్పునకు లోబడే కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావలీతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సీనియారిటీకి విరుద్ధంగా తమను కొత్త జిల్లాలకు కేటాయించారంటూ పలువురు ఉపాధ్యాయులు దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం విచారించింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు, సీనియారిటీకి విరు ద్ధంగా కోరుకున్న ప్రాంతానికి కాకుండా పిటిషనర్లను కేటాయించారని వారి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కొత్త జిల్లాలకు కేటాయించిన వారంతా విధుల్లో చేరారని ప్ర భుత్వ న్యాయవాది నివేదించారు. దీనిపై కౌం టర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేసింది. -
రేపు అర్ధరాత్రి వరకు వెబ్ఆప్షన్లకు గడువు..
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ బదిలీల్లో వెబ్ ఆప్షన్లను రేపు(శుక్రవారం) అర్ధరాత్రి వరకూ నమోదు చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 18 తేదీ అర్ధరాత్రి నుంచి వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, మొత్తం 16 వేల పోస్టులు బ్లాక్ చేశామని పేర్కొన్నారు. బ్లాకింగ్ ప్రక్రియ లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా 4008 పోస్టులు భర్తీ కాకుండా నిలిచిపోయే పరిస్థితి ఉందని ఆయన వివరించారు. (చదవండి: ‘ఓటుకు కోట్లు’ కేసులో కీలక పరిణామం) మొత్తంగా ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ కోసం 74, 418 మంది ఐచ్ఛికాలను ఇచ్చారని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలతో విధానపరమైన నిర్ణయాలపై చర్చకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ ఫీజులు గత ఏడాది తరహాలోనే ఉండే అవకాశముందని, తుది నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూలును రేపు ప్రకటిస్తామని మంత్రి సురేష్ వెల్లడించారు.(చదవండి: దేశ చరిత్రలో ఇదే తొలిసారి: సీఎం జగన్) -
రేపటి వరకు టీచర్ల బదిలీల వెబ్ ఆప్షన్
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి వెబ్ ఆప్షన్ ప్రక్రియ గడువు ఈ నెల 15తో ముగియగా, ఉపాధ్యాయ సంఘాలు, టీచర్ల వినతి మేరకు మరో మూడ్రోజులు అంటే రేపటి వరకు పొడిగించినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. సీపీఎస్కు సంబంధించి ప్రభుత్వ కార్యాచరణ కొనసాగుతోందన్నారు. అక్యూరల్ ఫర్మ్ పేరుతో ఇటీవల కమిటీ ఏర్పాటు చేశామని, ఇన్సూ్యరెన్స్ ప్రీమియం, రిస్క్లకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులపై ఈ కమిటీ రిపోర్టు అందజేసిందని, అది ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు. సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బుధవారం మధ్యాహ్నం వరకు 71,947 మంది (సుమారు 95 శాతం) టీచర్లు వెబ్ ఆప్షన్ను వినియోగించుకున్నారన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తరవాతే బదిలీలకు సంబంధించి సవరించిన జీవో నెంబర్లు 53, 54, 59లను ప్రభుత్వం జారీ చేసిందని తెలిపారు. పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా బదిలీలు చేపట్టామని చెప్పారు. కేటగిరీ 4లోని పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులే విద్యనభ్యసిస్తుంటారని, అవి నిర్వీర్యమైపోకూడదనేదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. రాష్ట్ర విద్యా రంగంలో సీఎం వైఎస్ జగన్ చేపట్టిన సంస్కరణలు దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందాయన్నారు. ఉపాధ్యాయుల్లో నెలకొన్న అనుమానాలను పెనుభూతాలుగా మార్చి, రాజకీయాలకు వాడుకోవద్దని విపక్ష నాయకులకు మంత్రి హితవు పలికారు. సీపీఎస్పై చిత్తశుద్ధితో ఉన్నాం.. సీపీఎస్ విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఇదే విషయంపై 2019 ఆగస్టులో మంత్రి వర్గ ఉప సంఘాన్ని సీఎం జగన్ ఏర్పాటు చేశారన్నారు. అందులో తాను కూడా ఉన్నానని, ఇప్పటికి ఎన్నో పర్యాయాలు భేటీ కూడా అయ్యామని తెలిపారు. సీఎస్ అడ్వైజరీగా ఉండే ‘వర్కింగ్ కమిటీ ఆఫ్ సెక్రటరీస్’ను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 20 తేదీన జగనన్న అమ్మ ఒడి తుది జాబితా ప్రకటిస్తామని మంత్రి సురేష్ తెలిపారు. గ్రామ సచివాలయాల ద్వారా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపడుతున్నామన్నారు. ఉద్యోగులపై లాఠీచార్జి చేయించిన ఘనత చంద్రబాబుదే.. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు సకాలంలో ఇవ్వాలని, నాణ్యమైన భోజనం అందించాలని కోరిన ఉపాధ్యాయులను పాఠశాలల్లోకి వెళ్లి అరెస్టు చేశారని మంత్రి గుర్తు చేశారు. అప్పటి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులకు సంబంధించిన రెండు వీడియోలను మంత్రి విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. తమ సమస్యలు పరిష్కరించాలని అడిగిన ఉద్యోగులపై లాఠీచార్జీ చేయించడం, గుర్రాలతో తొక్కించడం చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఆయన హయాంలో అన్నీ అక్రమ బదిలీలేనని, అలాంటి వ్యక్తి ఉపాధ్యాయుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి సురేష్ ఎద్దేవా చేశారు. -
టీచర్ల బదిలీలకు ఓకే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు మార్గదర్శకాలను ఖరారుచేస్తూ పాఠశాల విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. గ్రేడ్–2 హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, తత్సమాన కేటగిరీల టీచర్లు ఈ బదిలీల పరిధిలోకి వస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ జీవో–54 విడుదల చేశారు. దీంతోపాటు ఆయా పాఠశాలల్లో టీచర్ల సర్దుబాటు ప్రక్రియకు సంబంధించి కూడా ప్రభుత్వం జీవో–53ని జారీచేసింది. బదిలీలు ఆన్లైన్లో వెబ్ కౌన్సెలింగ్ ద్వారా చేయనున్నారు. ఈ ఉత్తర్వులు రావడంతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ బదిలీల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఇతర యాజమాన్యాల స్కూళ్ల టీచర్ల బదిలీలకు ఆయా విభాగాలు షెడ్యూల్ ఇవ్వనున్నాయి. మార్గదర్శకాలు ఇలా.. – 2019–20 విద్యా సంవత్సరం పూర్తయ్యే నాటికి ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తయిన టీచర్లకు, 5 ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన గ్రేడ్–2 హెడ్మాస్టర్లకు బదిలీ తప్పనిసరి. ఏడాదిలో సగం రోజులు పూర్తి చేసినా పూర్తి ఏడాదిగానే పరిగణిస్తారు. – అక్టోబర్ ఒకటి నుంచి రెండేళ్లలో పదవీ విరమణ చేయబోయే వారికి వారు కోరుకుంటే తప్ప బదిలీ ఉండదు. – బాలికోన్నత పాఠశాలల్లో పనిచేస్తూ అక్టోబర్ 1 నాటికి 50 ఏళ్లలోపు వయసున్న పురుష టీచర్లకు బదిలీ తప్పనిసరి. – అంధులైన టీచర్లను బదిలీల నుంచి మినహాయించారు. వారు కోరుకుంటే బదిలీ చేయవచ్చు. – టీచర్ల బదిలీలకు 85 ఎన్టైటిల్మెంట్ పాయింట్లను ఖరారు చేశారు. కామన్ పాయింట్ల కింద 55, స్పెషల్ పాయింట్ల కింద 25, రీ అపోర్షన్ పాయింట్ల కింద 5గా నిర్ణయించారు. – ప్రిఫరెన్షియల్ కేటగిరీల కింద దివ్యాంగులు, భర్త నుంచి విడిపోయిన వారు, భర్త చనిపోయిన వారికి ఎన్టైటిల్మెంటు పాయింట్లతో సంబంధం లేకుండా సీనియార్టీలో ప్రాధాన్యతనిస్తారు. – తప్పుడు ధ్రువపత్రాలిచ్చే వారిపై.. వాటిని పరిశీలించకుండా కౌంటర్ సంతకం చేసే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. – ఉత్తర్వులు అందుకున్నాక ఎవరైనా అనధికారికంగా గైర్హాజరైతే వారికి నో వర్క్ నో పే అమలుచేస్తారు. టీచర్ల సర్దుబాటు ప్రక్రియ ఇలా.. టీచర్ల సర్దుబాటుకు సంబంధించి కేటగిరీల వారీగా పిల్లల సంఖ్యను అనుసరించి టీచర్ల సంఖ్యను నిర్ధారించారు. – ప్రాథమిక పాఠశాలల్లో 151–200 విద్యార్థులుంటే ఒక హెచ్ఎం, 5గురు ఎస్జీటీలు.. – 121–150 వరకు ఐదుగురు ఎస్జీటీలు.. – 91–120 వరకు నలుగురు ఎస్జీటీలు.. – 61–90 వరకు ముగ్గురు ఎస్జీటీలు.. – 60 వరకు అయితే ఇద్దరు ఎస్జీటీలు.. – 200పైన ప్రతి 40 మంది విద్యార్థులకు అదనంగా ఒక ఎస్జీటీని నియమిస్తారు. -
టీచర్ల బదిలీలకు సీఎం గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీచర్ల బదిలీలకు ఆమోదం తెలుపుతూ ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేసినట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా టీచర్ల బదిలీలను చేపట్టనున్నారు. మూడేళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీచర్ల బదిలీలకు ఆమోదం తెలపడంపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. -
విద్యలో విప్లవం
సాక్షి, అమరావతి: ఒకటవ తరగతికి ముందే పీపీ1, పీపీ2, ప్రీ ఫస్ట్ క్లాస్ (సంసిద్ధతా తరగతులు) ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. పిల్లలకు 6 ఏళ్ల వయసు వచ్చే సరికే 85 శాతం మెదడు అభివృద్ధి చెందుతుందని అధ్యయనాలు, నిపుణులు చెబుతున్న దృష్ట్యా మొదటి తరగతికి ముందే సంసిద్ధతా తరగతులను అభ్యసిస్తే వారి పునాది ధృడంగా ఉంటుందన్నారు. దీనిని అనుసరిస్తూ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం 2021–22 నుంచి జాతీయ నూతన విద్యా విధానం అమలు చేయాలన్నారు. ఇందులో భాగంగా 5+3+3+4 అమలుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. జాతీయ నూతన విద్యా విధానంపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. జాతీయ విద్యా విధానంపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ బలమైన పునాదితో మంచి ఫలితాలు – విద్యార్థి రాణించాలంటే పునాది బలంగా ఉండాలి. అది జరగాలంటే ఒకటవ తరగతికి రాకముందే చదువు పట్ల ఆసక్తి, శ్రద్ధ ఉండేలా చూడాలి. ఆట పాటలతో చిన్నారులు బడిబాట పట్టేలా చూడాలి. అందుకోసమే విద్యా రంగంలో విప్లవాత్మక చర్యలకు నాంది పలుకుతూ అంగన్వాడీలలో పీపీ1, పీపీ2 ప్రారంభించబోతున్నాం. ఆ తర్వాత ప్రీ ఫస్ట్ క్లాస్ ఉంటుంది. విద్యార్థి ఒకటవ తరగతిలో చేరేసరికి చదువు పట్ల అవగాహన ఉంటుంది. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. ఈ మేరకు సిలబస్ రూపొందించాలి. జాతీయ నూతన విద్యా విధానాన్ని 2021–22 నుంచే అమలు చేయడానికి తగిన విధంగా పాఠ్య పుస్తకాలు ముద్రించాలి. ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు రూపొందించాలి. – విద్యా రంగంలో గ్రామ, వార్డు సచివాలయాల సేవలను వినియోగించుకునేందుకు అవసరమైన విధి, విధానాలను రూపొందించాలి. అందుకు తగిన ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్) ఉండాలి. ప్రత్యేక యాప్ కూడా రూపొందించాలి. ప్రమాణాలు బావుండాలి – అన్ని విద్యాలయాలు, కళాశాలలను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. అవి కనీస ప్రమాణాలు పాటిస్తున్నాయో? లేదో? ధ్రువపరుచుకోవాలి. తగిన ప్రమాణాలు పాటించని విద్యా సంస్థలను తక్షణమే మూసి వేయాలి. అవి తిరిగి ఆయా ప్రమాణాలు సాధించిన తర్వాతే తిరిగి ప్రారంభానికి అనుమతివ్వాలి. – ఉపాధ్యాయ శిక్షణా సంస్థల పని తీరు, ఉపాధ్యాయ శిక్షణ కరిక్యులమ్పై కూడా తగిన శ్రద్ధ కనపర్చాలి. సక్రమంగా పని చేయని ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు, నాణ్యత ప్రమాణాలు పాటించని వాటిని తక్షణమే మూసి వేయాలి – వివిధ పాఠశాలలు, శిక్షణా సంస్థలు, కాలేజీలు ప్రమాణాలు పాటించాల్సిన ఆవశ్యకతపై తల్లిదండ్రులుకు వివరించాలి. విద్యా సంస్థల్లో ప్రమాణాలు కొరవడితే నష్టపోయేది విద్యార్థులేనని వారికి అవగాహన కల్పించాలి. ఉపాధ్యాయుల బదిలీలు – విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను పునర్నియమించే విధంగా అవసరసమైన బదిలీలు (రీ అపోర్షన్మెంట్) చేయాలి. – ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్ని, ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, విద్యా శాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు, హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య, సర్వశిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెట్రిసెల్వి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు అంశాలు అమలు – జాతీయ నూతన విద్యా విధానంలో ప్రతిపాదించిన అనేక అంశాలను రాష్ట్రంలో ఇప్పటికే అమలు చేస్తున్నామని విద్యా శాఖ అధికారులు సీఎంకు వివరించారు. – పాఠశాలలు, అంగన్వాడీల్లో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకం అమలు, ప్రాథమిక స్ధాయిలో పాఠశాల సంసిద్ధత కార్యక్రమాల అమలు, ద్విభాషా పాఠ్య పుస్తకాలు రూపొందించడం, సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టడం, స్థానిక సంస్కృతికి అద్దం పట్టేలా పాఠ్య పుస్తకాల రూపకల్పన, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ఏడాదికి కనీసం 50 గంటల పాటు శిక్షణా కార్యక్రమాలు అమలు జరిగేలా చూడటం వంటివన్నీ రాష్ట్రంలో అమలు అవుతున్నాయి. – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం 1,261 గురుకుల పాఠశాలలు, బాలికల కోసం 352 కస్తూరిబా గాంధీ విద్యాలయాలు (కేజీబీవీ), దివ్యాంగుల కోసం 672 భవిత కేంద్రాలను ఏర్పాటయ్యాయి. – పాఠశాలల ప్రమాణాల పరిరక్షణ కోసం ఇప్పటికే పాఠశాల విద్య, ఉన్నత విద్యకు సంబంధించి రెండు వేర్వేరు కమిషన్లు పని చేస్తున్నాయి. – అంగన్వాడీ సిబ్బందిలో మరింత నైపుణ్యం పెంచడంలో భాగంగా ఇంటర్ అర్హత ఉన్న వారికి ఆరు నెలల డిప్లొమా కోర్సు, పదవ తరగతి అర్హత ఉన్న వారికి ఏడాది డిప్లొమా కోర్సు ప్రవేశపెట్టాల్సి ఉంది. -
