attacked
-
Bihar: మళ్లీ పోలీసులపై దాడి
బీహార్: బీహార్లో పోలీసులపై దాడులు ఆగడం లేదు. ముంగేర్ జిల్లాలో ఏఎస్ఐ సంతోష్ కుమార్ సింగ్ హత్యోదంతం మరువకముందే డయల్ 112 విభాగంలో పనిచేస్తున్న మరో పోలీసు కానిస్టేబుల్పై దాడి జరిగింది. ఈ ఘటనలో మరో కానిస్టేబుల్ గాయపడ్డారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం హవేలీ ఖడంగ్ర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫసియాబాద్లో ఆదివారం రాత్రి దొంగతనం ఆరోపణతో ఇద్దరు యువకులను స్థానికులు పట్టుకుని పంచాయతీ భవనంలో బంధించి, ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు గ్రామానికి చేరుకుని, ఆ యువకులను తమతో పాటు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అయితే గ్రామీణులు పోలీసులను అడ్డుకుంటూ, వాగ్వాదానికి దిగారు. ఈ నేపధ్యంలో పోలీసులపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో బబ్లూ రజక్ అనే పోలీసు గాయపడ్డారు. పరిస్థితి కాస్త సద్దుమణిగాక పోలీసులు ఆ ఇద్దరు యువకులను తమతోపాటు పోలీస్ స్టేషన్కు తీసుకు వెళ్లారు. పోలీసులపై రాళ్లు రువ్విన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: రాజధానిలో మహిళల రక్షణకు యాంటీ ఈవ్ టీజింగ్ స్క్వాడ్ -
హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా దాడి.. 20 మంది మృతి
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆదేశాల దరిమిలా యెమెన్ రాజధానిపై జరిగిన దాడుల్లో 20 మంది పౌరులు మృతిచెందారని ఇరాన్ మద్దతు కలిగిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. హౌతీ ఆరోగ్య, పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటనలో అమెరికా దాడుల్లో 20 మంది పౌరులు మరణించారని , మరో తొమ్మిది మంది గాయపడ్డారని, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నదని తెలిపింది.యెమెన్లోని హౌతీ ఉగ్రవాదులపై శక్తివంతమైన సైనిక చర్యను ప్రారంభించాలని తాను అమెరికా సైన్యాన్ని ఆదేశించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటనలో తెలిపారు. హౌతీ ఉగ్రవాదులు(Houthi Rebels) అమెరికాతో పాటు ఇతర నౌకలు, విమానాలు, డ్రోన్లపై దాడులకు ప్రేరేపించే విధంగా నిరంతర ప్రచారాన్ని నిర్వహించారని ట్రంప్ పేర్కొన్నారు. కాగా తాము జిబౌటి ఓడరేవు నుండి బయలుదేరిన మూడు అమెరికన్ సైనిక సరఫరా నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు యెమెన్ హౌతీ గ్రూప్ పేర్కొంది. హౌతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరియా మాట్లాడుతూ రెండు అమెరికన్ డిస్ట్రాయర్లను కూడా తాము లక్ష్యంగా చేసుకున్నామని అన్నారు. మరోవైపు యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులకు టెహ్రాన్ ఆర్థిక వనరులు, ఆయుధ మద్దతు, సైనిక శిక్షణను అందిస్తోందనే అమెరికా ఆరోపణను ఐక్యరాజ్యసమితికి ఇరాన్ శాశ్వత మిషన్ తోసిపుచ్చింది.ఇది కూడా చదవండి: Vadodara: ‘తాగలేదు.. గుంతల వల్లే కారు అదుపు తప్పింది’ -
కుప్పంలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై అమ్మాయి తండ్రి దాడి
సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పంలో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న జంటపై అమ్మాయి తండ్రి కత్తితో దాడి చేశారు. అడ్డుకున్న మరో ఇద్దరిపైనా కూడా దాడికి పాల్పడ్డాడు. పెద్దల సమక్షంలో రాజీ పంచాయితీ అంటూ పిలిచి నలుగురిపై విచక్షణరహితంగా కత్తితో దాడి చేశారు.ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కత్తి కడుపులో ఇరుక్కుపోయింది. బాధితులను గుడుపల్లి మండలం అగరం గ్రామానికి చెందిన చంద్రశేఖర్, రమేష్, కౌసల్య, సీతారామప్పగా గుర్తించారు. వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
రెవెన్యూ అధికారులపై ఆక్రమణదారులు దాడి
సాక్షి, అన్నమయ్య జిల్లా: కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ అధికారులకు కూడా రక్షణ కొరవడింది. మదనపల్లి పట్టణం దేవతా నగర్లో ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాలను కూల్చేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై ఆక్రమణదారులు దాడికి పాల్పడ్డారు. కొడవలితో నరికేందుకు యత్నించారు. జేసీబీ అద్దాలను ధ్వంసం చేసి పెట్రోల్ పోసి నిప్పు అంటించారు.రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేషాద్రి రావుపై కొడవలితో దాడి చేసేందుకు యత్నించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేషాద్రి రావు మొబైల్ ఫోన్,విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ప్రసాద్ మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. ఈ దాడిలో డ్రైవర్ గణేష్ గాయపడ్డారు. ప్రభుత్వ అధికారులకు రక్షణ కల్పించాలని అధికారులు కోరారు. ఈ ఘటన జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేషాద్రి రావు, వీఆర్వో ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. -
‘జనసేన వాళ్లమని చెప్పినా చితకబాదారు!’
ఎన్టీఆర్, సాక్షి: పండుగ పూట కూటమి నేతలు అధికార మదంతో రెచ్చిపోతున్నారు. రికార్డింగ్ డ్యాన్యుల ముసుగుతో అశ్లీల నృత్యాలను దగ్గరుండి మరీ ప్రొత్సహిస్తున్నారు. అలాగే బరుల్లో తమ ఆధిపత్యమే కొనసాగేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో దాడులకూ పాల్పడుతున్నారు. అయితే.. కోడి పందేలు కూటమి మధ్య లుకలుకలను బయటపెడుతున్నాయి. బరుల్లో తెలుగు తమ్ముళ్లు(TDP Activists) బరి తెగించేస్తున్నారు. ఎవరూ ముందుకు రాకుండా.. ఉత్త పుణ్యానికే దాడులకు దిగుతున్నారు. అయితే ‘‘ఎందుకు కొడుతున్నారు?’’ అని అడిగినందుకు కర్రలతో మూకుమ్మడి దాడి చేశారు. దాడిని అడ్డుకున్న వారి వాహనాలను సైతం ధ్వంసం చేశారు. దాడిలో ఆరుగురికి గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆ ఆరుగురు జనసేన కార్యకర్తలని తేలింది. కంచికచర్ల(Kanchikarla) మండలం గండేపల్లి కోడిపందేల బరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాము జనసేన వాళ్లమని చెప్పిన్నా వినకుండా దుర్భాషలాడుతూ తమను చితకబాదారని బాధితులు వాపోయారు. మరోవైపు తమ కార్యకర్తల పై జరిగిన దాడిపై జనసేన(Jana Sena) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘చంద్రబాబు, పవన్లు 15 ఏళ్లు కలిసి పొత్తులో ఉందామనుకుంటున్నారు. కానీ టీడీపీ నేతలు అలా ఉండనిచ్చేలా లేరు’’ అని అంటున్నారు. తాజా దాడిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని జనసేన నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీలో కోడి పందేలు(Rooster Fightings) కూటమి నేతల మధ్య చిచ్చు రాజేస్తున్నాయి. జనసేన, బీజేపీ వాళ్లను టీడీపీ వాళ్లు ముందుకు రానివ్వకపోవడమే అందుకు కారణం. ఇందుకు సంబంధించిన ఘటనలు.. సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. ఇక.. ఏపీలో సాంప్రదాయ సంబరాల ముసుగులో యధేచ్ఛగా జూద క్రీడలు. కోడిపందాల బరులను ఆదాయ వనరులుగా మార్చేసుకుంటున్నారు కూటమి నేతలు. కోడి పందాల బరుల్లో వాటాల కోసం కూటమి పార్టీ ఎమ్మెల్యేలు తహతహలాడిపోతున్నారు. ఈ క్రమంలో.. తమ అనుచరులను రంగంలోకి దించుతున్నారు. ఏపీలో మునుపెన్నడూ లేనంతగా ఇష్టానుసారంగా బరులు ఏర్పాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. కోడి పందాల బరుల్లో జూదక్రీడలకు స్పెషల్ ఎరేంజ్ మెంట్స్ చేస్తున్నారు. పేకాట, గుండాట, లోన బయట , నంబర్ల గేమ్స్ కోసం కౌంటర్లు ఏర్పాటు చేయించారు. ఇక.. జూద క్రీడలకు తోడు మద్యం ఏరులై పారుతోంది. మద్యం కోసం ప్రత్యేకంగా మినీ బార్లు , బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ.. తొలి రెండు రోజుల్లోనే వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది. మొత్తం.. ఈ పండక్కి జూదం ,మద్యం ద్వారా భారీగా సంపాదించాలని పక్కా ప్రణాళిక వేసుకున్న కూటమి నేతలు.. దానిని అంతే పక్కాగా అమలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. కోడిపందాలు , పేకాట ,గుండాటలు ఆడితే తాటతీస్తామని పండగ ముందు పోలీసులు హెచ్చరికల వరకే పరిమితం అయ్యారు. బరుల వద్ద కనీసం కనుచూపుమేరలో కూడా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కనిపించకపోవడంతో.. కూటమి నేతలతో కుమ్మక్కయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇదీ చదవండి: కోడి పందేల కోసం మహిళా బౌన్సర్లు!! -
ఇద్దరు ఎమ్మార్వోల వీరంగం.. రియల్టర్పై దాడి
సాక్షి,చిత్తూరు:మద్యం మత్తులో చిత్తూరులో ఇద్దరు తహసీల్దార్లు వీరంగం సృష్టించారు. తప్పతాగి నడిరోడ్డుపై రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడికి దిగారు. శివ,ప్రసన్నలు గంగవరం,పెద్దపంజాణి ఇన్ఛార్జ్ తహసీల్దార్లుగా పనిచేస్తున్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కృష్ణకుమార్పై శివ,ప్రసన్నలు దాడి చేశారు. చిత్తూరులోని ఓ బార్లో శివ,ప్రసన్న,కృష్ణ కుమార్లు వేరువేరుగా మద్యం సేవించారు. శివ,ప్రసన్న,కృష్ణ కుమార్ల మధ్య ఆర్థిక లావాదేవీలున్నాయి.మద్యం తాగేటపుడు మాటా మాటా పెరిగి కృష్ణ కుమార్పై శివ,ప్రసన్న దాడి చేశారు. ఈ దాడి వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కృష్ణకుమార్ డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: తెలుగు తమ్ముళ్ల స్వైర విహారం -
AP: ప్రేమోన్మాది ఘాతుకం.. దాడిలో ఇంటర్ విద్యార్థిని మృతి
సాక్షి, నంద్యాల: ఏపీలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదనే కారణంగా యువతిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ ప్రమాదంలో బాధితురాలు మృతిచెందింది. అనంతరం తాను నిప్పంటించుకొని అతడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నంద్యాల జిల్లా నందికొట్కూరు బైరెడ్డి నగర్కు చెందిన ఇంటర్ విద్యార్థిని తాను ప్రేమిస్తున్నానంటూ రాఘవేంద్ర వేధింపులకు గురిచేశాడు . అయితే యువతి అతని ప్రేమను అంగీకరించకపోవడంతో.. లహరిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అనంతరం తాను నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా యువతి పూర్తిగా కాలిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లహరి మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. -
వైఎస్సార్ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై కత్తితో దాడి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదని ప్రేమోన్మాది ఓ యువతిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారు. వేముల మండలం కొత్తపల్లిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల ఇంట్లో వారు రావడంతో ఆ యువకుడు పరారయ్యారు.పరిస్థితి విషమించడంతో పులివెందులలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె శరీరంపై 14 కత్తిపోట్లు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉండడంతో పాటు రక్తస్రావం ఎక్కువగా అవుతుండడంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
Bangladesh: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాదిపై దాడి.. పరిస్థితి విషమం
ఢాకా: బంగ్లాదేశ్లో దేశద్రోహం ఆరోపణలపై అరెస్టయిన చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి తరపు న్యాయవాది రమణ్ రాయ్పై దాడి జరిగిందని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్(ఇస్కాన్) తెలిపింది.ఇస్కాన్ ప్రతినిధి రాధారమణ్ దాస్ ట్విట్టర్లో ఒక పోస్ట్లో ‘దయచేసి అడ్వకేట్ రమణ్ రాయ్ కోసం ప్రార్థించండి. అతను చేసిన ఒకేఒక తప్పు చిన్మయ్ కృష్ణ ప్రభు కోసం కోర్టులో వాదించడం. ఇస్లాంవాదులు అతని ఇంటిని ధ్వంసం చేసి, అతనిపై దాడి చేశారు, ప్రస్తుతం ఆయన ప్రాణాలతో పోరాడుతున్నారు’ అని రాశారు.Please pray for Advocate Ramen Roy. His only 'fault' was defending Chinmoy Krishna Prabhu in court.Islamists ransacked his home and brutally attacked him, leaving him in the ICU, fighting for his life.#SaveBangladeshiHindus #FreeChinmoyKrishnaPrabhu pic.twitter.com/uudpC10bpN— Radharamn Das राधारमण दास (@RadharamnDas) December 2, 2024బంగ్లాదేశ్కు చెందిన పలువురు న్యాయవాదులు ఈ ఘటనలను ఖండించారు. కాగా చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాది హత్యకు గురయ్యాడంటూ గత నెలలో సోషల్ మీడియాతోపాటు కొన్ని వార్తా కథనాలలో కనిపించింది. అయితే ఈ ప్రస్తావనలో వచ్చిన లాయర్ పేరు సైఫుల్ ఇస్లాం అని విచారణలో తేలింది. ఆయన ప్రభుత్వం తరపు న్యాయవాది అని, అతను చిన్మోయ్ దాస్ కేసులో పోరాడలేదని సమాచారం.బంగ్లాదేశ్లోని ఇస్కాన్ టెంపుల్కు చెందిన సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి ఇటీవల రంగ్పూర్లో హిందువులకు మద్దతుగా జరిగిన నిరసనలకు నాయకత్వం వహించారు. ఆ తరువాత గత నెలలో ఢాకాలో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అతనిపై దేశద్రోహం అభియోగం మోపారు. ఈ నేపధ్యంలో ఢాకా కోర్టు అతనికి బెయిల్ నిరాకరించింది.బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా బహిష్కరణకు గురైనప్పటి నుండి, మైనారిటీలపై హింసాయుత ఘటనలు జరుగుతున్నాయి. అలాగే వీటిని నిరసిస్తూ పలు ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. బంగ్లాదేశ్లోని ఛటోగ్రామ్లో చిన్మయ్ కృష్ణ దాస్ శిష్యులు ఇద్దరు అదృశ్యమయ్యారని రాధారమణ్ దాస్ గతంలో ఒక పోస్టులో తెలిపారు. కాగా బంగ్లాదేశ్లో హిందువుల అరెస్టులను భారత్ ఖండించింది. హిందువులు, ఇతర మైనారిటీలకు భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.ఇది కూడా చదవండి: దూసుకొచ్చిన మృత్యువు -
దాడి చేయబోతే 'దాడి' చేశార్సార్!
-
విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, విశాఖపట్నం: నగరంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పెదగంట్యాడ బాలచెరువు సమీపంలో యువతిపై ఓ యువకుడు దాడి చేశారు. ఈ ఘటనలో బాధితురాలు మేఘన తీవ్రంగా గాయపడింది. కాగా, మేఘనపై జరిగిన దాడిలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది. రెండు సార్లు నిందితుడిపై ఫిర్యాదు చేసిన కానీ పోలీసులు పట్టించుకోలేదు.మేఘన తలపై బలంగా ఇనుప రాడ్డుతో నిందితుడు నీరజ్ శర్మ దాడి చేశాడు. మేఘన పై దాడి చేస్తున్న క్రమంలో అడ్డు వచ్చిన మరో ఇద్దరిపై కూడా ప్రేమోన్మాది దాడి చేశాడు. బాధితురాలి తలపై వైద్యులు 30కి పైగా కుట్లు వేశారు. మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని కిమ్స్కు తరలించారు. -
కొడుకు, కోడలు కలిసి తండ్రిపై దాడి
-
బహ్రాయిచ్లో పట్టుబడిన చిరుత
బహ్రాయిచ్: ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్ జిల్లాలో జనాలపై దాడి చేస్తున్న చిరుత ఎట్టకేలకు పట్టుబడింది. దానిని అటవీశాఖ అధికారులు బోనులో బంధించారు. ఆ చిరుత ఒక బాలికతో పాటు వృద్ధురాలిపై కూడా దాడి చేసింది. చిరుత పట్టుబడటంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.దీనికిముందు గత సోమవారం అటవీశాఖ అధికారులు ఒక చిరుతను పట్టుకున్నారు. ఇప్పుడు రెండో చిరుతపులిని పట్టుకున్నారు. కతర్నియాఘాట్ అటవీ ప్రాంత పరిధిలోని పలు గ్రామాల్లో చిరుతలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఐదు రోజుల క్రితం ఒక చిరుత 13 ఏళ్ల బాలికపై దాడి చేసి గాయపరిచింది. ఇదేవిధంగా 80 ఏళ్ల రెహమానా ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేసింది. ఆ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు గ్రామ సమీపంలోని చెరుకు తోటలో బోనును ఏర్పాటు చేశారు. కొద్దిసేపటికి చిరుత ఆ బోనులో చిక్కింది. పోలీస్ స్టేషన్ హెడ్ హరీష్ సింగ్, రేంజర్ రోహిత్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకుని, చిరుతను ట్రాక్టర్ ట్రాలీలో ఎక్కించి, అటవీశాఖ రేంజ్ కార్యాలయానికి తరలించారు.ఇది కూడా చదవండి: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి -
హర్యానా మాజీ డిప్యూటీ సీఎం కాన్వాయ్పై దాడి
జీంద్: హర్యానాలోని జింద్ జిల్లా ఉచన కలాన్లో కలకలం చోటుచేసుకుంది. సోమవారం అర్థరాత్రి మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా కాన్వాయ్పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం దుష్యంత్ చౌతాలా బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా కొందరు యువకులు వీరంగం సృష్టించారు. అనంతరం దుష్యంత్ కాన్వాయ్ వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.ఈ రోడ్ షోలో దుష్యంత్తో పాటు ఆజాద్ సమాజ్ పార్టీ నేత చంద్రశేఖర్ రావణ్ కూడా పాల్గొన్నారు. ఈ హఠాత్ దాడి హర్యానా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఈ దాడిలో చంద్రశేఖర్ ప్రయాణిస్తున్న కారు వెనుక అద్దాలు పగిలిపోయాయి. జేజేపీ నేత, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా ఉచన కలాన్ అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. చంద్రశేఖర్ ఆయనకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు. హర్యానాలో అక్టోబర్ 5న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.ఇది కూడా చదవండి: గయతో పాటు ఈ ప్రాంతాల్లోనూ పిండ ప్రదానాలు -
మద్యం మాఫియా దాడి.. ఆరుగురు పోలీసులకు గాయాలు
పట్నా: గత కొంతకాలంగా బీహార్లో మద్యం అక్రమ రవాణా కేసులు తరచూ వెలుగు చూస్తున్నాయి. తాజాగా మద్యం మాఫియా పోలీసులపై దాడికి దిగింది. బెగుసరాయ్ జిల్లాలోని లాఖో పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం మద్యం మాఫియా దాడిలో లాఖో పోలీస్ స్టేషన్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ), సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)తో సహా ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. లాఖో పోలీస్ స్టేషన్ ఇన్చార్జి అభిషేక్ కుమార్ నేతృత్వంలో పోలీసుల బృందం మద్యం స్థావరాలపై దాడి చేయడానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది. బహద్పూర్ ముషారి తోలా ప్రాంతానికి వెళ్లి, దేశీ మద్యం తయారీలో నిమగ్నమైన కొంతమంది స్థానికుల ఇళ్లపై పోలీసులు దాడులు చేశారు. ఈ సమయంలో మద్యం మాఫియా పోలీసు బృందంపై రాళ్లు రువ్వింది.ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు గాయపడ్డారని తెలుసుకున్న వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపు చేశారు. గాయపడిన పోలీసులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తెలుస్తోంది. ఈ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: రూ.లక్షన్నర కోట్ల ‘మూసీ’కి లక్షల జీవితాలు బలి -
దళిత వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే దాడి
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, అమరావతి: ఏరా లం...కొడకా.. చంపేస్తాను నా కొడకా.. ఏంటి రా నన్ను తిట్టావంట.. చదువుకునే కుర్రాళ్లను రెచ్చగొడతావా.. అంటూ నోటికొచ్చినట్టు బండ బూతులు తిడుతూ ఓ దళిత ప్రభుత్వ వైద్యుడిపై కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ తన అనుచరులతో కలసి పిడిగుద్దులతో దాడి చేశారు. శనివారం కాకినాడ రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ) మైదానంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించి పూర్వాపరాలిలా ఉన్నాయి. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలకు శ్రీనగర్లో 12 ఎకరాల క్రీడా మైదానం ఉంది.ఇందులో సుమారు 150 గజాల్లో మెడికోల కోసం వాలీబాల్ కోర్ట్æ ఉంది. వైద్య కళాశాల ముందస్తు అనుమతి లేకుండా ఇతరులు క్రీడల కోసం ఆ కోర్టును వినియోగించరాదు. అయితే గత కొంత కాలంగా కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ అనుచరులమంటూ సుమారు 40 మంది యువకులు వాలీబాల్ కోర్ట్కు వస్తూ మెడికోలపై గొడవకు దిగుతున్నారు. వైద్య విద్యార్థినులతో పాటు వాకింగ్ కోసం వస్తున్న మహిళలపై తరచూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీనిపై ఆర్ఎంసీ స్పోర్ట్స్ వైస్చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుకు మెడికోలు ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని వైద్య విద్యార్థులు అటు రంగరాయ యాజమాన్యంతో పాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ)కి ఫిర్యాదు చేశారు. అనుమతి అడిగి.. అంతలోనే గొడవకు దిగి..తమ అనుచరులను కోర్టులో ఆడుకునేందుకు అనుమతివ్వాలని ఆర్ఎంసీ ప్రిన్సిపాల్, డీఎంఈ డాక్టర్ డీఎస్వీఎల్ నరసింహాన్ని ఇటీవల ఎమ్మెల్యేలు ఇరువురూ ఫోన్లో అడిగారు. అందుకు నరసింహం అభ్యంతరం చెబుతూ.. ఉన్నత స్థాయి కమిటీలో చర్చించి చెబుతామని వారికి చెప్పారు. ఇంతలో అనుమతి లేకుండానే శనివారం కూటమి ఎమ్మెల్యేల అనుచరులు వాలీబాల్ కోర్టులో ఆటలాడుతున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపాల్, డాక్టర్ విష్ణువర్ధన్, కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్, ఫోరెన్సిక్ హెచ్వోడీ డాక్టర్ ఉమామహేశ్వరరావు, ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్తో కలసి ఆర్ఎంసీ గ్రౌండ్కి చేరుకున్నారు.కోర్టు నుంచి వెళ్లిపోవాలని ఎమ్మెల్యేల అనుచరులకు నచ్చజెప్పగా.. వారు వాగ్వాదానికి దిగారు. అనంతరం ఎమ్మెల్యే అనుచరులు కోర్టు ఖాళీ చేసి వెళ్లిపోయాక ఎమ్మెల్యే నానాజీ తన అనుచరులను వెంట బెట్టుకుని గ్రౌండ్కు వచ్చి డాక్టర్ ఉమామహేశ్వరరావుపై బండ బూతులు మొదలుపెట్టి.. ఆ డాక్టర్ ముఖానికి మాస్క్ను బలవంతంగా లాగేసి పిడిగుద్దులు కురిపించారు. మరోమారు తన అనుచరులను అడ్డుకుంటే చంపేస్తానని హెచ్చరించి వెళ్లారు. ఆ సమయంలో ఇరు పక్షాలు గొడవకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.నేటి నుంచి జూడాల నిరసన..ఎమ్మెల్యే నానాజీ దౌర్జన్యానికి నిరసనగా ఆదివారం నుంచి విధులు బహిష్కరిస్తామని వైద్యులు, జూడాలు ప్రకటించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ నరసింహం ఆధ్వర్యంలో వైద్యులు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్కు జరిగిన సంఘటనపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎంఎల్ఏ నానాజీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. ఇదిలా ఉండగా కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆర్ఎమ్సీకి వచ్చి ఇరుపక్షాలతో రాజీకి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు వైద్యులు, మెడికోలు ససేమిరా అంటున్నారు. దళిత సంఘాలు ఆర్ఎంసీ గ్రౌండ్స్కు చేరుకుని దళిత జాతికి జరిగిన అవమానమంటూ ధర్నాకు దిగారు.క్రిమినల్ కేసు నమోదు చేయాలిడా.ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన అనుచరులు దాడికి పాల్పడటం హేయమైన చర్య అని ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా.జయధీర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, వైద్యులపై దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు ఆయన లేఖ రాశారు. -
మళ్లీ తోడేలు దాడి.. ఇద్దరు చిన్నారులకు గాయాలు
బహ్రయిచ్: ఉత్తరప్రదేశ్లోని బహ్రయిచ్ జిల్లాలోని 35 గ్రామాలు నరమాంస భక్షక తోడేళ్ల దాడులతో వణికిపోతున్నాయి. ప్రతిరోజూ తోడేళ్ల దాడులకు సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సోమవారం రాత్రి ఇద్దరు చిన్నారులపై నరమాంస భక్షక తోడేలు దాడి చేసింది.ఈ ఘటన బహ్రయిచ్లోని మహసీ ప్రాంతంలోని గిర్ధర్ పూర్వా గ్రామంలో చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి నరమాంస భక్షక తోడేలు ఇద్దరు పిల్లలపై దాడి చేసింది. ఈ ఘటనలో ఒక చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. మరో బాలిక గాయపడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతోంది.ఐదేళ్ల బాలిక తన అమ్మమ్మతో కలిసి ఇంట్లో మంచంపై నిద్రిస్తోంది. రాత్రి 12 గంటల సమయంలో తోడేలు ఆమెపై దాడి చేయడంతో ఆమె కేకలు వేసింది. దీంతో ఆ తోడేలు అక్కడి నుంచి పారిపోయి, మరో ఇంట్లోని చిన్నారిపై దాడి చేసింది. ఆ చిన్నారి కూడా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ ఘటన మహసీ తహసీల్ ప్రాంతంలోని పాంధుయా గ్రామంలో చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా రాత్రివేళ నరమాంస భక్షక తోడేళ్లు దాడులకు దిగుతున్నాయి. -
మరో వైద్యురాలిపై దాడి.. నిందితులు పరార్
దేశంలో ఎక్కడో ఒకచోట వైద్యులపై దాడులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ముంబైలోని సియోన్ ఆస్పత్రిలో ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది. ఓ వైద్యురాలిపై రోగి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఈ ఉదంతంలో ఆ వైద్యురాలు గాయపడ్డారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈరోజు(ఆదివారం) తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దీనిపై బీఎంసీ ఎంఏఆర్డీ అసోసియేషన్ వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వైద్యురాలిపై దాడి చేసిన వారంతా మద్యం మత్తులో ఉన్నారని తెలుస్తోంది. వీరు ఆమెపై దాడికి పాల్పడిన అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.కాగా కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటన తర్వాత, దేశవ్యాప్తంగా వైద్యులు తమ భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు. తాజాగా సియోన్ ఆస్పత్రిలో జరిగిన ఘటనతో వైద్యుల భద్రతపై మరోసారి పలు సందేహాలు తలెత్తుతున్నాయి. -
Maharashtra: మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్పై దాడి
మహారాష్ట్రలో సంచలన ఉదంతం చోటుచేసుకుంది. థానేలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్పై దాడి జరిగింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) కార్యకర్తలు ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్పై పేడ, టమోటాలు, గాజులు, కొబ్బరికాయలు విసిరారు. ఈ దాడికి పాల్పడిన 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం శుక్రవారం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో రాజ్ ఠాక్రే ర్యాలీపై శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన వ్యక్తులు కిళ్లీలు విసిరారనే ఆరోపణలు వచ్చాయి. ఈ దరిమిలా మర్నాడు ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్పై పేడ, టమోటాలు విసిరారు. దీంతో రాజ్ ఠాక్రే పార్టీ కార్యకర్తలు ఉద్ధవ్ కాన్వాయ్పై దాడి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.వివరాల్లోకి వెళితే ముంబైకి ఆనుకుని ఉన్న థానే జిల్లాలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం శనివారం ఒక మీటింగ్ నిర్వహించింది. దీనిలో ఉద్ధవ్ ఠాక్రే కూడా పాల్గొన్నారు. ఈ సమయంలో కొంతమంది ఎంఎస్ఎన్ కార్యకర్తలు ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్పై పేడ, టమోటాలు, గాజులు, కొబ్బరికాయలను విసిరారు.పోలీసు వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం, ప్రస్తుతం పోలీసులు 20 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే వర్సెస్ రాజ్ ఠాక్రే వివాదం మొదలయ్యిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. -
తీహార్ జైలులో ఖైదీల ఘర్షణ.. ఇద్దరికి గాయాలు
ఢిల్లీలోని తీహార్ జైలులో మరోమారు గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఖైదీల మధ్య మరోసారి ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు. జైలులోని ఫోన్ రూమ్లో ఈ గొడవ జరిగింది. లవ్లీ, లావిష్ అనే ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు.వివరాల్లోకి వెళితే లోకేష్ అనే ఖైదీ ఈ దాడికి పాల్పడ్డాడని సమాచారం. లోకేష్ సోదరుని హత్య కేసులో లవ్లీ, లావిష్ జైలులో ఉన్నారు. జైలులోనే దాడికి ప్లాన్ చేసిన లోకేష్ తన సహచరులు హిమాన్ష్, అభిషేక్ల సాయం తీసుకున్నాడు. అవకాశం చూసుకున్న లోకేష్, అతని సహచరులు కలసి లవ్లీ, లావిష్లపై దాడి చేశారు. గాయపడిన ఖైదీలిద్దరినీ జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఒక ఖైదీని ఆస్పత్రి నుంచి తిరిగి జైలుకు తీసుకువచ్చారు. మరొక ఖైదీ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తీహార్ జైలులో గతంలోనూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. -
కోఠిలో కలకలం.. ప్రభుత్వ వైద్యుడిపై తోటి డాక్టర్ల దాడి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద కలకలం రేగింది. ప్రభుత్వ వైద్యుడిపై తోటి వైద్యులు దాడికి పాల్పడ్డారు. దీంతో డీఎంఈ కార్యాలయం ముందు బాధిత వైద్యుడు డాక్టర్ శేఖర్ ఆందోళనకు దిగారు.సాధారణ బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు అమలు చేయాలని డీఎంఈకు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చానని.. ఈ జీవో అమలు చేస్తే హైదరాబాద్లో పని చేస్తున్న వైద్యులు జిల్లాలకు, జిల్లాలలో పని చేస్తున్న వాళ్లు హైదరాబాద్కు 40 శాతం మేర బదిలీలు జరుగుతాయి. ఈ బదిలీ లను అడ్డుకునేందుకు డాక్టర్ పల్లం ప్రవీణ్ కుమార్, బొంగు రమేష్, రాథోడ్ , వినోద్ కుమార్లు కుట్ర చేస్తున్నారని డాక్టర్ శేఖర్ ఆరోపించారు.తాను డీఎంఈకు వినతి పత్రం ఇవ్వకుండా తనను అడ్డుకుని. తనపై దాడి చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ముసుగులో ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ సిటీ లోనే తిష్ట వేశారు. వాటిపై ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన నలుగురు వైద్యులపై చర్యలు తీసుకొనేంత వరకు తాను డీఎంఈ కార్యాలయం ముందే బైఠాయిస్తానని వైద్యుడు శేఖర్ చెబుతున్నారు. -
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కో కన్వినర్ ఇంటిపై దాడి
తెనాలి అర్బన్: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా గుంటూరు జిల్లా కో–కన్వినర్ నీలి అజయ్కుమార్ ఇంటిపై బుధవారం అర్ధరాత్రి టీడీపీ గూండాలు దాడి చేశారు. నాలుగు గంటలపాటు విధ్వంసానికి పాల్పడ్డారు. ఇంట్లో వస్తువులు, కిటికీల అద్దాలు, పూల కుండీలు ధ్వంసం చేశారు. బాధితుడి కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి నందులపేటకు చెందిన నీలి అజయ్ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా జిల్లా కో–కన్వినర్. ప్రతిపక్ష పార్టీల విమర్శలను సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టేవాడు. అతనిపై కక్ష పెంచుకున్న కొందరు టీడీపీ గూండాలు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాగానే బెదిరింపులు ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం అజయ్ విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో కొందరు టీడీపీ గూండాలు కారులో అతని ఇంటికి వచ్చారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో కర్రలు, రోకలి బండలతో కిటికి అద్దాలు పగలకొట్టారు. కిటికీల నుంచి కర్రలు, రాడ్లతో లోపల అందిన వస్తువులను ధ్వంసం చేశారు. ఇంటి ఆవరణలోని వాషింగ్ మిషన్, పూల కుండీలు, వస్తువులను పగులగొట్టారు. దీనిని గమనించిన స్థానికులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై దౌర్జన్యానికి దిగారు. వారిపై దుర్భాషలాడి, బెదిరించారు. తెల్లవారుజామున 4 గంటల వరకు నాలుగు గంటల పాటు విధ్వంసం కొనసాగినా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. -
విజయవాడ: కోర్టు ఆవరణలో దారుణం.. పచ్చ గూండాల అరాచకం
సాక్షి, విజయవాడ: ఏపీలో టీడీపీ శ్రేణుల అరాచకాలు ఆగడం లేదు.. అధికార మత్తులో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. తాజాగా విజయవాడలోని కోర్టు ఆవరణలోనే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పచ్చమూకలు దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై గద్దె రామ్మోహన్ అనుచరులు దాడికి దిగారు.కర్రలు, బీర్ బాటిళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఆటోలో వెంబడించి టీడీపీ గూండాలు దాడి చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు పవన్, రాజేష్లు తీవ్రంగా గాయపడ్డారు. వారు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.ఎంతమంది తల్లులను క్షోభ పెడతారు..వైఎస్సార్సీపీ కోసం పనిచేసినందుకే తమ పిల్లలపై దాడి జరిగిందని బాధితుల తల్లి మద్దెల మల్లిక అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటినుండి అరాచకం జరుగుతోంది. చంద్రబాబు, లోకేష్ ఈ దాడులకు సమాధానం చెప్పాలి. ఎంతమంది తల్లులను క్షోభ పెడతారు. ఎంతమంది మహిళల ఉసురు పోసుకుంటారు. నా బిడ్డల తలలు పగలగొట్టారు.. పరిస్థితి విషమంగా ఉంది’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పైకి సౌమ్యంగా కనిపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతున్నారని.. దాడులను ప్రోత్సహించే వ్యక్తి అని, బీరు సీసాలు, కర్రలతో మాటు వేసి దాడి చేశారన్నారు. -
‘ఉగ్రదాడి సమయంలో సీట్ల కింద దాక్కున్నాం’
జమ్మూలోని రియాసి జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికులతో నిండిన బస్సుపై శివఖోడిలో జరిగిన ఈ దాడి నుంచి వారణాసికి చెందిన అతుల్ మిశ్రా, అతని భార్య నేహా మిశ్రాలు తెలివిగా తప్పించుకున్నారు.అతుల్ మిశ్రా దంపతులు ఈ దాడి దృశ్యాలను కేవలం 10 అడుగుల దూరం నుంచి ప్రాణాలను ఉగ్గబట్టుకుని చూశారు. ఉగ్రవాదుల బుల్లెట్ల వర్షం నుంచి తప్పించుకునేందుకు బస్సు సీటు కింద దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నామని వీరు ఇతర కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే ఈ ఘటనలో వీరిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.వారణాసిలోని కాలభైరవ ప్రాంతానికి చెందిన అతుల్ మిశ్రా అతని భార్య నేహా మిశ్రాలు మాతా వైష్ణో దేవిని దర్శించుకునేందుకు జమ్మూ వెళ్లారు. ఈ ప్రమాదం అనంతరం వీరిద్దరూ వీడియో కాల్ చేసి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.ఈ దురాగతానికి పాల్పడిన పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని అతుల్ తండ్రి రాజేష్ మిశ్రా ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. కాగా అతుల్, నేహా దంపతులు తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా జూన్ ఏడున వారణాసి నుండి జమ్మూకు బయలుదేరి వెళ్లారు. వైష్ణో దేవి దర్శనం అనంతరం శివఖోడి వెళ్లి అక్కడ దైవ దర్శనం చేసుకుని, ఇతర ప్రయాణికులతో పాటు బస్సులో తిరిగి వస్తుండగా ఈ ఉగ్ర దాడి ఘటన చోటుచేసుకుంది. దాడి సమయంలో వీరు ప్రయాణిస్తున్న బస్సు కాలువలో పడింది. -
మణిపూర్ సీఎం కాన్వాయ్పై దాడి
ఇంఫాల్: మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కాన్వాయ్పై సోమవారం అనుమానిత మిలిటెంట్లు దాడి చేశారు. కాంగ్పోక్పి జిల్లాలో జాతీయ రహదారి 37 వద్ద సోమవారం ఉదయం సాయుధ ఈ ఆకస్మికంగా దాడి జరిగింది. ఈ ఘటనలో సీఎం భద్రతా సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి గాయపడ్డాడు.కాగా జూన్ 6న జిరిబామ్కు చెందిన ఓ రైతు హత్యతో అక్కడ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. గత కొన్ని రోజులుగా ఉద్రిక్తంగా మారిన ఇక్కడ పరిస్థితులను సీఎం బీరెన్ సింగ్ మంగళవారం సందర్శించేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే నేడు సీఎం కాన్వాయ్ ఇంఫాల్ నుంచి జిరిబమ్ జిల్లాకు వెళ్తున్న సమయంలో దాడి జరిగింది. సెక్యూరిటీ దళాలపై మిలిటెంట్లు పలుమార్లు ఫైరింగ్ జరిపారు. అయితే ఆ దాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టాయి.అయితే దాడి సమయంలో సీఎం సంఘటన ప్రాంతంలో లేనట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా జిరిబామ్లో వ్యక్తి హత్యతో కొందరు అరాచకవాదులు రెండు పోలీస్ అవుట్పోస్టులు, ఫారెస్టు బీట్ కార్యాలయంతోపాటు మేతీ, కుకీ తెగల వారికి చెందిన దాదాపు 70 ఇళ్లను తగలబెట్టారు. ఈ ఘటన అనంతరం మైతీ వర్గానికి చెందిన వందలాది మంది పౌరులు ఆ ప్రాంతం విడిచి వెళ్లిపోయారు. -
Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
నంద్యాల, సాక్షి: పోలింగ్ ముగియడంతో జిల్లాలో పాత పగలు భగ్గుమన్నాయి!. గత అర్ధరాత్రి ఆళ్లగడ్డలో ఒక యువకుడిపై హత్యాయత్నం జరిగింది. సదరు యువకుడ్ని టీడీపీ నేత భూమా అఖిలప్రియ దగ్గర పని చేసే బాడీగార్డుగా గుర్తించగా.. ఏవీ సుబ్బారెడ్డి మనుషులే ఈ పని చేయించి ఉంటారనే అనుమానాలు తలెత్తున్నాయి.కిందటి ఏడాది మే నెలలో జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా.. అఖిల ప్రియ వర్గీయులు కొత్తపల్లిరోడ్డులో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారు. ఆ సమయంలో నిఖిల్ ఆయనపై చేయి చేసుకున్నాడు. భూమా వర్గీయుల దాడిలో ఏవీ సుబ్బారెడ్డి నోటి నుంచి రక్తం కారింది. ఆయనను కొడుతున్నప్పుడు భూమా అఖిల ప్రియా అక్కడే ఉన్నారు. పైగా ఆమె ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులను బెదిరించడం కనిపించింది. వారిపై ఘాటు పదాలతో విరుచుకుపడ్డారామె. ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో తన తరువాతే ఇంకెవరైనా అంటూ హెచ్చరించారు. ఈ ఘటన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇరువురిని ఎన్నికలయ్యేదాకా గొడవపడొద్దని మందలించినట్లు ప్రచారం జరిగింది. కట్ చేస్తే.. ఏడాది తర్వాత నిన్న అర్ధరాత్రి ఆళ్లగడ్డలో అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్పై దాడి జరిగింది. తొలుత కారుతో నిఖిల్కు ఢీ కొట్టారు. ఆ తర్వాత అతనిపై రాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో నిఖిల్ తీవ్రంగా గాయపడగా.. నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాత పగతో సుబ్బారెడ్డి మనుషులే ఈ పని చేయించి ఉంటారని స్థానిక చర్చ నడుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై స్పందించాల్సి ఉంది. అయితే దాడికి ఉపయోగించిన వాహనం నంద్యాలకు చెందిందిగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. -
ఊరకుక్క దాడిలో చిన్నారి దుర్మరణం
తాండూరు రూరల్: దగ్గర్లోనే పనిచేస్తున్న భర్తకు మంచినీళ్లు ఇచ్చొద్దామని వెళ్లిందా తల్లి. ఇంతలోనే అంత ఘోరం జరిగిపోతుందని ఊహించలేదు. ఇంటికి తిరిగి వచ్చేసరికి తన ఐదు నెలల చిన్నారి రక్తపు మడుగులో కన్పించాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శిశువుపై ఊరకుక్క దాడి చేసింది. మెడ, కన్ను భాగంలో కరవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. వైద్యులు చికిత్సకు ఏర్పాట్లు చేస్తుండగానే బాలుడు మరణించాడు.దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మరోవైపు కోపోద్రిక్తులైన చుట్టుపక్కల ఉండే కార్మికులు కుక్కను కొట్టి చంపేశారు. మంగళవారం ఉదయం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని బసవేశ్వర్నగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. రూరల్ సీఐ అశోక్, ఎస్ఐ విఠల్రెడ్డి, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.గదిలో బాలుడు ఒంటరిగా ఉండటంతో..కర్ణాటక రాష్ట్రం రాయచూర్కు చెందిన నీలం మధు, మహబూబ్నగర్ జిల్లా వనపర్తి సమీపంలోని దుప్పల్లికి చెందిన లావణ్యల వివాహం నాలుగేళ్ల క్రితం జరిగింది. వీరికి ఐదు నెలల క్రితం సాయినాథ్ పుట్టాడు. కాగా స్టోన్ పాలిషింగ్ పనిచేసే మధు వారం క్రితమే బసవేశ్వర్నగర్లోని సంగెం కలాన్ గ్రామానికి చెందిన నాగభూషణం పాలిషింగ్ యూనిట్లో చేరాడు. సమీపంలోనే ఓ అద్దె గదిలో దంపతులు నివసిస్తున్నారు. మంగళవారం ఉదయం చిన్నారిని ఇంట్లో పడుకోబెట్టిన లావణ్య పక్కనే వంద అడుగుల దూరంలో పనిచేస్తున్న మధుకు మంచినీళ్లు ఇవ్వడానికి వెళ్లింది.బాబుకు ఉక్కపోస్తుందని, వెంటనే తిరిగొస్తాను కదా అన్న ఉద్దేశంతో గది తలుపు వేయలేదు. లావణ్య అలా బయటకు వెళ్లగానే పరిసర ప్రాంతంలో తిరుగుతున్న ఓ ఊరకుక్క ఇంట్లోకి చొరబడింది. ఒంటరిగా ఉన్న సాయినాథ్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. నాలుగేళ్లుగా సంతానం కోసం ఎదురు చూసి, ఎన్నో మొక్కులు మొక్కగా పుట్టిన ఒక్కగానొక్క కొడుకు కళ్ల ముందే చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. ‘నాన్నా లే నాన్నా’అంటూ లావణ్య రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఈ నెల 24న తిరుపతి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామని, ఇంతలోనే ఇలా జరిగిందని మధు విలపించాడు.అందరూ ఎన్నికలకు వెళ్లడంతో..సాధారణ రోజుల్లో పాలిషింగ్ యూనిట్ సమీపంలోని కార్మికుల గదుల వద్ద సందడి ఉంటుంది. అయితే ఎన్నికల నేపథ్యంలో చాలావరకు కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలకు వెళ్లడంతో పెద్దగా మనుషుల అలికిడి లేకుండాపోయింది. దీనికి తోడు మధు కుటుంబం నివాసం ఉంటున్న గది ఒక్కటే విడిగా ఉండటం, పక్కన ఇతర నివాసాలు లేకపోవడంతో కుక్క దాడి చేసేందుకు అవకాశం ఏర్పడింది. -
టీడీపీ నేతల బరితెగింపు.. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు
సాక్షి, పల్నాడు: జిల్లాలో టీడీపీ నేతలు బరి తెగించారు. తమకు ఓట్లు వేయని వారిని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని మాదల, తొండపి గ్రామాల్లో రాత్రి విధ్వంసం సృష్టించారు.గురజాల మండలం కొత్త గణేషన్ పాడులో కర్రలు రాళ్లతో వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. పోలింగ్ అనంతరం మూడు గంటల పాటు నిరంతరాయంగా దాడులు చేశారు. కొత్త గణేషన్పాడులో బీసీలపైన టీడీపీ గూండాలు దాడులు చేశారు. సీఐ స్థాయి నుంచి డీఐజీ వరకు సమాచారం ఇచ్చిన పట్టించుకోలేదు. -
పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ మూకలు
సాక్షి, పల్నాడు జిల్లా: రెంటచింతలలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. రెంటచింతల వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఉమామహేశ్వర్రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. ఉమామహేశ్వర్రెడ్డిపై ఒకేసారి 60 మందికిపైగా దాడి చేశారు.ఉమామహేశ్వర్రెడ్డి కారును టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఉమామహేశ్వర్రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.టీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు: పిన్నెల్లిటీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. దౌర్జన్యాలు, అల్లర్లతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. మహిళలపై దాడులు చేయడం సిగ్గుమాలిన చర్య. మూడు రోజుల క్రితం నా భార్యపైనా దాడి చేశారు.ఇవాళ రెంటచింతలలో మా నాయకులపై హత్యాయత్నం చేశారని పిన్నెల్లి మండిపడ్డారు. -
పాక్ నౌకాదళ ఎయిర్ స్టేషన్పై బీఎల్ఏ దాడి
పాకిస్తాన్లోని రెండవ అతిపెద్ద నౌకాదళ ఎయిర్ స్టేషన్పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) దాడికి తెగబడింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్ ఈ దాడికి పాల్పడింది. బలూచిస్థాన్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం బీఎల్ఏ ఫైటర్లు టర్బాట్లో ఉన్న పీఎన్ఎస్ సిద్ధిఖీ నేవల్ బేస్లోకి ప్రవేశించి అక్కడ పలు ప్రదేశాలలో పేలుళ్లకు పాల్పడ్డారు. నేవీ బేస్ దగ్గర అర్థరాత్రి వేళ షెల్లింగ్ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పీఎన్ఎస్ అనేది పాక్లోని రెండవ అతిపెద్ద నేవీ స్థావరం. పాకిస్తాన్ నేవీకి చెందిన ఆధునిక ఆయుధాలు ఇక్కడ నిల్వ చేస్తారు. సోమవారం రాత్రి దాడి ప్రారంభంకాగా ఇప్పటికీ కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని సమాచారం. అయితే ఈ దాడిని తాము భగ్నం చేశామని పాక్ ఏజెన్సీలు తెలిపాయి. ఈ ఉదంతంపై పాక్ ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే టర్బాట్లోని అన్ని ఆసుపత్రులలో ఎమర్జెన్సీ ప్రకటించారు. వైద్యులను అప్రమత్తం చేశారు. దీనికి ముందు జనవరి 29న గ్వాదర్లోని పాకిస్తాన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ హెడ్క్వార్టర్స్పై దాడి జరిగింది. కాగా తాజాగా టర్బాట్లో సోమవారం రాత్రి ప్రారంభమైన దాడుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు పాకిస్తాన్ భద్రతా ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. After the passage of 7 hours, the BLA Majeed Brigade still continues to hold control of the PNS Siddiqui Naval Base in #Turbat city. Firing and explosions continue, BLA fighters reportedly destroy drone operating systems at base source police pic.twitter.com/W68QW8w2os — Benjimen Baluch (@BaluchBenjimen) March 26, 2024 -
గుజరాత్ వర్సిటీలో విదేశీ విద్యార్థులపై దాడి.. ఇద్దరు అరెస్ట్
అహ్మదాబాద్: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లోని గుజరాత్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులపై కొందరు దాడికి దిగారు. క్యాంపస్లోని ఎ–బ్లాక్ హాస్టల్లో విదేశీ విద్యార్థులు కొందరు శనివారం రాత్రి నమాజ్ చేస్తుండగా ముగ్గురు విద్యార్థులు అడ్డుకున్నారు. వారికి మరో 200 మంది తోడై విధ్వంసం సృష్టించారు. రాళ్లు రువ్వడంతో శ్రీలంక, తజికిస్తాన్కు చెందిన ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు 25 మందిపై కేసులు పెట్టి ముగ్గురిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలను పునరావృతం కానివ్వబోమని వీసీ నీరజా అరుణ్ గుప్తా స్పష్టం చేశారు. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని విదేశాంగ శాఖ పేర్కొంది. -
నాదెండ్ల మనోహర్పై నీళ్ల బాటిల్తో దాడి
తెనాలి(గుంటూరు జిల్లా): పొత్తు పెట్టుకున్నప్పటికీ తెనాలిలో టీడీపీ–జనసేన నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న తీవ్ర విభేదాలు గురువారం బట్టబయలయ్యాయి. జనసేన సీనియర్ నేత, తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్పై టీడీపీ వర్గీయులు నీళ్ల బాటిల్తో దాడి చేశారు. ఈ బాటిల్ ఆయన తలకు తగిలింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గురువారం సాయంత్రం తెనాలిలో జనచైతన్య పాదయాత్ర ప్రారంభించారు. బోసు రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర వీనస్ టాకీస్ దగ్గరకు చేరుకుంది. అక్కడ టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) వచ్చి కలిశారు. ఆ వెంటనే రాజాకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పోటీగా జనసేన కార్యకర్తలు నాదెండ్ల మనోహర్ జిందాబాద్.. అంటూ నినాదాలు ప్రారంభించారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. ఈ తోపులాటలో టీడీపీ మహిళా కార్యకర్త ఒకరు ఇరుక్కుపోయారు. ఈ సమయంలో∙ఎవరో నీళ్ల బాటిల్ను నాదెండ్ల మనోహర్పైకి బలంగా విసిరారు. ఆయన తప్పుకోవాలని ప్రయత్నించినప్పటికీ తలకు తగిలింది. ఈ ఘటనతో అందరూ కంగుతిన్నారు. ఆలపాటి రాజా వర్గమే అక్కసుతో ఈ దాడికి పాల్పడిందని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆలపాటి రాజా టీడీపీ నుంచి తెనాలి టికెట్ ఆశించారని, ఆయనకు కాకుండా పొత్తుల్లో భాగంగా జనసేన నేత నాదెండ్ల మనోహర్కు ఇవ్వడంవల్లే ఈ దాడి చేశారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలతో పాదయాత్రకు వచ్చిన అనేక మంది యాత్ర పూర్తికాకుండానే వెళ్లిపోయారు. -
ఉద్రిక్తత.. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ను లాక్కెళ్లిన రైతులు
సాక్షి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంపై వేరుశెనగ రైతులు దాడి చేశారు. దీంతో అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. మార్కెట్ కమిటి ఛైర్మన్ ఛాంబర్లోకి దూసుకెళ్లిన రైతులు.. ఛైర్మన్ను కార్యాలయం నుంచి లాక్కెళ్లారు. -
సూర్యాపేట: ఉద్రిక్తత.. మాజీ ఎంపీపీ కవితపై స్థానికుల దాడి
సాక్షి, సూర్యాపేట జిల్లా: కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎంపీపీ కవితపై స్థానికులు దాడికి యత్నించారు. తమ భూమిని అక్రమంగా కబ్జా చేసి ఇళ్లు నిర్మించుకుందంటూ ఆరోపిస్తూ.. కవిత ఇంటి లోపల టెంటు వేసి నిరసన తెలిపేందుకు స్థానికులు యత్నించారు. దీంతో కవిత అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆగ్రహంతో కవిత జుట్టు పట్టుకుని స్థానికులు దాడికి దిగారు. తమ స్థలాల్ని కబ్జా చేసిన కవితపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భూమి తిరిగిచ్చేంత వరకు నిరసన తెలుపుతామని స్థానికులు అంటున్నారు. -
మంత్రి రజిని ఆఫీస్పై దాడి.. 30 మంది అరెస్ట్
గుంటూరు, సాక్షి: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీకి చెందిన గుంటూరు కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు తమ చర్యలు ప్రారంభించారు. ఈ దాడికి సంబంధించి 30 మందిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కార్యాలయంపై దాడి చేసింది టీడీపీ-జనసేన కార్యకర్తలనే పోలీసులు ధృవీకరించారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన మంత్రి విడదల రజిని కార్యాలయంపై గుర్తు తెలియని ఆగంతకులు దాడులు చేశారు. ఆఫీసుపై రాళ్ల దాడికి తెగబడడంతో పాటు ఫ్లెక్సీలను చించేసి, అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగినా.. రౌడీ మూక వెనక్కి తగ్గలేదు. చివరికి దాడికి సంబంధించి కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో ఇది టీడీపీ-జనసేన కార్యకర్తల పనిగా తేల్చారు. పచ్చమూక దాడిని తీవ్రంగా ఖండించిన మంత్రి రజిని.. బీసీ అయిన తనను దాడులతో భయపెట్టలేరన్నారు. ఓటమి భయంతో.. అధికార దాహంతోనే ఈ దాడికి పాల్పడ్డారని అన్నారామె. ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారామె. మరోవైపు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే మంత్రి రజినీ కార్యాలయంపై దాడి జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇదీ చదవండి: ఎవరున్నా విడిచిపెట్టేది లేదు: మంత్రి రజిని వార్నింగ్ -
చిత్తూరు జిల్లా: దళితులపై టీడీపీ వర్గాల దాడి
గంగవరం(చిత్తూరు జిల్లా): దళితులపై టీడీపీకి చెందిన అగ్రవర్ణాలవారు దాడులకు పాల్పడిన ఘటనలో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గురువారం మీడియా ఎదుట బాధితులు తమ ఆవేదన వెళ్లగక్కారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ మబ్బువారిపేట దళితవాడలో దాదాపు 30 ఇళ్లలో ప్రజలు నివాసం ఉంటున్నారు. వీళ్లందరికీ అధికార పార్టీ వైఎస్సార్సీపీ అంటే అమితమైన అభిమానం.దీన్ని జీర్ణించుకోలేని ఇదే గ్రామంలో టీడీపీకి చెందిన అగ్ర కులస్థులు నిత్యం కులం పేరుతో దూషించడం, అవమానించడం వంటివి పరిపాటిగా సాగిస్తున్నారు. బుధవారం రాత్రి వారు పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటుండగా.. టీడీపీకి చెందిన అల్లరిమూకలు దుర్గ, గోవర్ధన్, రాకేష్ మరి కొంతమంది అనుచరులతో వెళ్లి అక్కడ గొడవలు సృష్టించారు. ఇంతలో రవి అనే వ్యక్తి అందరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. అందరూ కలిసి అతనిపై పైశాచికంగా దాడి చేశారు. అడ్డొచ్చిన మహిళల పైనా దాడులకు పాల్పడి కులం పేరుతో దూషించినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక వైఎస్సార్సీపీ నేతలు దళితులపై దాడి విషయాన్ని ఎమ్మెల్యే వెంకటేగౌడ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎస్ఐ ప్రతాప్రెడ్డిని వివరణ కోరగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఇదీ చదవండి: మా అవినీతినే బయటపెడతారా.. మీ అంతు చూస్తాం -
ఫొటో జర్నలిస్ట్ గోపాల్పై దాడి
హైదరాబాద్: విధి నిర్వహణలో ఉన్న ఫొటో జర్నలిస్ట్ నగర గోపాల్పై దాడి చేసిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం (టీఎస్పీజేఏ) అధ్యక్షుడు అనుమళ్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శి కె.ఎన్.హరి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫొటో జర్నలిస్ట్ నగర గోపాల్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. స్వల్ప వివాదం కారణంగా మహేష్గౌడ్ అనే వ్యక్తి కర్రతో తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడిన గోపాల్ ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. గోపాల్ను సహచర ఫొటో జర్నలిస్టులతో కలసి వారు పరామర్శించారు. స్థానిక పోలీసులు నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే గోపాల్పై దాడి చేసిన మహేష్గౌడ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
బరితెగించిన టీడీపీ నేత ధూళిపాళ్ల అనుచరులు.. రైతులపై దాడి
సాక్షి, గుంటూరు జిల్లా: టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులు బరితెగించారు. సంగం డెయిరీ యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన రైతులపై దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాడ్డులతో విక్షచణారహితంగా ధూళిపాళ్ల అనుచరులు దాడి చేశారు. దాడిలో పలువురు రైతులు గాయపడ్డారు. ధూళిపాళ్ల నరేంద్ర డైరెక్షన్లోనే ఈ దాడి జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. పాలు పోయించుకుని బోనస్ ఇస్తామంటూ సంగం డెయిరీ యాజమాన్యం మోసానికి తెరతీసింది. ఇది అన్యాయం అంటూ అడగడానికి వచ్చిన ఏలూరు జిల్లా రైతులపై దాడికి పాల్పడ్డారు. చదవండి: చంద్రబాబు మెడికల్ రిపోర్ట్ ఇచ్చింది వైద్యులా? రాజకీయ నేతలా?: సజ్జల -
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నం
సాక్షి, సిద్దిపేట: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. కత్తితో ఓ వ్యక్తి ఆయనపై దాడి చేయగా.. కడుపులో గాయం అయ్యింది. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. సూరంపల్లి ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మెదక్ లోక్సభ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్రెడ్డి.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఈ క్రమంలో దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. కత్తితో దాడి చేసిన నిందితుడ్ని బీఆర్ఎస్ కార్యకర్తలు చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడ్ని మిరుదొడ్డి మండలం చెప్పాల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. హుటాహుటిన బయల్దేరిన హరీష్రావు కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి సంగతి తెలియగానే మంత్రి హరీష్రావు ఫోన్లో పరామర్శించారు. మెదక్ హుటాహుటిన బయల్దేరారు. అవసరం అయితే హైదరాబాద్ కు తీసుకురావాలని బీఆర్ఎస్ నేతలకు హరీష్రావు సూచించారు. -
ఏలూరు: లోకేష్ యాత్రలో రెచ్చిపోయిన టీడీపీ రౌడీలు
సాక్షి, ఏలూరు: లోకేష్ పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. తుక్కులూరులో విధ్వంసానికి యత్నించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్ల దగ్గర రెచ్చగొట్టే చర్యలకు దిగిన టీడీపీ శ్రేణులు.. వైఎస్సార్సీపీ నేత విజయ్ ఇంటిపై రాళ్లు రువ్వారు. దీంతో ఇంటి అద్దాలు ధ్వంసం కాగా, వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. టీడీపీ అరాచకాలను చిత్రీకరిస్తున్న మీడియాపై కూడా దాడులకు తెగబడ్డారు. మీడియా ప్రతినిధుల ఫోన్లను సైతం లోకేష్ యువగళం టీమ్ లాక్కొంది. అడ్డుగా వెళ్లిన రూరల్ కానిస్టేబుల్పై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. చదవండి: ఆర్జీవీ థర్డ్ గ్రేడ్ అంటూ లోకేశ్ వ్యాఖ్యలు.. రివర్స్ కౌంటర్ ఇచ్చిన వర్మ -
ఎంపీ ఇంటిపైనే రాళ్ల దాడి జరిగితే సామాన్యుడి పరిస్థితేంటి?
సాక్షి, హైదరాబాద్: నాలుగు పర్యాయాలు ఎంపీ అయిన తన ఇంటిపైనే రాళ్ల దాడి జరిగితే.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్ దార్సుసలాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలోని తన ఇంటిపై రాళ్ల దాడి జరగడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఒక వైపు ముస్లింల ఇళ్లపై బుల్డోజర్లు ప్రయోగిస్తూనే, మరోవైపు ఎంపీ ఇంటిపై రాళ్లు రువ్వుతున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్లతో కూల్చివేతలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా రాళ్ల దాడులకు, తాటాకు చప్పుళ్లకు భయపడేదిలేదన్నారు. ఇలాంటి ఘటన బీజేపీ నేత ఇంటిపై జరిగితే స్పందన మరోలా ఉండేదని ఒవైసీ అన్నారు. దేశంలో జరుగుతున్న హింసాకాండపై ప్రధాని మోదీ నోరు మెదపడం లేదని, కనీసం స్వాత్రంత్య్ర దినోత్సవ ప్రసంగంలోనైనా స్పందిస్తారా? కనీసం ఖండిస్తారా? అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ఎక్కడ ఉంది? అంటూ నిలదీశారు. -
తన్నులు తిన్న మహిళాపైలట్పై చర్యలు
ఢిల్లీ: ఇండిగోకు చెందిన ఓ మహిళా పైలట్ను, ఆమె భర్తను కొందరు చితకబాదిన వీడియో నిన్నంతా విపరీతంగా వైరల్ అయ్యింది. తమ ఇంట్లో పని చేసే పదేళ్ల చిన్నారిని వేధిస్తున్నారని, శారీరకంగా గాయపర్చానే కారణంతో ఆ చిన్నారి బంధువులే ఆ పని చేశారు. అయితే.. ఈ ఘటన వైరల్ కావడంతో ఇండిగో ఎయిర్లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. సదరు పైలట్ను విధుల నుంచి పక్కనపెడుతున్నట్లు ప్రకటించింది. సదరు ఘటనపై దర్యాప్తు నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఢిల్లీ ద్వారకా ప్రాంతంలో తాజాగా ఇది చోటు చేసుకుంది. రెండు నెలలుగా ఆ చిన్నారిని వాళ్లు వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె భర్త కూడా అదే ఎయిర్లైన్స్లో పని చేస్తుండగా.. ఆయన విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఇదిలా ఉంటే.. ద్వారకా పోలీస్ స్టేషన్లో ఆ జంటపై కేసు నమోదు అయ్యింది. Injuries of the minor that she was beaten and brunt by the couple pic.twitter.com/jYVwWzbfTx — । अतुल । (@atulamist7) July 19, 2023 ఇదీ చదవండి: సెల్ఫోన్ వాడుతోందని తిడితే.. జలపాతంలో దూకింది -
స్పైడర్ మ్యాన్ ను పట్టుకొని చితక్కొట్టేశారు..
న్యూయార్క్: 15 ఏళ్ల అమెరికా టీనేజర్ స్పైడర్ మ్యాన్ వేషధారణలో పార్కుకు వెళ్తే అక్కడి ఆకతాయి యువత బాలుడిని ఎగతాళి చేసి గాయపరిచారు. పాపం స్పైడర్ మ్యాన్ కు ముక్కు నుండి రక్తం ధారకట్టడంతో నిస్సహాయంగా నిలుచుండిపోయాడు. వారు దాడి చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. హడ్సన్ ఫాల్స్ కు చెందిన 15 ఏళ్ల అయిడిన్ పెడోన్ న్యూయార్క్ లోని ఒక పార్కు వారు నిర్వహించిన సూపర్ హీరో థీమ్ లో పాల్గొనేందుకు తనకు ఇష్టమైన స్పైడర్ మ్యాన్ గెటప్ వేసుకుని పార్కుకి వెళ్ళాడు. అంతలోనే అక్కడికి వచ్చిన కొంతమంది టీనేజర్లు అయిడిన్ చుట్టూ చేసిరి మొదట ఎగతాళి చేశారు. ఆ గుంపులోని ఒక అమ్మాయి అయిడిన్ ముఖంపై బలంగా కొట్టింది. దాంతో తూలిపడబోయిన అయిడిన్ ఆపుకుని స్పైడర్ మ్యాన్ మాస్క్ తొలగించగా ముక్కు మీద తీవ్ర గాయం కావడంతో రక్తం బొటబొటా కారింది. ఈ సంఘటన జరుగుతుండగా పార్కులో మిగతావారు ఫోన్లో ఈ సన్నివేశాన్ని వీడియో తీస్తూ కనిపించడం విశేషం. This is actually disgusting… I hope there were consequences for what they did to that poor boy pic.twitter.com/vQ2hHEDcU4 — FadeHubb (@FadeHubb) July 1, 2023 స్థానిక మీడియా న్యూయార్క్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం అయిడిన్ చికిత్స పొందుతున్నాడని, గో ఫండ్ మి అనే పేజీ ప్రతినిధులు మరోసారి అయిడిన్ ఇలా దెబ్బలు తినకుండా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి చందాలు వసూలు చేయగా ఇప్పటికి 10,000 యూఎస్ డాలర్లు( రూ 8.21 లక్షలు) పోగయ్యాయని అన్నారు. ఆరో తరగతి చదువుతున్న అయిడిన్ కు ఆత్మన్యూనతా భావం ఎక్కువని, స్కూల్లో తరచుగా సహచరులు తనని ఆటపట్టిస్తూ ఉండటంతో ఆ భావం నుండి బయటపడేందుకు ఆదివారం తనకు ఇష్టమైన స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకున్నాడని, తీరా అక్కడ ఇలా జరగడం అమానుషమని అన్నారు. చుట్టూ ఉన్నవారు దాడిని ఆపకపోగా వీడియోలు తీస్తూ నవ్వుతుండడం మరింత బాధించిందని తెలిపారు. అయిడిన్ తల్లి ఫిర్యాదు మేరకు హడ్సన్ ఫాల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దాడి చేసిన టీనేజ్ అమ్మాయిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇది కూడా చదవండి: Roller Coaster: తలకిందులుగా వేలాడుతూ.. 3 గంటలు నరకయాతన.. -
హాయ్ చెప్పినందుకు చితక్కొట్టారు..
సాక్షి, కరీంనగర్: మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు ఓ యువకుడిని చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాంత్ అనే వ్యక్తి కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ఉన్న లక్కీ బార్కు వెళ్లాడు. అక్కడ అప్పటికే మద్యం సేవిస్తున్న మరో నలుగురు ఫ్రెండ్స్ ఉండగా.. శ్రీకాంత్ హాయ్ చెప్పాడు. అయితే, శ్రీకాంత్ వెటకారంగా నమస్తే చెప్పినట్టు భావించిన ఆ నలుగురు ఫ్రెండ్స్ అప్పటికే మద్యం మత్తులో కూడా ఉండటంతో.. బార్ లోనే శ్రీకాంత్ పై దాడికి పాల్పడ్డారు. నలుగురు కలిసి విచక్షణారహితంగా దాడికి పాల్పడటంతో.. శ్రీకాంత్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సీసీ కెమెరా ఫుటేజీ కూడా పోలీసులు పరిశీలించారు. బాధితుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: హైదరాబాద్లో మహిళా టీచర్ మిస్సింగ్.. అసలేం జరిగింది? -
ఈ యువతికి ఏనుగు ఎలా జలక్ ఇచ్చిందో చూడండి!
-
యూఎస్ కాన్సులేట్ వెలుపల ‘వందేమాతరం’ నినాదాల హోరు!
ఖలిస్తాన్ మద్దతుదారులు యూకేలోని భారత్ హైకమిషన్పై దాడి చేసిన ఘటన మరువ మునుపే సుమారు రెండు వేల మంది వేర్పాటు వాదులు భవంతి సమీపంలో నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర నిరసనను తెలియజేస్తూ..తగిన చర్యలను తీసుకోవాలని యూకేని కోరింది. దీంతో అప్రమత్తమైన లండన్ పోలీసులు వేర్పాటువాదుల దాడి యత్నాన్ని విఫలం చేశారు. ఈ నేపథ్యంలో ఖలిస్తాన్ మద్దతుదారులకు ప్రతిస్పందనగా అమెరికాలోని శాన్ ప్రావిన్స్స్కోలో భారత హైకమిషన్ వెలుపల భారతీయుల బృందం జాతీయ జెండాను, యూఎస్ జెండాను పట్టుకుని ఊపుతూ..వందేమాతరం, భారత్మాతాకీ జై అని నినాదాలు చేశారు. మరోవైపు ధోల్ దరువులు కూడా మారుమ్రోగాయి. అదేసమయంలో కొంతమంది నిరసనకారులు దూరంగా ఖలిస్తాన్ జెండాలను ఊపుతూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. కాగా, శాన్ప్రాన్సిస్కోలో భారతీయ కాన్సులేట్పై ఒక గుంపు దాడి చేసి భవనం వెలుపల గోడపై ఫ్రీ అమృత్పాల్ అని రాసి భారీ గ్రాఫిటీని స్ప్రే చేసిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగడం గమనార్హం. అంతేగాదు అంతకుమునుపు యూఎస్లోని భారత్ హైకమిషన్ వెలుపల ఖలిస్తానీ మద్దతుదారులు భారత్ జెండాను తొలగించారు ప్రతిగా పెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సంగతి తెలిసింది. అలాగే భారత్ దీనిపై తీవ్రంగా నిరసించడమే గాక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా ఒక ప్రకటనలో యూఎస్ని కోరింది. #WATCH | United States: Indians gather outside the Indian consulate in San Francisco in support of India's unity pic.twitter.com/tuLxMBV3q0 — ANI (@ANI) March 25, 2023 (చదవండి: ప్రకంపనలు రేపుతున్న ఉత్తర కొరియా ప్రకటన.. సునామీని పుట్టించే..) -
ఇండియన్ కాన్సులేట్పై ఖలిస్తాన్ మద్దతుదారుల దాడి
న్యూఢిల్లీ: ఖలీస్తాన్ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. అమృత్పాల్ సింగ్ అరెస్టును వ్యతిరేకిస్తూ.. విదేశాల్లో భారత సంబంధిత దౌత్యపరమైన కార్యాలయాలపై వరుస దాడులకు తెగబడుతున్నారు. లండన్లో భారత హైకమిషన్ భవనం వద్ద భారతీయ జెండాను కిందకు లాగి అవమానపరిచే యత్నం మరిచిపోకముందే.. తాజాగా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్పై దాడికి పాల్పడ్డారు. పంజాబ్లో ఖలీస్తాన్ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్ను.. సినీ ఫక్కీ ఛేజ్ తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం అంతర్జాతీయంగా ప్రభావం చూపెడుతోంది. ఖలిస్తాన్ మద్దతుదారులు భారత దౌతకార్యాలయాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆదివారం లండన్లోని భారతీయ హైకమిషన్ భవనం వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. భారతీయ జెండాను కిందకు దించి.. ఖలీస్తానీ జెండాను ఎగరేసే యత్నం చేశారు. అయితే.. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ.. ఆ దేశపు దౌత్యవేత్తలకు వివరణ కోరుతూ సమన్లు సైతం జారీ చేసింది. అయితే.. తాజాగా శాన్ ఫ్రొన్సిస్కో(యూఎస్ స్టేట్ కాలిఫోర్నియా)లోని ఇండియన్ కాన్సులేట్ భవనంపై దాడి జరిగింది. గుంపుగా వచ్చిన కొందరు దాడికి పాల్పడడంతో పాటు అక్కడి గోడలపై ఫ్రీ అమృత్పాల్(అమృత్పాల్ను విడుదల చేయాలి) అంటూ రాతలు రాశారు. ఆ సమయంలో బ్యాక్గ్రౌండ్లో పంజాబీ సంగీతం భారీ శబ్ధంతో వినిపిస్తోంది. దాడికి పాల్పడిన దుండగుల్లోనే కొందరు వీడియోలు తీయడం విశేషం ఇక్కడ. ఈ పరిణామంపై అదనపు సమాచారం అందాల్సి ఉంది. After London, now San Francisco - Indian consulate in San Francisco is attacked by Khalistan supporters. For Modi’s security, Rs 584 crores spent every year, but India’s diplomatic missions are left unsecured. pic.twitter.com/scJ9rKcazW — Ashok Swain (@ashoswai) March 20, 2023 ఇదీ చదవండి: త్రివర్ణ పతాకాన్ని అవమానం నుంచి కాపాడారు! -
Hyd: సీసీటీవీలో అసభ్యప్రవర్తన.. చితకబాదేశారు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎస్సార్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న ఓ బాలికను వేధింపులు గురిచేశాడు ఓ యువకుడు. దీంతో ఆగ్రహానికి గురైన బాలిక బంధువులు అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. బాలికతో సదరు యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. బాధితురాలు విషయం చెప్పడంతో.. సీసీటీవీలను పరిశీలించి నిందితుడిని గుర్తించారు ఆమె బంధువులు. ఆపై వేధింపులపై అతన్ని నిలదీస్తూ.. చితకబాదారు. చివరకు పోలీసులకు అప్పగించారు. -
సింగర్ సోనూ నిగమ్పై ముంబైలో దాడి
-
యూత్ కాంగ్రెస్ నేతపై దాడి.. రేవంత్ యాత్ర ముగిసిన కొద్దిసేపటికే..
వరంగల్ : హనుమకొండలో సోమవారం రాత్రి కాంగ్రెస్ యువజన నాయకుడు తోట పవన్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా బహిరంగసభ ముగిసిన కొన్ని నిమిషాలకే సభావేదికకు వంద మీటర్ల దూరంలోనే ఈ దాడి జరిగింది. ముక్కు, కుడి కన్ను భాగంలో బలమైన గాయాలయ్యాయి. వీపుపై వాతలు తేలాయి. రక్తపుమడుగులో ఉన్న పవన్ను స్థానికులు గమనించి హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. డీసీసీ నేత నాయిని రాజేందర్రెడ్డి ఆస్పత్రి వద్ద మాట్లాడుతూ పవన్పై బీఆర్ఎస్ కార్యకర్తలే దాడి చేశారని ఆరోపించారు. ప్లకార్డులతో నిరసన..: రేవంత్రెడ్డి యాత్ర సమయంలో హనుమకొండలోని బాలసముద్రం అంబేడ్కర్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను పేదలకు పంచాలని తోట పవన్ డిమాండ్ చేస్తూ స్థానికులతో కలిసి ప్రదర్శన చేపట్టారు. ఆ తరువాత రేవంత్ బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీని ప్రదర్శించారు. ఆ సభ ముగియగానే ఈ దాడి జరిగింది. -
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ నివాసంపై దుండగుల దాడి
సాక్షి, ఢిల్లీ: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ నివాసంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. రాజస్థాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లకముందే ఈ దాడి జరిగింది. ఘటనాస్థలంలో ఆధారాలను ఫోరెన్సిక్ సేకరించింది. ఘటనపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటివరకు ఢిల్లీలో నాలుగుసార్లు దుండగులు దాడికి పాల్పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటిపై రాళ్లు విసిరారని అసదుద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు అసదుద్దీన్ ఇంటిపై నాలుగు సార్లు దాడి జరిగింది. కాగా, ఒవైసీ రెండు రోజుల రాజస్థాన్ పర్యటనలో ఉన్నారు. అక్కడ ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ ప్రచారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.. చదవండి: రింగ్ మాస్టర్కు ఝలక్.. నువ్వు లక్కీఫెలో భయ్యా! -
దళిత మహిళ ఆదిలక్ష్మిపై పరిటాల సునిత వర్గీయుల దాడి
-
అనంత: టీడీపీ నేతల దౌర్జన్యకాండ.. మహిళపై సునీత వర్గీయుల దాడి
సాక్షి, అనంతపురం: జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ దళితురాలిపై పరిటాల సునీత వర్గీయులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమెను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు బంధువులు. ఈ దాడిలో గాయపడిన ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పరిటాల వర్గీయులు తనను వేధిస్తన్నారని, వాళ్ల నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఆదిలక్ష్మి చెబుతోంది. అంతేకాదు బాధితురాలు గత నెలలో పరిటాల సునీతకు తన సమస్య చెప్పే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకుండా పోయిందని చెబుతోందామె. -
వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దేవినేని ఉమా అనుచరుల దాడి
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు మండలం గంగినేనిపాలెంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై టీడీపీ నేత దేవినేని ఉమా అనుచరులు దాడికి పాల్పడ్డారు. సర్పంచ్ రామారావు, ఎంపీటీసీ ప్రసాద్పై దాడికి టీడీపీ నేతలు యత్నించారు. అడ్డుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్రగాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. టీడీపీ నేతల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. -
చిత్తూరు: పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల బరితెగింపు
-
మహిళతో వివాహేతర సంబంధం.. సెల్ఫోన్ చార్జర్ వైర్తో ఆమె పిల్లలపై..
ఆటోనగర్ (విజయవాడతూర్పు): మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమె పిల్లలపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో చిన్నారులు సుధాకర్ (11), యేసు (5) గాయాలపాలయ్యారు. పటమట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదాల దైవకృప జ్యోతి (శ్రావణి) వెంకన్నకు 13 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరు కృష్ణా జిల్లా కెంపల్లి కొత్తగూడెంలో ఉండేవారు. వీరిద్దరూ రెండేళ్ల క్రితం విడిపోయారు. శ్రావణి ప్రస్తుతం భారతినగర్లో నివాసముంటూ నగరంలోని ప్రముఖ హోటల్లో పని చేస్తుంది. అక్కడే పని చేస్తున్న రఘువర్మతో పరిచయం ఏర్పడటంతో ఆరు మాసాలుగా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం నడుస్తుంది. సరిగా చదవడం లేదనే సాకుతో రఘువర్మ సుధాకర్, యేసును సెల్ఫోన్ చార్జర్ వైర్తో కొట్టడంతో పిల్లల వీపులపై వాతలు వచ్చాయి. దీంతో శ్రావణి పటమట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పిల్లలను చైల్డ్లైన్కు తరలించారు. రఘువర్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఘట్కేసర్: కాలేజీ వాట్సాప్ గ్రూపుల్లో బీటెక్ స్టూడెంట్స్ ఫేక్ న్యూడ్ ఫొటోలు.. -
Rajouri: హిందువులపై దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం
శ్రీనగర్: రెండు రోజుల వ్యవధిలో జరిగిన ఉగ్రదాడులు.. ఆరుగురి దుర్మరణం.. ఇందులో ఇద్దరు చిన్నారులు.. పదుల సంఖ్యలో గాయపడడంతో సరిహద్దు జిల్లా రాజౌరిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. హిందూ కుటుంబాలనే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చెలరేగిపోతుండడంతో.. భద్రతాపరంగా అధికార యంత్రాంగం వైఫల్యం చెందుతోందని స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాజౌరి జిల్లాలో భారీగా పారామిలిటరీ ట్రూప్స్ను మోహరిస్తోంది కేంద్ర హోం మంత్రిత్వశాఖ. ఇప్పటికే సీఆర్పీఎఫ్ తరపున 18వేల సిబ్బంది రంగంలోకి దిగారు. గత మూడు రోజులుగా వందల సంఖ్యలో బలగాలు రాజౌరీలో మోహరించగా.. మరికొన్ని కంపెనీలు జమ్ముకి బయల్దేరాయి. దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల ఎరివేతే లక్ష్యంగా సైన్యం, స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్తో కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. జమ్ము కశ్మీర్లో ఇప్పటికే సీఆర్ఎఫ్ బలగాలు ఉనికి భారీగా ఉంది. డెబ్భైకి పైగా బెటాలియన్లు(మొత్తం సీఆర్ఎఫ్ బలగాల సామర్థ్యంలో 3వ వంతు) జమ్ము కశ్మీర్లోనే భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. ఇక రాజౌరి జిల్లా ఉప్పర్ డాంగ్రీ గ్రామంలో.. ఆదివారం సాయంత్రం ఇద్దరు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. ఆ మరుసటి రోజే ఉగ్రవాదుల కోసం కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు పాతిన ఐఈడీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులను చనిపోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. నెల వ్యవధిలో ఇది మూడో ఉగ్రదాడి ఘటన. గత నెలలో ఆర్మీ క్యాంప్ సమీపంలోనే ఇద్దరిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. హిందూ కుటుంబాల నివాసాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతుండడంతో.. చాలా మంది అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధికారులు భద్రతకు తమది హామీ అని ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. -
Viral Video: సరదాకి గెలికాడు.. దెబ్బకు దూలతీర్చేసిందిగా..
-
అర్థరాత్రి షాకింగ్ ఘటన.. దంపతులపై దాడి.. మహిళను కారు ఎక్కాలంటూ..
జహీరాబాద్(సంగారెడ్డి జిల్లా): అర్ధరాత్రి దంపతులు బస్సుదిగి నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో యువకులు దాడి చేసిన వీడియో వైరల్గా మారింది. ఆదివారం రాత్రి పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన దంపతులు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో బస్టాండ్లో బస్సుదిగి కాలినడకన తమ ఇంటికి వెళుతున్నాడు. ఈ క్రమంలో యువకులు వారిని అనుకరిస్తూ బ్లాక్రోడ్డులో అటకాయించారు. కారులో ఎక్కాలంటూ మహిళపై దాడి చేయగా, ఆమె కేకలు వేసిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. యువకులు తాగిన మైకంలో వారిని అటకాయించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఎస్ఐ శ్రీకాంత్ను వివరణ కోరగా దంపతులపై జరిగిన జరిగిన దాడిపై ఫిర్యాదు అందిందని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో నిందితులను అరెస్ట్చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. చదవండి: ఇలా కూడా పగ తీర్చుకోవచ్చా..! -
ఎంబీబీఎస్ విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో దాడి చేసిన జ్ఞానేశ్వర్
-
పశువుల కాపరి పై దాడి చేసిన పులి..
-
చిలుకలన్నీ కలిసి పాము పై దాడి..
-
FRO పై దాడి చేసిన గొత్తికోయల గ్రామ బహిష్కరణ
-
హేయనీయం: ‘పైసలొద్దు.. నన్ను వదిలేయండయ్యా!’
క్రైమ్: పని చేసి.. దానికి ప్రతిఫలం అడిగిన ఓ వ్యక్తిని కులం పేరుతో దూషించడమే కాదు.. అతనిపై దాష్టికానికి పాల్పడ్డారు కొందరు. వద్దని వేడుకుంటున్నా వినిపించుకోకుండా ఆ వ్యవహారమంతా వీడియో తీసి.. సోషల్ మీడియా ద్వారా వైరల్ చేశారు. ఓ దళితుడిని కులం పేరిట దూషించడమే కాదు.. అతనిపై దాడికి దిగారు. అక్కడితో ఆగకుండా అతనితో బలవంతంగా వాళ్ల మూత్రం తాగించి, మెడలో చెప్పుల దండ వేశారు. నవంబర్ 23వ తేదీన రాజస్థాన్ సిరోహిలో హేయనీయమైన ఈ ఘటన చోటు చేసుకుంది. భరత్ కుమార్ అనే వ్యక్తి స్థానికంగా నగరంలో ఎలక్ట్రిషియన్గా పని చేస్తున్నాడు. ఓ దాబాలో కరెంట్ వైరింగ్ పని చేసి.. రూ. 21వేలు బిల్లుగా వేశాడు. కానీ, ఆ దాబా ఓనర్ ఐదు వేలు మాత్రమే చెల్లించి.. మిగతా పేమెంట్ కోసం భరత్ను చాలాసార్లు తిప్పించుకున్నాడు. సహనం కోల్పోయిన భరత్ ఓ రాత్రి.. దాబా వద్దకు వెళ్లి మిగతా డబ్బు ఇవ్వాలని గట్టిగా నిలదీశాడు. దీంతో.. కోపంతో ఆ దాబా ఓనర్, అతని మరో ఇద్దరు స్నేహితులు కలిసి భరత్పై దాడి చేశారు. వద్దని వేడుకున్నా.. అతనిపై వికృత చేష్టలకు పాల్పడి వీడియోలు తీశారు. తనకు డబ్బులు వద్దని, వదిలేయాలంటూ బతిమాలుకున్నాడు. కులం పేరుతో అతన్ని దూషిస్తూ తమ మూత్రం తాగించారు ఆ ముగ్గురు. ఆపై తమ చెప్పులను దండగా చేసి అతని మెడలో వేశారు. ఐదు గంటలపాటు సాగింది వాళ్ల దాడి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాళ్లు.. భరత్ కేకలు విని కూడా పట్టనట్లు వెళ్లిపోయారు. ఆపై నిందితులు ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అది చూసి అవమానం భరించలేక పోలీసులను ఆశ్రయించాడు భరత్. దీంతో అట్రాసిటీ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. Video Credits: First India News -
భద్రాద్రి: గుత్తికోయల దాడి.. ఫారెస్ట్ రేంజర్ మృతి
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: కలకలం సృష్టించిన గుత్తి కోయల దాడి ఘటనలో ఫారెస్ట్ అధికారి మృతి చెందారు. పోడు భూములకు సంబంధించి గుత్తికోయలకు , ఫారెస్ట్ అధికారులకు మధ్య మంగళవారం గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడ్డ ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. చంద్రుగొండ మండలం బెండలపాడులో మంగళవారం ఈ దాడి ఘటన చోటు చేసుకుంది. ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ను వెంటాడి మొదటి కర్రతో దాడి చేశారు. కిందపడిపోయిన తర్వాత వేట కొడవళ్లు, గొడ్డళ్లతో దాడి చేశారు. ఘటన గురించి తెలిసిన వెంట హుటాహుటిన చండ్రుగొండ చేరుకున్నారు డీఎస్పీ వెంకటేశ్వరబాబు, సీఐ వసంత్ కుమార్లు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతోన్న శ్రీనివాస్ను చంద్రుగొండ పిహెచ్సీకి తరలించారు. పరిస్తితి విషమించడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. గత కొంతకాలంగా ఫారెస్ట్ అధికారులకు, ఆదివాసులకు మధ్య పోడు భూముల విషయంలో వరుసగా జరుగుతున్న వివాదాలు ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. బెండలపాడు సమీపంలోని ఎర్రబొడు అటవీప్రాంతంలో గుత్తికోయలు పోడు వ్యవసాయం చేసుకుంటున్న భూముల్లో గతంలో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటారు. ఈ నాటిన మొక్కల్ని తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో పలుమార్లు ఫారెస్ట్ అధికారులకు, పోడు రైతులకు మధ్య గొడవ కూడా జరిగింది. గతంలో లాఠీఛార్జ్ సైతం చేశారు. తాజాగా ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ మళ్లీ భూముల్లో అధికారులను నాటిన మొక్కల్ని ధ్వంసం చేశారు గుత్తికోయలు. దానిని అడ్డుకునే క్రమంలో అధికారులు, గుత్తి కోయలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావుపై వేట కొడవళ్లతో దాడి చేశారు. -
కోనసీమ జిల్లా: అంకంపాలెంలో మహిళలపై తేనెటీగల దాడి
-
దాడి జరిగినా లెక్కచేయని సూపర్ స్టార్ కృష్ణ.. కంటికి కట్టుతో.. 1985లో ఏం జరిగిందంటే?
