నేటి వార్తావిశేషాలు | today news updates | Sakshi
Sakshi News home page

నేటి వార్తావిశేషాలు

Published Mon, Nov 2 2015 7:37 AM | Last Updated on Sun, Sep 3 2017 11:54 AM

today news updates

వైఎస్సార్ సీపీ సమరభేరి: పెరిగిన నిత్యావరసరాల ధరలపై వైఎస్సార్ సీపీ సమరభేరి మోగించింది. ధరల నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నేడు ఏపీలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాల ఎదుల ఆందోళనలు నిర్వహించనుంది.

విద్యార్థులపై దాడికి నిరసన: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేసిన విద్యార్థి జేఏసీ నాయకులపై విజయవాడలో బీజేపీ నేతల దాడిని నిరసిస్తూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో నేడు ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మిషన్ కాకతీయ ఫేస్- 2: చెరువుల పుణరుద్ధరణ కోసం తెలంగాణ సర్కార్ ప్రారంభించిన మిషన్ కాకతీయ పథకం ఫేస్-2పై ఇంజనీర్లతో నేడు వర్క్ షాప్ జరగనుంది. జేఎన్టీయూలో నిర్వహించే ఈ కార్యక్రమానికి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, అధికారులు పాల్గొననున్నారు.

ఏపీ కేబినెట్ భేటీ: రాజధాని భూముల అంశం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలే ప్రధాన ఎజెండాగా నేడు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. విజయవాడలో జరగనున్న ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు అధ్యక్షత వహిస్తారు.

వీరీవీరీ గుమ్మడిపండు..: కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెలంగాణ బీజేపీ నేడు తెరదించనుంది. వరంగల్ ఉప ఎన్నికలో బీజేపీ- టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరనేది నేడు ప్రకటించనుంది. దేవయ్య, చింతా స్వామి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

నామినేషన్లు: వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా సిరిసిల్ల రాజయ్య, వామపక్షాల అభ్యర్థిగా గాలి వినోద్ కుమార్ నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement