ముంబై: అనారోగ్యం కారణంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదివారం మహారాష్ట్రలో ఒక రోజు ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. అయితే అనారోగ్యానికి సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. మరోవైపు సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని రాయ్బరేలీ నియోజకవర్గంలో ఉన్న లాల్గంజ్లో ఆదివారం జరగాల్సిన బహిరంగ సభను రాహుల్ రద్దు చేసుకున్నారు. కాగా.. సోనియా కుమార్తె ప్రియాంకా గాంధీ సోమవారం రాయ్బరేలీలో సభలను అనివార్య కారణాల వల్ల రద్దు చేసుకున్నారు.
అనారోగ్యంతో సోనియా పర్యటన రద్దు
Published Mon, Apr 21 2014 2:50 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement