attacked
-
‘జనసేన వాళ్లమని చెప్పినా చితకబాదారు!’
ఎన్టీఆర్, సాక్షి: పండుగ పూట కూటమి నేతలు అధికార మదంతో రెచ్చిపోతున్నారు. రికార్డింగ్ డ్యాన్యుల ముసుగుతో అశ్లీల నృత్యాలను దగ్గరుండి మరీ ప్రొత్సహిస్తున్నారు. అలాగే బరుల్లో తమ ఆధిపత్యమే కొనసాగేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో దాడులకూ పాల్పడుతున్నారు. అయితే.. కోడి పందేలు కూటమి మధ్య లుకలుకలను బయటపెడుతున్నాయి. బరుల్లో తెలుగు తమ్ముళ్లు(TDP Activists) బరి తెగించేస్తున్నారు. ఎవరూ ముందుకు రాకుండా.. ఉత్త పుణ్యానికే దాడులకు దిగుతున్నారు. అయితే ‘‘ఎందుకు కొడుతున్నారు?’’ అని అడిగినందుకు కర్రలతో మూకుమ్మడి దాడి చేశారు. దాడిని అడ్డుకున్న వారి వాహనాలను సైతం ధ్వంసం చేశారు. దాడిలో ఆరుగురికి గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆ ఆరుగురు జనసేన కార్యకర్తలని తేలింది. కంచికచర్ల(Kanchikarla) మండలం గండేపల్లి కోడిపందేల బరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాము జనసేన వాళ్లమని చెప్పిన్నా వినకుండా దుర్భాషలాడుతూ తమను చితకబాదారని బాధితులు వాపోయారు. మరోవైపు తమ కార్యకర్తల పై జరిగిన దాడిపై జనసేన(Jana Sena) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘చంద్రబాబు, పవన్లు 15 ఏళ్లు కలిసి పొత్తులో ఉందామనుకుంటున్నారు. కానీ టీడీపీ నేతలు అలా ఉండనిచ్చేలా లేరు’’ అని అంటున్నారు. తాజా దాడిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని జనసేన నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీలో కోడి పందేలు(Rooster Fightings) కూటమి నేతల మధ్య చిచ్చు రాజేస్తున్నాయి. జనసేన, బీజేపీ వాళ్లను టీడీపీ వాళ్లు ముందుకు రానివ్వకపోవడమే అందుకు కారణం. ఇందుకు సంబంధించిన ఘటనలు.. సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. ఇక.. ఏపీలో సాంప్రదాయ సంబరాల ముసుగులో యధేచ్ఛగా జూద క్రీడలు. కోడిపందాల బరులను ఆదాయ వనరులుగా మార్చేసుకుంటున్నారు కూటమి నేతలు. కోడి పందాల బరుల్లో వాటాల కోసం కూటమి పార్టీ ఎమ్మెల్యేలు తహతహలాడిపోతున్నారు. ఈ క్రమంలో.. తమ అనుచరులను రంగంలోకి దించుతున్నారు. ఏపీలో మునుపెన్నడూ లేనంతగా ఇష్టానుసారంగా బరులు ఏర్పాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. కోడి పందాల బరుల్లో జూదక్రీడలకు స్పెషల్ ఎరేంజ్ మెంట్స్ చేస్తున్నారు. పేకాట, గుండాట, లోన బయట , నంబర్ల గేమ్స్ కోసం కౌంటర్లు ఏర్పాటు చేయించారు. ఇక.. జూద క్రీడలకు తోడు మద్యం ఏరులై పారుతోంది. మద్యం కోసం ప్రత్యేకంగా మినీ బార్లు , బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ.. తొలి రెండు రోజుల్లోనే వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది. మొత్తం.. ఈ పండక్కి జూదం ,మద్యం ద్వారా భారీగా సంపాదించాలని పక్కా ప్రణాళిక వేసుకున్న కూటమి నేతలు.. దానిని అంతే పక్కాగా అమలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. కోడిపందాలు , పేకాట ,గుండాటలు ఆడితే తాటతీస్తామని పండగ ముందు పోలీసులు హెచ్చరికల వరకే పరిమితం అయ్యారు. బరుల వద్ద కనీసం కనుచూపుమేరలో కూడా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కనిపించకపోవడంతో.. కూటమి నేతలతో కుమ్మక్కయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇదీ చదవండి: కోడి పందేల కోసం మహిళా బౌన్సర్లు!! -
ఇద్దరు ఎమ్మార్వోల వీరంగం.. రియల్టర్పై దాడి
సాక్షి,చిత్తూరు:మద్యం మత్తులో చిత్తూరులో ఇద్దరు తహసీల్దార్లు వీరంగం సృష్టించారు. తప్పతాగి నడిరోడ్డుపై రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడికి దిగారు. శివ,ప్రసన్నలు గంగవరం,పెద్దపంజాణి ఇన్ఛార్జ్ తహసీల్దార్లుగా పనిచేస్తున్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కృష్ణకుమార్పై శివ,ప్రసన్నలు దాడి చేశారు. చిత్తూరులోని ఓ బార్లో శివ,ప్రసన్న,కృష్ణ కుమార్లు వేరువేరుగా మద్యం సేవించారు. శివ,ప్రసన్న,కృష్ణ కుమార్ల మధ్య ఆర్థిక లావాదేవీలున్నాయి.మద్యం తాగేటపుడు మాటా మాటా పెరిగి కృష్ణ కుమార్పై శివ,ప్రసన్న దాడి చేశారు. ఈ దాడి వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కృష్ణకుమార్ డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: తెలుగు తమ్ముళ్ల స్వైర విహారం -
AP: ప్రేమోన్మాది ఘాతుకం.. దాడిలో ఇంటర్ విద్యార్థిని మృతి
సాక్షి, నంద్యాల: ఏపీలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదనే కారణంగా యువతిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ ప్రమాదంలో బాధితురాలు మృతిచెందింది. అనంతరం తాను నిప్పంటించుకొని అతడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నంద్యాల జిల్లా నందికొట్కూరు బైరెడ్డి నగర్కు చెందిన ఇంటర్ విద్యార్థిని తాను ప్రేమిస్తున్నానంటూ రాఘవేంద్ర వేధింపులకు గురిచేశాడు . అయితే యువతి అతని ప్రేమను అంగీకరించకపోవడంతో.. లహరిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అనంతరం తాను నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా యువతి పూర్తిగా కాలిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లహరి మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. -
వైఎస్సార్ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై కత్తితో దాడి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదని ప్రేమోన్మాది ఓ యువతిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారు. వేముల మండలం కొత్తపల్లిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల ఇంట్లో వారు రావడంతో ఆ యువకుడు పరారయ్యారు.పరిస్థితి విషమించడంతో పులివెందులలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె శరీరంపై 14 కత్తిపోట్లు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉండడంతో పాటు రక్తస్రావం ఎక్కువగా అవుతుండడంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
Bangladesh: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాదిపై దాడి.. పరిస్థితి విషమం
ఢాకా: బంగ్లాదేశ్లో దేశద్రోహం ఆరోపణలపై అరెస్టయిన చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి తరపు న్యాయవాది రమణ్ రాయ్పై దాడి జరిగిందని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్(ఇస్కాన్) తెలిపింది.ఇస్కాన్ ప్రతినిధి రాధారమణ్ దాస్ ట్విట్టర్లో ఒక పోస్ట్లో ‘దయచేసి అడ్వకేట్ రమణ్ రాయ్ కోసం ప్రార్థించండి. అతను చేసిన ఒకేఒక తప్పు చిన్మయ్ కృష్ణ ప్రభు కోసం కోర్టులో వాదించడం. ఇస్లాంవాదులు అతని ఇంటిని ధ్వంసం చేసి, అతనిపై దాడి చేశారు, ప్రస్తుతం ఆయన ప్రాణాలతో పోరాడుతున్నారు’ అని రాశారు.Please pray for Advocate Ramen Roy. His only 'fault' was defending Chinmoy Krishna Prabhu in court.Islamists ransacked his home and brutally attacked him, leaving him in the ICU, fighting for his life.#SaveBangladeshiHindus #FreeChinmoyKrishnaPrabhu pic.twitter.com/uudpC10bpN— Radharamn Das राधारमण दास (@RadharamnDas) December 2, 2024బంగ్లాదేశ్కు చెందిన పలువురు న్యాయవాదులు ఈ ఘటనలను ఖండించారు. కాగా చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాది హత్యకు గురయ్యాడంటూ గత నెలలో సోషల్ మీడియాతోపాటు కొన్ని వార్తా కథనాలలో కనిపించింది. అయితే ఈ ప్రస్తావనలో వచ్చిన లాయర్ పేరు సైఫుల్ ఇస్లాం అని విచారణలో తేలింది. ఆయన ప్రభుత్వం తరపు న్యాయవాది అని, అతను చిన్మోయ్ దాస్ కేసులో పోరాడలేదని సమాచారం.బంగ్లాదేశ్లోని ఇస్కాన్ టెంపుల్కు చెందిన సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి ఇటీవల రంగ్పూర్లో హిందువులకు మద్దతుగా జరిగిన నిరసనలకు నాయకత్వం వహించారు. ఆ తరువాత గత నెలలో ఢాకాలో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అతనిపై దేశద్రోహం అభియోగం మోపారు. ఈ నేపధ్యంలో ఢాకా కోర్టు అతనికి బెయిల్ నిరాకరించింది.బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా బహిష్కరణకు గురైనప్పటి నుండి, మైనారిటీలపై హింసాయుత ఘటనలు జరుగుతున్నాయి. అలాగే వీటిని నిరసిస్తూ పలు ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. బంగ్లాదేశ్లోని ఛటోగ్రామ్లో చిన్మయ్ కృష్ణ దాస్ శిష్యులు ఇద్దరు అదృశ్యమయ్యారని రాధారమణ్ దాస్ గతంలో ఒక పోస్టులో తెలిపారు. కాగా బంగ్లాదేశ్లో హిందువుల అరెస్టులను భారత్ ఖండించింది. హిందువులు, ఇతర మైనారిటీలకు భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.ఇది కూడా చదవండి: దూసుకొచ్చిన మృత్యువు -
దాడి చేయబోతే 'దాడి' చేశార్సార్!
-
విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, విశాఖపట్నం: నగరంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పెదగంట్యాడ బాలచెరువు సమీపంలో యువతిపై ఓ యువకుడు దాడి చేశారు. ఈ ఘటనలో బాధితురాలు మేఘన తీవ్రంగా గాయపడింది. కాగా, మేఘనపై జరిగిన దాడిలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది. రెండు సార్లు నిందితుడిపై ఫిర్యాదు చేసిన కానీ పోలీసులు పట్టించుకోలేదు.మేఘన తలపై బలంగా ఇనుప రాడ్డుతో నిందితుడు నీరజ్ శర్మ దాడి చేశాడు. మేఘన పై దాడి చేస్తున్న క్రమంలో అడ్డు వచ్చిన మరో ఇద్దరిపై కూడా ప్రేమోన్మాది దాడి చేశాడు. బాధితురాలి తలపై వైద్యులు 30కి పైగా కుట్లు వేశారు. మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని కిమ్స్కు తరలించారు. -
కొడుకు, కోడలు కలిసి తండ్రిపై దాడి
-
బహ్రాయిచ్లో పట్టుబడిన చిరుత
బహ్రాయిచ్: ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్ జిల్లాలో జనాలపై దాడి చేస్తున్న చిరుత ఎట్టకేలకు పట్టుబడింది. దానిని అటవీశాఖ అధికారులు బోనులో బంధించారు. ఆ చిరుత ఒక బాలికతో పాటు వృద్ధురాలిపై కూడా దాడి చేసింది. చిరుత పట్టుబడటంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.దీనికిముందు గత సోమవారం అటవీశాఖ అధికారులు ఒక చిరుతను పట్టుకున్నారు. ఇప్పుడు రెండో చిరుతపులిని పట్టుకున్నారు. కతర్నియాఘాట్ అటవీ ప్రాంత పరిధిలోని పలు గ్రామాల్లో చిరుతలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఐదు రోజుల క్రితం ఒక చిరుత 13 ఏళ్ల బాలికపై దాడి చేసి గాయపరిచింది. ఇదేవిధంగా 80 ఏళ్ల రెహమానా ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేసింది. ఆ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు గ్రామ సమీపంలోని చెరుకు తోటలో బోనును ఏర్పాటు చేశారు. కొద్దిసేపటికి చిరుత ఆ బోనులో చిక్కింది. పోలీస్ స్టేషన్ హెడ్ హరీష్ సింగ్, రేంజర్ రోహిత్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకుని, చిరుతను ట్రాక్టర్ ట్రాలీలో ఎక్కించి, అటవీశాఖ రేంజ్ కార్యాలయానికి తరలించారు.ఇది కూడా చదవండి: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి -
హర్యానా మాజీ డిప్యూటీ సీఎం కాన్వాయ్పై దాడి
జీంద్: హర్యానాలోని జింద్ జిల్లా ఉచన కలాన్లో కలకలం చోటుచేసుకుంది. సోమవారం అర్థరాత్రి మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా కాన్వాయ్పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం దుష్యంత్ చౌతాలా బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా కొందరు యువకులు వీరంగం సృష్టించారు. అనంతరం దుష్యంత్ కాన్వాయ్ వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.ఈ రోడ్ షోలో దుష్యంత్తో పాటు ఆజాద్ సమాజ్ పార్టీ నేత చంద్రశేఖర్ రావణ్ కూడా పాల్గొన్నారు. ఈ హఠాత్ దాడి హర్యానా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఈ దాడిలో చంద్రశేఖర్ ప్రయాణిస్తున్న కారు వెనుక అద్దాలు పగిలిపోయాయి. జేజేపీ నేత, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా ఉచన కలాన్ అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. చంద్రశేఖర్ ఆయనకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు. హర్యానాలో అక్టోబర్ 5న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.ఇది కూడా చదవండి: గయతో పాటు ఈ ప్రాంతాల్లోనూ పిండ ప్రదానాలు -
మద్యం మాఫియా దాడి.. ఆరుగురు పోలీసులకు గాయాలు
పట్నా: గత కొంతకాలంగా బీహార్లో మద్యం అక్రమ రవాణా కేసులు తరచూ వెలుగు చూస్తున్నాయి. తాజాగా మద్యం మాఫియా పోలీసులపై దాడికి దిగింది. బెగుసరాయ్ జిల్లాలోని లాఖో పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం మద్యం మాఫియా దాడిలో లాఖో పోలీస్ స్టేషన్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ), సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)తో సహా ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. లాఖో పోలీస్ స్టేషన్ ఇన్చార్జి అభిషేక్ కుమార్ నేతృత్వంలో పోలీసుల బృందం మద్యం స్థావరాలపై దాడి చేయడానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది. బహద్పూర్ ముషారి తోలా ప్రాంతానికి వెళ్లి, దేశీ మద్యం తయారీలో నిమగ్నమైన కొంతమంది స్థానికుల ఇళ్లపై పోలీసులు దాడులు చేశారు. ఈ సమయంలో మద్యం మాఫియా పోలీసు బృందంపై రాళ్లు రువ్వింది.ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు గాయపడ్డారని తెలుసుకున్న వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపు చేశారు. గాయపడిన పోలీసులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తెలుస్తోంది. ఈ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: రూ.లక్షన్నర కోట్ల ‘మూసీ’కి లక్షల జీవితాలు బలి -
దళిత వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే దాడి
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, అమరావతి: ఏరా లం...కొడకా.. చంపేస్తాను నా కొడకా.. ఏంటి రా నన్ను తిట్టావంట.. చదువుకునే కుర్రాళ్లను రెచ్చగొడతావా.. అంటూ నోటికొచ్చినట్టు బండ బూతులు తిడుతూ ఓ దళిత ప్రభుత్వ వైద్యుడిపై కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ తన అనుచరులతో కలసి పిడిగుద్దులతో దాడి చేశారు. శనివారం కాకినాడ రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ) మైదానంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించి పూర్వాపరాలిలా ఉన్నాయి. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలకు శ్రీనగర్లో 12 ఎకరాల క్రీడా మైదానం ఉంది.ఇందులో సుమారు 150 గజాల్లో మెడికోల కోసం వాలీబాల్ కోర్ట్æ ఉంది. వైద్య కళాశాల ముందస్తు అనుమతి లేకుండా ఇతరులు క్రీడల కోసం ఆ కోర్టును వినియోగించరాదు. అయితే గత కొంత కాలంగా కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ అనుచరులమంటూ సుమారు 40 మంది యువకులు వాలీబాల్ కోర్ట్కు వస్తూ మెడికోలపై గొడవకు దిగుతున్నారు. వైద్య విద్యార్థినులతో పాటు వాకింగ్ కోసం వస్తున్న మహిళలపై తరచూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీనిపై ఆర్ఎంసీ స్పోర్ట్స్ వైస్చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుకు మెడికోలు ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని వైద్య విద్యార్థులు అటు రంగరాయ యాజమాన్యంతో పాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ)కి ఫిర్యాదు చేశారు. అనుమతి అడిగి.. అంతలోనే గొడవకు దిగి..తమ అనుచరులను కోర్టులో ఆడుకునేందుకు అనుమతివ్వాలని ఆర్ఎంసీ ప్రిన్సిపాల్, డీఎంఈ డాక్టర్ డీఎస్వీఎల్ నరసింహాన్ని ఇటీవల ఎమ్మెల్యేలు ఇరువురూ ఫోన్లో అడిగారు. అందుకు నరసింహం అభ్యంతరం చెబుతూ.. ఉన్నత స్థాయి కమిటీలో చర్చించి చెబుతామని వారికి చెప్పారు. ఇంతలో అనుమతి లేకుండానే శనివారం కూటమి ఎమ్మెల్యేల అనుచరులు వాలీబాల్ కోర్టులో ఆటలాడుతున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపాల్, డాక్టర్ విష్ణువర్ధన్, కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్, ఫోరెన్సిక్ హెచ్వోడీ డాక్టర్ ఉమామహేశ్వరరావు, ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్తో కలసి ఆర్ఎంసీ గ్రౌండ్కి చేరుకున్నారు.కోర్టు నుంచి వెళ్లిపోవాలని ఎమ్మెల్యేల అనుచరులకు నచ్చజెప్పగా.. వారు వాగ్వాదానికి దిగారు. అనంతరం ఎమ్మెల్యే అనుచరులు కోర్టు ఖాళీ చేసి వెళ్లిపోయాక ఎమ్మెల్యే నానాజీ తన అనుచరులను వెంట బెట్టుకుని గ్రౌండ్కు వచ్చి డాక్టర్ ఉమామహేశ్వరరావుపై బండ బూతులు మొదలుపెట్టి.. ఆ డాక్టర్ ముఖానికి మాస్క్ను బలవంతంగా లాగేసి పిడిగుద్దులు కురిపించారు. మరోమారు తన అనుచరులను అడ్డుకుంటే చంపేస్తానని హెచ్చరించి వెళ్లారు. ఆ సమయంలో ఇరు పక్షాలు గొడవకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.నేటి నుంచి జూడాల నిరసన..ఎమ్మెల్యే నానాజీ దౌర్జన్యానికి నిరసనగా ఆదివారం నుంచి విధులు బహిష్కరిస్తామని వైద్యులు, జూడాలు ప్రకటించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ నరసింహం ఆధ్వర్యంలో వైద్యులు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్కు జరిగిన సంఘటనపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎంఎల్ఏ నానాజీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. ఇదిలా ఉండగా కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆర్ఎమ్సీకి వచ్చి ఇరుపక్షాలతో రాజీకి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు వైద్యులు, మెడికోలు ససేమిరా అంటున్నారు. దళిత సంఘాలు ఆర్ఎంసీ గ్రౌండ్స్కు చేరుకుని దళిత జాతికి జరిగిన అవమానమంటూ ధర్నాకు దిగారు.క్రిమినల్ కేసు నమోదు చేయాలిడా.ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన అనుచరులు దాడికి పాల్పడటం హేయమైన చర్య అని ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా.జయధీర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, వైద్యులపై దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు ఆయన లేఖ రాశారు. -
మళ్లీ తోడేలు దాడి.. ఇద్దరు చిన్నారులకు గాయాలు
బహ్రయిచ్: ఉత్తరప్రదేశ్లోని బహ్రయిచ్ జిల్లాలోని 35 గ్రామాలు నరమాంస భక్షక తోడేళ్ల దాడులతో వణికిపోతున్నాయి. ప్రతిరోజూ తోడేళ్ల దాడులకు సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సోమవారం రాత్రి ఇద్దరు చిన్నారులపై నరమాంస భక్షక తోడేలు దాడి చేసింది.ఈ ఘటన బహ్రయిచ్లోని మహసీ ప్రాంతంలోని గిర్ధర్ పూర్వా గ్రామంలో చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి నరమాంస భక్షక తోడేలు ఇద్దరు పిల్లలపై దాడి చేసింది. ఈ ఘటనలో ఒక చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. మరో బాలిక గాయపడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతోంది.ఐదేళ్ల బాలిక తన అమ్మమ్మతో కలిసి ఇంట్లో మంచంపై నిద్రిస్తోంది. రాత్రి 12 గంటల సమయంలో తోడేలు ఆమెపై దాడి చేయడంతో ఆమె కేకలు వేసింది. దీంతో ఆ తోడేలు అక్కడి నుంచి పారిపోయి, మరో ఇంట్లోని చిన్నారిపై దాడి చేసింది. ఆ చిన్నారి కూడా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ ఘటన మహసీ తహసీల్ ప్రాంతంలోని పాంధుయా గ్రామంలో చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా రాత్రివేళ నరమాంస భక్షక తోడేళ్లు దాడులకు దిగుతున్నాయి. -
మరో వైద్యురాలిపై దాడి.. నిందితులు పరార్
దేశంలో ఎక్కడో ఒకచోట వైద్యులపై దాడులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ముంబైలోని సియోన్ ఆస్పత్రిలో ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది. ఓ వైద్యురాలిపై రోగి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఈ ఉదంతంలో ఆ వైద్యురాలు గాయపడ్డారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈరోజు(ఆదివారం) తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దీనిపై బీఎంసీ ఎంఏఆర్డీ అసోసియేషన్ వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వైద్యురాలిపై దాడి చేసిన వారంతా మద్యం మత్తులో ఉన్నారని తెలుస్తోంది. వీరు ఆమెపై దాడికి పాల్పడిన అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.కాగా కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటన తర్వాత, దేశవ్యాప్తంగా వైద్యులు తమ భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు. తాజాగా సియోన్ ఆస్పత్రిలో జరిగిన ఘటనతో వైద్యుల భద్రతపై మరోసారి పలు సందేహాలు తలెత్తుతున్నాయి. -
Maharashtra: మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్పై దాడి
మహారాష్ట్రలో సంచలన ఉదంతం చోటుచేసుకుంది. థానేలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్పై దాడి జరిగింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) కార్యకర్తలు ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్పై పేడ, టమోటాలు, గాజులు, కొబ్బరికాయలు విసిరారు. ఈ దాడికి పాల్పడిన 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం శుక్రవారం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో రాజ్ ఠాక్రే ర్యాలీపై శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన వ్యక్తులు కిళ్లీలు విసిరారనే ఆరోపణలు వచ్చాయి. ఈ దరిమిలా మర్నాడు ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్పై పేడ, టమోటాలు విసిరారు. దీంతో రాజ్ ఠాక్రే పార్టీ కార్యకర్తలు ఉద్ధవ్ కాన్వాయ్పై దాడి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.వివరాల్లోకి వెళితే ముంబైకి ఆనుకుని ఉన్న థానే జిల్లాలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం శనివారం ఒక మీటింగ్ నిర్వహించింది. దీనిలో ఉద్ధవ్ ఠాక్రే కూడా పాల్గొన్నారు. ఈ సమయంలో కొంతమంది ఎంఎస్ఎన్ కార్యకర్తలు ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్పై పేడ, టమోటాలు, గాజులు, కొబ్బరికాయలను విసిరారు.పోలీసు వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం, ప్రస్తుతం పోలీసులు 20 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే వర్సెస్ రాజ్ ఠాక్రే వివాదం మొదలయ్యిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. -
తీహార్ జైలులో ఖైదీల ఘర్షణ.. ఇద్దరికి గాయాలు
ఢిల్లీలోని తీహార్ జైలులో మరోమారు గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఖైదీల మధ్య మరోసారి ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు. జైలులోని ఫోన్ రూమ్లో ఈ గొడవ జరిగింది. లవ్లీ, లావిష్ అనే ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు.వివరాల్లోకి వెళితే లోకేష్ అనే ఖైదీ ఈ దాడికి పాల్పడ్డాడని సమాచారం. లోకేష్ సోదరుని హత్య కేసులో లవ్లీ, లావిష్ జైలులో ఉన్నారు. జైలులోనే దాడికి ప్లాన్ చేసిన లోకేష్ తన సహచరులు హిమాన్ష్, అభిషేక్ల సాయం తీసుకున్నాడు. అవకాశం చూసుకున్న లోకేష్, అతని సహచరులు కలసి లవ్లీ, లావిష్లపై దాడి చేశారు. గాయపడిన ఖైదీలిద్దరినీ జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఒక ఖైదీని ఆస్పత్రి నుంచి తిరిగి జైలుకు తీసుకువచ్చారు. మరొక ఖైదీ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తీహార్ జైలులో గతంలోనూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. -
కోఠిలో కలకలం.. ప్రభుత్వ వైద్యుడిపై తోటి డాక్టర్ల దాడి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద కలకలం రేగింది. ప్రభుత్వ వైద్యుడిపై తోటి వైద్యులు దాడికి పాల్పడ్డారు. దీంతో డీఎంఈ కార్యాలయం ముందు బాధిత వైద్యుడు డాక్టర్ శేఖర్ ఆందోళనకు దిగారు.సాధారణ బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు అమలు చేయాలని డీఎంఈకు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చానని.. ఈ జీవో అమలు చేస్తే హైదరాబాద్లో పని చేస్తున్న వైద్యులు జిల్లాలకు, జిల్లాలలో పని చేస్తున్న వాళ్లు హైదరాబాద్కు 40 శాతం మేర బదిలీలు జరుగుతాయి. ఈ బదిలీ లను అడ్డుకునేందుకు డాక్టర్ పల్లం ప్రవీణ్ కుమార్, బొంగు రమేష్, రాథోడ్ , వినోద్ కుమార్లు కుట్ర చేస్తున్నారని డాక్టర్ శేఖర్ ఆరోపించారు.తాను డీఎంఈకు వినతి పత్రం ఇవ్వకుండా తనను అడ్డుకుని. తనపై దాడి చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ముసుగులో ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ సిటీ లోనే తిష్ట వేశారు. వాటిపై ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన నలుగురు వైద్యులపై చర్యలు తీసుకొనేంత వరకు తాను డీఎంఈ కార్యాలయం ముందే బైఠాయిస్తానని వైద్యుడు శేఖర్ చెబుతున్నారు. -
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కో కన్వినర్ ఇంటిపై దాడి
తెనాలి అర్బన్: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా గుంటూరు జిల్లా కో–కన్వినర్ నీలి అజయ్కుమార్ ఇంటిపై బుధవారం అర్ధరాత్రి టీడీపీ గూండాలు దాడి చేశారు. నాలుగు గంటలపాటు విధ్వంసానికి పాల్పడ్డారు. ఇంట్లో వస్తువులు, కిటికీల అద్దాలు, పూల కుండీలు ధ్వంసం చేశారు. బాధితుడి కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి నందులపేటకు చెందిన నీలి అజయ్ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా జిల్లా కో–కన్వినర్. ప్రతిపక్ష పార్టీల విమర్శలను సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టేవాడు. అతనిపై కక్ష పెంచుకున్న కొందరు టీడీపీ గూండాలు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాగానే బెదిరింపులు ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం అజయ్ విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో కొందరు టీడీపీ గూండాలు కారులో అతని ఇంటికి వచ్చారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో కర్రలు, రోకలి బండలతో కిటికి అద్దాలు పగలకొట్టారు. కిటికీల నుంచి కర్రలు, రాడ్లతో లోపల అందిన వస్తువులను ధ్వంసం చేశారు. ఇంటి ఆవరణలోని వాషింగ్ మిషన్, పూల కుండీలు, వస్తువులను పగులగొట్టారు. దీనిని గమనించిన స్థానికులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై దౌర్జన్యానికి దిగారు. వారిపై దుర్భాషలాడి, బెదిరించారు. తెల్లవారుజామున 4 గంటల వరకు నాలుగు గంటల పాటు విధ్వంసం కొనసాగినా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. -
విజయవాడ: కోర్టు ఆవరణలో దారుణం.. పచ్చ గూండాల అరాచకం
సాక్షి, విజయవాడ: ఏపీలో టీడీపీ శ్రేణుల అరాచకాలు ఆగడం లేదు.. అధికార మత్తులో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. తాజాగా విజయవాడలోని కోర్టు ఆవరణలోనే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పచ్చమూకలు దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై గద్దె రామ్మోహన్ అనుచరులు దాడికి దిగారు.కర్రలు, బీర్ బాటిళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఆటోలో వెంబడించి టీడీపీ గూండాలు దాడి చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు పవన్, రాజేష్లు తీవ్రంగా గాయపడ్డారు. వారు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.ఎంతమంది తల్లులను క్షోభ పెడతారు..వైఎస్సార్సీపీ కోసం పనిచేసినందుకే తమ పిల్లలపై దాడి జరిగిందని బాధితుల తల్లి మద్దెల మల్లిక అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటినుండి అరాచకం జరుగుతోంది. చంద్రబాబు, లోకేష్ ఈ దాడులకు సమాధానం చెప్పాలి. ఎంతమంది తల్లులను క్షోభ పెడతారు. ఎంతమంది మహిళల ఉసురు పోసుకుంటారు. నా బిడ్డల తలలు పగలగొట్టారు.. పరిస్థితి విషమంగా ఉంది’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పైకి సౌమ్యంగా కనిపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతున్నారని.. దాడులను ప్రోత్సహించే వ్యక్తి అని, బీరు సీసాలు, కర్రలతో మాటు వేసి దాడి చేశారన్నారు. -
‘ఉగ్రదాడి సమయంలో సీట్ల కింద దాక్కున్నాం’
జమ్మూలోని రియాసి జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికులతో నిండిన బస్సుపై శివఖోడిలో జరిగిన ఈ దాడి నుంచి వారణాసికి చెందిన అతుల్ మిశ్రా, అతని భార్య నేహా మిశ్రాలు తెలివిగా తప్పించుకున్నారు.అతుల్ మిశ్రా దంపతులు ఈ దాడి దృశ్యాలను కేవలం 10 అడుగుల దూరం నుంచి ప్రాణాలను ఉగ్గబట్టుకుని చూశారు. ఉగ్రవాదుల బుల్లెట్ల వర్షం నుంచి తప్పించుకునేందుకు బస్సు సీటు కింద దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నామని వీరు ఇతర కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే ఈ ఘటనలో వీరిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.వారణాసిలోని కాలభైరవ ప్రాంతానికి చెందిన అతుల్ మిశ్రా అతని భార్య నేహా మిశ్రాలు మాతా వైష్ణో దేవిని దర్శించుకునేందుకు జమ్మూ వెళ్లారు. ఈ ప్రమాదం అనంతరం వీరిద్దరూ వీడియో కాల్ చేసి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.ఈ దురాగతానికి పాల్పడిన పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని అతుల్ తండ్రి రాజేష్ మిశ్రా ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. కాగా అతుల్, నేహా దంపతులు తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా జూన్ ఏడున వారణాసి నుండి జమ్మూకు బయలుదేరి వెళ్లారు. వైష్ణో దేవి దర్శనం అనంతరం శివఖోడి వెళ్లి అక్కడ దైవ దర్శనం చేసుకుని, ఇతర ప్రయాణికులతో పాటు బస్సులో తిరిగి వస్తుండగా ఈ ఉగ్ర దాడి ఘటన చోటుచేసుకుంది. దాడి సమయంలో వీరు ప్రయాణిస్తున్న బస్సు కాలువలో పడింది. -
మణిపూర్ సీఎం కాన్వాయ్పై దాడి
ఇంఫాల్: మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కాన్వాయ్పై సోమవారం అనుమానిత మిలిటెంట్లు దాడి చేశారు. కాంగ్పోక్పి జిల్లాలో జాతీయ రహదారి 37 వద్ద సోమవారం ఉదయం సాయుధ ఈ ఆకస్మికంగా దాడి జరిగింది. ఈ ఘటనలో సీఎం భద్రతా సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి గాయపడ్డాడు.కాగా జూన్ 6న జిరిబామ్కు చెందిన ఓ రైతు హత్యతో అక్కడ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. గత కొన్ని రోజులుగా ఉద్రిక్తంగా మారిన ఇక్కడ పరిస్థితులను సీఎం బీరెన్ సింగ్ మంగళవారం సందర్శించేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే నేడు సీఎం కాన్వాయ్ ఇంఫాల్ నుంచి జిరిబమ్ జిల్లాకు వెళ్తున్న సమయంలో దాడి జరిగింది. సెక్యూరిటీ దళాలపై మిలిటెంట్లు పలుమార్లు ఫైరింగ్ జరిపారు. అయితే ఆ దాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టాయి.అయితే దాడి సమయంలో సీఎం సంఘటన ప్రాంతంలో లేనట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా జిరిబామ్లో వ్యక్తి హత్యతో కొందరు అరాచకవాదులు రెండు పోలీస్ అవుట్పోస్టులు, ఫారెస్టు బీట్ కార్యాలయంతోపాటు మేతీ, కుకీ తెగల వారికి చెందిన దాదాపు 70 ఇళ్లను తగలబెట్టారు. ఈ ఘటన అనంతరం మైతీ వర్గానికి చెందిన వందలాది మంది పౌరులు ఆ ప్రాంతం విడిచి వెళ్లిపోయారు. -
Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
నంద్యాల, సాక్షి: పోలింగ్ ముగియడంతో జిల్లాలో పాత పగలు భగ్గుమన్నాయి!. గత అర్ధరాత్రి ఆళ్లగడ్డలో ఒక యువకుడిపై హత్యాయత్నం జరిగింది. సదరు యువకుడ్ని టీడీపీ నేత భూమా అఖిలప్రియ దగ్గర పని చేసే బాడీగార్డుగా గుర్తించగా.. ఏవీ సుబ్బారెడ్డి మనుషులే ఈ పని చేయించి ఉంటారనే అనుమానాలు తలెత్తున్నాయి.కిందటి ఏడాది మే నెలలో జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా.. అఖిల ప్రియ వర్గీయులు కొత్తపల్లిరోడ్డులో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారు. ఆ సమయంలో నిఖిల్ ఆయనపై చేయి చేసుకున్నాడు. భూమా వర్గీయుల దాడిలో ఏవీ సుబ్బారెడ్డి నోటి నుంచి రక్తం కారింది. ఆయనను కొడుతున్నప్పుడు భూమా అఖిల ప్రియా అక్కడే ఉన్నారు. పైగా ఆమె ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులను బెదిరించడం కనిపించింది. వారిపై ఘాటు పదాలతో విరుచుకుపడ్డారామె. ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో తన తరువాతే ఇంకెవరైనా అంటూ హెచ్చరించారు. ఈ ఘటన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇరువురిని ఎన్నికలయ్యేదాకా గొడవపడొద్దని మందలించినట్లు ప్రచారం జరిగింది. కట్ చేస్తే.. ఏడాది తర్వాత నిన్న అర్ధరాత్రి ఆళ్లగడ్డలో అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్పై దాడి జరిగింది. తొలుత కారుతో నిఖిల్కు ఢీ కొట్టారు. ఆ తర్వాత అతనిపై రాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో నిఖిల్ తీవ్రంగా గాయపడగా.. నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాత పగతో సుబ్బారెడ్డి మనుషులే ఈ పని చేయించి ఉంటారని స్థానిక చర్చ నడుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై స్పందించాల్సి ఉంది. అయితే దాడికి ఉపయోగించిన వాహనం నంద్యాలకు చెందిందిగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. -
ఊరకుక్క దాడిలో చిన్నారి దుర్మరణం
తాండూరు రూరల్: దగ్గర్లోనే పనిచేస్తున్న భర్తకు మంచినీళ్లు ఇచ్చొద్దామని వెళ్లిందా తల్లి. ఇంతలోనే అంత ఘోరం జరిగిపోతుందని ఊహించలేదు. ఇంటికి తిరిగి వచ్చేసరికి తన ఐదు నెలల చిన్నారి రక్తపు మడుగులో కన్పించాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శిశువుపై ఊరకుక్క దాడి చేసింది. మెడ, కన్ను భాగంలో కరవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. వైద్యులు చికిత్సకు ఏర్పాట్లు చేస్తుండగానే బాలుడు మరణించాడు.దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మరోవైపు కోపోద్రిక్తులైన చుట్టుపక్కల ఉండే కార్మికులు కుక్కను కొట్టి చంపేశారు. మంగళవారం ఉదయం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని బసవేశ్వర్నగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. రూరల్ సీఐ అశోక్, ఎస్ఐ విఠల్రెడ్డి, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.గదిలో బాలుడు ఒంటరిగా ఉండటంతో..కర్ణాటక రాష్ట్రం రాయచూర్కు చెందిన నీలం మధు, మహబూబ్నగర్ జిల్లా వనపర్తి సమీపంలోని దుప్పల్లికి చెందిన లావణ్యల వివాహం నాలుగేళ్ల క్రితం జరిగింది. వీరికి ఐదు నెలల క్రితం సాయినాథ్ పుట్టాడు. కాగా స్టోన్ పాలిషింగ్ పనిచేసే మధు వారం క్రితమే బసవేశ్వర్నగర్లోని సంగెం కలాన్ గ్రామానికి చెందిన నాగభూషణం పాలిషింగ్ యూనిట్లో చేరాడు. సమీపంలోనే ఓ అద్దె గదిలో దంపతులు నివసిస్తున్నారు. మంగళవారం ఉదయం చిన్నారిని ఇంట్లో పడుకోబెట్టిన లావణ్య పక్కనే వంద అడుగుల దూరంలో పనిచేస్తున్న మధుకు మంచినీళ్లు ఇవ్వడానికి వెళ్లింది.బాబుకు ఉక్కపోస్తుందని, వెంటనే తిరిగొస్తాను కదా అన్న ఉద్దేశంతో గది తలుపు వేయలేదు. లావణ్య అలా బయటకు వెళ్లగానే పరిసర ప్రాంతంలో తిరుగుతున్న ఓ ఊరకుక్క ఇంట్లోకి చొరబడింది. ఒంటరిగా ఉన్న సాయినాథ్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. నాలుగేళ్లుగా సంతానం కోసం ఎదురు చూసి, ఎన్నో మొక్కులు మొక్కగా పుట్టిన ఒక్కగానొక్క కొడుకు కళ్ల ముందే చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. ‘నాన్నా లే నాన్నా’అంటూ లావణ్య రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఈ నెల 24న తిరుపతి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామని, ఇంతలోనే ఇలా జరిగిందని మధు విలపించాడు.అందరూ ఎన్నికలకు వెళ్లడంతో..సాధారణ రోజుల్లో పాలిషింగ్ యూనిట్ సమీపంలోని కార్మికుల గదుల వద్ద సందడి ఉంటుంది. అయితే ఎన్నికల నేపథ్యంలో చాలావరకు కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలకు వెళ్లడంతో పెద్దగా మనుషుల అలికిడి లేకుండాపోయింది. దీనికి తోడు మధు కుటుంబం నివాసం ఉంటున్న గది ఒక్కటే విడిగా ఉండటం, పక్కన ఇతర నివాసాలు లేకపోవడంతో కుక్క దాడి చేసేందుకు అవకాశం ఏర్పడింది. -
టీడీపీ నేతల బరితెగింపు.. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు
సాక్షి, పల్నాడు: జిల్లాలో టీడీపీ నేతలు బరి తెగించారు. తమకు ఓట్లు వేయని వారిని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని మాదల, తొండపి గ్రామాల్లో రాత్రి విధ్వంసం సృష్టించారు.గురజాల మండలం కొత్త గణేషన్ పాడులో కర్రలు రాళ్లతో వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. పోలింగ్ అనంతరం మూడు గంటల పాటు నిరంతరాయంగా దాడులు చేశారు. కొత్త గణేషన్పాడులో బీసీలపైన టీడీపీ గూండాలు దాడులు చేశారు. సీఐ స్థాయి నుంచి డీఐజీ వరకు సమాచారం ఇచ్చిన పట్టించుకోలేదు. -
పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ మూకలు
సాక్షి, పల్నాడు జిల్లా: రెంటచింతలలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. రెంటచింతల వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఉమామహేశ్వర్రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. ఉమామహేశ్వర్రెడ్డిపై ఒకేసారి 60 మందికిపైగా దాడి చేశారు.ఉమామహేశ్వర్రెడ్డి కారును టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఉమామహేశ్వర్రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.టీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు: పిన్నెల్లిటీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. దౌర్జన్యాలు, అల్లర్లతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. మహిళలపై దాడులు చేయడం సిగ్గుమాలిన చర్య. మూడు రోజుల క్రితం నా భార్యపైనా దాడి చేశారు.ఇవాళ రెంటచింతలలో మా నాయకులపై హత్యాయత్నం చేశారని పిన్నెల్లి మండిపడ్డారు. -
పాక్ నౌకాదళ ఎయిర్ స్టేషన్పై బీఎల్ఏ దాడి
పాకిస్తాన్లోని రెండవ అతిపెద్ద నౌకాదళ ఎయిర్ స్టేషన్పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) దాడికి తెగబడింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్ ఈ దాడికి పాల్పడింది. బలూచిస్థాన్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం బీఎల్ఏ ఫైటర్లు టర్బాట్లో ఉన్న పీఎన్ఎస్ సిద్ధిఖీ నేవల్ బేస్లోకి ప్రవేశించి అక్కడ పలు ప్రదేశాలలో పేలుళ్లకు పాల్పడ్డారు. నేవీ బేస్ దగ్గర అర్థరాత్రి వేళ షెల్లింగ్ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పీఎన్ఎస్ అనేది పాక్లోని రెండవ అతిపెద్ద నేవీ స్థావరం. పాకిస్తాన్ నేవీకి చెందిన ఆధునిక ఆయుధాలు ఇక్కడ నిల్వ చేస్తారు. సోమవారం రాత్రి దాడి ప్రారంభంకాగా ఇప్పటికీ కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని సమాచారం. అయితే ఈ దాడిని తాము భగ్నం చేశామని పాక్ ఏజెన్సీలు తెలిపాయి. ఈ ఉదంతంపై పాక్ ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే టర్బాట్లోని అన్ని ఆసుపత్రులలో ఎమర్జెన్సీ ప్రకటించారు. వైద్యులను అప్రమత్తం చేశారు. దీనికి ముందు జనవరి 29న గ్వాదర్లోని పాకిస్తాన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ హెడ్క్వార్టర్స్పై దాడి జరిగింది. కాగా తాజాగా టర్బాట్లో సోమవారం రాత్రి ప్రారంభమైన దాడుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు పాకిస్తాన్ భద్రతా ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. After the passage of 7 hours, the BLA Majeed Brigade still continues to hold control of the PNS Siddiqui Naval Base in #Turbat city. Firing and explosions continue, BLA fighters reportedly destroy drone operating systems at base source police pic.twitter.com/W68QW8w2os — Benjimen Baluch (@BaluchBenjimen) March 26, 2024 -
గుజరాత్ వర్సిటీలో విదేశీ విద్యార్థులపై దాడి.. ఇద్దరు అరెస్ట్
అహ్మదాబాద్: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లోని గుజరాత్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులపై కొందరు దాడికి దిగారు. క్యాంపస్లోని ఎ–బ్లాక్ హాస్టల్లో విదేశీ విద్యార్థులు కొందరు శనివారం రాత్రి నమాజ్ చేస్తుండగా ముగ్గురు విద్యార్థులు అడ్డుకున్నారు. వారికి మరో 200 మంది తోడై విధ్వంసం సృష్టించారు. రాళ్లు రువ్వడంతో శ్రీలంక, తజికిస్తాన్కు చెందిన ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు 25 మందిపై కేసులు పెట్టి ముగ్గురిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలను పునరావృతం కానివ్వబోమని వీసీ నీరజా అరుణ్ గుప్తా స్పష్టం చేశారు. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని విదేశాంగ శాఖ పేర్కొంది. -
నాదెండ్ల మనోహర్పై నీళ్ల బాటిల్తో దాడి
తెనాలి(గుంటూరు జిల్లా): పొత్తు పెట్టుకున్నప్పటికీ తెనాలిలో టీడీపీ–జనసేన నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న తీవ్ర విభేదాలు గురువారం బట్టబయలయ్యాయి. జనసేన సీనియర్ నేత, తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్పై టీడీపీ వర్గీయులు నీళ్ల బాటిల్తో దాడి చేశారు. ఈ బాటిల్ ఆయన తలకు తగిలింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గురువారం సాయంత్రం తెనాలిలో జనచైతన్య పాదయాత్ర ప్రారంభించారు. బోసు రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర వీనస్ టాకీస్ దగ్గరకు చేరుకుంది. అక్కడ టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) వచ్చి కలిశారు. ఆ వెంటనే రాజాకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పోటీగా జనసేన కార్యకర్తలు నాదెండ్ల మనోహర్ జిందాబాద్.. అంటూ నినాదాలు ప్రారంభించారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. ఈ తోపులాటలో టీడీపీ మహిళా కార్యకర్త ఒకరు ఇరుక్కుపోయారు. ఈ సమయంలో∙ఎవరో నీళ్ల బాటిల్ను నాదెండ్ల మనోహర్పైకి బలంగా విసిరారు. ఆయన తప్పుకోవాలని ప్రయత్నించినప్పటికీ తలకు తగిలింది. ఈ ఘటనతో అందరూ కంగుతిన్నారు. ఆలపాటి రాజా వర్గమే అక్కసుతో ఈ దాడికి పాల్పడిందని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆలపాటి రాజా టీడీపీ నుంచి తెనాలి టికెట్ ఆశించారని, ఆయనకు కాకుండా పొత్తుల్లో భాగంగా జనసేన నేత నాదెండ్ల మనోహర్కు ఇవ్వడంవల్లే ఈ దాడి చేశారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలతో పాదయాత్రకు వచ్చిన అనేక మంది యాత్ర పూర్తికాకుండానే వెళ్లిపోయారు. -
ఉద్రిక్తత.. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ను లాక్కెళ్లిన రైతులు
సాక్షి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంపై వేరుశెనగ రైతులు దాడి చేశారు. దీంతో అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. మార్కెట్ కమిటి ఛైర్మన్ ఛాంబర్లోకి దూసుకెళ్లిన రైతులు.. ఛైర్మన్ను కార్యాలయం నుంచి లాక్కెళ్లారు. -
సూర్యాపేట: ఉద్రిక్తత.. మాజీ ఎంపీపీ కవితపై స్థానికుల దాడి
సాక్షి, సూర్యాపేట జిల్లా: కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎంపీపీ కవితపై స్థానికులు దాడికి యత్నించారు. తమ భూమిని అక్రమంగా కబ్జా చేసి ఇళ్లు నిర్మించుకుందంటూ ఆరోపిస్తూ.. కవిత ఇంటి లోపల టెంటు వేసి నిరసన తెలిపేందుకు స్థానికులు యత్నించారు. దీంతో కవిత అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆగ్రహంతో కవిత జుట్టు పట్టుకుని స్థానికులు దాడికి దిగారు. తమ స్థలాల్ని కబ్జా చేసిన కవితపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భూమి తిరిగిచ్చేంత వరకు నిరసన తెలుపుతామని స్థానికులు అంటున్నారు. -
మంత్రి రజిని ఆఫీస్పై దాడి.. 30 మంది అరెస్ట్
గుంటూరు, సాక్షి: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీకి చెందిన గుంటూరు కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు తమ చర్యలు ప్రారంభించారు. ఈ దాడికి సంబంధించి 30 మందిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కార్యాలయంపై దాడి చేసింది టీడీపీ-జనసేన కార్యకర్తలనే పోలీసులు ధృవీకరించారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన మంత్రి విడదల రజిని కార్యాలయంపై గుర్తు తెలియని ఆగంతకులు దాడులు చేశారు. ఆఫీసుపై రాళ్ల దాడికి తెగబడడంతో పాటు ఫ్లెక్సీలను చించేసి, అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగినా.. రౌడీ మూక వెనక్కి తగ్గలేదు. చివరికి దాడికి సంబంధించి కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో ఇది టీడీపీ-జనసేన కార్యకర్తల పనిగా తేల్చారు. పచ్చమూక దాడిని తీవ్రంగా ఖండించిన మంత్రి రజిని.. బీసీ అయిన తనను దాడులతో భయపెట్టలేరన్నారు. ఓటమి భయంతో.. అధికార దాహంతోనే ఈ దాడికి పాల్పడ్డారని అన్నారామె. ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారామె. మరోవైపు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే మంత్రి రజినీ కార్యాలయంపై దాడి జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇదీ చదవండి: ఎవరున్నా విడిచిపెట్టేది లేదు: మంత్రి రజిని వార్నింగ్ -
చిత్తూరు జిల్లా: దళితులపై టీడీపీ వర్గాల దాడి
గంగవరం(చిత్తూరు జిల్లా): దళితులపై టీడీపీకి చెందిన అగ్రవర్ణాలవారు దాడులకు పాల్పడిన ఘటనలో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గురువారం మీడియా ఎదుట బాధితులు తమ ఆవేదన వెళ్లగక్కారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ మబ్బువారిపేట దళితవాడలో దాదాపు 30 ఇళ్లలో ప్రజలు నివాసం ఉంటున్నారు. వీళ్లందరికీ అధికార పార్టీ వైఎస్సార్సీపీ అంటే అమితమైన అభిమానం.దీన్ని జీర్ణించుకోలేని ఇదే గ్రామంలో టీడీపీకి చెందిన అగ్ర కులస్థులు నిత్యం కులం పేరుతో దూషించడం, అవమానించడం వంటివి పరిపాటిగా సాగిస్తున్నారు. బుధవారం రాత్రి వారు పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటుండగా.. టీడీపీకి చెందిన అల్లరిమూకలు దుర్గ, గోవర్ధన్, రాకేష్ మరి కొంతమంది అనుచరులతో వెళ్లి అక్కడ గొడవలు సృష్టించారు. ఇంతలో రవి అనే వ్యక్తి అందరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. అందరూ కలిసి అతనిపై పైశాచికంగా దాడి చేశారు. అడ్డొచ్చిన మహిళల పైనా దాడులకు పాల్పడి కులం పేరుతో దూషించినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక వైఎస్సార్సీపీ నేతలు దళితులపై దాడి విషయాన్ని ఎమ్మెల్యే వెంకటేగౌడ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎస్ఐ ప్రతాప్రెడ్డిని వివరణ కోరగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఇదీ చదవండి: మా అవినీతినే బయటపెడతారా.. మీ అంతు చూస్తాం -
ఫొటో జర్నలిస్ట్ గోపాల్పై దాడి
హైదరాబాద్: విధి నిర్వహణలో ఉన్న ఫొటో జర్నలిస్ట్ నగర గోపాల్పై దాడి చేసిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం (టీఎస్పీజేఏ) అధ్యక్షుడు అనుమళ్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శి కె.ఎన్.హరి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫొటో జర్నలిస్ట్ నగర గోపాల్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. స్వల్ప వివాదం కారణంగా మహేష్గౌడ్ అనే వ్యక్తి కర్రతో తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడిన గోపాల్ ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. గోపాల్ను సహచర ఫొటో జర్నలిస్టులతో కలసి వారు పరామర్శించారు. స్థానిక పోలీసులు నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే గోపాల్పై దాడి చేసిన మహేష్గౌడ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
బరితెగించిన టీడీపీ నేత ధూళిపాళ్ల అనుచరులు.. రైతులపై దాడి
సాక్షి, గుంటూరు జిల్లా: టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులు బరితెగించారు. సంగం డెయిరీ యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన రైతులపై దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాడ్డులతో విక్షచణారహితంగా ధూళిపాళ్ల అనుచరులు దాడి చేశారు. దాడిలో పలువురు రైతులు గాయపడ్డారు. ధూళిపాళ్ల నరేంద్ర డైరెక్షన్లోనే ఈ దాడి జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. పాలు పోయించుకుని బోనస్ ఇస్తామంటూ సంగం డెయిరీ యాజమాన్యం మోసానికి తెరతీసింది. ఇది అన్యాయం అంటూ అడగడానికి వచ్చిన ఏలూరు జిల్లా రైతులపై దాడికి పాల్పడ్డారు. చదవండి: చంద్రబాబు మెడికల్ రిపోర్ట్ ఇచ్చింది వైద్యులా? రాజకీయ నేతలా?: సజ్జల -
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నం
సాక్షి, సిద్దిపేట: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. కత్తితో ఓ వ్యక్తి ఆయనపై దాడి చేయగా.. కడుపులో గాయం అయ్యింది. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. సూరంపల్లి ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మెదక్ లోక్సభ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్రెడ్డి.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఈ క్రమంలో దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. కత్తితో దాడి చేసిన నిందితుడ్ని బీఆర్ఎస్ కార్యకర్తలు చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడ్ని మిరుదొడ్డి మండలం చెప్పాల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. హుటాహుటిన బయల్దేరిన హరీష్రావు కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి సంగతి తెలియగానే మంత్రి హరీష్రావు ఫోన్లో పరామర్శించారు. మెదక్ హుటాహుటిన బయల్దేరారు. అవసరం అయితే హైదరాబాద్ కు తీసుకురావాలని బీఆర్ఎస్ నేతలకు హరీష్రావు సూచించారు. -
ఏలూరు: లోకేష్ యాత్రలో రెచ్చిపోయిన టీడీపీ రౌడీలు
సాక్షి, ఏలూరు: లోకేష్ పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. తుక్కులూరులో విధ్వంసానికి యత్నించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్ల దగ్గర రెచ్చగొట్టే చర్యలకు దిగిన టీడీపీ శ్రేణులు.. వైఎస్సార్సీపీ నేత విజయ్ ఇంటిపై రాళ్లు రువ్వారు. దీంతో ఇంటి అద్దాలు ధ్వంసం కాగా, వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. టీడీపీ అరాచకాలను చిత్రీకరిస్తున్న మీడియాపై కూడా దాడులకు తెగబడ్డారు. మీడియా ప్రతినిధుల ఫోన్లను సైతం లోకేష్ యువగళం టీమ్ లాక్కొంది. అడ్డుగా వెళ్లిన రూరల్ కానిస్టేబుల్పై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. చదవండి: ఆర్జీవీ థర్డ్ గ్రేడ్ అంటూ లోకేశ్ వ్యాఖ్యలు.. రివర్స్ కౌంటర్ ఇచ్చిన వర్మ -
ఎంపీ ఇంటిపైనే రాళ్ల దాడి జరిగితే సామాన్యుడి పరిస్థితేంటి?
సాక్షి, హైదరాబాద్: నాలుగు పర్యాయాలు ఎంపీ అయిన తన ఇంటిపైనే రాళ్ల దాడి జరిగితే.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్ దార్సుసలాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలోని తన ఇంటిపై రాళ్ల దాడి జరగడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఒక వైపు ముస్లింల ఇళ్లపై బుల్డోజర్లు ప్రయోగిస్తూనే, మరోవైపు ఎంపీ ఇంటిపై రాళ్లు రువ్వుతున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్లతో కూల్చివేతలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా రాళ్ల దాడులకు, తాటాకు చప్పుళ్లకు భయపడేదిలేదన్నారు. ఇలాంటి ఘటన బీజేపీ నేత ఇంటిపై జరిగితే స్పందన మరోలా ఉండేదని ఒవైసీ అన్నారు. దేశంలో జరుగుతున్న హింసాకాండపై ప్రధాని మోదీ నోరు మెదపడం లేదని, కనీసం స్వాత్రంత్య్ర దినోత్సవ ప్రసంగంలోనైనా స్పందిస్తారా? కనీసం ఖండిస్తారా? అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ఎక్కడ ఉంది? అంటూ నిలదీశారు. -
తన్నులు తిన్న మహిళాపైలట్పై చర్యలు
ఢిల్లీ: ఇండిగోకు చెందిన ఓ మహిళా పైలట్ను, ఆమె భర్తను కొందరు చితకబాదిన వీడియో నిన్నంతా విపరీతంగా వైరల్ అయ్యింది. తమ ఇంట్లో పని చేసే పదేళ్ల చిన్నారిని వేధిస్తున్నారని, శారీరకంగా గాయపర్చానే కారణంతో ఆ చిన్నారి బంధువులే ఆ పని చేశారు. అయితే.. ఈ ఘటన వైరల్ కావడంతో ఇండిగో ఎయిర్లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. సదరు పైలట్ను విధుల నుంచి పక్కనపెడుతున్నట్లు ప్రకటించింది. సదరు ఘటనపై దర్యాప్తు నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఢిల్లీ ద్వారకా ప్రాంతంలో తాజాగా ఇది చోటు చేసుకుంది. రెండు నెలలుగా ఆ చిన్నారిని వాళ్లు వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె భర్త కూడా అదే ఎయిర్లైన్స్లో పని చేస్తుండగా.. ఆయన విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఇదిలా ఉంటే.. ద్వారకా పోలీస్ స్టేషన్లో ఆ జంటపై కేసు నమోదు అయ్యింది. Injuries of the minor that she was beaten and brunt by the couple pic.twitter.com/jYVwWzbfTx — । अतुल । (@atulamist7) July 19, 2023 ఇదీ చదవండి: సెల్ఫోన్ వాడుతోందని తిడితే.. జలపాతంలో దూకింది -
స్పైడర్ మ్యాన్ ను పట్టుకొని చితక్కొట్టేశారు..
న్యూయార్క్: 15 ఏళ్ల అమెరికా టీనేజర్ స్పైడర్ మ్యాన్ వేషధారణలో పార్కుకు వెళ్తే అక్కడి ఆకతాయి యువత బాలుడిని ఎగతాళి చేసి గాయపరిచారు. పాపం స్పైడర్ మ్యాన్ కు ముక్కు నుండి రక్తం ధారకట్టడంతో నిస్సహాయంగా నిలుచుండిపోయాడు. వారు దాడి చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. హడ్సన్ ఫాల్స్ కు చెందిన 15 ఏళ్ల అయిడిన్ పెడోన్ న్యూయార్క్ లోని ఒక పార్కు వారు నిర్వహించిన సూపర్ హీరో థీమ్ లో పాల్గొనేందుకు తనకు ఇష్టమైన స్పైడర్ మ్యాన్ గెటప్ వేసుకుని పార్కుకి వెళ్ళాడు. అంతలోనే అక్కడికి వచ్చిన కొంతమంది టీనేజర్లు అయిడిన్ చుట్టూ చేసిరి మొదట ఎగతాళి చేశారు. ఆ గుంపులోని ఒక అమ్మాయి అయిడిన్ ముఖంపై బలంగా కొట్టింది. దాంతో తూలిపడబోయిన అయిడిన్ ఆపుకుని స్పైడర్ మ్యాన్ మాస్క్ తొలగించగా ముక్కు మీద తీవ్ర గాయం కావడంతో రక్తం బొటబొటా కారింది. ఈ సంఘటన జరుగుతుండగా పార్కులో మిగతావారు ఫోన్లో ఈ సన్నివేశాన్ని వీడియో తీస్తూ కనిపించడం విశేషం. This is actually disgusting… I hope there were consequences for what they did to that poor boy pic.twitter.com/vQ2hHEDcU4 — FadeHubb (@FadeHubb) July 1, 2023 స్థానిక మీడియా న్యూయార్క్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం అయిడిన్ చికిత్స పొందుతున్నాడని, గో ఫండ్ మి అనే పేజీ ప్రతినిధులు మరోసారి అయిడిన్ ఇలా దెబ్బలు తినకుండా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి చందాలు వసూలు చేయగా ఇప్పటికి 10,000 యూఎస్ డాలర్లు( రూ 8.21 లక్షలు) పోగయ్యాయని అన్నారు. ఆరో తరగతి చదువుతున్న అయిడిన్ కు ఆత్మన్యూనతా భావం ఎక్కువని, స్కూల్లో తరచుగా సహచరులు తనని ఆటపట్టిస్తూ ఉండటంతో ఆ భావం నుండి బయటపడేందుకు ఆదివారం తనకు ఇష్టమైన స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకున్నాడని, తీరా అక్కడ ఇలా జరగడం అమానుషమని అన్నారు. చుట్టూ ఉన్నవారు దాడిని ఆపకపోగా వీడియోలు తీస్తూ నవ్వుతుండడం మరింత బాధించిందని తెలిపారు. అయిడిన్ తల్లి ఫిర్యాదు మేరకు హడ్సన్ ఫాల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దాడి చేసిన టీనేజ్ అమ్మాయిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇది కూడా చదవండి: Roller Coaster: తలకిందులుగా వేలాడుతూ.. 3 గంటలు నరకయాతన.. -
హాయ్ చెప్పినందుకు చితక్కొట్టారు..
సాక్షి, కరీంనగర్: మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు ఓ యువకుడిని చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాంత్ అనే వ్యక్తి కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ఉన్న లక్కీ బార్కు వెళ్లాడు. అక్కడ అప్పటికే మద్యం సేవిస్తున్న మరో నలుగురు ఫ్రెండ్స్ ఉండగా.. శ్రీకాంత్ హాయ్ చెప్పాడు. అయితే, శ్రీకాంత్ వెటకారంగా నమస్తే చెప్పినట్టు భావించిన ఆ నలుగురు ఫ్రెండ్స్ అప్పటికే మద్యం మత్తులో కూడా ఉండటంతో.. బార్ లోనే శ్రీకాంత్ పై దాడికి పాల్పడ్డారు. నలుగురు కలిసి విచక్షణారహితంగా దాడికి పాల్పడటంతో.. శ్రీకాంత్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సీసీ కెమెరా ఫుటేజీ కూడా పోలీసులు పరిశీలించారు. బాధితుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: హైదరాబాద్లో మహిళా టీచర్ మిస్సింగ్.. అసలేం జరిగింది? -
ఈ యువతికి ఏనుగు ఎలా జలక్ ఇచ్చిందో చూడండి!
-
యూఎస్ కాన్సులేట్ వెలుపల ‘వందేమాతరం’ నినాదాల హోరు!
ఖలిస్తాన్ మద్దతుదారులు యూకేలోని భారత్ హైకమిషన్పై దాడి చేసిన ఘటన మరువ మునుపే సుమారు రెండు వేల మంది వేర్పాటు వాదులు భవంతి సమీపంలో నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర నిరసనను తెలియజేస్తూ..తగిన చర్యలను తీసుకోవాలని యూకేని కోరింది. దీంతో అప్రమత్తమైన లండన్ పోలీసులు వేర్పాటువాదుల దాడి యత్నాన్ని విఫలం చేశారు. ఈ నేపథ్యంలో ఖలిస్తాన్ మద్దతుదారులకు ప్రతిస్పందనగా అమెరికాలోని శాన్ ప్రావిన్స్స్కోలో భారత హైకమిషన్ వెలుపల భారతీయుల బృందం జాతీయ జెండాను, యూఎస్ జెండాను పట్టుకుని ఊపుతూ..వందేమాతరం, భారత్మాతాకీ జై అని నినాదాలు చేశారు. మరోవైపు ధోల్ దరువులు కూడా మారుమ్రోగాయి. అదేసమయంలో కొంతమంది నిరసనకారులు దూరంగా ఖలిస్తాన్ జెండాలను ఊపుతూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. కాగా, శాన్ప్రాన్సిస్కోలో భారతీయ కాన్సులేట్పై ఒక గుంపు దాడి చేసి భవనం వెలుపల గోడపై ఫ్రీ అమృత్పాల్ అని రాసి భారీ గ్రాఫిటీని స్ప్రే చేసిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగడం గమనార్హం. అంతేగాదు అంతకుమునుపు యూఎస్లోని భారత్ హైకమిషన్ వెలుపల ఖలిస్తానీ మద్దతుదారులు భారత్ జెండాను తొలగించారు ప్రతిగా పెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సంగతి తెలిసింది. అలాగే భారత్ దీనిపై తీవ్రంగా నిరసించడమే గాక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా ఒక ప్రకటనలో యూఎస్ని కోరింది. #WATCH | United States: Indians gather outside the Indian consulate in San Francisco in support of India's unity pic.twitter.com/tuLxMBV3q0 — ANI (@ANI) March 25, 2023 (చదవండి: ప్రకంపనలు రేపుతున్న ఉత్తర కొరియా ప్రకటన.. సునామీని పుట్టించే..) -
ఇండియన్ కాన్సులేట్పై ఖలిస్తాన్ మద్దతుదారుల దాడి
న్యూఢిల్లీ: ఖలీస్తాన్ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. అమృత్పాల్ సింగ్ అరెస్టును వ్యతిరేకిస్తూ.. విదేశాల్లో భారత సంబంధిత దౌత్యపరమైన కార్యాలయాలపై వరుస దాడులకు తెగబడుతున్నారు. లండన్లో భారత హైకమిషన్ భవనం వద్ద భారతీయ జెండాను కిందకు లాగి అవమానపరిచే యత్నం మరిచిపోకముందే.. తాజాగా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్పై దాడికి పాల్పడ్డారు. పంజాబ్లో ఖలీస్తాన్ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్ను.. సినీ ఫక్కీ ఛేజ్ తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం అంతర్జాతీయంగా ప్రభావం చూపెడుతోంది. ఖలిస్తాన్ మద్దతుదారులు భారత దౌతకార్యాలయాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆదివారం లండన్లోని భారతీయ హైకమిషన్ భవనం వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. భారతీయ జెండాను కిందకు దించి.. ఖలీస్తానీ జెండాను ఎగరేసే యత్నం చేశారు. అయితే.. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ.. ఆ దేశపు దౌత్యవేత్తలకు వివరణ కోరుతూ సమన్లు సైతం జారీ చేసింది. అయితే.. తాజాగా శాన్ ఫ్రొన్సిస్కో(యూఎస్ స్టేట్ కాలిఫోర్నియా)లోని ఇండియన్ కాన్సులేట్ భవనంపై దాడి జరిగింది. గుంపుగా వచ్చిన కొందరు దాడికి పాల్పడడంతో పాటు అక్కడి గోడలపై ఫ్రీ అమృత్పాల్(అమృత్పాల్ను విడుదల చేయాలి) అంటూ రాతలు రాశారు. ఆ సమయంలో బ్యాక్గ్రౌండ్లో పంజాబీ సంగీతం భారీ శబ్ధంతో వినిపిస్తోంది. దాడికి పాల్పడిన దుండగుల్లోనే కొందరు వీడియోలు తీయడం విశేషం ఇక్కడ. ఈ పరిణామంపై అదనపు సమాచారం అందాల్సి ఉంది. After London, now San Francisco - Indian consulate in San Francisco is attacked by Khalistan supporters. For Modi’s security, Rs 584 crores spent every year, but India’s diplomatic missions are left unsecured. pic.twitter.com/scJ9rKcazW — Ashok Swain (@ashoswai) March 20, 2023 ఇదీ చదవండి: త్రివర్ణ పతాకాన్ని అవమానం నుంచి కాపాడారు! -
Hyd: సీసీటీవీలో అసభ్యప్రవర్తన.. చితకబాదేశారు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎస్సార్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న ఓ బాలికను వేధింపులు గురిచేశాడు ఓ యువకుడు. దీంతో ఆగ్రహానికి గురైన బాలిక బంధువులు అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. బాలికతో సదరు యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. బాధితురాలు విషయం చెప్పడంతో.. సీసీటీవీలను పరిశీలించి నిందితుడిని గుర్తించారు ఆమె బంధువులు. ఆపై వేధింపులపై అతన్ని నిలదీస్తూ.. చితకబాదారు. చివరకు పోలీసులకు అప్పగించారు. -
సింగర్ సోనూ నిగమ్పై ముంబైలో దాడి
-
యూత్ కాంగ్రెస్ నేతపై దాడి.. రేవంత్ యాత్ర ముగిసిన కొద్దిసేపటికే..
వరంగల్ : హనుమకొండలో సోమవారం రాత్రి కాంగ్రెస్ యువజన నాయకుడు తోట పవన్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా బహిరంగసభ ముగిసిన కొన్ని నిమిషాలకే సభావేదికకు వంద మీటర్ల దూరంలోనే ఈ దాడి జరిగింది. ముక్కు, కుడి కన్ను భాగంలో బలమైన గాయాలయ్యాయి. వీపుపై వాతలు తేలాయి. రక్తపుమడుగులో ఉన్న పవన్ను స్థానికులు గమనించి హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. డీసీసీ నేత నాయిని రాజేందర్రెడ్డి ఆస్పత్రి వద్ద మాట్లాడుతూ పవన్పై బీఆర్ఎస్ కార్యకర్తలే దాడి చేశారని ఆరోపించారు. ప్లకార్డులతో నిరసన..: రేవంత్రెడ్డి యాత్ర సమయంలో హనుమకొండలోని బాలసముద్రం అంబేడ్కర్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను పేదలకు పంచాలని తోట పవన్ డిమాండ్ చేస్తూ స్థానికులతో కలిసి ప్రదర్శన చేపట్టారు. ఆ తరువాత రేవంత్ బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీని ప్రదర్శించారు. ఆ సభ ముగియగానే ఈ దాడి జరిగింది. -
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ నివాసంపై దుండగుల దాడి
సాక్షి, ఢిల్లీ: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ నివాసంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. రాజస్థాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లకముందే ఈ దాడి జరిగింది. ఘటనాస్థలంలో ఆధారాలను ఫోరెన్సిక్ సేకరించింది. ఘటనపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటివరకు ఢిల్లీలో నాలుగుసార్లు దుండగులు దాడికి పాల్పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటిపై రాళ్లు విసిరారని అసదుద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు అసదుద్దీన్ ఇంటిపై నాలుగు సార్లు దాడి జరిగింది. కాగా, ఒవైసీ రెండు రోజుల రాజస్థాన్ పర్యటనలో ఉన్నారు. అక్కడ ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ ప్రచారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.. చదవండి: రింగ్ మాస్టర్కు ఝలక్.. నువ్వు లక్కీఫెలో భయ్యా! -
దళిత మహిళ ఆదిలక్ష్మిపై పరిటాల సునిత వర్గీయుల దాడి
-
అనంత: టీడీపీ నేతల దౌర్జన్యకాండ.. మహిళపై సునీత వర్గీయుల దాడి
సాక్షి, అనంతపురం: జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ దళితురాలిపై పరిటాల సునీత వర్గీయులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమెను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు బంధువులు. ఈ దాడిలో గాయపడిన ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పరిటాల వర్గీయులు తనను వేధిస్తన్నారని, వాళ్ల నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఆదిలక్ష్మి చెబుతోంది. అంతేకాదు బాధితురాలు గత నెలలో పరిటాల సునీతకు తన సమస్య చెప్పే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకుండా పోయిందని చెబుతోందామె. -
వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దేవినేని ఉమా అనుచరుల దాడి
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు మండలం గంగినేనిపాలెంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై టీడీపీ నేత దేవినేని ఉమా అనుచరులు దాడికి పాల్పడ్డారు. సర్పంచ్ రామారావు, ఎంపీటీసీ ప్రసాద్పై దాడికి టీడీపీ నేతలు యత్నించారు. అడ్డుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్రగాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. టీడీపీ నేతల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. -
చిత్తూరు: పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల బరితెగింపు
-
మహిళతో వివాహేతర సంబంధం.. సెల్ఫోన్ చార్జర్ వైర్తో ఆమె పిల్లలపై..
ఆటోనగర్ (విజయవాడతూర్పు): మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమె పిల్లలపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో చిన్నారులు సుధాకర్ (11), యేసు (5) గాయాలపాలయ్యారు. పటమట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదాల దైవకృప జ్యోతి (శ్రావణి) వెంకన్నకు 13 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరు కృష్ణా జిల్లా కెంపల్లి కొత్తగూడెంలో ఉండేవారు. వీరిద్దరూ రెండేళ్ల క్రితం విడిపోయారు. శ్రావణి ప్రస్తుతం భారతినగర్లో నివాసముంటూ నగరంలోని ప్రముఖ హోటల్లో పని చేస్తుంది. అక్కడే పని చేస్తున్న రఘువర్మతో పరిచయం ఏర్పడటంతో ఆరు మాసాలుగా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం నడుస్తుంది. సరిగా చదవడం లేదనే సాకుతో రఘువర్మ సుధాకర్, యేసును సెల్ఫోన్ చార్జర్ వైర్తో కొట్టడంతో పిల్లల వీపులపై వాతలు వచ్చాయి. దీంతో శ్రావణి పటమట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పిల్లలను చైల్డ్లైన్కు తరలించారు. రఘువర్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఘట్కేసర్: కాలేజీ వాట్సాప్ గ్రూపుల్లో బీటెక్ స్టూడెంట్స్ ఫేక్ న్యూడ్ ఫొటోలు.. -
Rajouri: హిందువులపై దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం
శ్రీనగర్: రెండు రోజుల వ్యవధిలో జరిగిన ఉగ్రదాడులు.. ఆరుగురి దుర్మరణం.. ఇందులో ఇద్దరు చిన్నారులు.. పదుల సంఖ్యలో గాయపడడంతో సరిహద్దు జిల్లా రాజౌరిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. హిందూ కుటుంబాలనే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చెలరేగిపోతుండడంతో.. భద్రతాపరంగా అధికార యంత్రాంగం వైఫల్యం చెందుతోందని స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాజౌరి జిల్లాలో భారీగా పారామిలిటరీ ట్రూప్స్ను మోహరిస్తోంది కేంద్ర హోం మంత్రిత్వశాఖ. ఇప్పటికే సీఆర్పీఎఫ్ తరపున 18వేల సిబ్బంది రంగంలోకి దిగారు. గత మూడు రోజులుగా వందల సంఖ్యలో బలగాలు రాజౌరీలో మోహరించగా.. మరికొన్ని కంపెనీలు జమ్ముకి బయల్దేరాయి. దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల ఎరివేతే లక్ష్యంగా సైన్యం, స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్తో కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. జమ్ము కశ్మీర్లో ఇప్పటికే సీఆర్ఎఫ్ బలగాలు ఉనికి భారీగా ఉంది. డెబ్భైకి పైగా బెటాలియన్లు(మొత్తం సీఆర్ఎఫ్ బలగాల సామర్థ్యంలో 3వ వంతు) జమ్ము కశ్మీర్లోనే భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. ఇక రాజౌరి జిల్లా ఉప్పర్ డాంగ్రీ గ్రామంలో.. ఆదివారం సాయంత్రం ఇద్దరు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. ఆ మరుసటి రోజే ఉగ్రవాదుల కోసం కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు పాతిన ఐఈడీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులను చనిపోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. నెల వ్యవధిలో ఇది మూడో ఉగ్రదాడి ఘటన. గత నెలలో ఆర్మీ క్యాంప్ సమీపంలోనే ఇద్దరిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. హిందూ కుటుంబాల నివాసాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతుండడంతో.. చాలా మంది అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధికారులు భద్రతకు తమది హామీ అని ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. -
Viral Video: సరదాకి గెలికాడు.. దెబ్బకు దూలతీర్చేసిందిగా..
-
అర్థరాత్రి షాకింగ్ ఘటన.. దంపతులపై దాడి.. మహిళను కారు ఎక్కాలంటూ..
జహీరాబాద్(సంగారెడ్డి జిల్లా): అర్ధరాత్రి దంపతులు బస్సుదిగి నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో యువకులు దాడి చేసిన వీడియో వైరల్గా మారింది. ఆదివారం రాత్రి పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన దంపతులు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో బస్టాండ్లో బస్సుదిగి కాలినడకన తమ ఇంటికి వెళుతున్నాడు. ఈ క్రమంలో యువకులు వారిని అనుకరిస్తూ బ్లాక్రోడ్డులో అటకాయించారు. కారులో ఎక్కాలంటూ మహిళపై దాడి చేయగా, ఆమె కేకలు వేసిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. యువకులు తాగిన మైకంలో వారిని అటకాయించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఎస్ఐ శ్రీకాంత్ను వివరణ కోరగా దంపతులపై జరిగిన జరిగిన దాడిపై ఫిర్యాదు అందిందని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో నిందితులను అరెస్ట్చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. చదవండి: ఇలా కూడా పగ తీర్చుకోవచ్చా..! -
ఎంబీబీఎస్ విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో దాడి చేసిన జ్ఞానేశ్వర్
-
పశువుల కాపరి పై దాడి చేసిన పులి..
-
చిలుకలన్నీ కలిసి పాము పై దాడి..
-
FRO పై దాడి చేసిన గొత్తికోయల గ్రామ బహిష్కరణ
-
హేయనీయం: ‘పైసలొద్దు.. నన్ను వదిలేయండయ్యా!’
క్రైమ్: పని చేసి.. దానికి ప్రతిఫలం అడిగిన ఓ వ్యక్తిని కులం పేరుతో దూషించడమే కాదు.. అతనిపై దాష్టికానికి పాల్పడ్డారు కొందరు. వద్దని వేడుకుంటున్నా వినిపించుకోకుండా ఆ వ్యవహారమంతా వీడియో తీసి.. సోషల్ మీడియా ద్వారా వైరల్ చేశారు. ఓ దళితుడిని కులం పేరిట దూషించడమే కాదు.. అతనిపై దాడికి దిగారు. అక్కడితో ఆగకుండా అతనితో బలవంతంగా వాళ్ల మూత్రం తాగించి, మెడలో చెప్పుల దండ వేశారు. నవంబర్ 23వ తేదీన రాజస్థాన్ సిరోహిలో హేయనీయమైన ఈ ఘటన చోటు చేసుకుంది. భరత్ కుమార్ అనే వ్యక్తి స్థానికంగా నగరంలో ఎలక్ట్రిషియన్గా పని చేస్తున్నాడు. ఓ దాబాలో కరెంట్ వైరింగ్ పని చేసి.. రూ. 21వేలు బిల్లుగా వేశాడు. కానీ, ఆ దాబా ఓనర్ ఐదు వేలు మాత్రమే చెల్లించి.. మిగతా పేమెంట్ కోసం భరత్ను చాలాసార్లు తిప్పించుకున్నాడు. సహనం కోల్పోయిన భరత్ ఓ రాత్రి.. దాబా వద్దకు వెళ్లి మిగతా డబ్బు ఇవ్వాలని గట్టిగా నిలదీశాడు. దీంతో.. కోపంతో ఆ దాబా ఓనర్, అతని మరో ఇద్దరు స్నేహితులు కలిసి భరత్పై దాడి చేశారు. వద్దని వేడుకున్నా.. అతనిపై వికృత చేష్టలకు పాల్పడి వీడియోలు తీశారు. తనకు డబ్బులు వద్దని, వదిలేయాలంటూ బతిమాలుకున్నాడు. కులం పేరుతో అతన్ని దూషిస్తూ తమ మూత్రం తాగించారు ఆ ముగ్గురు. ఆపై తమ చెప్పులను దండగా చేసి అతని మెడలో వేశారు. ఐదు గంటలపాటు సాగింది వాళ్ల దాడి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాళ్లు.. భరత్ కేకలు విని కూడా పట్టనట్లు వెళ్లిపోయారు. ఆపై నిందితులు ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అది చూసి అవమానం భరించలేక పోలీసులను ఆశ్రయించాడు భరత్. దీంతో అట్రాసిటీ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. Video Credits: First India News -
భద్రాద్రి: గుత్తికోయల దాడి.. ఫారెస్ట్ రేంజర్ మృతి
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: కలకలం సృష్టించిన గుత్తి కోయల దాడి ఘటనలో ఫారెస్ట్ అధికారి మృతి చెందారు. పోడు భూములకు సంబంధించి గుత్తికోయలకు , ఫారెస్ట్ అధికారులకు మధ్య మంగళవారం గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడ్డ ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. చంద్రుగొండ మండలం బెండలపాడులో మంగళవారం ఈ దాడి ఘటన చోటు చేసుకుంది. ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ను వెంటాడి మొదటి కర్రతో దాడి చేశారు. కిందపడిపోయిన తర్వాత వేట కొడవళ్లు, గొడ్డళ్లతో దాడి చేశారు. ఘటన గురించి తెలిసిన వెంట హుటాహుటిన చండ్రుగొండ చేరుకున్నారు డీఎస్పీ వెంకటేశ్వరబాబు, సీఐ వసంత్ కుమార్లు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతోన్న శ్రీనివాస్ను చంద్రుగొండ పిహెచ్సీకి తరలించారు. పరిస్తితి విషమించడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. గత కొంతకాలంగా ఫారెస్ట్ అధికారులకు, ఆదివాసులకు మధ్య పోడు భూముల విషయంలో వరుసగా జరుగుతున్న వివాదాలు ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. బెండలపాడు సమీపంలోని ఎర్రబొడు అటవీప్రాంతంలో గుత్తికోయలు పోడు వ్యవసాయం చేసుకుంటున్న భూముల్లో గతంలో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటారు. ఈ నాటిన మొక్కల్ని తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో పలుమార్లు ఫారెస్ట్ అధికారులకు, పోడు రైతులకు మధ్య గొడవ కూడా జరిగింది. గతంలో లాఠీఛార్జ్ సైతం చేశారు. తాజాగా ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ మళ్లీ భూముల్లో అధికారులను నాటిన మొక్కల్ని ధ్వంసం చేశారు గుత్తికోయలు. దానిని అడ్డుకునే క్రమంలో అధికారులు, గుత్తి కోయలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావుపై వేట కొడవళ్లతో దాడి చేశారు. -
కోనసీమ జిల్లా: అంకంపాలెంలో మహిళలపై తేనెటీగల దాడి
-
దాడి జరిగినా లెక్కచేయని సూపర్ స్టార్ కృష్ణ.. కంటికి కట్టుతో.. 1985లో ఏం జరిగిందంటే?
కర్నూలు కల్చరల్: సినీ హీరో సూపర్స్టార్ కృష్ణకు జిల్లాతో ఆత్మీయ అనుబంధం ఉంది. నంద్యాల సమీపంలోని ఫారెస్ట్లో రైల్వే వంతెనపై నిర్వహించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం షూటింగ్లో పాల్గొన్నాడు. 1985లో కృష్ణ కాంగ్రెస్ తరపున జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చదవండి: హార్సిలీ హిల్స్తో సూపర్స్టార్ కృష్ణకు విడదీయరాని అనుబంధం నంద్యాలలో ఎన్నికల ప్రచారం ముగించుకొని రాత్రి 11 గంటల సమయంలో కర్నూలు చేరుకుంటుండగా నంద్యాల చెక్ పోస్ట్ సమీపంలో టీడీపీ శ్రేణులు రాళ్ల దాడి చేశారు. దాడిలో కృష్ణ కంటికి గాయమైంది. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి లో చికిత్స చేయించుకొని(కంటికి కట్టుతో) ఎస్టీబీసీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అర్ధరాత్రి అయినా అభిమానులు ఆయనను చూసేందుకు అలాగే వేచి ఉండటం ఆయన మంచి తనానికి నిదర్శనం. అలాగే బంగారుపేటలో నివాసం ఉండే బాబ్జి.. కృష్ణకు వీరాభిమాని, మంచి మిత్రుడు. ఆయన నివాసానికి విజయ నిర్మలతో కృష్ణ తరచూ వచ్చి పోయేవారు. ప్రస్తుతం ఆనంద్ థియేటర్ ఉన్న ప్రాంతంలో బాబ్జి ఏర్పాటు చేసిన రైస్మిల్ను కృష్ణ దంపతులు ప్రారంభించారు. కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సాయిబాబా థియేటర్లో, పండంటి కాపురం నేతాజీ థియేటర్లో, పాడిపంటలు విక్టరీ థియేటర్లో, ఊరికి మొనగాడు శ్రీరామ థియేటర్లో వంద రోజులు ఆడాయి. అభిమానులు విజయోత్సవ సభలు ఘనంగా నిర్వహించారు. కృష్ణ అభిమానుల సంఘానికి చెందిన నాయకులు బుధవార పేటకు చెందిన కుమార్, శేఖర్లు కృష్ణ సినిమా విడుదలైన ప్రతిసారి చెన్నై, హైదరాబాద్ వెళ్లి ఆయనకు కలిసి వచ్చేవారు. కృష్ణ మృతి పట్ల టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, కార్యదర్శి మహమ్మద్ మి య్యా, ఉపాధ్యక్షులు ఇనాయతుల్లా, ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్వీ మోహన్రెడ్డి, కార్యాధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, కర్నూలు రంగ స్థల కళాకారుల సంక్షేమ సంఘం నాయకులు బైలుప్పల షఫీ తదితరులు సంతాపం ప్రకటించారు. సినిమా రంగంలో సరికొత్త పోకడలకు నాంది పలికిన మహా నటుడు కృష్ణ అని అభిప్రాయపడ్డారు. -
IBS ర్యాగింగ్ కేసులో వెలుగు చూస్తున్న మరిన్ని నిజాలు
-
ఎమ్మెల్యే రసమయి కాన్వాయ్ పై యువకుల దాడి
-
హిజ్రాపై దాష్టికం.. జట్టు కత్తిరించి చిత్రవధ చేస్తూ..
చెన్నై: హిజ్రాపై దారుణానికి తెగబడ్డ ఇద్దరు యువకులను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు పోలీసులు. ఓ హిజ్రాను పొలంలో చీర చించేసి.., జుట్టు కత్తిరించి.. చిత్రవధ చేస్తూ హింసించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమిళనాడు ట్యూటికోరిన్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 19 సెకండ్ల నిడివి ఉన్న వీడియోలో.. బ్లేడ్తో హిజ్రా జుట్టును కోసేసి పొలంలో పడేశారు. ఆమె ముఖం దాడి మూలంగా ఛిద్రమైనట్లు కనిపిస్తోంది. ఆ పక్కనే మరో హిజ్రా ఉండగా.. దాడికి పాల్పడ్డ ఇద్దరు యువకులు ‘‘వీళ్లను చూడండి. ఇంతకాలం మగవాళ్ల నుంచి డబ్బు దోచుకున్నారు. ఇప్పుడు మనమేం చేయాలి? అంతా అయిపోయింది. వీళ్లేం అందంగా కనిపించడం లేదు కదా’’ అంటూ గట్టిగట్టిగా అరిచారు. Couple of trans women attacked by this goons @tnpoliceoffl @CityTirunelveli @TUTICORINPOLICE @sivagangapolice @mducollector @maduraipolice .Break your silence pic.twitter.com/HHwGuTJtI2 — GRACE BANU (@thirunangai) October 12, 2022 మరో వీడియోలో హిజ్రాలు నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు వైరల్ అయ్యింది. హిజ్రా హక్కుల ఉద్యమకారిణి గ్రేస్ బాను ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై తమిళనాడు సౌత్ జోన్ పోలీసులు స్పందించారు. నిందితులను నోవాహ్, విజయ్గా నిర్ధారించారు. ఆ ఇద్దరికి వీడియోలో ఉన్న హిజ్రాలు బాగా తెలుసని, వాళ్లలో ఓ జంటకు సంబంధం కూడా ఉందని, కానీ, విడిపోవడంతోనే ఇలా దాడి జరిగి ఉంటుందని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు. ఇదీ చదవండి: ఈరోజుల్లో ఇంత నిజాయితీగా బతుకుతున్నారా? -
ప్రేమించలేదని ప్రాణం తీసాడు...
-
ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు
-
అరేయ్.. ఏం మనుషులు రా మీరు!
బెంగళూరు: రోడ్డున పోతుంటే.. తమను చూసి మొరిగిందని ఓ శునకంపై దారుణానికి తెగబడ్డారు ఇద్దరు. దాని మెడకు ఉన్న చెయిన్తో ముందరి కాళ్లను బంధించి.. దుడ్డు కర్రలతో విచక్షణారహితంగా చితకబాదారు. ఆ దెబ్బలు తాళలేక బాధతో అది మూలుగుతున్నా.. అడ్డుకునేందుకు చుట్టు పక్కలవాళ్లు ప్రయత్నించినా.. ఆ మూర్ఖుల తగ్గలేదు. ఈ ఘటనను వీడియో తీసేందుకు యత్నించిన వాళ్లను సైతం తోసేసి.. ఆ మూగజీవిపై దాడి చేశారు. ఇంతలో ఓనర్ అక్కడికి చేరుకుని నిలదీయడంతో.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈస్ట్ బెంగళూరు కేఆర్ పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని మంజునాథ లేఅవుట్లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆ శునకాన్ని.. యజమాని వెటర్నరీ హాస్పిటల్లో చేర్పించినట్లు తెలుస్తోంది. ఇక వీడియో ఆధారంగా కేసు నమోదు చేయాలని బెంగళూరు పోలీసులు నిర్ణయించారు. ఓనర్ను సంప్రదించగా ఫిర్యాదు చేయడానికి ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఈ ఘటన వైరల్ కావడంతో.. ఆ మూర్ఖులను మూగజీవి ప్రేమికులు తిట్టిపోస్తున్నారు. -
సినిమాను తలపించిన ఎటాక్ సీన్.. స్విగ్గీ డెలివరీ బాయ్పై వెంటపడి మరీ..
చైతన్యపురి(హైదరాబాద్): మద్యం మత్తులో ముగ్గురు యువకులు స్విగ్గీ డెలివరీ బాయ్పై దాడి చేసి కొట్టిన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారంకిరణ్ అనే డెలివరీ బాయ్ శనివారం ఉదయం భవానీనగర్లోని వరలక్ష్మి టిఫిన్స్ వద్దకు ఆర్డర్ తీసుకునేందుకు వచ్చాడు. హోటల్లోకి వెళుతుండగా బయటకు వస్తున్న ముగ్గురు యువకుల్లో ఒకరు కిరణ్కు తగిలాడు. దీంతో చూసి వెళ్లాలని చెప్పటంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న యువకులు కిరణ్పై దాడికి దిగారు. తప్పించుకొని రోడ్డుపై పరుగెత్తుతుండగా వెంటపడి మరీ పిడిగుద్దులు, చెప్పులతో తీవ్రంగా కొట్టారు. చదవండి: నల్గొండలో దారుణం.. కన్నీళ్లు తెప్పించే ఘటన.. అక్కడే ఉన్న స్విగ్గీ డిలివరీ బాయ్స్ కొందరు వారిని అడ్డుకొనేందుకు యత్నించగా, వారిపై కూడా దాడి చేశారు. స్విగ్గీబాయ్స్, స్థానికులు కొందరు వారి వెంటపడగా ముగ్గురూ కారులో అక్కడి నుంచి పరారయ్యారు. వారిని వెంబడించిన కొందరు సరూర్నగర్లో పట్టుకుని ముందుగా సరూర్నగర్ పోలీసులకు అప్పగించారు. ఘటన చైతన్యపురి పరిధిలో జరగడంతో వారిని అక్కడికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ కిరణ్ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిలో కెనడా నుంచి ఇటీవలే వచ్చిన మలక్పేటకు చెందిన ఎన్ఆర్ఐ పి.ఆకాష్రాజ్ (26), సైదాబాద్కు చెందిన పి.శివ (22), ఎం.శివ (21)గా గుర్తించారు. కారులో ఓ యువతి కూడా ఉందని సమాచారం. నిందితులంతా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. -
మద్యం త్రాగేందుకు డబ్బులు ఇవ్వాలని నానమ్మపై మనువడి దాడి
-
క్యాబ్ డ్రైవర్పై దాడిలో 12 మందిపై కేసు
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి ప్రాంతంలో క్యాబ్ డ్రైవర్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వివేక్రెడ్డి కస్టడీ సోమవారం ముగిసింది. దీంతో పోలీసులు ప్రధాన నిందితుడిని జైలుకు తరలించారు. క్యాబ్ డ్రైవర్ వెంకటేష్తో పాటు యజమాని పర్వతాలును తనతో పాటు 12 మంది కలిసి దాడి చేసినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. గత నెల 31న ఉప్పర్పల్లికి చెందిన వివేక్రెడ్డి (24) బీఎన్రెడ్డినగర్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని ఉప్పర్పల్లికి ప్రయాణం అయ్యాడు. బుకింగ్ స్వీకరించిన వెంకటేష్ (27) వివేక్రెడ్డిని పికప్ చేసుకుని చంద్రాయణగుట్ట మీదుగా ఉప్పర్పల్లికి వెళ్తున్నాడు.ఈ క్రమంలో రాత్రి 12 గంటల సమయంలో యజమాని ఫోన్ చేయడంతో ఉప్పర్పల్లి వద్ద డ్రాప్ చేసి వస్తానని తెలపడంతో తాను చంద్రయణగుట్ట వద్దే ఉన్నానని తాను కూడా వస్తానంటూ తెలపడంతో కారులోనే ముగ్గురు కలిసి వెళ్లారు. డబ్బుల చెల్లింపులో వివాదం.. ఉప్పర్పల్లి వద్ద కారు దిగి డబ్బులు చెల్లించడంలో వివాదం చోటు చేసుకుని అతడు ఘర్షణకు దిగాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడికి తెలపడంతో వారు సైతం ఘటనా స్థలానికి వచ్చి డ్రైవర్తో పాటు యజమానిని సైతం చితకబాదారు. అనంతరం వారి కారులోనే ఇద్దరిని బందించారు. ఇదే సమయంలో రాజేంద్రనగర్ గస్తీ పోలీసులు పెట్రోలింగ్కు రాగా ఘర్షణ విషయాన్ని గమనించి వారందరినీ స్టేషన్కు తరలించారు. ఇరువురి భిన్న వాదనలు.. వివేక్రెడ్డి మొదట కారు డ్రైవర్ వెంకటేష్, పర్వతాలు ఇద్దరు తన గొలుసు తీసుకుని దాడి చేశారంటూ ఫిర్యాదు చేయగా.. డ్రైవర్ డబ్బులు చెల్లించమంటే తమపై దాడి చేశారని తెలపడంతో వారిని స్టేషన్లోనే కూర్చోబెట్టారు. అప్పటికే ఉదయం కావడంతో వెంకటేష్ అస్వస్థతకు గురై రక్తపు వాంతులు చేసుకోవడంతో వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దెబ్బలు తాళలేకే.. దెబ్బలు తాళలేకే ఇరువురు అస్వస్థతతకు గురి కావడంతో వారిని ఉస్మానియాకు తరలించామని డ్రైవర్ వెంకటేష్ పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు ఉస్మానియా నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అదే రోజు సాయంత్రం కోమాలోకి వెళ్లిన వెంకటేష్ ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. హత్యాయత్నం కేసు.. మొదట రాజేంద్రనగర్ పోలీసులు వివేక్రెడ్డితో పాటు అతడి స్నేహితులపై దాడి కేసు నమోదు చేసి అనంతరం బాధితుడు కోమాలోకి వెళ్లడంతో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎస్ఐ పరీక్షలకు సిద్ధమవుతుండగా.. బాధితుడు వెంకటేష్ ఎస్ఐ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. క్యాబ్ డ్రైవర్గా పని చేస్తునే శిక్షణ పొందుతున్నాడని ఆదివారం పరీక్షలు రాయాల్సి ఉండగా ఆసుపత్రిలో కోమాలో ఉ డని వారు విలపించారు. దాడి జరగకపోతే పరీక్షలు రాసి ఎస్ఐగా సెలక్ట్ అయ్యేవాడని దాడికి పాల్పడిన నిందితులను శిక్షించాలని వారు కోరారు. -