జూన్ నెలాఖరుకి కొత్త టీచర్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు కొత్త టీచర్లను నియమించేందుకు ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. జూన్ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8,792 పోస్టుల భర్తీకి గతేడాది టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టగా, పలు న్యాయ వివాదాల అనంతరం 7,414 పోస్టులకు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసింది. మరో 1,378 పోస్టులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్లు ఇవ్వాల్సి ఉంది. అయితే వారికి పోస్టింగ్లు ఇవ్వాలంటే ముందుగా టీచర్ల బదిలీలు చేపట్టాల్సి ఉండటంతో విద్యాశాఖ తర్జనభర్జన పడుతోంది. సీనియర్ టీచర్లకు కేటగిరీ–1 ప్రాంతాలైన పట్టణాలు, పరిసరాల్లోకి బదిలీలు చేసి, కొత్త టీచర్లకు కేటగిరీ–4 ప్రాంతాల్లో (గ్రామీణ ప్రాంతాల్లో) పోస్టింగ్లు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం బదిలీలపై నిషేధం ఉండటం, ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఈ నెలాఖరు తర్వాత పోస్టింగ్లకు సంబంధించిన వ్యవహారాలను ప్రారంభించాలన్న ఆలోచనల్లో ఉంది. దీనిపై ఉన్నత స్థాయిలో చర్చించి జూన్ మొదటి వారంలో రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ), బదిలీల ప్రక్రియను చేపట్టి జూన్ నెలాఖరుకు కొత్త టీచర్లను నియమించే అవకాశం ఉంది. అయితే హేతుబద్ధీకరణ చేయాలా? వద్దా? కేవలం బదిలీలు చేసి పోస్టింగ్లు త్వరగా ఇచ్చే డిమాండ్లు వచ్చినప్పటికీ రేషనలైజేషన్ చేయకుండా బదిలీలు, పోస్టింగ్ చేపడితే అవసరం లేని చోట టీచర్లు ఉండి.. అవసరం ఉన్న చోట టీచర్లు లేని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో హేతుబద్ధీకరణతోపాటు బదిలీలు చేశాకే కొత్త నియామకాలు చేపట్టాలన్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఈలోగా కొత్త టీచర్ల నియామక మార్గదర్శకాలను రూపొందించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. -
అక్రమార్కులకు అండదండలు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే విషయంలో పాఠశాల విద్యాశాఖ వెనక్కి తగ్గింది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ సంచాలకులతో సహా ప్రాంతీయ సంయుక్త సంచాలకులను తప్పు దోవ పట్టిస్తూ హైదరాబాద్ ఆర్జేడీ కార్యాలయ ఉద్యోగులు ఉత్తర్వులు విడుదల చేసిన వ్యవహారంపై విచారణ చేపట్టిన అధికారులు ఇందులో ముగ్గురి పాత్ర ఉన్నట్లు తేల్చారు. ఆ ముగ్గురు ఉద్యోగులైన సహాయ సంచాలకులు, సెక్షన్ సూపరింటెండెంట్, క్లరికల్ ఉద్యోగులు దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ విద్యాశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అనంతరం వారి నుంచి వివరణ తీసుకున్న ఆర్జేడీ ఆమేరకు ఫైలును పాఠశాల విద్యాశాఖ సంచాలక కార్యాలయానికి పంపించారు. ఇక్కడి వరకు చర్యలు వేగవంతంగా జరిగినప్పటికీ...ఆ ముగ్గురు ఉద్యోగులపై వేటువేసే క్రమంలో మాత్రం ఆ శాఖ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అవకతవకలు జరిగిన తీరు, చర్యలు తీసుకోవాల్సిన విషయానికి సంబంధించిన ఫైలు విద్యాశాఖ సంచాలకుడి కార్యాలయానికి చేరి 15 రోజులు కావస్తున్నా...ఆ ఫైలుకు మోక్షం కలగకపోవడం గమనార్హం. ఉన్నతాధికారిపై ఒత్తిడి... టీచర్ల బదిలీల్లో జరిగిన అక్రమాలు రుజువైనప్పటికీ...వారిపై చర్యలు తీసుకోకపోవడంపై ఆ శాఖలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమార్కలపై చర్యలు తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నట్లు ఆ శాఖలోని ఉద్యోగులు పేర్కొంటున్నారు. మరోవైపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్లు సమాచారం. ఈక్రమంలో విద్యాశాఖ ఉన్నతాధికారిపై ఒత్తిడి వస్తుండటంతోనే చర్యలకు సంబంధించిన ఫైలు పెండింగ్లో ఉందని చెబుతున్నారు. అవకతవకలకు పాల్పడినట్లు తేలిన ముగ్గుర్లో ఒకరు ఈ నెలాఖరులో పదవీ విరమణ పొందనున్నారు. దీంతో రిటైర్మెంట్కు ముందుగా శాఖపరమైన చర్యలు తీసుకుంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్కు ఇబ్బంది వస్తుందని, ఈ కారణంగానే వేటువేయడంలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. ఇదిలావుండగా, బదిలీ ఉత్తర్వుల్లో అక్రమంగా పేర్లు చొప్పిస్తూ ఇచ్చిన ఆదేశాలను విద్యాశాఖ రద్దు చేసింది. మొత్తం 37 మంది టీచర్ల పేర్లతో వచ్చిన ఉత్తర్వుల్లో దాదాపు ఇరవై వరకు సరైనవని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయా టీచర్లకు తిరిగి బదిలీ ఉత్తర్వులు జారీ చేసే అంశంపై విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
‘అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి’
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఆదివారం టీపీటీఎఫ్ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ అధ్యక్షుడు బి.కొండల్రెడ్డి, కార్యదర్శి మైస శ్రీనివాసులు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల బదిలీల్లో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారన్నారు. నాలుగు నెలలు కావస్తున్నా.. ఈ సమస్యని పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని, వారంలోగా పరిష్కరించకుంటే ఉద్యమిస్తామన్నారు. బదిలీల వ్యవహారంలో చిన్న ఉద్యోగులను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘ఝలక్’ ఇచ్చిన ఉద్యోగులకు షాక్..!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలకు పాల్పడిన ఉద్యోగులపై వేటు వేసేందుకు పాఠశాల విద్యా శాఖ చర్యలు చేప ట్టింది. టీచర్ల వెబ్ కౌన్సెలింగ్లో జరిగిన పొరపాట్ల సర్దుబాటులో పలువురు టీచర్ల నుంచి విద్యా శాఖ అప్పీళ్లు స్వీకరించింది. ఈ అప్పీళ్లను పరిశీలించి కొన్నింటికి ఆమోదం తెలుపుతూ విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచా ర్య ఉత్తర్వులు జారీ చేశారు. దీని ఆధారంగా పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్కుమార్ బదిలీ ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వుల్లో కొందరు ఆర్జేడీ కార్యాలయ ఉద్యోగులు ప్రభుత్వం ఆమోదించిన అప్పీళ్లతోపాటు తిరస్కరించిన అప్పీళ్లనూ చొప్పి ంచారు. ఇలా దాదాపు 17 మంది టీచర్లకు అక్రమంగా బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ‘ఉపాధ్యాయ బదిలీల్లో ఉన్నతాధికారులకు ఝలక్’అనే శీర్షికతో ఈ నెల 8న ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీంతో బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేశారు. ముగ్గురికి నోటీసులు..: బదిలీల్లో అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులకు ఆర్జేడీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇందులో ఒక అసిస్టెంట్ డైరెక్టర్తోపాటు సెక్షన్ సూపరింటెండెంట్, క్లరికల్ ఉద్యోగి ఉన్నారు. వీరంతా వివరణ ఇవ్వాల్సిందిగా ఆమె ఆదేశించారు. ఈ క్రమ ంలో వారి నుంచి వివరణ తీసుకున్న అధికారులు ఆ ఫైలును పాఠశాల విద్యా శాఖ సంచాలకుల కార్యాలయానికి పంపినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ఫైలు డైరెక్టర్ వద్ద పెండింగ్లో ఉంది. ఆయా ఉద్యోగులు ఇచ్చిన వివరణ ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తిరస్కరించిన అప్పీళ్లకు ప్రాంతీయ కార్యాలయంలో ఎలా ఆమోదించారనే అంశాన్నీ విద్యా శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. మొత్తంగా దసరా తర్వాత వీరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆ శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. -
టీచర్స్ ట్రాన్స్ఫర్లలోనూ అవినీతి: దాసోజు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టీచర్స్, లెక్చరర్స్ బదిలీల్లో భారీ అవినీతి చోటుచేసుకుందని కాంగ్రెస్ నేత దాసోజ్ శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన సీఎం కేసీఆర్కు ఓ బహిరంగ లేఖరాశారు. విద్యాబుద్దులు నేర్పి సమాజానికి ఆదర్శవంతంగా నిలవాల్సిన విద్యాశాఖలో కూడా అవినీతి జరగడం దారుణమన్నారు. నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత కూడా భార్యాభర్తల కు సంబంధించిన అంతర్ జిల్లా బదిలీలకు అనుమతి ఇవ్వకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. 2018 జూన్ 6 న మొదలుపెట్టి నెలరోజుల పాటు నిర్వహించిన ఉపాధ్యాయుల బదిలీలను వెబ్ కౌన్సెలింగ్తో విజయవంతంగా ముగించామని చెప్పుకుంటున్నారని, కానీ అంతర్జిల్లా బదిలీలకు అవకాశం ఇవ్వక పోవడం వెనుక ఉద్దేశాలేంటో అర్ధం కావడం లేదన్నారు. ‘దేవుడు వరమిచ్చినా పూజారి వరమియ్యేలేదు’ అన్నట్లుగా ఓ వైపు ప్రభుత్వం జీవో విడుదలచేసినా విద్యాశాఖ ఎందుకు అంతర్జిల్లా బదిలీలను చేపట్ట లేకపోయిందో సమాధానం చెప్పాలని సీఎంను ప్రశ్నించారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామన్న హామీని మరిచిపోయారన్నారు. సుదీర్ఘ కాలంగా ఒకేచోట పనిచేస్తున్న వారిని ట్రాన్స్ ఫర్ చేస్తామని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నా కూడా ఎందుకు ఆచరణలో పెట్టలేకపోయారని ప్రశ్నించారు. నోటిపికేషన్ విడుదల చేయకుండా ఉద్యోగాలను భర్తీచేయకుండా గెస్ట్ లెక్చరర్ల పేరిట కళాశాలలను నడుపుతున్నారని, ఇలా పూర్తి స్ధాయి లెక్చరర్లు , ప్రిన్సిపాల్ లేకుండా ఇంచార్జీలతో కాలం వెళ్లదీస్తుంటే నాణ్యమైన విద్య ఎలా అందుతుందో చెప్పాలని నిలదీశారు. -
టీచర్ల బదిలీల పరిష్కరణలో జాప్యం’
సాక్షి, హైదరాబాద్: టీచర్ల బదిలీలపై వచ్చిన అప్పీళ్ల పరిష్కరణలో విద్యాశాఖ జాప్యం చేయడంపై పీఆర్టీయూ ఆగ్రహం వ్యక్తం చేసింది. బదిలీల్లో అన్యాయం జరిగిందంటూ టీచర్లు వినతులిచ్చి 15 రోజులు గడిచినా పరిష్కరించకపోవడాన్ని తప్పుబట్టింది. అప్పీళ్లను పరిష్కరించాలని కోరుతూ శనివారం ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తంరెడ్డి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్యకు వినతిపత్రం అందజేశారు. ఉన్నత పాఠశాలల్లో ఎన్సీసీ యూనిట్లు ఉన్నచోట ఇద్దరికి పోస్టింగ్ ఇవ్వడంతో అయోమయం నెలకొందని, ఎన్సీసీ యూనిట్లకు అధికారులను నియమించాలని కోరారు. టీచర్లు సమర్పించిన వినతులు పరిష్కరించకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. -
టీచర్ల బదిలీలకు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ టీచర్ల బదిలీలకు లైన్ క్లియర్ అయింది. ఉపాధ్యాయ బదిలీ నిబంధనలను సవాల్ చేసిన వ్యాజ్యాలపై వాదనలు ముగియడంతో హైకోర్టు తుది తీర్పును వెల్లడించింది. టీచర్ల బదిలీ ప్రక్రియ నిలిపి వేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. బదిలీలు ఆపాలంటూ హైకోర్టులో దాఖలైన 125 పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది. మరోవైపు.. ‘‘బదిలీ ఉత్తర్వులు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయి. ఏకీకృత సర్వీసు నిబంధనలకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ఉత్తర్వుల్ని యథాతథంగా ఉంచాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో బదిలీ ఉత్తర్వుల్ని రద్దు చేయాలి’’. అని ప్రభుత్వ ఉపాధ్యాయుల తరఫున సీనియర్ న్యాయవాది రామచంద్రరావు, జెడ్పీ టీచర్ల తరఫున సీనియర్ న్యాయవాది సురేందర్రావు వాదించిన విషయం తెలిసిందే. ‘‘డీఈవో లేని చోట్ల ఉపాధ్యాయులను బదిలీచేసే అధికారం ఆర్జేడీలకు అప్పగించాం. పూర్వపు పది జిల్లాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని బదిలీలు జరుగుతాయి. పైరవీలకు ఆస్కారం లేదనే కొందరు కావాలని బదిలీ ప్రక్రియను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వ్యాజ్యాలను కొట్టివేసి బదిలీలు జరిగేలా చేయాలి’’ అని సర్కార్ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు ప్రతివాదన చేశారు. గతంలో పలు దఫాలు వాయిదా పడగా.. బదిలీలు ఆపాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను నేడు కొట్టివేసిన ధర్మాసనం ప్రక్రియను కొనసాగించవచ్చునని స్పష్టం చేసింది. -
ఉపాధ్యాయ బదిలీలపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, మెదక్ : తెలంగాణ రాష్ట్రంలో పాలకులు అహంకారంతో వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధ్యాయ బదిలీలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఏ మాత్రం జరగడం లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు గౌరవం దక్కడం లేదన్నారు. పక్క రాష్ట్రంలో 10వేల ఉద్యోగాలు నియామకాలు చేపడితే.. తెలంగాణలో 10 కూడా జరగలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. 4 సంవత్సరాల కాలంలో డీఎస్సీ, టీచర్ల నియామకాలను ప్రభుత్వం చేపట్టలేదని ఉత్తమ్ పేర్కొన్నారు. అంతేకాక ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డు కష్టాలు తప్పడం లేదన్నారు. -
టీచర్ల బదిలీల వ్యాజ్యాలపై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ బదిలీ నిబంధనలను సవాల్ చేసిన వ్యాజ్యాలపై వాదనలు ముగియడంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని హైకోర్టు ప్రకటించింది. ఈ మేరకు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గురువారం నిర్ణయాన్ని వెల్లడించింది. ‘‘బదిలీ ఉత్తర్వులు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయి. ఏకీకృత సర్వీసు నిబంధనలకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ఉత్తర్వుల్ని యథాతథంగా ఉంచాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో బదిలీ ఉత్తర్వుల్ని రద్దు చేయాలి’’.. అని ప్రభుత్వ ఉపాధ్యాయుల తరఫున సీనియర్ న్యాయవాది రామచంద్రరావు, జెడ్పీ టీచర్ల తరఫున సీనియర్ న్యాయవాది సురేందర్రావు వాదించారు. ‘‘డీఈవో లేని చోట్ల ఉపాధ్యాయులను బదిలీచేసే అధికారం ఆర్జేడీలకు అప్పగించాం. పూర్వపు పది జిల్లాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని బదిలీలు జరుగుతాయి. పైరవీలకు ఆస్కారం లేదనే కొందరు కావాలని బదిలీ ప్రక్రియను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వ్యా జ్యాలను కొట్టివేసి బదిలీలు జరిగేలా చేయాలి’’ అని సర్కార్ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు ప్రతివాదన చేశారు. వాదన ల అనంతరం తీర్పును వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. 26లోగా వీటిపై తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని« దర్మాసనం తెలిపింది. -
‘నకిలీ’లా.. నో ప్రాబ్లమ్!
