
సాక్షి, గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 122వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. బుధవారం ఉదయం ఆయన సత్తెనపల్లి నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి రామకృష్ణాపురం మీదగా నందిగామ్ చేరుకున్నారు. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం గుడిపూడి కాలనీ మీదగా గుడిపుడి చేరుకుని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్ను విడుదల చేశారు.