దిగ్భ్రాంతికర ఘటన.. చేతులెత్తి వేడుకున్న కానిస్టేబుల్
ఢిల్లీ: సొసైటీకి రక్షణ నిలయంగా భావించే పోలీస్ స్టేషన్లో.. అదీ అంతా చూస్తుండగానే ఓ పోలీస్ కానిస్టేబుల్పై నిర్ధాక్షిణ్యంగా దాడి జరిగింది. పైగా ఆ దాడిని కొందరు వీడియోలు తీస్తుండగా.. తనను వదిలేయాలని ఆ సిబ్బంది చేతులెత్తి వేడుకోవడం వైరల్ అవుతోంది. దిగ్భ్రాంతికరమైన ఈ ఘటన న్యూఢిల్లీ ఆనంద్ విహార్ పోలీస్ స్టేషన్లో జరిగింది. సుమారు పది, పన్నెండు మంది చుట్టూ చేరి ఆ కానిస్టేబుల్ను విచక్షణ రహితంగా కొట్టారు. చుట్టుపక్కల చాలా మంది ఆ ఘటనను వీడియో, ఫొటోలు తీశారు. అయితే ఎవరూ వాళ్లను ఆపే ప్రయత్నం చేయలేదు. బాధితుడు ఆ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్గా తెలుస్తోంది. క్షమించి వదిలేయాలని ఆ కానిస్టేబుల్ వేడుకోవడం వీడియోలో చూడొచ్చు. ఆగస్టు 3వ తేదీన ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఓ పోలీస్ సిబ్బంది సైతం వీడియో తీసి వైరల్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వీడియో ఉన్నతాధికారుల దాకా చేరడంతో విచారణకు ఆదేశించారు. కానిస్టేబుల్పై జరిగిన దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. అయితే కారణాలు ఏవైనా పోలీసులపై దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు కొందరు. దాడి చేసిన వాళ్లను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. వీడియో వైరల్ అవుతుండడంతో నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని చెబుతోంది ఢిల్లీ పోలీస్ విభాగం. अंधेर गर्दी है दिल्ली में, #DelhiPolice #Delhi pic.twitter.com/JfBLNdNuIM — Dhananjay Singh (@KunwarDJAY) August 6, 2022 -
సెట్లో ఓవరాక్షన్ చేసి తన్నులు తిన్న హీరో
-
Nupur Sharma: బజరంగ్ దళ్ కార్యకర్తపై దాడి
భోపాల్: బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మకు మద్దతు చెప్తున్న వాళ్లపై దాడులు కూడా పెరిగిపోతున్నాయి. ఉదయ్పూర్, అమరావతి దారుణ హత్యోదంతాల తర్వాత.. బీహార్లో ఓ యువకుడు వాట్సాప్ స్టేటస్గా నూపుర్ శర్మ వ్యాఖ్యల వీడియోను పెట్టుకున్నాడని దుండుగులు కత్తులతో గాయపరిచారు. తాజాగా మధ్యప్రదేశ్లోనూ ఓ బజరంగ్ దళ్ కార్యకర్తపై కత్తులతో దాడి చేసింది ఓ మూక. బుధవారం అగర్-మాల్వాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నూపుర్ శర్మ కామెంట్లకు మద్దతు ప్రకటించిన ఓ వ్యక్తిని కత్తులతో పొడిచారు పదమూడు మంది. బాధితుడి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసుకుని.. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ దాడితో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బజరంగ్ దళ్ స్థానిక కన్వీనర్ అయిన ఆయూష్ జడమ్(25).. స్థానిక మీడియాలో బహిరంగంగా నూపుర్ శర్మకు మద్దతు ఇస్తూ వ్యాఖ్యలు చేశాడు. బుధవారం ఉదయం స్థానిక టోల్ బూత్ నుంచి బైక్పై వెళ్తున్న సమయంలో అతనిపై దాడి చేసింది ఓ గ్రూప్. దీంతో బాధితుడిని చికిత్స కోసం ఉజ్జయిని ఆస్పత్రిని తరలించారు. దాడికి పాల్పడిందంతా స్థానికులేనని పోలీసులు నిర్ధారించారు. కాగా, ఈ ఘటనను నిరసిస్తూ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఎస్పీ కార్యాలయం ఎదుట హిందూ సంఘాలు బైఠాయించి ఆందోళన చేపట్టాయి. मप्र के आगर मालवा में एक बजरंग दल कार्यकर्ता पर हमला हो गया,आरोप है कि #नुपुर_शर्मा का समर्थन करने की वजह से ये हमला हुआ है,मामले में 13 लोगों के खिलाफ मामला दर्ज किया गया है जिनमें से दो को गिरफ्तार कर लिया गया है, घटना के बाद शहर में तनाव की स्थिति बन गई है @ndtv @ndtvindia pic.twitter.com/wRD1vT39PH — Anurag Dwary (@Anurag_Dwary) July 20, 2022 ఇదీ చదవండి: నూపుర్ శర్మకు ప్రాణహాని ఉంది నిజమే- సుప్రీంకోర్టు -
కాంగ్రెస్ నేతపై దాడి.. ఆరోగ్య పరిస్థితి విషమం
ఉప ఎన్నికల వేళ త్రిపురలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సుదీప్ రాయ్ బర్మాన్పై ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నారు. వివరాల ప్రకారం.. ఈ నెల 23వ తేదీన త్రిపురలో రాజధాని అగర్తాల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సుదీప్ బర్మాన్.. ఆదివారం రాత్రి ఉజన్ అభోయ్నగర్లో తన మద్దతుదారులను కలిశారు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. అనంతరం కారు, కాంగ్రెస్ పార్టీ జెండాలను ధ్వంసం చేశారు. కాగా, ఈ దాడికి అధికార బీజేపీ పార్టీనే కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకునే ఇలా దాడి చేశారని విమర్శించారు. అంతకుముందు కూడా సుదీప్ రాయ్.. భద్రతా సిబ్బంది, డ్రైవర్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇదిలా ఉండగా.. సుదీప్ రాయ్ బర్మాన్ ఈ ఏడాది ప్రారంభంలో బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ సర్కార్ పాలనలో ఆయన ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను పార్టీ అధిష్టానం మంత్రి పదవి నుంచి తొలగించింది. దీంతో గత ఫిబ్రవరి నెలలో బర్మాన్ బీజేపీకి గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక, త్రిపురలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు జూన్ 23న ఉప ఎన్నికలు జరుగుతుండగా.. జూన్ 26న ఓట్ల లెక్కింపు జరగనుంది. Tripura Bypoll Violene - BJP Gundas attack Agaratala - 6 congress Candidate sudip Roy Barman. pic.twitter.com/ZiREN9gWNz — With Congress (@WithCongress) June 20, 2022 ఇది కూడా చదవండి: సైన్యంలో చేరమని మిమ్మల్ని ఎవరు అడిగారు: మాజీ ఆర్మీ చీఫ్ ఫైర్ -
ఈవ్ టీజింగ్ను ప్రతిఘటించిన మహిళ.. బ్లేడుతో దాడి.. 118 కుట్లు
భోపాల్: ఈవ్ టీజింగ్ను ప్రతిఘటించిన మహిళపై ముగ్గురు బ్లేడుతో విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారు. ముఖమంతా రక్తమోడుతున్న ఆమెకు ఆస్పత్రిలో 118 కుట్లువేసి చికిత్స చేశారు. భోపాల్లో జూన్ 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రాత్రిపూట భర్తతో కలిసి బైక్ మీద ఇంటికొస్తున్న మహిళపట్ల ఇద్దరుబాలురు, ఒక వ్యక్తి ఈవ్టీజింగ్కు పాల్పడ్డారు. ప్రతిఘటించిన ఆమె ముఖంపై 10 సెంటీమీటర్ల మేర లోతైన గాటు పెట్టి బ్లేడుతో పలుచోట్ల దాడిచేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం శివరాజ్ ఆదేశించారు. బాధితురాలిని సీఎం పరామర్శించి లక్ష ఆర్థికసాయం ప్రకటించారు. మున్సిపల్ అధికారులు ఒక నిందితుని ఇంటిని కూల్చివేశారు. अन्याय का प्रतिकार करना अन्य लोगों के लिए प्रेरणा का कार्य है, इस नाते बहन सीमा अन्य महिलाओं के लिए प्रेरक भी हैं। उनके बेटा और बेटी पढ़ते हैं और उनके सहयोग के लिए भी कलेक्टर भोपाल को आवश्यक निर्देश दिये हैं। pic.twitter.com/BXQ5ywPCxG — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) June 12, 2022 -
మెక్సికోలో పేలిన తుపాకీ.. ఆరుగురి దుర్మరణం
అమెరికాలో తుపాకీ నరమేధం శాంతించడం లేదు. తాజాగా మెక్సికో వీధుల్లో దుండగుల కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. ఇందులో ఐదుగురు స్కూల్ పిల్లలే కావడం గమనార్హం. మధ్య మెక్సికోలో సాయుధులైన దుండగులు.. గువానాజువాటో వీధుల్లో తెగపడ్డారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఐదుగురు స్టూడెంట్స్తో(16 నుంచి 18 ఏళ్ల మధ్య వాళ్లు) పాటు ఓ వృద్ధురాలు మృతి చెందింది. చనిపోయిన వాళ్లంతా బారోన్ కమ్యూనిటీకి చెందిన వాళ్లేనని గువానాజువాటో మేయర్ నిర్ధారించారు. ఇదిలా ఉంటే.. రెండు వారాల కిందట గువానాజువాటోలోని సెలాయా నగరంలో జరిగిన ప్రతీకార దాడుల్లో పదకొండు మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. డ్రగ్స్, చమురు దొంగతనాల నేపథ్యంలోనే ఇక్కడ గ్యాంగ్ వార్లు జరుగుతున్నాయి. 2006 డిసెంబర్ నుంచి ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పదన మిలిటరీ యాంటీ డ్రగ్ ఆపరేషన్ వల్ల మెక్సికోలో ఇప్పటిదాకా మూడున్నర లక్షల హత్యలు జరిగాయి. చదవండి: అవమానాలు-కుటుంబ పరిస్థితులతో కిరాతకుడిగా.. -
రేషన్ డిపోలో తనిఖీలు చేశారని అధికారులపై టీడీపీ నాయకులు దాడి
-
Kili Paul: ఆస్పత్రిలో ఇంటర్నెట్ సెన్సేషన్.. కత్తులు, కర్రలతో దాడి!
Kili Paul Attacked: ఎప్పుడూ నవ్వుతూ, సరదాగా, యాక్టివ్గా స్టెప్పులేసే అతను.. ఆస్పత్రిలో స్ట్రెచ్చర్ మీద దీనస్థితిలో ఉన్నాడు. చేతి బొటనవేలుకి రక్తపు మరకతో బ్యాండేజ్. కాళ్ల మీద గాయపు గుర్తులు.. ఇంటర్నెట్ సెన్సేషన్గా పేరొందిన కిలి పాల్ పరిస్థితి ఇది. కత్తులతో, కర్రలతో ఆయన మీద ఎవరో హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇన్స్టాగ్రామ్ని, సోషల్ మీడియాలో ఇతర ఫ్లాట్ఫామ్స్ ఫాలో అయ్యే వారికి పరిచయం అక్కర్లేని పేరు.. కిలి పాల్. పల్లెల్లో పిల్లగాళ్ల దగ్గర నుంచి బాలీవుడ్ స్టార్స్, ప్రముఖుల దాకా ఈ టాంజానియా ఇంటర్నెట్ సెలబ్రిటీకి ఫ్యాన్స్. అతని ఇన్స్టా రీల్స్కి ఫిదా అవుతుంటారు. బాలీవుడ్తో పాటు ఇతర భాషల్లోని పాటలకు అదిరిపోయే స్టెప్పులు, అబ్బురపరిచే ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఎంతో మంది భారతీయుల మనుసులు దోచేశారు టాంజానియాకి చెందిన అన్నా చెల్లెల్లు కిలిపాల్, నీమాపాల్లు. అయితే కిలి పాల్ మీద ఎవరో దుండగులు దాడి చేశారు. ‘కొందరు తనను కింద పడేయాలని చూస్తున్నారు. కానీ, దేవుడు మాత్రం తనకి సాయం చేస్తూ వస్తున్నాడు. నా కోసం ప్రార్థించండి’ అంటూ ఓ స్టోరీ పోస్ట్ చేశాడు కిలి పాల్. అయితే అతని మీద హత్యాయత్నం ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? అనే వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్టాక్లో వీడియోల ద్వారా పాపులర్ అయిన కిలి పాల్.. ఎక్కువ భారతీయ సినీ గేయాలు, డైలాగులకే డ్యాన్సులు చేస్తుంటాడు. తక్కువ టైంలో గుర్తింపు దక్కిన అతనికి ఫిబ్రవరిలో భారత హై కమిషన్ ప్రత్యేక గుర్తింపుతో గౌరవించింది. అంతెందుకు ప్రధాని మోదీ సైతం తన మన్ కీ బాత్లో కిలి పాల్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు కూడా.