సాక్షి, హైదరాబాద్: టీచర్ల బదిలీల్లో రోజుకో వింత వ్యవహారం వెలుగు చూస్తోంది. ఓ వైపు విద్యాశాఖ వైఖరితో బదిలీల కౌన్సెలింగ్ తేదీలు పొడిగిస్తుండగా.. మరోవైపు నకిలీ మెడికల్ సర్టిఫికెట్ల విషయంలో కొందరిపైనే చర్యలు తీసుకోవడం ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 2వేల మంది నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు ప్రాథమికంగా గుర్తించినా 30 మందిపైనే చర్యలు తీసుకోవడంపై టీచర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసిన వైద్యాధికారులపైనా వేటు వేయకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2 వేల మంది..! ఉపాధ్యాయుడి భార్యకు దీర్ఘకాలిక జబ్బులున్నా లేదా దీర్ఘకాలిక జబ్బులు, మానసిక వికలాంగులున్న పిల్లలున్నా వారికి విద్యాశాఖ 10 పాయింట్లు ఇస్తుంది. దీనికి మెడికల్ బోర్డుల నుంచి ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి. ఇదే అదనుగా కొందరు టీచర్లు అడ్డదారిలో నకిలీ సర్టిఫికెట్లు పొంది ప్రాథమిక సీనియారిటీ జాబితాలో అదనపు పాయింట్లు సాధించారు. ప్రాథమిక జాబితాపై అభ్యంతరాలు వెల్లువెత్తడంతో తేరుకున్న శాఖ.. కొన్ని దరఖాస్తులను లోతుగా పరిశీలించి నకిలీవని తేల్చింది. కొందరు స్వచ్ఛందంగా మెడికల్ కేటగిరీ పాయింట్లు రద్దు చేయా లని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 వేల మంది నకిలీ ధ్రువపత్రాలు సమర్పించినట్లు ప్రాథమికంగా తేల్చారు. మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన టీచర్లపై ఆయా జిల్లా కలెక్టర్లు వేటు వేశారు. కానీ మిగతా జిల్లాల్లో ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. చర్యలు కొందరిపైనే! బదిలీ దరఖాస్తుల్లో నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన వారందరిపై చర్యలు తీసుకోకుండా కొందరిపైనే విద్యాశాఖ వేటు వేయడంపై ఉపాధ్యాయ వర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. దరఖాస్తు ల పరిశీలనలో నకిలీవని తేలితే తప్పనిసరిగా వేటు వేయాలని ఇప్పటికే డిమాండ్ చేశాయి. కానీ సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో పదుల సంఖ్యలో టీచర్లపైనే చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 2,000 మంది బోగస్ సర్టిఫికెట్లు సమర్పించినట్లు గుర్తించినా దాదాపు 30 మందిపైనే చర్యలు తీసుకోవడం గమనార్హం. ఆ వైద్యాధికారులపై చర్యలేవి? ఒక్కో నకిలీ సర్టిఫికెట్కు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు వైద్యాధికారులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. రంగారెడ్డి, మెదక్, వరంగల్, కరీంగనర్, నిజామాబాద్ జిల్లాల్లోనే ఎక్కువగా మెడికల్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీర్ఘకాలిక జబ్బులతో పాటు వైకల్య నిర్ధారణలోనూ ఇదే తరహా నకిలీలు పుట్టుకొచ్చినట్లు సమాచారం. అడ్డగోలుగా సర్టిఫికెట్లు జారీ చేసిన వైద్యాధికారులపై ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని, వీటిని ముంద స్తుగా కట్టడి చేసి ఉంటే ఇంత భాగోతం జరిగేది కాదని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. టీచర్లతో పాటు వైద్యాధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి: పీఆర్టీయూ నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన టీచర్లపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖను పీఆర్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు సరోత్తంరెడ్డి, చెన్నకేశవరెడ్డి కోరారు. సర్టిఫికెట్లు జారీ చేసిన వైద్యాధికారులపైనా చర్యలు తీసుకోవాల న్నారు. మెదక్ జిల్లాలో కొందరు టీచర్లు సరైన సర్టిఫికెట్లు ఇచ్చినా వారిని కలెక్టర్ సస్పెండ్ చేశారని, సస్పెన్షన్ను వెనక్కు తీసుకోవాలని కోరారు. బదిలీల సమయంలో గందరగోళం నెలకొనడంతో మిగతా టీచర్లు ఇబ్బంది పడుతున్నారని, అధికారులు లోతు గా పరిశీలిస్తే ఇబ్బందులుండవని టీఆర్టీఎఫ్ గౌరవాధ్యక్షుడు ప్రతాప్రెడ్డి అన్నారు. -
టీచర్ల బదిలీల్లో అవే తప్పులు...!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి విద్యాశాఖ వెల్లడించిన సీనియారిటీ జాబితా గందరగోళంగా మారింది. ఎన్టైటిల్మెంట్ పాయింట్ల కేటాయింపులో పొరపాటు దొర్లడంతో జాబితాలో పేర్లు తారుమారయ్యాయి. బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల ప్రాథమిక సీనియారిటీ జాబితాను విద్యాశాఖ శుక్రవారం వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చింది. ఇందులో సీనియారిటీని చూసుకున్న పలువురు ఉపాధ్యాయులు తమ పాయింట్లను చూసుకుని కంగుతిన్నారు. జాబితాలో జూనియర్లు పైవరుసకు వెళ్లడంతో సీనియర్లు విద్యాశాఖకు భారీగా ఫిర్యాదులు చేశారు. ప్రాథమిక జాబితాపై ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి సరిదిద్దే వెసులుబాటు ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలతో ఆ ప్రక్రియ మరింత జటిలంగా మారింది. తాజాగా ప్రవేశపెట్టిన ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం లేదు. జాబితాలో ఒకసారి వంద మంది పేర్లను మాత్రమే చూసే అవకాశం ఉంది. దీంతో ఎవరైనా ఉపాధ్యాయుడు జాబితాలో తన పేరును చూసుకోవాలంటే ప్రతి పేజీని తప్పకుండా చూడాల్సి వస్తోంది. మరోవైపు తప్పొప్పులు సవరిస్తున్న క్రమంలో జాబితాలో పేర్లు గంటగంటకూ తారుమారవుతున్నాయి. ఈ ప్రక్రియ ఉపాధ్యాయులకు చికాకు తెస్తోంది. మరోవైపు జాబితాను ప్రింట్అవుట్ తీసుకునే వీల్లేకపోవడంతో సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు సరైన ఆధారాలు సమర్పించే అవకాశం లేదని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. నేటితో అభ్యంతరాలకు తెర... ఉపాధ్యాయులకు సర్వీసు కాలానికి ఇచ్చే పాయింట్లలో తప్పులు దొర్లినట్లు టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జిల్లా బదిలీలపై వచ్చిన వారికి జీరో సర్వీసును పరిగణించకుండా పూర్వ జిల్లాలో పనిచేసిన కాలానికి పాయింట్లు ఇస్తున్నట్లు టీచర్లు విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అలాగే స్కూళ్ల కేటగిరీని నిర్దేశించడంలో పొరపాట్లు జరిగినట్లు పలువురు టీచర్లు డీఈవోలకు లిఖితపూర్వకంగా వినతులు సమర్పించారు. పదో తరగతిలో వంద శాతం ఫలితాల విషయంలోనూ జీహెచ్ఎంలతో కుమ్మక్కై టీచర్లు అధిక పాయింట్లు పొందుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే వాటిని ఆమోదిస్తున్నారని, స్పౌజ్ పాయింట్ల విషయంలో సర్వీసు పుస్తకాలను వెరిఫై చేయకుండా పచ్చజెండా ఊపుతున్నట్లు టీచర్లు ఆరోపిస్తున్నారు. సీనియారిటీ జాబితా, పాయింట్ల కేటాయింపుపై అభ్యంతరాల స్వీకరణ ఆదివారంతో ముగియనుంది. టీచర్ల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత మంగళవారం తుది జాబితాను విద్యాశాఖ ప్రకటించనుంది. అవార్డులు వెనక్కు...! జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులు పొందిన టీచర్లకు గతంలో బదిలీల ప్రక్రియలో ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చేది. తా జాగా అలాంటి వారికి, రాష్ట్ర, జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్లకు ప్రత్యేక పాయింట్లు ఇవ్వడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పనితీరుకు గుర్తింపుగా అవార్డులు ఇచ్చి ఇప్పుడు గౌరవం ఇవ్వడం లేదని పలువురు అవార్డుగ్రహీతలు విద్యాశాఖ వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ విద్యాశాఖ వారి వినతిని పరిగణించలేదు. దీంతో తాజాగా అవార్డులు తిరిగిచ్చేయాలని కొందరు భావిస్తున్నారు. సందర్భాన్ని బట్టి అవార్డులను ప్రభుత్వానికి తిరిగిచ్చేస్తామని ఇటీవల రాష్ట్రస్థాయి పురస్కారం తీసుకున్న ఉపాధ్యాయుడు ఒకరు ‘సాక్షి’తో అన్నారు. -
అడ్డగోలు బదిలీలు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయుల సాధారణ బదిలీలకు ముందే అడ్డగోలుగా ‘విచక్షణ’ బదిలీలు జరుగుతున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాము కోరుకున్న చోట పోస్టింగ్ కోసం కొందరు, అధికంగా హెచ్ఆర్ఏ (ఇంటి అద్దె భత్యం) పొందవచ్చని మరికొందరు, మారుమూల ప్రాంతాల్లో ఉండటం ఇష్టం లేక పట్టణ ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు అధికారులను, రాజకీయ నేతలను పట్టుకుని ఈ ‘విచక్షణ’ బదిలీలు చేయించుకుంటున్నట్టు ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. కొందరు అధికారులు లక్షల కొద్దీ ముడుపులు పుచ్చుకుని ఇష్టారాజ్యంగా బదిలీలు చేస్తున్నారని.. దీనివల్ల ఇతర టీచర్లకు నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ బదిలీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. వాస్తవానికి ఈ బదిలీల వ్యవహారంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఇప్పటికే అధికారులను హెచ్చరించారు. ‘టీచర్ల విచక్షణ బదిలీలతో ప్రభుత్వం అభాసుపాలవుతోంది. అత్యవసరమైతే తప్ప అలాంటి బదిలీలు వద్దు. బదిలీల షెడ్యూల్ జారీ చేశాక ఎట్టి పరిస్థితుల్లో విచక్షణ బదిలీలు చేయవద్దు..’ అని స్పష్టం చేశారు. అయినా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఈనెల 6వ తేదీన బదిలీల షెడ్యూల్ విడుదలయ్యాక కూడా పాత తేదీలతో అడ్డగోలుగా బదిలీలు చేసినట్టు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. 400కు పైగా బదిలీలు! విచక్షణ బదిలీల పేరుతో ఇప్పటివరకు దాదాపు 400 మంది టీచర్లు బదిలీ పొందినట్టు విద్యాశాఖ అధికారులే పేర్కొంటున్నారు. ఇందులో ఆయా జిల్లాల పరిధిలో 300 మందిని బదిలీ చేయగా.. మరో వంద మందిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో భారీగా సొమ్ము చేతులు మారినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాల పరిధిలోని పట్టణ ప్రాంతాలకు బదిలీ కోసం రూ.2 లక్షల వరకు, అంతర్ జిల్లా బదిలీలకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసినట్టు ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. రాజకీయ పలుకుబడి, డబ్బులు.. సాధారణ బదిలీల్లో తాము కోరుకున్న స్థానాలు రాకపోవచ్చని భావించిన కొందరు ఉపాధ్యాయులు.. రాజకీయ నాయకులతో పరిచయాన్ని, డబ్బు, పరపతిని ఉపయోగించుకుని కోరుకున్న చోటికి బదిలీ చేయించుకోగలిగారని అంటున్నారు. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు ముట్టజెప్పాల్సి వచ్చిందని పోస్టింగులు సాధించుకున్న ఉపాధ్యాయులు తోటి ఉపాధ్యాయులతో చెప్పుకుంటుండటం గమనార్హం. ఓ కీలక అధికారి, కొందరు నేతలను పట్టుకుంటే కావాల్సిన చోటికి బదిలీ చేయించుకోవచ్చని, తమకు తెలిసిన ఏయే టీచర్ ఎంత ‘ఖర్చు’ పెట్టుకుని బదిలీ చేయించుకున్నారని ఉపాధ్యాయుల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇక కొందరు నేతలు అధిక హెచ్ఆర్ఏ వర్తించే ప్రదేశాలను ముందే గుర్తించి.. ఆయా చోట్ల పోస్టింగ్ ఇప్పించేందుకు పలువురు టీచర్లతో బేరాలు కూడా కుదుర్చుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. టీచర్లు వెళ్లి చేరితేనే.. ఇతర జిల్లాల నుంచి ఒక్క రంగారెడ్డి జిల్లాకే 35 మంది టీచర్లు బదిలీ చేయించుకున్నారు. పాత రంగారెడ్డి జిల్లా పరిధిలోకి మరో 13 మంది టీచర్ల బదిలీలు జరిగాయి. ఇవన్నీ బయటకు వచ్చిన వివరాలే. ఇంకా టీచర్లు వెళ్లి స్కూళ్లలో చేరితే తప్ప తెలియని విధంగా బదిలీల ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. గతంలో ఎవరినైనా విచక్షణ బదిలీ చేయాలనుకుంటే జీవో రూపంలో ఉత్తర్వులు వెలువడేవి. కానీ ఇప్పుడు మెమో రూపంలో బదిలీలు చేస్తున్నారు. దీంతో సదరు టీచర్లు ఆయా పాఠశాలలకు వెళ్లి చేరితే తప్ప బదిలీ అయినట్టు బయటికి తెలియడం లేదు. ఇలా హైదరాబాద్, సంగారెడ్డి, నల్లగొండ, వరంగల్, మెదక్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల నుంచి 200 మందికిపైగా టీచర్లకు బదిలీలు జరిగినట్టు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. మరోవైపు ఇప్పటివరకు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), పండిట్లు, పీఈటీలు, స్కూల్ అసిస్టెంట్లను విచక్షణ బదిలీలు చేయగా.. ఈసారి పెద్ద సంఖ్యలో ప్రధానోపాధ్యాయులూ ఇలా బదిలీ అయ్యారు. ఒక్క వరంగల్ జిల్లా పరిధిలోనే నలుగురిని ఇలా పట్టణ ప్రాంతానికి బదిలీ చేసినట్టు తెలిసింది. ఇప్పటివరకు జరిగిన బదిలీలతోపాటు మరో 200 వరకు బదిలీల ఫైళ్లు ఉన్నట్టు ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. గల్లంతవుతున్న పోస్టులు స్థానిక, ఓపెన్ కోటాలలో 80:20 పద్ధతిన పోస్టులు భర్తీ చేయాలి. కానీ విచక్షణ బదిలీలతో మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో స్థానికేతరుల సంఖ్య పెరిగిపోయిందని, దీనివల్ల స్థానికులకు పోస్టులు మిగలకుండా పోయే పరిస్థితి నెలకొందని అంటున్నారు. అంతేకాదు అక్రమ బదిలీలతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 30 శాతం హెచ్ఆర్ఏ కలిగిన ప్రదేశాలు (ఖాళీలు) భర్తీ అయిపోయాయని చెబుతున్నారు. మరోవైపు అడ్డదారి బదిలీల ఆర్డర్లు పట్టుకుని వస్తున్న టీచర్లతో అధికారులు గందరగోళంలో పడుతున్నారు. ఇలా పోస్టింగ్ ఆర్డర్లు పట్టుకుని వస్తున్న వారి కారణంగా.. ఖాళీల సంఖ్య మారిపోతుండటంతో తరచూ మార్పులు చేయాల్సి వస్తోందని ఓ ఉన్నతాధికారి వాపోవడం గమనార్హం. మరోవైపు అడ్డదారి బదిలీలపై నిరసన తెలిపినా ప్రభుత్వంగానీ, ఉన్నతాధికారులుగానీ పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. సీఎంవో బదిలీలు రద్దు చేయాలి ‘‘అక్రమ బదిలీలను ప్రోత్సహించడం సరికాదు. ఇలా ఇప్పటివరకు చేసిన బదిలీలన్నింటినీ రద్దు చేయాలి. దీనిపై కొందరు టీచర్లు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. విచక్షణ బదిలీల కోసం ఇంకా 200 ఫైళ్లు ఉన్నట్టు తెలిసింది..’’ – భుజంగరావు, ఎస్టీయూ అధ్యక్షుడు ఇక కౌన్సెలింగ్ ఎందుకు? ‘‘ప్రభుత్వమే అడ్డదారిలో బదిలీలు చేస్తే.. ఇంకా కౌన్సెలింగ్ ఎందుకు? ఇప్పటివరకు చేసిన బదిలీలను రద్దు చేయాలి. ఆయా స్థానాలు అర్హులైన వారికి దక్కేలా చూడాలి..’’ – రవి, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి -
రెండేళ్లు నిండితేనే బదిలీ
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ మొదలైంది. మూడేళ్ల తర్వాత బదిలీలు చేపట్టడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఉత్సాహం కనిపిస్తోంది. బదిలీలను ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించడంపై ఉపాధ్యాయుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా విద్యా శాఖ మాత్రం ఆన్లైన్వైపే మొగ్గు చూపింది. ఈ మేరకు జీవో ఎంఎస్ 16 జారీ చేసింది. బదిలీకి 2018 మే 31ని కటాఫ్ తేదీగా నిర్ణయించింది. ఉపాధ్యాయులు http:// transfers. cdse. telangana. gov. in వెబ్సైట్లో లాగిన్ అయి బదిలీకి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలి. ఒకేచోట రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు బదిలీకి అర్హులు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న జీహెచ్ఎంలు, ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న టీచర్లు తప్పనిసరిగా బదిలీ కానున్నారు. పదవీ విరమణకు రెండేళ్లలోపు సమయం ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఉంటుంది. బాలికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న 50 ఏళ్ల లోపు పురుష ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ కానున్నారు. బాలికోన్నత పాఠశాలలో పనిచేయడానికి మహిళా ఉపాధ్యాయులు లభ్యమవకపోతే 50 ఏళ్లకు పైబడిన పురుష ఉపాధ్యాయులకు బదిలీకి అవకాశమిస్తారు. ఎన్సీసీ అధికారులుగా ఉన్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నిర్ణీత సర్వీసు ఓ పాఠశాలలో పూర్తయితే మరో ఎన్సీసీ పాఠశాలకు బదిలీ చేయాలి. బదిలీకి అర్హత పాయింట్లు ఇలా.. నాలుగో కేటగిరీ పాఠశాలలో పనిచేసే టీచర్కు (12 శాతం ఇంటి అద్దె పొందుతూ ఎలాంటి రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు) ఏటా 5 పాయింట్లు (ప్రతి నెల సర్వీసుకు 0.416 పాయింట్లు) ఇస్తారు. మూడో కేటగిరి పాఠశాల టీచర్కు (12 శాతం అద్దె పొందుతూ రోడ్డు సౌకర్యం ఉన్న గ్రామాలు) ఏటా 3 పాయింట్లు (నెలకు 0.25 పాయింట్లు) ఇస్తారు. రెండో కేటగిరి పాఠశాల టీచర్కు (14.5 శాతం ఇంటి అద్దె పొందే పట్టణాలు, శివారు గ్రామాలు) ఏటా 2 పాయింట్లు, మొదటి కేటగిరీ పాఠశాలల్లో (20% ఆపైన హెచ్ఆర్ఏ పొందే పట్టణాలు, శివారు గ్రామాలు) పనిచేసే టీచర్కు ఏటా ఒక పాయింట్ ఇస్తారు. నాలుగో కేటగిరీ ప్రాంతాలను జిల్లా కలెక్టర్లు ప్రకటిస్తారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆన్ డ్యూటీ సౌకర్యం ఉన్న ఉపాధ్యాయ సంఘాల నేతలు, గుర్తింపు పొందిన సంఘాల రాష్ట్ర, ఉమ్మడి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుకు 10 పాయింట్లు ఇస్తారు. అవివాహిత మహిళలు, భార్యా భర్తల్లో ఒకరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైతే 10 పాయింట్లు కేటాయిస్తారు. ప్రధానోపాధ్యాయులు ఐదేళ్లకు, ఇతర టీచర్లు ఎనిమిదేళ్లకు ఒకసారే ఈ పాయింట్లు వాడుకోవాలి. పదో తరగతిలో 100 శాతం ఫలితాలకు 2.5 పాయింట్లు, 95 శాతం పైబడితే 2 పాయింట్లు, 90 నుండి 94 శాతం వరకు ఒక పాయింట్ ఇస్తారు. ప్రాధాన్యత కేటగిరీలు వికలాంగులు (70 శాతం పైబడిన), వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, ఉద్యోగి లేదా జీవిత భాగస్వామి కేన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, బోన్ టీబీ, కిడ్నీ లివర్ హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ వంటి రోగాల పీడితులుంటే ప్రాధాన్యత కేటగిరీ కింద పరిగణిస్తారు. అలాగే మానసిక వైకల్యం, బ్లడ్ కేన్సర్, గుండెకు రంధ్రం, జువైనల్ డయాబెటిస్ వంటి వ్యాధులతో బాధపడే పిల్లల తల్లిదండ్రుల్లో ఒకరు ప్రాధాన్యత కేటగిరీలోకి వస్తారు. బదిలీల నిర్వహణకు కమిటీలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల బదిలీలకు జోనల్ స్థాయిలో డైరెక్టరేట్ నుంచి నియమించిన సీనియర్ అధికారి చైర్మన్గా, ఆర్జేడీ మెంబర్ కన్వీనర్గా, సంబంధిత డీఈఓ సభ్యులుగా కమిటీ ఉంటుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల జీహెచ్ఎంలకు సంబంధించి జెడ్పీ చైర్పర్సన్ చైర్మన్గా, కలెక్టర్ వైస్ చైర్మన్గా, జేసీ, జెడ్పీ సీఈఓ సభ్యులుగా ఏర్పడిన కమిటీ బదిలీలు నిర్వహిస్తుంది. జిల్లా స్థాయిలో ప్రభుత్వ ఉపాధ్యాయుల కొరకు కలెక్టర్ చైర్మన్గా, జేసీ, సీఈవో సభ్యులుగా, డీఈవో కన్వీనర్గా కమిటీ బదిలీలు నిర్వహిస్తుంది. ఒకసారి బదిలీ అయిన తర్వాత మార్చడానికి వీళ్లేదు. తప్పనిసరి బదిలీలో ఉండి బదిలీకి దరఖాస్తు చేయని, వెబ్ ఆప్షన్ ఇచ్చుకోని ఉపాధ్యాయులను మిగిలిపోయిన ఖాళీల్లో బదిలీ చేస్తారు. బదిలీ ఉత్తర్వులన్నీ నోటీసు బోర్డుపై, ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. బదిలీ అయిన ఉపాధ్యాయులు కొత్త పాఠశాలలో మరుసటి రోజే చేరాలి. బదిలీలపై అభ్యంతరాలు, ఫిర్యాదులను అప్పీలేట్ అధికారికి 10 నుంచి 15 రోజులల్లోగా సమర్పించాలి. వారు రికార్డులు పరిశీలించి ఉత్తర్వులిస్తారు. బదిలీలకు తప్పుడు సమాచారం సమర్పించిన, నిబంధనలు ఉల్లంఘించిన ఉపాధ్యాయులు, అధికారులపై సీసీఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. టీచర్ల ప్రాధాన్యత పాయింట్లలో కోత ఉపాధ్యాయ బదిలీ మార్గదర్శకాల్లో గతంతో పోల్చితే స్వల్ప మార్పులు జరిగాయి. జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు పొందిన టీచర్లకు బదిలీల సమయంలో ప్రోత్సాహకంగా ప్రాధాన్యత పాయింట్లు ఇచ్చేవారు. ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను ఉపాధ్యాయులకు వివరించేందుకు నియమించిన రాష్ట్ర, జిల్లా రిసోర్స్ పర్సన్లకూ ప్రత్యేక పాయింట్లు ఇచ్చేవారు. తాజా మార్గదర్శకాల్లో ఈ పాయింట్లకు ప్రభుత్వం కోత పెట్టింది. అలాగే ఒకేచోట 8 ఏళ్లు సర్వీసు పూర్తి చేసిన భార్య, భర్తలు తప్పనిసరి బదిలీ అవనున్నారు. అయితే ఇందులో స్పౌజ్ పాయింట్లు వాడుకునే అంశంపై స్పష్టత లేదు. సాధారణంగా స్పౌజ్ ప్రాధాన్యత పాయింట్లు ఇస్తే భార్య పనిచేసే చోటుకు భర్త, భర్త పనిచేసే చోటుకు భార్య వెళ్లడం సహజం. ఈ సమయంలో ఒకరు స్పౌజ్ పాయింట్లు వాడుకునే అవకాశం ఉంటుంది. తాజా ఉత్తర్వుల్లో దీనిపై స్పష్టత లోపించింది. ఇలాంటి అంశాలపై క్షేత్ర స్థాయిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. టీచర్ల బదిలీల షెడ్యూల్ విడుదల సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసింది. బుధవారం రాత్రి పొద్దుపోయాక ప్రభుత్వం టీచర్ల బదిలీల మార్గదర్శకాలను విడుదల చేసిన నేపథ్యంలో గురువారం విద్యాశాఖ బదిలీల షెడ్యూల్ ప్రకటించింది. బదిలీలు కోరుకునే ఉపాధ్యాయులు గురువారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం తేదీలవారీగా చేపట్టే కార్యక్రమాలను విద్యాశాఖ షెడ్యూల్లో ప్రకటించింది. ఆన్లైన్లో బదిలీలపై అవగాహన కల్పిస్తూనే అభ్యంతరాల స్వీకరణకూ సమయం ఇచ్చింది. బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేలా కసరత్తు చేసింది. దరఖాస్తుల స్వీకరణ, సీనియారిటీ జాబితా, ఎన్టైటిల్మెంట్ పాయింట్లు, అభ్యంతరాలు, వెబ్ ఆప్షన్లు, బదిలీ ఉత్తర్వులన్నీ ఆన్లైన్ పద్ధతిలోనే జరగనున్నాయి. ఈ నెల 26వ తేదీతో బదిలీల ప్రక్రియ ముగియనుంది. ఇదీ షెడ్యూల్... -
టీచర్ల బదిలీలకు మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జీవో 16 జారీ చేసింది. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా విద్యాశాఖ కూడా బదిలీల షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంది. గురువారం ఉదయం షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈసారి బదిలీ ప్రక్రియను ఆన్లైన్ పద్ధతిలోనే నిర్వహించనున్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఆఫ్లైన్ పద్ధతిలో చేపట్టాలని డిమాండ్ చేసినా.. విద్యాశాఖ మాత్రం ఆన్లైన్ వైపే మొగ్గుచూపింది. ఈ నెల 7 నుంచి 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఇప్పటికే జిల్లాల వారీగా ఉపాధ్యాయ ఖాళీల జాబితాను వెబ్సైట్లో పొందుపర్చారు. ఉపాధ్యాయులు వేకెన్సీ పొజిషన్ను చూసుకుంటూ బదిలీలపై అంచనాలు వేసుకుంటున్నారు. ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్లు ఒకేచోట పనిచేసిన టీచర్లకు బదిలీ తప్పనిసరి కానుంది. తాజా మార్గదర్శకాల్లో గత నిబంధనలను అనుసరించినప్పటికీ కొన్ని మార్పులు చేశారు. ఆ వివరాలివీ.. - ఉద్యోగి స్పౌజ్కు హృద్రోగాలు లేదా కిడ్నీ లేదా కేన్సర్ వంటి వ్యాధులుంటే వారిని ప్రిఫరెన్షియల్ కోటాలో చేర్చుతారు. గతంలో పిల్లలకు మాత్రమే ఇలాంటి వ్యాధులుంటే ఈ కోటా వర్తించేది. పిల్లల కేటగిరీలో డయాబెటిక్, గుండె సంబంధిత వ్యాధులు, బ్లడ్ కేన్సర్, మానసిక వైకల్యం కేటగిరీ వారికి ప్రాధాన్యం ఇస్తారు. - స్పౌజ్ కేటగిరీలో ఇచ్చే ప్రాధాన్య పాయింట్లు దుర్వినియోగం కాకుండా భార్యాభర్తల్లో ఒకరు ఉన్న చోటికి మరొకరిని పంపేలా వారు పని చేసే స్కూల్ను జీపీఎస్ ద్వారా లింకు చేసి, అక్కడికే మరొకరిని పంపిస్తారు. స్పౌజ్ పాయింట్లు భార్య, భర్త ఇరువురిలో ఒకరు మాత్రమే వినియోగించుకోవాలి. - భార్య/భర్త ఇరువురిలో ఒకరు స్పౌజ్ పాయింట్లు వినియోగించుకున్నట్లయితే.. మరొకరు పనిచేసే చోటు నుంచి 50 కిలోమీటర్ల దూరంలోపు ఉన్న స్థానాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ దూరం ఉన్న స్థానానికి ఆప్షన్ ఇచ్చుకుంటే జనరల్ పద్ధతిలో బదిలీ చేస్తారు. - టీచర్కు ఎనిమిదేళ్లు, హెడ్ మాస్టర్కు 5 ఏళ్ల సర్వీసు పూర్తయితే తప్పనిసరిగా బదిలీ చేస్తారు. - ఆన్లైన్లో ‘నాట్ విల్లింగ్’కు అవకాశం ఉండదు. పని చేస్తున్న ప్రదేశంలో రెండేళ్ల సర్వీసు ఉన్న వారు (బదిలీకి దరఖాస్తు చేసుకునే అర్హత కలిగినవారు) తమకు కచ్చితంగా ట్రాన్స్ఫర్ కావాలనుకునే ఒకటీ రెండు స్కూళ్లకు (ప్లేస్లు) మాత్రమే ఆప్షన్లు ఇచ్చుకోవాలి. వాటిల్లో వస్తే అలాట్ అవుతుంది. లేదంటే పాత స్కూల్లోనే ఉంటారని అధికారులు వెల్లడించారు. ఒకట్రెండు రెండు కూడా వద్దనుకుంటే బదిలీకే దరఖాస్తు చేసుకోవద్దు. - 5, 8 ఏళ్ల సర్వీసుతో తప్పనిసరి బదిలీ అయ్యే వారు, రెండేళ్ల సర్వీసుతో బదిలీలకు దరఖాస్తు చేసుకునే అర్హత కలిగిన వారు, మిగతా టీచర్లతో కూడిన జాబితాలను డీఈవోలు ప్రకటించారు. -
ఉపాధ్యాయ బదిలీలకు రంగం సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు రంగం సిద్ధమైంది. మార్గదర్శకాల జారీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు బదిలీల్లో ఎదురయ్యే సమస్యలు.. వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై విద్యా శాఖ ఉన్నతాధికారులు డెమో నిర్వహించారు. పాఠశాల విద్య కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఇన్చార్జి కమిషనర్ అధర్ సిన్హా, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం, సమస్యలపై పరిశీలన జరిపారు. ఉపాధ్యాయ సంఘాల నుంచి వెల్లువెత్తుతున్న అభ్యంతరాలపైనా చర్చించారు. అధికారులు రూపొందించిన వెబ్సైట్లో ఉన్న అంశాలు.. చేర్చాల్సిన విషయాలపై చర్చలు జరిపారు. మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు లేవనెత్తుతున్న సమస్యలపైనా చర్చించినట్లు సమాచారం. ఆన్లైన్ బదిలీకే మొగ్గు..! ప్రభుత్వ ఆలోచన మేరకు ఆన్లైన్ బదిలీల వైపే అధికారులు మొగ్గుచూపుతున్నారు. సంఘాల నేతలు ఆఫ్లైన్లో బదిలీలు చేయాలని కోరుతున్నా.. ఆ ఒక్క విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఉన్నతాధికారి పేర్కొన్నారు. మరోవైపు జీవిత భాగస్వామి (స్పౌజ్)కేటగిరీలో ఇచ్చే ప్రాధాన్య పాయింట్లు దుర్వినియోగం కాకుండా భార్యాభర్తల్లో ఒకరు ఉన్న చోటికి మరొకరిని పంపించేలా ఏర్పాట్లు చేశారు. వారు పని చేసే స్కూల్ను జీపీఎస్ ద్వారా లింకు చేసి, అక్కడికే మరొకరిని పంపిస్తారు. టీచర్ అయితే ఐదేళ్లు, హెడ్ మాస్టర్ అయితే 8 ఏళ్లు పూర్తయి తప్పనిసరి బదిలీలో ఉంటే వారిద్దరిని ఎక్కడికి పంపాలన్న దానిపై ఆన్లైన్లో సమస్య రాకుండా చూసేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. కాగా, ఆన్లైన్లో నాట్ విల్లింగ్కు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. పని చేస్తున్న ప్రదేశంలో రెండేళ్ల సర్వీసు ఉన్న వారు (బదిలీకి దరఖాస్తు చేసుకునే అర్హత కలిగినవారు) తమకు కచ్చితంగా కావాలనుకునే రెండు మూడు స్కూళ్లకు (ప్లేస్లు) మాత్రమే ఆప్షన్లు ఇచ్చుకోవాలని, వాటిల్లో వస్తే అలాట్ అవుతుందని, లేదంటే పాత స్కూల్లోనే ఉంటారని అధికారులు చెబుతున్నారు. అవి కూడా వద్దనుకుంటే బదిలీకే దరఖాస్తు చేసుకోవద్దని సూచిస్తున్నారు. ఇదీ ఆన్లైన్ దరఖాస్తు విధానం.. - హెడ్మాస్టర్లు /http://cdse. telangana.gov.in వెబ్సైట్లో లాగిన్ కావాలి. - వెబ్సైట్లో టీచర్ల ట్రాన్స్ఫర్ లింకును క్లిక్ చేయాలి. యూజర్ గైడ్లో పేర్కొన్న ప్రకారం దరఖాస్తు నింపాలి. మొబైల్ నంబర్, ఏడు అంకెల ట్రెజరీ ఐడీ, పుట్టిన తేదీ, వెరిఫికేషన్ కోడ్, మొబైల్ నంబర్కు వచ్చే వన్టైమ్ పాస్వర్డ్ను ఎంటర్ చేస్తే దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. అందులో అన్ని వివరాలను నమోదు చేయాలి. ప్రాధాన్య క్రమంలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. - తప్పనిసరిగా బదిలీ అయ్యేవారు (హెడ్మాస్టర్/టీచర్) పని చేస్తున్న ప్రదేశం కాకుండా వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. తక్కువ ఆప్షన్లు ఇస్తే.. అందులో ఫిట్ కాకపోతే మిగిలిపోయే వెకెన్సీల్లో అలాట్ అయ్యే అవకాశం ఉంటుంది. - బదిలీ అర్హత కలిగిన వారు (తప్పనిసరి కాని వారు) తమకు కావాల్సిన ప్రదేశాలనే ఎంచుకోవాలి. అలాగే పని చేస్తున్న ప్రదేశంలో ఉండాలనుకుంటే దాన్నే ఎంచుకోవాలి. ఎక్కువ ఆప్షన్లు ఇస్తే చివరి ఆప్షన్ ఇచ్చిన ప్రదేశంలోనూ అలాట్ అయ్యే అవకాశం ఉంటుంది. - ఇప్పటివరకు ఖాళీగా ఉన్న ఖాళీలతో పాటు తప్పనిసరి బదిలీలతో ఖాళీ అయ్యే ప్రదేశాలు కంప్యూటర్ స్క్రీన్లో ఎడమ వైపు కాలమ్లో ఉంటాయి. - మొదట మండలాల ఎంపిక తర్వాత ఖాళీలు అందుబాటులో ఉన్న పాఠశాల పేర్లను పొందడానికి సబ్మిట్ బటన్ నొక్కాలి. - ఆ తర్వాత పాఠశాలల పేర్లు, మండలాల వివరాలు వస్తాయి. వాటిని ప్రాధాన్య క్రమంలో ఎంచుకోవాలి. - అన్ని వివరాలను ఎంచుకున్న తర్వాత, ప్రివ్యూ బటన్ నొక్కాలి. అన్ని వివరాలు సరిగ్గా ఉంటేనే సబ్మిట్ నొక్కాలి. లేకపోతే ఎడిట్ చేసుకోవాలి. - సీనియారిటీ, ఆప్షన్ల ఆధారంగా ప్లేస్లు అలాట్ అవుతాయి. ‘నాట్ విల్లింగ్’కు నో చాన్స్ మాన్యువల్లో ఉన్నట్లుగా నాట్ విల్లింగ్కు అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. టీచర్ల బదిలీల్లో దశల వారీగా ఉండే దరఖాస్తు విధానాన్ని మంగళవారం వెల్లడించారు. దానిపైనే డెమో నిర్వహించారు. ఒకట్రెండు రోజుల్లో బదిలీల మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేయనుంది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఆన్లైన్లో టీచర్ల సీనియారిటీ జాబితాలను అందుబాటులో ఉంచారు. 5, 8 ఏళ్ల సర్వీసుతో తప్పనిసరి బదిలీ అయ్యే వారు, 2 ఏళ్ల సర్వీసు బదిలీలకు దరఖాస్తు చేసుకునే అర్హత కలిగిన వారు, మిగతా టీచర్లతో కూడిన జాబితాలను ప్రకటించారు. వాటిపై అభ్యంతరాలు ఉంటే 6 నుంచి 8 వరకు తెలపాలని సూచించారు. ఆ తర్వాత ఆన్లైన్లో బదిలీల దరఖాస్తులకు అవకాశం కల్పించనున్నారు. -
టీచర్ల బదిలీల షెడ్యూల్ ప్రకటించాలి
హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్యూటీఎఫ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆదివారం హైదరాబాద్ దోమలగూడలోని యూటీఎఫ్ కార్యాల యంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ రాములు అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్రంలో రెండేళ్లుగా బదిలీలు, పదోన్నతులు లేకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారన్నారు. సర్వీస్ రూల్స్ సమస్య కోర్టు వివాదంలో ఉన్నందున ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా బదిలీలు, పదోన్నతుల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. ఉప విద్యాధికారి, మండల విద్యాధికారి వంటి పర్యవేక్షణాధికారి పోస్టులు అధిక సంఖ్యలో ఖాళీగా ఉండటంతో విద్యా రంగం కుంటుపడుతోందని పేర్కొన్నారు. అర్హులైన స్కూల్ అసిస్టెంట్లతో పదోన్నతుల ద్వారా జూనియర్, డైట్ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యా మిషన్ను ప్రక టించాలని, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో తరగతికొక ఉపాధ్యాయుడు, తరగతి గది ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎస్టీఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షుడు నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఎస్టీఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షురాలు సంయుక్త, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, ఉపాధ్యక్షులు సోమశేఖర్, దుర్గాభవాని తదితరులు పాల్గొన్నారు. -
టీచర్ల బదిలీల కౌన్సెలింగ్లో ఆంక్షలు
ఒక్కరిని మాత్రమే అనుమతిస్తున్న అధికారులు నేడు ఇంగ్లీష్, గణితం, పీడీలకు కౌన్సెలింగ్ అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్లో సోమవారం కొత్త ఆంక్షలను అమలు చేశారు. అంతకు ముందు రోజులు కౌన్సెలింగ్ హాలులోకి ఒకేసారి 50 మందిని అనుమతించి అందరి సమక్షంలో సీనియార్టీ జాబితా ప్రకారం ఒక్కొక్కరిని పిలిచి స్థానాలు కోరుకోమని చెప్పేవారు. అయితే సోమవారం జరిగిన తెలుగు, హిందీ, ఉర్దూ టీచర్ల కౌన్సెలింగ్లో కేవలం సీనియార్టీ జాబితా ప్రకారం ఒక్కరిని మాత్రమే హాలులోకి పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించారు. తక్కిన వారందరినీ మరో హాలులో కూర్చొబెట్టారు. జిల్లా పరిశీలకులు, ఆర్జేడీ ప్రతాప్రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో కౌన్సెలింగ్ జరిగింది. మార్పులు, చేర్పులుండవు ఈ సందర్భంగా ఆర్జేడీ ప్రతాప్రెడ్డిని కలిసిన పలువురు టీచర్లు తుదిజాబితాలో చాలా తప్పులున్నాయంటూ ఫిర్యాదులు చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ తాత్కాలిక జాబితాలో ఏవైనా తప్పొప్పులుంటే సవరణలు చేస్తామన్నారు. అంతేకాని తుది జాబితా వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు ఉండదని స్పష్టం చేశారు. అలాగే 40 శాతం వికలత్వంతో ప్రిపరెన్షియల్ కేటగిరీలో ఉన్న టీచర్లందరూ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసేలోగా మెడికల్ బోర్డు నుంచి ధ్రువీకరణత్రం తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. లేదంటే చర్యలుంటాయని హెచ్చరించారు. నేడు ఇంగ్లిష్, గణితం, పీడీలకు కౌన్సెలింగ్ ఇంగ్లిష్, గణితం స్కూల్ అసిస్టెంట్లతో పాటు పీడీలకు మంగళవారం కౌన్సెలింగ్ ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. ఇంగ్లిష్, గణితం టీచర్లు ఉదయం 10 గంటలకు సైన్స్సెంటర్లో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అలాగే పీడీలు, అడహక్ పీడీలకు మధ్యాహ్నం కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా కౌన్సెలింగ్ హాలులోకి ఉపాధ్యాయ సంఘాల నాయకులను అనుమతించాలని పలువురు నాయకులు ఆర్జేడీని కలిసి విజ్ఞప్తి చేశారు. ఆర్జేడీ స్పందిస్తూ కేవలం కౌన్సెలింగ్ హాజరయ్యే టీచర్లు మినహా తక్కిన ఎవరికీ అనుమతి ఉండదని స్పష్టం చేశారు. నేడు రెండు కేంద్రాలు గణితం, ఇంగ్లీష్ టీచర్లు అధికసంఖ్యలో ఉండటంతో కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సైన్స్ సెంటర్లోనే రెండు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఒకచోట ఇంగ్లిష్, మరోచోట గణితం టీచర్లకు కౌన్సెలింగ్ ఉంటుంది. -
లెక్క తేలింది కానీ...
ఉపాధ్యాయ బదిలీలపై కొనసాగుతున్న ఉత్కంఠ కౌన్సెలింగ్పై తొలగని ప్రతిష్టంభన మారిన కౌన్సెలింగ్ షెడ్యూల్ నేడు ప్రాధమిక జాబితా విడుదలకు అవకాశం ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఇక కౌన్సెలింగ్ జరగాల్సి ఉంది. కానీ అదీ తొలిరోజు జరగలేదు. మళ్లీ వారిలో ఒకటే ఉత్కంఠ. రోజుకో ఉత్తర్వు... పూటకో నిబంధనతో ఉపాధ్యాయులను రెండు నెలలుగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విద్యాశాఖ విభాగం మళ్లీ ఎలాంటి ప్రకటన విడుదల చేయకుండా... కౌన్సెలింగ్ వాయిదా వేయడంతో ఇంకా ఈ వ్యవహారంలో ప్రతిష్టంభన కొనసాగుతున్నట్టే కనిపిస్తోంది. విజయనగరం అర్బన్: ఉపాధ్యాయుల బదిలీలు, హేతుబద్ధీకరణకు సంబంధించిన ప్రక్రియలో రెండు నెలల తర్జన భర్జనలు ఒక కొలిక్కి వచ్చింది. ఎప్పటికప్పుడు మారుతున్న షెడ్యూల్ ప్రకారం జిల్లా యంత్రాంగం బదిలీలకు ఏర్పాట్లు చేస్తున్నా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జాప్యం వల్ల జిల్లా ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ మాత్రం వీడలేదు. ఉపాధ్యాయుల బదిలీ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు రోజుకో ఉత్తర్వు జారీ కావడంతో గందరగోళం కొనసాగుతూనే ఉంది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం నుంచి జరగాల్సిన కౌన్సెలింగ్ ఆగిపోవడంతో ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ నెలకొంది. వాయిదా వేసిన విషయాన్ని పాఠశాల విద్యాశాఖ అధికారులు ముందుగా ప్రకటించలేదు. దీనివల్ల తొలిరోజు కౌన్సెలింగ్కు హాజరవ్వాల్సిన ప్రధానోపాధ్యాయులు అయోమయంలో పడ్డారు. దీనిపై డీఈఓ ఎస్.అరుణకుమార్ వివరణ ఇస్తూ జిల్లాలో బదిలీలకు సంబంధించిన మంగళవారం నుంచి జరగాల్సిన కౌన్సెలింగ్ షెడ్యూల్ ఈ నెల 21వ తేదీ నుంచి కొనసాగుతుందని ఉన్నతాధికారుల నుంచి సమాచారం వచ్చినట్టు తెలిపారు. మారిన కౌన్సెలింగ్ షెడ్యూల్ తాజాగా ఉన్నతాధికారుల నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు ఈ నెల 21వ తేదీన కౌన్సెలింగ్ ప్రారంభిస్తామని డీఈఓ ఎస్.అరుణకుమారి తెలిపారు. తొలుత హెడ్మాస్టర్లు, ఆ తరువాత స్కూల్ అసిస్టెంట్ టీచర్లు, సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహిస్తామని, వీటిన్నింటినీ పూర్తి చేసి వచ్చే నెల 3వ తేదీన కొత్త స్థానాలనుంచి విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని వివరించారు. నేడు ప్రాధమిక జాబితా విడుదల ఉపాధ్యాయుల బదిలీ దరఖాస్తుల పరిశీలన పూర్తయింది కొద్దిరోజులుగా జరిగుతున్న ఈ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. తదనంతరం బదిలీ అయ్యే ఉపాధ్యాయుల సీనియారిటీ ప్రాధమిక జాబితాను డీఈఓ విడుదలకు సిద్ధంగా ఉంచారు. ఉన్నతాధికారుల అనుమతి పొందిన వెంటనే విడుదల చేస్తారు. బుధ, గురువారాల్లో సీనియారిటీ ప్రాథమిక జాబితాను విడుదల చేయనున్నారు. వీటిపై అభ్యంతరాల స్వీకరణ, నివృత్తి తరువాత తుది జాబితాను ఖరారు చేస్తారు. -
తప్పుల తడక
కడప ఎడ్యుకేషన్: నాలుగో కేటగిరీ(రహదారి సౌకర్యం లేని) పాఠశాలల జాబితా జిల్లా యంత్రాంగాన్ని నవ్వులపాలు చేసింది. ఇంటి అద్దె అలవెన్సు 12 శాతం ఉన్న పాఠశాలల్లోనే 4వ కేటగిరీ వాటిని ఎంపిక చేయాలని జీఓ నంబర్ 43 చెబుతున్నా దానిని ఖాతర్ చేయకుండా 14.5 శాతం, 20 శాతం హెచ్ఆర్ఏ ఉన్న పాఠశాలలను సైతం ఈ విభాగం కింద చేర్చి పంచాయతీరాజ్ ఎస్ఈ అందరిని ఆశ్చర్యచకితులను చేశారు. రహదారి అసలేలేని పల్లెలు జాబితాలో కనిపించకపోగా ఇటీవల తారురోడ్డు వేసిన గ్రామాలు ప్రత్యక్షం కావడం వివాదాస్పదంగా మారింది. వారం రోజుల పాటు జిల్లాస్థాయి అధికారులంతా తర్జనభర్జన పడి చివరికి తప్పుల తడక జాబితాను విడుదల చేయడం ఉపాధ్యాయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. పాత సీసాలో కొత్తసారా: 2015లో విడుదల చేసిన జాబితాలోని 55 పాఠశాలల్లో కేవలం ఐదింటిని తొలగించి మూడింటిని కొత్తగా చేర్చారు. పాత జాబితా నుంచి చక్రాయపేట మండలం మారేళ్లమడక, ముద్దనూరు మండలం చింతకుంట, పొద్దుటూరు మండలం ఎర్రగుంటపల్లె, వేంపల్లి మండలం ఎగువతువ్వపల్లె, అలిరెడ్డిపల్లె పాఠశాలలను తీసివేసి చక్రాయపేట మండలం ఉక్కుశిలవాండ్లపల్లె, పెండ్లిమర్రి మండలం తువ్వపల్లె, రాజంపటే మండలం ఏకిరిపల్లెలను కొత్తగా చేర్చారు. దీంతో 55 పాఠశాలలు ఉన్న జాబితా 53కి దిగింది. ఇంతకుమించి జాబితాలో పెద్దమార్పులు లేనందున పాతసీసాలో కొత్తసారా పోశారని ఉపాధ్యాయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. జీవోకు విరుద్ధంగా: విద్యాశాఖ విడుదల చేసిన 43 నంబర్ జీవో ప్రకారం అన్ని వాతావరణాల్లో వెళ్లలేని రహదారులను గుర్తించి ఆ మార్గంలో ఉన్న పాఠశాలలను నాలుగో కేటగిరీ కింద చేర్చాలని ఉంది. ఇది కూడా 12శాతం ఇంటి అద్దె అలవెన్సు కలిగిన పాఠశాలలను మాత్రమే తీసుకోవాలని ఉంది. అయితే పంచాయతీరాజ్ ఎస్సీ శనివారం రాత్రి విడుదల చేసిన నాలుగో కేటగిరీ జాబితా జీవో నంబర్ 43కు విరుద్ధంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. రాయచోటి మండలం దూలవారిపల్లె, రాజంపేట మండలం చెర్లోపల్లె, యానాదికాలనీ, బద్వేల్ మండలం రఘనాథపురం 14.5 శాతం హెచ్ఆర్ఏ ఉండగా చెన్నూరు మండలం శివాలపల్లె 20 శాతం హెచ్ఆర్ఏ కింద ఉంది. వీటిని కూడా నిబంధనలకు విరుద్ధంగా నాలుగో కేటగిరీ కింద చేర్చడంలో జిల్లా యంత్రాంగం నవ్వులపాలైంది. జిల్లాలోని 44 మండలాలకు కలిపి 4వ కేటగిరీ కింద 27 పాఠశాలలను గుర్తించగా రాయచోటి ప్రాంతంలోని 6 మండలాల్లోనే 26 పాఠశాలలను జాబితాలో చేర్చారు. రహదారి సౌకర్యం లేని పల్లెలు అధికంగా ఉన్న చక్రాయపేట మండలంలో ఒకేఒక్క పాఠశాల జాబితాలో ఉంది.తారురోడ్డు ఉన్నవి సైతం నాలుగో కేటగిరీలో కనిపించడంపై బాధిత ఉపాధ్యాయులు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు తెలిసింది. పైకి ఎగిసి... అంతలోనే తగ్గి... ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ మొదలుకాకముందే పంచాయతీరాజ్ అధికారులు నాలుగో కేటగిరీ జాబితాను విడుదల చేయాల్సి ఉంది. ఈ మేరకు కర్నూల్, అనంతపురం, చిత్తూరు జిల్లాల అధికారులు పదిరోజుల కిందటే జాబితాను విడుదల చేశారు. కడప పీఆర్ అధికారులు మాత్రం మొత్తం 988 గ్రామాలకు తారురోడ్డు సౌకర్యం లేదని నిర్ధారించి ఆ జాబితానే విద్యాశాఖకు పంపించారు. దీనిని తగ్గించాలని విద్యాశాకాధికారులు వారం రోజులపాటు ఎంత పోరాడినా జాబితాను మార్చే ప్రసక్తి లేందంటూ పంచాయతీరాజ్ ఎస్సీ భీష్మించుకుని కూర్చొన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకున్నా ఆయన పద్ధతిలో ఏమాత్రం మార్పురాలేదు. 988 గ్రామాలతో నాలుగో కేటగిరి జాబితా విడుదలైతే ఉద్యమం తప్పదని ఉపాధ్యాయ సంఘ నేతలు హెచ్చరించడంతో ఎట్టకేలకు శనివారం రాత్రి కేవలం 53 పాఠశాలలతోనే నాలుగో కేటగిరీ జాబితాను ఎస్సీ విడుదల చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం రహదారి సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలను పరిగణలోకి తీసుకోవాలని తాము కలెక్టర్, డీఈఓల ద్వారా పంచాయతీరాజ్ ఎస్సీకి వినతిపత్రం అందజేశాం. ఆయన వీటిని రీ ఎక్జామ్ చేయలేమంటూ వెనక్కి తిప్పి పంపించారు. ఇప్పుడు మాత్రం జీవో నంబర్ 43కు విరుద్ధంగా వ్యవహరించారు. మాకు జరిగిన అన్యాయం, తాజా జాబితాలోని అవకతవకలపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. – నాగేశ్వరావు, ఉపాధ్యాయుడు, కల్లూరుపల్లెతాండ, చక్రాయపేట మండలం. -
తప్పుకదా.. మాస్టారూ!
► పాయింట్ల కోసం అడ్డదార్లు తొక్కుతున్న అయ్యవార్లు ► స్పౌజ్ పాయింట్లు కేటాయింపుల్లో అక్రమమార్గం ► కొంతమంది విద్యాశాఖ సిబ్బంది సహకరిస్తున్నట్లు సమాచారం ► కానరాని పారదర్శకత.. కొనసాగుతున్న గందరగోళం ► వేలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు ► కలెక్టర్ జోక్యం చేసుకోవాలంటున్న ఉపాధ్యాయులు కోరుకున్న చోటుకు వెళ్లేందుకు అయ్యవార్లు అడ్డదారులు తొక్కుతున్నారు. బదిలీల నిబంధనల్లోని లొసుగులను అడ్డుపెట్టుకుని ఎక్కువ పాయింట్లు పొందేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు కొందరు అధికారులు కూడా సహాయపడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాగైనా మంచిస్థానం సంపాదించాలని 20శాతం ఇంటి అద్దె ఉండే ప్రాంతాలకు బదిలీ కావాలని పక్కదారులను ఎంచుకుంటున్నారు. ప్రత్యేక కేటగిరి కింద ఉన్న ఉపాధ్యాయులకు ముందుగా కౌన్సెలింగ్ను నిర్వహిస్తారు. కనుక వారు కోరుకున్న పాఠశాలలు లభిస్తాయనే ఆలోచనతో దొంగ సరిఫికెట్లు పుట్టించడానికి కూడా వెనుకాడటం లేదు. కడప ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీల్లో గందరగోళం ఇంకా కొనసాగుతోంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి వివిధ అంశాలపై పాయింట్లు కేటాయింపు వరకూ ప్రతి విషయంలోనూ నిర్దిష్టమైన విధానం, పారదర్శకత లేక అడుగడుగునా సాంకేతిక సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ఏప్రిల్లో మొదలుపెట్టిన బదిలీల ప్రక్రియ జూలై సగం పూర్తయినా ఇంకా ఒక కొలిక్కి రాలేదు. మొదట 50శాతం పనితీరు సూచికలు, వెబ్ కౌన్సెలింగ్తో టీచర్ల బదిలీల ప్రక్రియ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉపాధ్యాయులంతా ఆందోళన బాట పట్టారు. వేలాదిమంది ఉపాధ్యాయులతో డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గి 50శాతం పనితీరు సూచికలను 30శాతానికి తగ్గించడం, వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేసి మ్యానువల్ పద్ధతిలో కౌన్సెలింగ్ నిర్వహించాలని జీఓ నంబర్ 42ను విడుదల చేసింది. ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. లోపాల కోసం వెతుకులాట బదిలీల నిబంధనల్లోని లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు అయ్యవార్లు అడ్డదారులు తొక్కుతున్నారు. కొందరు అవినీతి అధికారుల సహకారం తీసుకుని కోరుకున్న ప్రాంతం కోసం అంతా సిద్ధం చేసుకున్నారు. ఇందులోభాగంగా ప్రత్యేక కేటగిరి కోసం ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ కేటగిరి కిందికి రావాలంటే 70శాతంకు పైగా అంగవైకల్యం ఉండాలి. క్యాన్సర్, బైపాస్, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి వంటి వ్యాధులకు గురై ఉండాలి. మానసిక వైకల్యం కలిగిన పిల్లలున్న తల్లిదండ్రులను కూడా ప్రత్యేక కేటగిరి కింద చేర్చుతారు. దీనిని అవకాశంగా తీసుకున్న కొంతమంది ఉపాధ్యాయులు తమ పలుకుబడిని ఉపయోగించి, డబ్బులు ఖర్చుపెట్టి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటున్నారు. వాస్తవంగా 40 నుంచి 50 శాతం వైకల్యం ఉన్నవారు 70శాతం ఉన్నట్లుగాను, పిల్లలకు మానసిక రోగాలు, నరాల సంబంధిత వ్యాధులు ఉన్నట్లుగా రిమ్స్ నుంచి దొంగ సర్టిఫికెట్లు పొందుతున్నారు. వాటిని ఉపయోగించి మంచి స్థానాలు పొందడానికి ప్రయత్నాలు చేçస్తున్నట్లు తెలిసింది. వరంలా 4వ కేటగిరి అలాగే 4వ కేటగిరి కింద పాఠశాలను చేర్చితే ఏడాదికి 5 పాయింట్లు వస్తాయి. దీంతో వారు కోరుకున్న పాఠశాలను చేజిక్కించుకోవచ్చని, అయా బడులను ఎలాగైనా 4వ కేటగిరి కింద మార్చడానికి రూ.వేలు ఖర్చుపెడుతున్నట్లు సమాచారం. మండలంలో పలుకుబడిని ఉపయోగించి పంచాయతీరాజ్ ఇంజనీర్లతో రోడ్డు సౌకర్యం లేదని రాయించుకుంటున్నారు. వాటిని పీఆర్ అధికారుల ద్వారా డీఈఓ కార్యాలయానికి పంపుతున్నట్లు తెలిసింది. డీఈఓ కార్యాలయంలోని కొందరు సిబ్బందిని ఉపయోగించుకుని తమ పనిని పూర్తి చేయించుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. నిబంధనల మేరకు ఏ కాలంలోనైనా నడవడానికి వీలులేని రహదారులు ఉన్న పాఠశాలు మాత్రమే 4వ కేటగిరి కిందికి వస్తాయి. 2009 నుంచి కేటగిరి వారీగా వివరాలు 4వ కేటగిరి కింద 2009 బదిలీల్లో 114 పాఠశాలలు, 2011 బదిలీల్లో 217 పాఠశాలలు, 2013 బదిలీల్లో 13 పాఠశాలలు, 2015కు 57 పాఠశాలలుగా చేర్చారు. 2009, 2011, 2013ల్లో జరిగిన బదిలీలలో లేని పాఠశాలలు కూడా 2015లో 4వ కేటగిరి కింద ప్రత్యక్షమయ్యాయి. ఉదాహరణకు చాపాడు మండలంలోని రామదాసుపురం, పొద్దుటూరు మండలంలోని ఎర్రగుంట్లపల్లె. ఈ రెండు పాఠశాలలు 2015 వరకు కూడా 3 కేటగిరి కింద ఉన్నాయి. 2015లో మాత్రం ఈ రెండు పాఠశాలలు 4వ కేటగిరికి వచ్చాయి. 2015లో 4వ కేటగిరి చేర్చిన కొన్ని పాఠశాలలకు 2009 నుంచే 4వ కేటగిరి కింద పాయింట్లు ఇచ్చినట్లు సమాచారం. కలెక్టర్ జోక్యం చేసుకోవాలి నిజాయితీగా పనిచేసిన ఉపాధ్యాయులు కొంతమంది అధికారులు తీరు కారణంగా నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపైన కలెక్టర్ జోక్యం చేసుకుని బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లాలోని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ప్రత్యేకించి నాల్గవ కేటగిరి పాఠశాలలు, స్పౌజ్ పాయింట్లు కేటాయింపు, ప్రత్యేక కేటగిరికి చెందిన ఉపాధ్యాయులను కలెక్టర్ ఆధ్వర్యంలో సమగ్రంగా విచారణ జరిపించాలని పలువురు ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు. -
బదిలీలుంటాయా?
ఉపాధ్యాయ బదిలీలపై తొలగని సందిగ్ధం.. వెబ్ కౌన్సెలింగ్ ఉండదని మంత్రి గంటా ప్రకటన - వెబ్ కౌన్సెలింగ్పై అభిప్రాయాలు సేకరిస్తున్న అధికారులు - ఇప్పటికే 6 జీవోలు, పది సర్క్యులర్లు జారీ చేసినా వీడని చిక్కుముడులు - బదిలీలు ఉంటాయో లేదో తేలక టీచర్ల అయోమయం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలపై సందిగ్ధత తొలగడం లేదు. టీచర్లు రోడ్డెక్కి ఆందోళనకు దిగడం, పలుమార్లు నిబంధనల మార్పుతో ఈ వ్యవహారం రోజురోజుకూ మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఆరు జీవోలు, పది సర్క్యులర్లు జారీచేసినా బదిలీలపై ఇప్పటికీ ఒక స్పష్టత రావడం లేదు. బదిలీలుంటాయా? ఉండవా? వెబ్కౌన్సెలింగా? మాన్యువల్గానా? అనేదానిపై స్పష్టత లేక లక్షలాది మంది ఉపాధ్యాయులు అయోమయ స్థితిని ఎదుర్కొంటున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమై పక్షం రోజులు దాటినా ఇప్పటికీ బోధన జరగడం లేదు. నెరవేరని మంత్రి హామీ : బదిలీలపై ఇటీవల టీచర్లు రాష్ట్రవ్యాప్తంగా డీఈవో కార్యాలయాలను ముట్టడించారు. ఉపాధ్యాయ సంఘాలు ‘చలో అమరావతి’కి పిలుపునిచ్చాయి. దీంతో దిగి వచ్చిన ప్రభుత్వం సంఘాలతో చర్చించింది. పనితీరు పాయింట్లను 30 శాతానికి తగ్గిస్తామని, మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే, మంత్రి ప్రకటనకు విరుద్ధంగా అధికారులు వెబ్ కౌన్సెలింగ్పై టీచర్ల నుంచి అభిప్రాయ సేకరణ ప్రారంభించడం వివాదాస్పదంగా మారుతోంది. అధికారులు టీచర్లకు నేరుగా ఫోన్లు చేస్తూ వెబ్కౌన్సెలింగ్పై అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. తక్షణమే బదిలీలు చేపట్టాల్సిందే: ఉపాధ్యాయల ఏకీకృత సర్వీసు నిబంధనలకు రాష్ట్రపతి ఆమోదం తెలపడం, కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాష్ట్రంలోని ఎంఈవో, డిప్యూటీ డీఈవో, డైట్ లెక్చరర్ తదితర పోస్టులను భర్తీ చేసి, ఆ తర్వాత బదిలీలను చేపట్టాలన్న ప్రతిపాదనను మంత్రి గంటా శ్రీనివాసరావు తెరపైకి తెచ్చారు. అయితే, ఏకీకృత సర్వీసు నిబంధనలు, పదోన్నతులతో సంబంధం లేకుండా బదిలీలను తక్షణమే చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు బదిలీలు చేయాలన్నా మళ్లీ కొత్తగా ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంటుంది. గతంలో ప్రకటించిన బదిలీల షెడ్యూల్లో మూడుసార్లు మార్పు జరిగింది. పనితీరు పాయింట్ల మార్పుతో మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఇప్పుడా షెడ్యూల్ను కూడా మార్పు చేయాల్సి ఉంటుంది. గడియకో నిర్ణయం, రోజుకో మార్పు ► రేషనలైజేషన్పై ఈ ఏడాది మే 5న పాఠశాల విద్యాశాఖ జీవో నంబర్ 29ను విడుదల చేసింది. విద్యార్థుల సంఖ్య 20 కంటే తక్కువ ఉన్న ప్రాథమిక పాఠశాలలు, 30 మంది కంటే తక్కువ ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలు, 50 మంది కంటే తక్కువ ఉన్న హైస్కూళ్లను మూసివేయాలని పేర్కొంది. దీనిపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో 10 మందిలోపు విద్యార్థులున్న స్కూళ్లను మరో స్కూల్లో విలీనం చేయాలంటూ నిబంధనలు మారుస్తూ జీవో నంబర్ 30ని జారీ చేసింది. ఆ రెండు జీవోల్లోనూ అస్పష్టత ఉండడంతో కొన్ని సర్క్యులర్లు ఇచ్చారు. ► బదిలీలపై ముందుగా జీవో నంబర్ 31ను విడుదల చేశారు. ఏ శాఖలోనూ లేని విధంగా మైనస్ పాయింట్లు, పనితీరు పాయింట్లు రెట్టింపు చేయడంపై టీచర్ల నుంచి వ్యతిరేకత రావడంతో జీవో 32ను విడుదల చేశారు. ► జీవో 32లోనూ స్పష్టత కొరవడడంతో దాన్ని సవరిస్తూ జీవో 33ని విడుదల చేశారు. పనితీరు పాయింట్లపై టీచర్ల వ్యతిరేకతతో వాటిని 40 శాతానికి తగ్గిస్తూ జీవో 38ని విడుదల చేశారు. ఈ జీవోలన్నింటిపై మళ్లీ వివరణలు ఇస్తూ 10 సర్క్యులర్లు జారీ చేశారు. -
15 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.
-
15 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్
- 8,792 టీచర్ పోస్టుల భర్తీ: కడియం - పాత జిల్లాల ప్రకారమే నియామకాలు - నియామక ప్రక్రియకు ఆరు నెలలు పడుతుంది - అప్పటివరకు విద్యా వలంటీర్లతో బోధన - 6 వేల స్కూళ్లలో జూన్ నుంచి బయోమెట్రిక్ - ఈసారి టీచర్ల బదిలీలు లేవని వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 15 రోజుల్లో టీఎస్పీఎస్సీ ద్వారా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. టీచర్ల నియామకాల ప్రక్రియకు ఆరు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉందని, ఈలోగా ఇబ్బందులు తలెత్తకుండా విద్యా వలంటీర్లతో బోధన కొనసాగిస్తామని చెప్పారు. వేసవి సెలవుల తర్వాత జూన్లో పాఠశాలలు తెరిచే మొదటి రోజు నుంచే పాఠశాలల్లో విద్యా వలంటీర్లు ఉండేలా చర్యలు చేపడతామన్నారు. సచివాలయంలో బుధవారం పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అన్ని ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ప్రారంభిస్తాం. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూల్స్, అన్ని గురుకులాలు మొత్తంగా 6 వేల పాఠశాలల్లో వచ్చే జూన్ నుంచి బయోమెట్రిక్ హాజరు విధానం అమల్లోకి తెస్తాం. తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ఈసారి మరిన్ని స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం ప్రారంభిస్తాం. గతేడాది ఒకటో తరగతిలో ఇంగ్లిషు మీడియం ప్రారంభించిన పాఠశాలల్లో ఈసారి రెండో తరగతి ప్రారంభం అవుతుంది. ఇంగ్లిషు మీడియం బోధించేందుకు ఆసక్తి కలిగి, ముందుకు వచ్చే వారికి నెల రోజుల పాటు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తాం’’ అని వివరించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉన్నందున కొత్త టీచర్ల నియామకాలను పాత జిల్లాల ప్రకారమే చేపడతామని పేర్కొన్నారు. ఈసారి రాష్ట్రంలో టీచర్ల బదిలీలు ఉండకపోవచ్చని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇప్పటికిప్పుడు టెట్ అవసరం లేదు మరో 15 రోజుల్లో ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ జారీ కానున్న నేపథ్యంలో ఇప్పుడు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించబోమని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 3 లక్షల మందికిపైగా అభ్యర్థులు టెట్లో అర్హత సాధించిన వారు ఉన్నారన్నారు. వారంతా ప్రస్తుతం డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని, కాబట్టి ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో టెట్ అవసరం లేదని అన్నారు. -
పనితీరు సూచికలు తొలిగించాలి
ఎస్ఎల్టీఏ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ బదిలీల్లో పనితీరు సూచికలు తొలగించాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్పై నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో రెన్నెల్లుగా జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల సంతకాల సేకరణ చేపట్టింది. సోమవారం స్థానిక పదో తరగతి స్పాట్ కేంద్రం వద్ద ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఒంటేరు మాట్లాడుతూ టీచర్ల బదిలీల్లో పనితీరు సూచికలు అనేది అశాస్త్రీయమన్నారు. గతేడాది బదిలీల్లో ఈ పనితీరు సూచికలు గందరగోళంగా మారాయని గుర్తు చేశారు. కొలబద్ధత, ప్రామాణికత, పారదర్శకత లేకపోవడంతో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. బలం, పలుకుబడి కల్గిన టీచర్లకు ఈ పనితీరు సూచికలు వరంగా మారాయన్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా, ఒక్కో డివిజన్లో ఒక్కో విధంగా వినియోగించుకున్నారన్నారు. సీనియార్టీ ప్రాతిపదికన టీచర్ల బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ, జయరాంనాయక్, నాయకులు రవీంద్రబాబు, బాలసుబ్రమణ్యం, ఎస్ఎల్టీఏ శివానందరెడ్డి, ఆదిశేషు, ఉపాధ్యాయ సత్తా ఫయాజ్, చంద్రమౌళి, ఎంఎస్పీటీఏ చంద్రశేకర్నాయుడు, ఆపస్ జిల్లా అధ్యక్షుడు టి.వెంకటేశ్వరప్రసాద్, పీఈటీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అవి అసలు పాఠశాలలేనా..?
♦ ప్రభుత్వ స్కూళ్ల దుస్థితి సిగ్గుపడేలా ఉంది ♦ రాష్ట్ర సర్కారుపై హైకోర్టు ఆగ్రహం ♦ అసలు గ్రామాలకు వెళ్లి పాఠశాలలను తనిఖీ చేస్తున్నారా? ♦ ఉన్నతాధికారుల పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్చాలి ♦ ఏదో ఓ రోజు ఆ దిశగా కూడా ఆదేశాలిస్తామని స్పష్టీకరణ ♦ గడువు కోరిన సర్కారు.. విచారణ వాయిదా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అందరూ సిగ్గుపడేలా ఉందని, అసలు కొన్నింటిని పాఠశాలలని కూడా ఎలా పిలవాలో అర్థం కాకుండా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అధికారులకు టీచర్ల బదిలీలపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల ప్రయోజనాలపై ఉండడం లేదని మండిపడింది. ప్రభుత్వ పాఠశాలల దుస్థితి మారాలంటే అధికారుల పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్చాలని... అప్పుడే వారికి సమస్య అర్థమవుతుందని పేర్కొంది. పరిస్థితులు ఇలానే కొనసాగితే ఏదో ఒక రోజు అలాంటి ఉత్తర్వులు జారీ చేస్తామని తేల్చి చెప్పింది. ఈ అంశంపై విచారణను సంక్రాంతి సెలవుల తరువాతకు వాయిదా వేస్తూ.. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ముందుకు నివేదిక.. తమ పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేరని, తాము సరైన విద్యను పొందలేకపోతున్నామని పేర్కొంటూ మహబూబ్నగర్ జిల్లా గట్టు, ఐజా మండలాల్లోని బొయ్యలగూడెం, మాచర్ల, కేశవరం, చింతలకుంట, మిట్టదొడ్డి, యల్లందొడ్డి, చాగదొన, అరగిడ్డ గ్రామాల విద్యార్థులు, తల్లిదండ్రులు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఇలా వచ్చిన దాదాపు 1,700కు పైగా లేఖలను ప్రజాహిత వ్యాజ్యం (పిల్)గా మలిచి హైకోర్టు విచారణ చేపట్టింది. తాజాగా సోమవారం దీనిని తాత్కాలిక సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఆయా పాఠశాలల్లో పరిస్థితులను తెలుసుకునేందుకు తమ ప్రతినిధిగా హైకోర్టు నియమించిన న్యాయవాది ఎం.విజయకుమార్గౌడ్ తన నివేదికను ఈ సందర్భంగా ధర్మాసనానికి అందజేశారు. ఆ నివేదికను పరిశీలించిన ధర్మాసనం... ఈ కేసులో ప్రభుత్వ కౌంటర్కూ, విజయకుమార్ నివేదికకు చాలా తేడా ఉండడాన్ని గుర్తించింది. దీనిపై ప్రభుత్వం తరపున హాజరైన రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావును ప్రశ్నించింది. ‘‘తమ పాఠశాలల్లో ఫర్నిచర్, తాగునీరు, మరుగుదొడ్లు లేవని విద్యార్థులు స్పష్టంగా చెప్పినట్లు విజయకుమార్ నివేదికలో పేర్కొన్నారు. హిందీ, ఇంగ్లిష్ టీచర్లు కూడా లేరని విద్యార్థులు చెప్పారు. స్కూల్ యూనిఫారాలు ఇవ్వడం లేదని విద్యార్థులు తెలిపారు. వీటన్నింటిపై మీరేమంటారు..?’’ అని నిలదీసింది. ఉపాధ్యాయులను నియమించలేని చోట్ల విద్యా వలంటీర్లను నియమించామని రామచంద్రరావు వివరిం చారు. మారుమూల గ్రామాలకు వెళ్లేందుకు టీచర్లు ఇష్టపడడం లేదని.. దీంతో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ వారిని పంపుతున్నామన్నారు. దీనిపై ధర్మాసనం స్పం దిస్తూ... ‘‘ఎంత మంది విద్యాశాఖ ఇన్స్పెక్టర్లు గ్రామాలకు వెళ్లి పాఠశాలలను తనిఖీ చేస్తున్నారు? మీ అధికారులకు టీచర్ల బదిలీలపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల ప్రయోజనాలపై ఉండదు. ఎందుకంటే బదిలీల్లో ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి కదా! ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులు మెరుగుపడాలంటే ఉన్నతాధికారులంతా తమ పిల్లలను వాటిల్లోనే చేర్చాలి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఓ రోజు ఆ ఉత్తర్వులు కూడా జారీ చేస్తాం. పాఠశాలల దుస్థితిని చూసి మనం సిగ్గుపడాలి. మీరేమో అన్నీ సమకూర్చామని చెబుతారు. విద్యార్థులు మాత్రం ఇప్పటికీ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. పాఠశాలల్లో పరిస్థితులపై మేం ఎంత మాత్రం సంతృప్తికరంగా లేం..’’ అని స్పష్టం చేసింది. అయితే మరింత గడువునిస్తే పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతానని రామచంద్రరావు కోరగా... ధర్మాసనం అంగీకరించింది. విచారణను సంక్రాంతి సెలవుల తరువాతకు వాయిదా వేసింది. ఈ కేసులో పూర్తి వివరాలతో నివేదికలు సమర్పించిన విజయకుమార్గౌడ్ను అభినందించింది. -
మాస్టారూ.. జీతాల్లేవ్..!
బదిలీ అయిన టీచర్లకు వేతనాలు నిలిపివేత నవంబర్ నెలకు చెల్లించవద్దని ఖజానా శాఖ డెరైక్టర్ ఆదేశాలు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా బదిలీలు నిర్వహించడంతోనే ఈ పరిస్థితి ఆయా పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకూ నిలిపివేత జిల్లాలో మొత్తం 11 వేల మంది ఉపాధ్యాయులపై ప్రభావం గుంటూరు ఎడ్యుకేషన్ ప్రభుత్వం ప్రతిష్టాతక్మంగా నిర్వహించిన ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ప్రహసనంగా మారింది. బదిలీ కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూసి ఎట్టకేలకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ పొందిన ఉపాధ్యాయుల ఆనందం ఎక్కువ కాలం నిలువలేదు. గత నెలలో వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ద్వారా బదిలీపై ఇతర పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించవద్దని ఖజానా శాఖ ఇచ్చిన ఉత్తర్వుల ఫలితంగా డిసెంబర్ 1వ తేదీన వేతనాలు అందుకోలేని పరిస్థితి ఏర్పడింది. 1,916 మంది ఉపాధ్యాయుల బదిలీ ... ఈ ప్రభావం బదిలీ అయిన ఉపాధ్యాయులతో పాటు ఆయా పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులపైనా పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు వెబ్ ఆధారిత బదిలీలను నిర్వహించేందుకు ఆగస్టు 31న పాఠశాల విద్యాశాఖ జీవో 63 ద్వారా మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో జిల్లాలో దరఖాస్తు చేసిన 4,700 మంది ఉపాధ్యాయుల్లో 1,916 బదిలీ అయ్యారు. నవంబర్ 1న కొత్త పాఠశాలల్లో చేరారు. 11 వేల మంది ఉపాధ్యాయులపై ప్రభావం .... ఆర్థికశాఖ అనుమతి లేకుండా విద్యాశాఖ నేరుగా బదిలీలు నిర్వహించినందున ఉపాధ్యాయులకు నవంబర్ నెల వేతనం చెల్లించవద్దని ఖజానా శాఖ డెరైక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో డిసెంబర్ 10 తేదీన ఉపాధ్యాయులకు వేతనాలు అందుకునే పరిస్థితి లేదు. జిల్లాలో బదిలీ అయిన 1,916 మందితో పాటు వారు పని చేస్తున్న పాఠశాలల్లోని ఇతర ఉపాధ్యాయుల వేతన బిల్లులూ నిలిచిపోనున్నాయి. జిల్లాలో జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో పని చేస్తున్న 11 వేల మంది ఉపాధ్యాయులపై ఈ ప్రభావం పడనుంది. ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చే వరకు .... మండలాన్ని యూనిట్గా తీసుకుని పాఠశాలల వారీగా ఉపాధ్యాయుల వేతన బిల్లుల చెల్లింపులు జరుపుతున్న పరిస్థితుల్లో, వేతన బిల్లులన్నింటినీ గత నెల 25 తేదీ నాటికే ట్రెజరీలకు పంపివేశారు. ఖజానా శాఖ తాజాగా ఇచ్చిన ఉత్తర్వులతో బదిలీ అయిన ఉపాధ్యాయుల వరకు వేతనాలు నిలిపివేయం సాధ్యం కాని పరిస్థితుల్లో ఆయా పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులందరికీ వేతన చెల్లింపులు నిలిపివేస్తున్నారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చే వరకు వేతన చెల్లింపులు జరగని పరిస్థితుల్లో ప్రభుత్వ తీరును ఉపాధ్యాయ సంఘాల నాయకులు తప్పుపడుతున్నారు. ప్రభుత్వం ముం దు చూపులేని వైఖరి కారణంగానే ఈ పరిస్థితి ఎదురైందని విమర్శిస్తున్నారు. -
సస్పెండైన డీఈవోలకు తిరిగి పోస్టింగ్లు
హైదరాబాద్: సస్పెన్షన్కు గురైనా ఇద్దరు మాజీ డీఈవోలకు తిరిగి పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. గత సెప్టెంబరులో జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో మెదక్, వరంగల్ జిల్లాల విద్యాశాఖాధికారులు నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపణలొచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మెదక్ జిల్లా డీఈవోగా పనిచేసిన రాజేశ్వర్రావుకు టెట్ డెరైక్టర్ కార్యాలయంలో డిప్యూటి డెరైక్టర్గానూ, వరంగల్ డీఈవోగా పనిచేసిన చంద్రమోహన్కు ఎస్సీఈఆర్టీలో డిప్యూటి డెరైక్టర్గానూ పోస్టింగులు లభించాయి. -
తొలిరోజే ఇక్కట్లు
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియలో రోజుకో సమస్య ఎదురవుతోంది. కౌన్సెలింగ్ స్థానంలో ప్రవేశపెట్టిన వెబ్ కౌన్సెలింగ్పై కనీస పరిజ్ఞానం లేకుండానే ఉపాధ్యాయులు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. బదిలీ కోరుతూ ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులకు విద్యాశాఖ విడుదల చేసిన ఖాళీల జాబితా ఆధారంగా తిరిగి ఆన్లైన్లోనే ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉండగా, ఆప్షన్లు ఏ విధంగా ఎంపిక చేసుకోవాలనే విషయమై ఉపాధ్యాయులకు కనీస పరిజ్ఞానం లేక ఇబ్బందులు తలెత్తే ప్రమాదముంది. ప్రభుత్వ విడుదల చేసిన షెడ్యూల్ ఆధారంగా ఆదివారం నుంచి ఆన్లైన్లో ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉండగా, పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ తెరుచుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈనెల 8వ తేదీ లోపు ఆప్షన్లు ఇచ్చుకున్న వారే బదిలీకి అర్హత పొందుతారని ప్రభుత్వం ప్రకటించడంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన రేకెత్తుతోంది. ఉదాహరణకు.. ఇంజినీరింగ్, బి. ఫార్మసీ తదితర కోర్సుల్లో చేరే సమయంలో విద్యార్థులకు ప్రభుత్వం ఏర్పాటు చేసే హెల్ప్లైన్ కేంద్రాల ద్వారా అవగాహన కల్పిస్తారు. హెల్ప్లైన్ సెంటర్లో కాకుండా ఇంటి వద్దే ఆప్షన్లు ఇచ్చుకోవాలన్నా అందుకు తగిన మార్గదర్శకాలతో కూడిన బుక్లెట్ ఇచ్చి, ఒక్కో దశలో సూచనలు అందించే పరిస్థితులు ఉండగా, ఉపాధ్యాయులకు మాత్ర ఇటువంటి ఏవీ లేకుండానే ఆప్షన్లు ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. గ్రామీణ ప్రాంతాల ఉపాధ్యాయులకు ఇది మరింత జటిలంగా మారింది. బదిలీకి దరఖాస్తు చేసిన ఉపాధ్యాయులు కంప్యూటర్ స్క్రీన్పై కనిపించే పాఠశాలల్లో తమకు నచ్చిన వాటిని క్లిక్ చేసే విధానంలోనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కొందరికి మేలు చేసేందుకు ప్రభుత్వం హడావుడిగా తీసుకున్న నిర్ణయంతో ఉపాధ్యాయులందరూ ఇబ్బందుల పాలవుతున్నారు. బదిలీ రేసులో 4,703 ఉపాధ్యాయులు.. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల పరిధిలో బదిలీ కోరుతూ దాఖలైన 5,434 దరఖాస్తుల్లో అభ్యంతరాలు, సమగ్ర పరిశీలన తర్వాత అధికారులు 4,703 దరఖాస్తులను ఖరారు చేశారు. అదేవిధంగా ఉద్యోగ విరమణ, ఉపాధ్యాయుల కొరత కారణంగా జిల్లావ్యాప్తంగా ఆయా పాఠశాలల్లో 1,862 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బదిలీకి దరఖాస్తు చేసిన 4,703 మంది హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, ఎల్పీటీ ఉపాధ్యాయుల్లో సీనియారిటీ ఆధారంగా 1,862 మంది ఉపాధ్యాయులే బదిలీ పొందుతారు. -
'బాబుకు అనుకూలమైన వారికే మంచి పోస్టులు'
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్రెడ్డి మండిపడ్డారు. తనకు అనుకూలమైన వారికి ఉన్నతమైన పోస్టింగ్ లను ఇచ్చేందుకే చంద్రబాబు టీచర్ల బదిలీల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. ఏపీలో 8 వేల పాఠశాలలు మూసివేసి నారాయణ విద్యాసంస్థలకు మేలు జరిగిలా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. 2014 డీఎస్సీ నియామకాలు వెంటనే చేపట్టాలని వైఎస్ఆర్ సీపీ నేత విశ్వేశ్వర్ రెడ్డి ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
బదిలీల్లో డీఈవోల అక్రమాలు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల్లో డీఈవోలు విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారు. కౌన్సెలింగ్లో కొన్ని ముఖ్యమైన పోస్టులను చూపకుండా అవినీతికి బాట వేసుకున్నారు. ముడుపులు ఇచ్చినవారికి, రాజకీయ పలుకుబడి ఉన్నవారికి తొలుత ఓ చోట పోస్టు ఇచ్చారు. కౌన్సెలింగ్ పూర్తయ్యాక ఆర్డర్లను మార్చేసి.. దాచిపెట్టిన పోస్టుల్లో ‘తమ’వారిని నియమించేసుకున్నారు. కౌన్సెలింగ్ సమయంలోనూ ముందు వచ్చిన సీనియర్ టీచర్లకు కొన్ని ఖాళీ పోస్టులను చూపకుండా... ఆ తర్వాత వచ్చిన‘తమ’వారికి కట్టబెట్టేసుకున్నారు. ఇప్పుడీ వ్యవహారం బయటకు పొక్కడంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే వరంగల్ డీఈవోపై వచ్చిన ఆరోపణలపై విద్యాశాఖ శాఖాపరమైన విచారణ చేపట్టింది. అక్కడ రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఏడుగురు టీచర్లకు సంబంధించి బదిలీలు పూర్తయ్యాక... వెళ్లాల్సిన స్థానాలను మార్చేసినట్లు తేలింది. దీంతో ఆయనపై శాఖాపరమైన చర్యల కోసం గురువారం విద్యాశాఖ ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. ఒకటీ రెండు రోజుల్లో ఆయనపై చర్యలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. మెదక్ డీఈవోపైనా తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆయనపై శుక్రవారం విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టనున్నారు. ముడుపుల బాగోతమే అక్కడి అక్రమాలకు కారణమని తెలిసింది. అలాగే హైదరాబాద్, కరీంనగర్ జిల్లాల్లోనూ ముడుపులు ముట్టజెప్పిన వారికి నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని చోట్లా: హైదరాబాద్ జిల్లాలో ఒక టీచర్ తనకు గతంలో అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లగా... దీనిని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు విద్యాశాఖకు సూచించింది. అయితే ప్రస్తుత జాబితాలో ఆ టీచర్ కంటే సీనియర్లు ఉన్నప్పటికీ పదోన్నతి కల్పించినట్లు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు గత నెల 12తో పదోన్నతుల ప్రక్రియ ముగిసినా... 13న కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్న మరో టీచర్కు 12వ తేదీతో 16న పదోన్నతి ఉత్తర్వులు ఇచ్చినట్లు పేర్కొంటున్నాయి. ఇక ఏ మేనేజ్మెంట్ టీచర్లకు ఆ మేనేజ్మెంట్లోనే పదోన్నతులు కల్పించాల్సి ఉన్నా కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలోని పోస్టుల్లోకి జిల్లా పరిషత్ టీచర్లను బదిలీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. డీఈవోలు ముడుపులు పుచ్చుకుని ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలోని ఓ మండలంలో స్పౌజ్ కేటగిరీలో వచ్చిన ఓ టీచర్కు ఆమె కోరుకున్న స్థానాన్ని ఇవ్వలేదు, ఖాళీ లేదని చెప్పి పక్కనున్న మండలంలో పోస్టింగ్ ఇచ్చారు. కానీ ఈ ఖాళీ లేదన్న స్థానాన్నే ఆ తరువాత మరో టీచర్కు ఇచ్చారు. మరో మండలంలో ఎస్సీ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయ పోస్టును తమకు ముడుపులిచ్చిన వారి కోసం ఓసీ పోస్టుగా మార్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటన్నింటి నేపథ్యంలో మిగతా జిల్లాల్లోని డీఈవోలపై వచ్చిన ఆరోపణలపైనా శాఖాపర విచారణకు విద్యాశాఖ సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. విద్యాశాఖ బాధ్యతలు చూస్తున కడియం శ్రీహరి ఈ అక్రమాలపై సీరియస్గా ఉన్నట్లు సమాచారం. -
టీచర్ల బదిలీలకు 1500 దరఖాస్తులు!
ముగిసిన దరఖాస్తు ప్రక్రియ పాఠశాలల హేతుబద్ధీకరణ పూర్తి సిటీబ్యూరో: ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. రెండేళ్ల తర్వాత టీచర్ల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. బుధవారం సాయంత్రానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు విధానం పూర్తయింది. వాటిని పరిశీలించిన అనంతరం విద్యాశాఖ ఆమోదించాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే దరఖాస్తుల సంఖ్య తేలనుంది. జిల్లాలో మూడు వేలకు పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో తప్పనిసరి బదిలీ అయ్యే వారితోపాటు ఆశావహులు సైతం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్కూళ్లలో ఉన్న మిగులు ఉపాధ్యాయులు 95 మంది, ఒకే పాఠశాలలో ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న 78 మంది ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్లు ఒకే బడిలో విధులు నిర్వహించిన 100 మంది స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ), 200 మంది ఎస్జీటీలు తప్పనిసరిగా ద రఖాస్తు చేసుకున్నట్లే. వీరితో దాదాపు 800 మంది రిక్వెస్ట్ కింద, మరికొందరు ఆశావహ దృక్పథంతో దరఖాస్తులను అప్లోడ్ చేశారని సమాచారం. ఇలా అన్ని విభాగాల్లో 1,500 పైబడి బదిలీ కోసం దరఖాస్తులు వచ్చి ఉండవచ్చని అంచనా. ముగిసిన పాఠశాలల రేషనలైజేషన్ హైదరాబాద్ జిల్లాలో పాఠశాలల హేతుబద్ధీకరణ ప్రక్రియ ముగిసింది. అందుకు సంబంధించిన జాబితాను వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల సంఖ్యలో ఎంటువంటి మార్పులేదు. ఇప్పటివరకు ఉన్న స్కూళ్లు యథావిధిగా 2015-16 విద్యా సంవత్సరానికి కొనసాగనున్నాయి. అయితే ఉన్నత పాఠశాలల్లో నడుస్తున్న సక్సెస్ స్కూళ్ల సంఖ్య మాత్రం తగ్గింది. జిల్లాలో 135 సక్సెస్ స్కూళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వీటిలో 6 నుంచి పదో తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో బోధన అందిస్తున్నారు. 20 సక్సెస్ స్కూళ్లలో 50 మంది లోపు విద్యార్థులే నమోదయ్యారు. రేషనలైజేషన్లో భాగంగా వీటిని కిలోమీటర్ పరిధిలో ఉన్న ఇతర సక్సెస్ స్కూళ్లలో విలీనం చేశారు. తద్వారా 15 సక్సెస్ స్కూళ్లు సంఖ్యా పరంగా తగ్గాయని అధికారులు తెలిపారు. ఈ బడుల్లో బోధించే 60 - 70 మంది ఉపాధ్యాయులను ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేయనున్నారు. అలాగే ప్రాథమిక పాఠశాలల సంఖ్యలో మార్పు చోటుచేసుకుంది. ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న రెండు పీఎస్లను.. ఒక పీఎస్గా మార్చారు. ఇలా పది పీఎస్లను ఇతర పీఎస్లలో విలీనం చేయడంతో తాజాగా జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల సంఖ్య 624కు పడిపోయింది. విలీనమైన బడుల్లోని ఉపాధ్యాయులకు అదనపు పాయింట్లు కే టాయించనున్నారు. -
అంతా గోప్యం
నల్లగొండ : జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అసలు ఏం జరుగుతోంది...? ఉపాధ్యాయ బది లీలు, పోస్టుల హేతుబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం షెడ్యూల్ జారీచేసి మూడు రోజులు దాటి నా ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. షెడ్యూల్ ప్రకారం పోస్టుల హేతుబద్ధీకరణ ఈ నెల 22వ తేదీ నాటికి పూర్తిచేసి అదే రోజున ఖాళీల వివరాలు ప్రకటించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలకు అనేక అవరోధాలు అడ్డొస్తున్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో మిగులు పోస్టులను గుర్తించే ప్రక్రియ వేగంగానేపూర్తయినప్పటికీ ఆ తర్వాత జరగాల్సిన మిగతా కార్యక్రమాలు నె మ్మదించాయి. వివాదస్పదమైన అంశాలకు కేంద్ర బిందువుగా మారుతున్న విద్యాశాఖ...గతంలో చేపట్టిన బదిలీలు, రేషనలైజేషన్ విధానంలో అనేక విమర్శలు ఎదుర్కొంది. దీంతో ప్రస్తుతం చేపడుతున్న బదిలీలు, రేషనలైజేషన్ అత్యంత పకడ్బందీగా చేయాలని భావిస్తున్నప్పటికీ శాఖాపరమైన సమస్యలు వేధిస్తున్నట్లు తెలుస్తోంది. డీఈఓ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చితో ముగుస్తుడడంతో ఎలాంటి విమర్శలకూ తావులేకుండా బదిలీలు పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు. కానీ అందుకు పరిస్థితులు అనుకూలించేలా కనిపించకపోవడంతో ఆయనకు ఎటూ పాలుపోవడం లేదు. శాఖపరమైన సవాళ్లు.... రేషనలైజేషన్ వ్యవహారం అంత ఆషామాషీగా ఉండదనేది ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయం. గతంలో కాకుండా ఇప్పుడు మారిన మార్గదర్శకాల ప్రకారం చేయాలంటే అందుకు నైపుణ్యం కలిగిన ఉద్యోగుల సహకారం చాలా అవసరం. కానీ డీఈఓ కార్యాలయంలో తాజా పరిస్థితులను పరిశీలిస్తే ఇద్దరు ఏడీలు ఉన్నప్పటికీ వారినుంచి ఎలాంటి సాయమూ పొందలేని స్థితిలో అధికారులు ఉన్నారు. గతంలో అనుభవం కలిగిన కొంతమంది ఉద్యోగులు ఉన్నప్పటికీ వారిని వేర్వేరు విభాగాలకు మార్చారు. దీంతో ఒకరిద్దరుపైనే ఆధారపడాల్సి వస్తోంది. రేషనలైజేషన్, ఖాళీల గుర్తింపు, పోస్టుల సర్దుబాటు ఇవన్నీ కూడా ఒకరిద్దరు చేతుల మీదుగానే నడుస్తోంది. దీంతో రేషనలైజేషన్ కసరత్తు షెడ్యూల్ ప్రకారం పూర్తవుతుందా..! అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉంటే బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించడం విద్యాశాఖకు పెనుసవాల్గా మారింది. జిల్లాలో భువనగిరి మినహా నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ డివి జన్ల డిప్యూటీ డీఈఓల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. చిలుకూరు మండలం మినహా మిగిలిన 58 మండలాలకు హెచ్ఎంలే ఇన్చార్జ్ ఎంఈఓలుగా వ్యవహరిస్తున్నారు. అదీగాక ఈసారి వినూత్నరీతిలో బదిలీల కౌన్సెలింగ్ జిల్లా కేంద్రంలో ఒకేచోట కాకుండా నాలుగు చోట్ల చేయాలని యోచిస్తున్నారు. ఇలాంటి సం క్లిష్ట పరిస్థితులను దాటుకుని కౌన్సెలింగ్ సజావుగా సాగుతుందా...! అన్నదే ప్రశ్నార్థకమే. స్పందించని డీఈఓ.. ఓ వైపు బదిలీల కసరత్తు జరుగుతుండగానే మరోవైపు పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. డీఈఓకు అదనంగా రాజీవ్ విద్యామిషన్ పీఓ బాధ్యతలు ఉన్నాయి. వీటిన్నింటినీ దాటుకుని ముందుకు పోయేందుకు ఆయన శత విధాలా ప్రయత్నిస్తున్నారు. శాఖాపరంగా కీలక పోస్టులు ఖాళీగా ఉండడం...కౌన్సెలింగ్, రేషనలైజేషన్ చేపట్టడంలో అనుభవం కలిగిన ఉద్యోగులు, అధికారులు సరిపడా లేకపోవడంతో డీఈఓ మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన కొద్ది రోజులుగా బయటి వ్యక్తులనుంచి వస్తున్న ఫోన్లకు ఎలాంటి స్పందన ఇవ్వడం లేదని ఉపాధ్యాయ సంఘాలు ఫిర్యాదు చేస్తున్నాయి. బదిలీలకు సంబంధించిన ఎలాంటి సమాచారం కూడా బయటకు పొక్కనివ్వకుండా గుట్టచప్పుడు కాకుండా చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అధికారిక సెల్నంబర్కు ఎవరు కాల్చేసినా తప్పని సరిగా స్పందించాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది. కానీ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న డీఈఓ అత్యవసరమని భావించిన ఫోన్కాల్స్కు మాత్రమే స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం అనుకున్న విధంగా ముందుకు సాగాలంటే కలెక్టర్ దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. -
నాడు విమర్శలు...నేడు ఇష్టారాజ్యంగా బదిలీలు
శ్రీకాకుళం: గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రస్థాయిలో జరిగిన ఉపాధ్యాయ బదిలీల సందర్భంలో అప్పటి ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకులు విమర్శలు చేసి అధికారంలోనికి వచ్చిన తరువాత ఇష్టారాజ్యంగా ఉపాధ్యాయులను బదిలీ చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. జిల్లా విద్యాశాఖాధికారులు పలువురికి బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు సోమవారం అందాయి. జిల్లాకు చెందిన 17 మంది వరకు బదిలీలు జరిగినట్టు తెలియవచ్చింది. ఈ బదిలీ ఉత్తర్వులు విద్యాశాఖ అధికారుల నుంచి కాకుండా ప్రజాప్రతినిధుల ప్రత్యేక కార్యదర్శుల ద్వారా విద్యాశాఖాధికారులకు రావడంపై ఉపాధ్యాయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా అంతర్జిల్లా బదిలీలను కూడా రాష్ట్రస్థాయిలో చేయడంపై ఉపాధ్యాయ వర్గాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. గత ప్రభుత్వం హయాంలో ఉపాధ్యాయుల బదిలీలు జరిగితే తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన అప్పటి ప్రతిపక్ష నాయకులు ఎన్నికల సమయంలో బదిలీలు కౌన్సెలింగ్ ద్వారానే జరుపుతామని దొడ్డిదారిన బదిలీలు ఉండవని చెప్పడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. వీటిని రద్దు చేయకుంటే ఆందోళన చేస్తామని పలు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. కొందరు ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించాలని కూడా యోచిస్తున్నారు. ఈ వ్యవహారం ఎటువంటి మలుపులకు దారితీస్తుందో వేచిచూడాలి.