వైఎస్ఆర్ సీపీ నేతపై వేటకొడవళ్లతో దాడి | unknown persons attacked by ysrcp leader | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ నేతపై వేటకొడవళ్లతో దాడి

Published Fri, Dec 25 2015 7:29 AM | Last Updated on Tue, May 29 2018 2:42 PM

unknown persons attacked by ysrcp leader

గుంటూరు:గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో గురువారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. స్థానిక మహాలక్ష్మీ బార్లో వైఎస్ఆర్ సీపీ సొసైటీ ప్రెసిడెంట్ సీతారామిరెడ్డిపై ఆయన ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేశారు. గాయపడిన ఆయనను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

సీతారామిరెడ్డికి అదే గ్రామానికి చెందిన పందిటి రామిరెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి సీతారామిరెడ్డిపై రామిరెడ్డి వేటకొడవలితో దాడి చేశాడు. అక్కడున్న వారు అడ్డుకోవటంతో సీతారామిరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటన అనంతరం రామిరెడ్డి పరారయ్యాడు. సీఐ సుబ్బారావు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement