నగరంలోని అత్తాపూర్ ఈశ్వర్ థియేటర్ వద్ద అభిమానులు ఆందోళన చేపట్టారు.
హైదరాబాద్: నగరంలోని అత్తాపూర్ ఈశ్వర్ థియేటర్ వద్ద అభిమానులు ఆందోళన చేపట్టారు. 'బాహుబలి' టికెట్లు బ్లాక్ లో అమ్ముతున్నారంటూ వారు ఆందోళన చేశారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా అదుపుతప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అంతేకాక థియేటర్ దగ్గర ఏర్పాటు చేసిన బౌన్సర్లు ప్రేక్షకులపై దాడికి దిగారు. దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియాపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో 'సాక్షి' విలేకరికి గాయాలు అయ్యాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
థియేటర్ల వద్ద ఉద్రిక్తత
అదేవిధంగా తార్నాక ఆరాధన థియేటర్ వద్ద, శంషాబాద్ లోని గణేష్ థియేటర్ పై కూడా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో థియేటర్ పై దాడికి దిగారు. అద్దాలు ధ్వంసం చేశారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బాహుబలి ని మొదటి రోజు చూడాలనే అత్యుత్సాహం ఉద్రిక్తతలకు దారి తీస్తోంది.