కర్నూలు కల్చరల్: సినీ హీరో సూపర్స్టార్ కృష్ణకు జిల్లాతో ఆత్మీయ అనుబంధం ఉంది. నంద్యాల సమీపంలోని ఫారెస్ట్లో రైల్వే వంతెనపై నిర్వహించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం షూటింగ్లో పాల్గొన్నాడు. 1985లో కృష్ణ కాంగ్రెస్ తరపున జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చదవండి: హార్సిలీ హిల్స్తో సూపర్స్టార్ కృష్ణకు విడదీయరాని అనుబంధం నంద్యాలలో ఎన్నికల ప్రచారం ముగించుకొని రాత్రి 11 గంటల సమయంలో కర్నూలు చేరుకుంటుండగా నంద్యాల చెక్ పోస్ట్ సమీపంలో టీడీపీ శ్రేణులు రాళ్ల దాడి చేశారు. దాడిలో కృష్ణ కంటికి గాయమైంది. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి లో చికిత్స చేయించుకొని(కంటికి కట్టుతో) ఎస్టీబీసీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అర్ధరాత్రి అయినా అభిమానులు ఆయనను చూసేందుకు అలాగే వేచి ఉండటం ఆయన మంచి తనానికి నిదర్శనం. అలాగే బంగారుపేటలో నివాసం ఉండే బాబ్జి.. కృష్ణకు వీరాభిమాని, మంచి మిత్రుడు. ఆయన నివాసానికి విజయ నిర్మలతో కృష్ణ తరచూ వచ్చి పోయేవారు. ప్రస్తుతం ఆనంద్ థియేటర్ ఉన్న ప్రాంతంలో బాబ్జి ఏర్పాటు చేసిన రైస్మిల్ను కృష్ణ దంపతులు ప్రారంభించారు. కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సాయిబాబా థియేటర్లో, పండంటి కాపురం నేతాజీ థియేటర్లో, పాడిపంటలు విక్టరీ థియేటర్లో, ఊరికి మొనగాడు శ్రీరామ థియేటర్లో వంద రోజులు ఆడాయి. అభిమానులు విజయోత్సవ సభలు ఘనంగా నిర్వహించారు. కృష్ణ అభిమానుల సంఘానికి చెందిన నాయకులు బుధవార పేటకు చెందిన కుమార్, శేఖర్లు కృష్ణ సినిమా విడుదలైన ప్రతిసారి చెన్నై, హైదరాబాద్ వెళ్లి ఆయనకు కలిసి వచ్చేవారు. కృష్ణ మృతి పట్ల టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, కార్యదర్శి మహమ్మద్ మి య్యా, ఉపాధ్యక్షులు ఇనాయతుల్లా, ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్వీ మోహన్రెడ్డి, కార్యాధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, కర్నూలు రంగ స్థల కళాకారుల సంక్షేమ సంఘం నాయకులు బైలుప్పల షఫీ తదితరులు సంతాపం ప్రకటించారు. సినిమా రంగంలో సరికొత్త పోకడలకు నాంది పలికిన మహా నటుడు కృష్ణ అని అభిప్రాయపడ్డారు. -
IBS ర్యాగింగ్ కేసులో వెలుగు చూస్తున్న మరిన్ని నిజాలు
-
ఎమ్మెల్యే రసమయి కాన్వాయ్ పై యువకుల దాడి
-
హిజ్రాపై దాష్టికం.. జట్టు కత్తిరించి చిత్రవధ చేస్తూ..
చెన్నై: హిజ్రాపై దారుణానికి తెగబడ్డ ఇద్దరు యువకులను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు పోలీసులు. ఓ హిజ్రాను పొలంలో చీర చించేసి.., జుట్టు కత్తిరించి.. చిత్రవధ చేస్తూ హింసించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమిళనాడు ట్యూటికోరిన్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 19 సెకండ్ల నిడివి ఉన్న వీడియోలో.. బ్లేడ్తో హిజ్రా జుట్టును కోసేసి పొలంలో పడేశారు. ఆమె ముఖం దాడి మూలంగా ఛిద్రమైనట్లు కనిపిస్తోంది. ఆ పక్కనే మరో హిజ్రా ఉండగా.. దాడికి పాల్పడ్డ ఇద్దరు యువకులు ‘‘వీళ్లను చూడండి. ఇంతకాలం మగవాళ్ల నుంచి డబ్బు దోచుకున్నారు. ఇప్పుడు మనమేం చేయాలి? అంతా అయిపోయింది. వీళ్లేం అందంగా కనిపించడం లేదు కదా’’ అంటూ గట్టిగట్టిగా అరిచారు. Couple of trans women attacked by this goons @tnpoliceoffl @CityTirunelveli @TUTICORINPOLICE @sivagangapolice @mducollector @maduraipolice .Break your silence pic.twitter.com/HHwGuTJtI2 — GRACE BANU (@thirunangai) October 12, 2022 మరో వీడియోలో హిజ్రాలు నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు వైరల్ అయ్యింది. హిజ్రా హక్కుల ఉద్యమకారిణి గ్రేస్ బాను ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై తమిళనాడు సౌత్ జోన్ పోలీసులు స్పందించారు. నిందితులను నోవాహ్, విజయ్గా నిర్ధారించారు. ఆ ఇద్దరికి వీడియోలో ఉన్న హిజ్రాలు బాగా తెలుసని, వాళ్లలో ఓ జంటకు సంబంధం కూడా ఉందని, కానీ, విడిపోవడంతోనే ఇలా దాడి జరిగి ఉంటుందని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు. ఇదీ చదవండి: ఈరోజుల్లో ఇంత నిజాయితీగా బతుకుతున్నారా? -
ప్రేమించలేదని ప్రాణం తీసాడు...
-
ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు
-
అరేయ్.. ఏం మనుషులు రా మీరు!
బెంగళూరు: రోడ్డున పోతుంటే.. తమను చూసి మొరిగిందని ఓ శునకంపై దారుణానికి తెగబడ్డారు ఇద్దరు. దాని మెడకు ఉన్న చెయిన్తో ముందరి కాళ్లను బంధించి.. దుడ్డు కర్రలతో విచక్షణారహితంగా చితకబాదారు. ఆ దెబ్బలు తాళలేక బాధతో అది మూలుగుతున్నా.. అడ్డుకునేందుకు చుట్టు పక్కలవాళ్లు ప్రయత్నించినా.. ఆ మూర్ఖుల తగ్గలేదు. ఈ ఘటనను వీడియో తీసేందుకు యత్నించిన వాళ్లను సైతం తోసేసి.. ఆ మూగజీవిపై దాడి చేశారు. ఇంతలో ఓనర్ అక్కడికి చేరుకుని నిలదీయడంతో.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈస్ట్ బెంగళూరు కేఆర్ పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని మంజునాథ లేఅవుట్లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆ శునకాన్ని.. యజమాని వెటర్నరీ హాస్పిటల్లో చేర్పించినట్లు తెలుస్తోంది. ఇక వీడియో ఆధారంగా కేసు నమోదు చేయాలని బెంగళూరు పోలీసులు నిర్ణయించారు. ఓనర్ను సంప్రదించగా ఫిర్యాదు చేయడానికి ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఈ ఘటన వైరల్ కావడంతో.. ఆ మూర్ఖులను మూగజీవి ప్రేమికులు తిట్టిపోస్తున్నారు. -
సినిమాను తలపించిన ఎటాక్ సీన్.. స్విగ్గీ డెలివరీ బాయ్పై వెంటపడి మరీ..
చైతన్యపురి(హైదరాబాద్): మద్యం మత్తులో ముగ్గురు యువకులు స్విగ్గీ డెలివరీ బాయ్పై దాడి చేసి కొట్టిన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారంకిరణ్ అనే డెలివరీ బాయ్ శనివారం ఉదయం భవానీనగర్లోని వరలక్ష్మి టిఫిన్స్ వద్దకు ఆర్డర్ తీసుకునేందుకు వచ్చాడు. హోటల్లోకి వెళుతుండగా బయటకు వస్తున్న ముగ్గురు యువకుల్లో ఒకరు కిరణ్కు తగిలాడు. దీంతో చూసి వెళ్లాలని చెప్పటంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న యువకులు కిరణ్పై దాడికి దిగారు. తప్పించుకొని రోడ్డుపై పరుగెత్తుతుండగా వెంటపడి మరీ పిడిగుద్దులు, చెప్పులతో తీవ్రంగా కొట్టారు. చదవండి: నల్గొండలో దారుణం.. కన్నీళ్లు తెప్పించే ఘటన.. అక్కడే ఉన్న స్విగ్గీ డిలివరీ బాయ్స్ కొందరు వారిని అడ్డుకొనేందుకు యత్నించగా, వారిపై కూడా దాడి చేశారు. స్విగ్గీబాయ్స్, స్థానికులు కొందరు వారి వెంటపడగా ముగ్గురూ కారులో అక్కడి నుంచి పరారయ్యారు. వారిని వెంబడించిన కొందరు సరూర్నగర్లో పట్టుకుని ముందుగా సరూర్నగర్ పోలీసులకు అప్పగించారు. ఘటన చైతన్యపురి పరిధిలో జరగడంతో వారిని అక్కడికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ కిరణ్ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిలో కెనడా నుంచి ఇటీవలే వచ్చిన మలక్పేటకు చెందిన ఎన్ఆర్ఐ పి.ఆకాష్రాజ్ (26), సైదాబాద్కు చెందిన పి.శివ (22), ఎం.శివ (21)గా గుర్తించారు. కారులో ఓ యువతి కూడా ఉందని సమాచారం. నిందితులంతా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. -
మద్యం త్రాగేందుకు డబ్బులు ఇవ్వాలని నానమ్మపై మనువడి దాడి
-
క్యాబ్ డ్రైవర్పై దాడిలో 12 మందిపై కేసు
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి ప్రాంతంలో క్యాబ్ డ్రైవర్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వివేక్రెడ్డి కస్టడీ సోమవారం ముగిసింది. దీంతో పోలీసులు ప్రధాన నిందితుడిని జైలుకు తరలించారు. క్యాబ్ డ్రైవర్ వెంకటేష్తో పాటు యజమాని పర్వతాలును తనతో పాటు 12 మంది కలిసి దాడి చేసినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. గత నెల 31న ఉప్పర్పల్లికి చెందిన వివేక్రెడ్డి (24) బీఎన్రెడ్డినగర్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని ఉప్పర్పల్లికి ప్రయాణం అయ్యాడు. బుకింగ్ స్వీకరించిన వెంకటేష్ (27) వివేక్రెడ్డిని పికప్ చేసుకుని చంద్రాయణగుట్ట మీదుగా ఉప్పర్పల్లికి వెళ్తున్నాడు.ఈ క్రమంలో రాత్రి 12 గంటల సమయంలో యజమాని ఫోన్ చేయడంతో ఉప్పర్పల్లి వద్ద డ్రాప్ చేసి వస్తానని తెలపడంతో తాను చంద్రయణగుట్ట వద్దే ఉన్నానని తాను కూడా వస్తానంటూ తెలపడంతో కారులోనే ముగ్గురు కలిసి వెళ్లారు. డబ్బుల చెల్లింపులో వివాదం.. ఉప్పర్పల్లి వద్ద కారు దిగి డబ్బులు చెల్లించడంలో వివాదం చోటు చేసుకుని అతడు ఘర్షణకు దిగాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడికి తెలపడంతో వారు సైతం ఘటనా స్థలానికి వచ్చి డ్రైవర్తో పాటు యజమానిని సైతం చితకబాదారు. అనంతరం వారి కారులోనే ఇద్దరిని బందించారు. ఇదే సమయంలో రాజేంద్రనగర్ గస్తీ పోలీసులు పెట్రోలింగ్కు రాగా ఘర్షణ విషయాన్ని గమనించి వారందరినీ స్టేషన్కు తరలించారు. ఇరువురి భిన్న వాదనలు.. వివేక్రెడ్డి మొదట కారు డ్రైవర్ వెంకటేష్, పర్వతాలు ఇద్దరు తన గొలుసు తీసుకుని దాడి చేశారంటూ ఫిర్యాదు చేయగా.. డ్రైవర్ డబ్బులు చెల్లించమంటే తమపై దాడి చేశారని తెలపడంతో వారిని స్టేషన్లోనే కూర్చోబెట్టారు. అప్పటికే ఉదయం కావడంతో వెంకటేష్ అస్వస్థతకు గురై రక్తపు వాంతులు చేసుకోవడంతో వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దెబ్బలు తాళలేకే.. దెబ్బలు తాళలేకే ఇరువురు అస్వస్థతతకు గురి కావడంతో వారిని ఉస్మానియాకు తరలించామని డ్రైవర్ వెంకటేష్ పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు ఉస్మానియా నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అదే రోజు సాయంత్రం కోమాలోకి వెళ్లిన వెంకటేష్ ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. హత్యాయత్నం కేసు.. మొదట రాజేంద్రనగర్ పోలీసులు వివేక్రెడ్డితో పాటు అతడి స్నేహితులపై దాడి కేసు నమోదు చేసి అనంతరం బాధితుడు కోమాలోకి వెళ్లడంతో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎస్ఐ పరీక్షలకు సిద్ధమవుతుండగా.. బాధితుడు వెంకటేష్ ఎస్ఐ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. క్యాబ్ డ్రైవర్గా పని చేస్తునే శిక్షణ పొందుతున్నాడని ఆదివారం పరీక్షలు రాయాల్సి ఉండగా ఆసుపత్రిలో కోమాలో ఉ డని వారు విలపించారు. దాడి జరగకపోతే పరీక్షలు రాసి ఎస్ఐగా సెలక్ట్ అయ్యేవాడని దాడికి పాల్పడిన నిందితులను శిక్షించాలని వారు కోరారు. -
దిగ్భ్రాంతికర ఘటన.. చేతులెత్తి వేడుకున్న కానిస్టేబుల్
ఢిల్లీ: సొసైటీకి రక్షణ నిలయంగా భావించే పోలీస్ స్టేషన్లో.. అదీ అంతా చూస్తుండగానే ఓ పోలీస్ కానిస్టేబుల్పై నిర్ధాక్షిణ్యంగా దాడి జరిగింది. పైగా ఆ దాడిని కొందరు వీడియోలు తీస్తుండగా.. తనను వదిలేయాలని ఆ సిబ్బంది చేతులెత్తి వేడుకోవడం వైరల్ అవుతోంది. దిగ్భ్రాంతికరమైన ఈ ఘటన న్యూఢిల్లీ ఆనంద్ విహార్ పోలీస్ స్టేషన్లో జరిగింది. సుమారు పది, పన్నెండు మంది చుట్టూ చేరి ఆ కానిస్టేబుల్ను విచక్షణ రహితంగా కొట్టారు. చుట్టుపక్కల చాలా మంది ఆ ఘటనను వీడియో, ఫొటోలు తీశారు. అయితే ఎవరూ వాళ్లను ఆపే ప్రయత్నం చేయలేదు. బాధితుడు ఆ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్గా తెలుస్తోంది. క్షమించి వదిలేయాలని ఆ కానిస్టేబుల్ వేడుకోవడం వీడియోలో చూడొచ్చు. ఆగస్టు 3వ తేదీన ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఓ పోలీస్ సిబ్బంది సైతం వీడియో తీసి వైరల్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వీడియో ఉన్నతాధికారుల దాకా చేరడంతో విచారణకు ఆదేశించారు. కానిస్టేబుల్పై జరిగిన దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. అయితే కారణాలు ఏవైనా పోలీసులపై దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు కొందరు. దాడి చేసిన వాళ్లను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. వీడియో వైరల్ అవుతుండడంతో నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని చెబుతోంది ఢిల్లీ పోలీస్ విభాగం. अंधेर गर्दी है दिल्ली में, #DelhiPolice #Delhi pic.twitter.com/JfBLNdNuIM — Dhananjay Singh (@KunwarDJAY) August 6, 2022 -
సెట్లో ఓవరాక్షన్ చేసి తన్నులు తిన్న హీరో
-
Nupur Sharma: బజరంగ్ దళ్ కార్యకర్తపై దాడి
భోపాల్: బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మకు మద్దతు చెప్తున్న వాళ్లపై దాడులు కూడా పెరిగిపోతున్నాయి. ఉదయ్పూర్, అమరావతి దారుణ హత్యోదంతాల తర్వాత.. బీహార్లో ఓ యువకుడు వాట్సాప్ స్టేటస్గా నూపుర్ శర్మ వ్యాఖ్యల వీడియోను పెట్టుకున్నాడని దుండుగులు కత్తులతో గాయపరిచారు. తాజాగా మధ్యప్రదేశ్లోనూ ఓ బజరంగ్ దళ్ కార్యకర్తపై కత్తులతో దాడి చేసింది ఓ మూక. బుధవారం అగర్-మాల్వాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నూపుర్ శర్మ కామెంట్లకు మద్దతు ప్రకటించిన ఓ వ్యక్తిని కత్తులతో పొడిచారు పదమూడు మంది. బాధితుడి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసుకుని.. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ దాడితో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బజరంగ్ దళ్ స్థానిక కన్వీనర్ అయిన ఆయూష్ జడమ్(25).. స్థానిక మీడియాలో బహిరంగంగా నూపుర్ శర్మకు మద్దతు ఇస్తూ వ్యాఖ్యలు చేశాడు. బుధవారం ఉదయం స్థానిక టోల్ బూత్ నుంచి బైక్పై వెళ్తున్న సమయంలో అతనిపై దాడి చేసింది ఓ గ్రూప్. దీంతో బాధితుడిని చికిత్స కోసం ఉజ్జయిని ఆస్పత్రిని తరలించారు. దాడికి పాల్పడిందంతా స్థానికులేనని పోలీసులు నిర్ధారించారు. కాగా, ఈ ఘటనను నిరసిస్తూ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఎస్పీ కార్యాలయం ఎదుట హిందూ సంఘాలు బైఠాయించి ఆందోళన చేపట్టాయి. मप्र के आगर मालवा में एक बजरंग दल कार्यकर्ता पर हमला हो गया,आरोप है कि #नुपुर_शर्मा का समर्थन करने की वजह से ये हमला हुआ है,मामले में 13 लोगों के खिलाफ मामला दर्ज किया गया है जिनमें से दो को गिरफ्तार कर लिया गया है, घटना के बाद शहर में तनाव की स्थिति बन गई है @ndtv @ndtvindia pic.twitter.com/wRD1vT39PH — Anurag Dwary (@Anurag_Dwary) July 20, 2022 ఇదీ చదవండి: నూపుర్ శర్మకు ప్రాణహాని ఉంది నిజమే- సుప్రీంకోర్టు -
కాంగ్రెస్ నేతపై దాడి.. ఆరోగ్య పరిస్థితి విషమం
ఉప ఎన్నికల వేళ త్రిపురలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సుదీప్ రాయ్ బర్మాన్పై ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నారు. వివరాల ప్రకారం.. ఈ నెల 23వ తేదీన త్రిపురలో రాజధాని అగర్తాల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సుదీప్ బర్మాన్.. ఆదివారం రాత్రి ఉజన్ అభోయ్నగర్లో తన మద్దతుదారులను కలిశారు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. అనంతరం కారు, కాంగ్రెస్ పార్టీ జెండాలను ధ్వంసం చేశారు. కాగా, ఈ దాడికి అధికార బీజేపీ పార్టీనే కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకునే ఇలా దాడి చేశారని విమర్శించారు. అంతకుముందు కూడా సుదీప్ రాయ్.. భద్రతా సిబ్బంది, డ్రైవర్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇదిలా ఉండగా.. సుదీప్ రాయ్ బర్మాన్ ఈ ఏడాది ప్రారంభంలో బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ సర్కార్ పాలనలో ఆయన ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను పార్టీ అధిష్టానం మంత్రి పదవి నుంచి తొలగించింది. దీంతో గత ఫిబ్రవరి నెలలో బర్మాన్ బీజేపీకి గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక, త్రిపురలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు జూన్ 23న ఉప ఎన్నికలు జరుగుతుండగా.. జూన్ 26న ఓట్ల లెక్కింపు జరగనుంది. Tripura Bypoll Violene - BJP Gundas attack Agaratala - 6 congress Candidate sudip Roy Barman. pic.twitter.com/ZiREN9gWNz — With Congress (@WithCongress) June 20, 2022 ఇది కూడా చదవండి: సైన్యంలో చేరమని మిమ్మల్ని ఎవరు అడిగారు: మాజీ ఆర్మీ చీఫ్ ఫైర్ -
ఈవ్ టీజింగ్ను ప్రతిఘటించిన మహిళ.. బ్లేడుతో దాడి.. 118 కుట్లు
భోపాల్: ఈవ్ టీజింగ్ను ప్రతిఘటించిన మహిళపై ముగ్గురు బ్లేడుతో విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారు. ముఖమంతా రక్తమోడుతున్న ఆమెకు ఆస్పత్రిలో 118 కుట్లువేసి చికిత్స చేశారు. భోపాల్లో జూన్ 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రాత్రిపూట భర్తతో కలిసి బైక్ మీద ఇంటికొస్తున్న మహిళపట్ల ఇద్దరుబాలురు, ఒక వ్యక్తి ఈవ్టీజింగ్కు పాల్పడ్డారు. ప్రతిఘటించిన ఆమె ముఖంపై 10 సెంటీమీటర్ల మేర లోతైన గాటు పెట్టి బ్లేడుతో పలుచోట్ల దాడిచేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం శివరాజ్ ఆదేశించారు. బాధితురాలిని సీఎం పరామర్శించి లక్ష ఆర్థికసాయం ప్రకటించారు. మున్సిపల్ అధికారులు ఒక నిందితుని ఇంటిని కూల్చివేశారు. अन्याय का प्रतिकार करना अन्य लोगों के लिए प्रेरणा का कार्य है, इस नाते बहन सीमा अन्य महिलाओं के लिए प्रेरक भी हैं। उनके बेटा और बेटी पढ़ते हैं और उनके सहयोग के लिए भी कलेक्टर भोपाल को आवश्यक निर्देश दिये हैं। pic.twitter.com/BXQ5ywPCxG — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) June 12, 2022 -
మెక్సికోలో పేలిన తుపాకీ.. ఆరుగురి దుర్మరణం
అమెరికాలో తుపాకీ నరమేధం శాంతించడం లేదు. తాజాగా మెక్సికో వీధుల్లో దుండగుల కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. ఇందులో ఐదుగురు స్కూల్ పిల్లలే కావడం గమనార్హం. మధ్య మెక్సికోలో సాయుధులైన దుండగులు.. గువానాజువాటో వీధుల్లో తెగపడ్డారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఐదుగురు స్టూడెంట్స్తో(16 నుంచి 18 ఏళ్ల మధ్య వాళ్లు) పాటు ఓ వృద్ధురాలు మృతి చెందింది. చనిపోయిన వాళ్లంతా బారోన్ కమ్యూనిటీకి చెందిన వాళ్లేనని గువానాజువాటో మేయర్ నిర్ధారించారు. ఇదిలా ఉంటే.. రెండు వారాల కిందట గువానాజువాటోలోని సెలాయా నగరంలో జరిగిన ప్రతీకార దాడుల్లో పదకొండు మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. డ్రగ్స్, చమురు దొంగతనాల నేపథ్యంలోనే ఇక్కడ గ్యాంగ్ వార్లు జరుగుతున్నాయి. 2006 డిసెంబర్ నుంచి ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పదన మిలిటరీ యాంటీ డ్రగ్ ఆపరేషన్ వల్ల మెక్సికోలో ఇప్పటిదాకా మూడున్నర లక్షల హత్యలు జరిగాయి. చదవండి: అవమానాలు-కుటుంబ పరిస్థితులతో కిరాతకుడిగా.. -
రేషన్ డిపోలో తనిఖీలు చేశారని అధికారులపై టీడీపీ నాయకులు దాడి
-
Kili Paul: ఆస్పత్రిలో ఇంటర్నెట్ సెన్సేషన్.. కత్తులు, కర్రలతో దాడి!
Kili Paul Attacked: ఎప్పుడూ నవ్వుతూ, సరదాగా, యాక్టివ్గా స్టెప్పులేసే అతను.. ఆస్పత్రిలో స్ట్రెచ్చర్ మీద దీనస్థితిలో ఉన్నాడు. చేతి బొటనవేలుకి రక్తపు మరకతో బ్యాండేజ్. కాళ్ల మీద గాయపు గుర్తులు.. ఇంటర్నెట్ సెన్సేషన్గా పేరొందిన కిలి పాల్ పరిస్థితి ఇది. కత్తులతో, కర్రలతో ఆయన మీద ఎవరో హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇన్స్టాగ్రామ్ని, సోషల్ మీడియాలో ఇతర ఫ్లాట్ఫామ్స్ ఫాలో అయ్యే వారికి పరిచయం అక్కర్లేని పేరు.. కిలి పాల్. పల్లెల్లో పిల్లగాళ్ల దగ్గర నుంచి బాలీవుడ్ స్టార్స్, ప్రముఖుల దాకా ఈ టాంజానియా ఇంటర్నెట్ సెలబ్రిటీకి ఫ్యాన్స్. అతని ఇన్స్టా రీల్స్కి ఫిదా అవుతుంటారు. బాలీవుడ్తో పాటు ఇతర భాషల్లోని పాటలకు అదిరిపోయే స్టెప్పులు, అబ్బురపరిచే ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఎంతో మంది భారతీయుల మనుసులు దోచేశారు టాంజానియాకి చెందిన అన్నా చెల్లెల్లు కిలిపాల్, నీమాపాల్లు. అయితే కిలి పాల్ మీద ఎవరో దుండగులు దాడి చేశారు. ‘కొందరు తనను కింద పడేయాలని చూస్తున్నారు. కానీ, దేవుడు మాత్రం తనకి సాయం చేస్తూ వస్తున్నాడు. నా కోసం ప్రార్థించండి’ అంటూ ఓ స్టోరీ పోస్ట్ చేశాడు కిలి పాల్. అయితే అతని మీద హత్యాయత్నం ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? అనే వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్టాక్లో వీడియోల ద్వారా పాపులర్ అయిన కిలి పాల్.. ఎక్కువ భారతీయ సినీ గేయాలు, డైలాగులకే డ్యాన్సులు చేస్తుంటాడు. తక్కువ టైంలో గుర్తింపు దక్కిన అతనికి ఫిబ్రవరిలో భారత హై కమిషన్ ప్రత్యేక గుర్తింపుతో గౌరవించింది. అంతెందుకు ప్రధాని మోదీ సైతం తన మన్ కీ బాత్లో కిలి పాల్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు కూడా. -
డబ్బులివ్వలేదని తల్లిపై హాకీస్టిక్తో దాడి
హసన్పర్తి: డబ్బులు ఇవ్వనందుకు ఓ కుమారుడు హాకీ కర్రతో తల్లిపై దాడి చేశాడు. గొడవను నివారించడానికి వచ్చిన మరో ఇద్దరిని చితకబాదాడు. ఈ సంఘటనలో తల్లి చికిత్స పొందుతూ మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలోని హనుమాన్నగర్లో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుండ్లసింగారానికి చెందిన అప్పల రమ్య (45) కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తూ హనుమాన్నగర్లో నివాసం ఉంటోంది. వ్యక్తిగత అవసరం కోసం కుమారుడు రోహిత్ రోజూ డబ్బుల కోసం తల్లిని వేధిస్తున్నాడు. ఈ క్రమంలో మూడు రోజుల కిందట డబ్బుల కోసం తల్లితో గొడవ పడ్డాడు. లేవని చెప్పడంతో క్షణికావేశానికి గురైన రోహిత్.. హాకీ కర్రతో తల్లి కడుపు, తల, వీపుపై బలంగా కొట్టాడు. అడ్డువచ్చిన మామ సతీశ్, అమ్మమ్మ, అక్కలను చితకబాదాడు. ఈ ఘటనలో రమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించగా శుక్రవారం రాత్రి ఆమె మృతిచెందినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ జనార్దన్రెడ్డి తెలిపారు. శనివారం మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగిం చారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు జనార్దన్రెడ్డి చెప్పారు. -
కూరగాయలు తెమ్మన్న భార్య.. ఆ భర్త ఏం చేశాడంటే..?
ధర్మవరం అర్బన్(అనంతపురం జిల్లా): కూరగాయలు తీసుకురమ్మన్నందుకు భార్యపై భర్త కొడవలితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని శివానగర్కు చెందిన లక్ష్మణస్వామి, రత్నమ్మ దంపతులు. మగ్గం పనులతో జీవనం సాగిస్తున్నారు. శనివారం ఉదయం కూరగాయలు తీసుకురావాలని భర్తకు రత్నమ్మ తెలపడంతో డబ్బులిస్తే వెళతానని సమాధానమిచ్చాడు. చదవండి: 300 అడుగుల లోతు.. చిమ్మ చీకటి.. ప్రాణాలను పణంగా పెట్టి.. తన దగ్గర లేవు అన్నందుకు వాగ్వాదానికి దిగి రత్నమ్మపై కొడవలితో దాడి చేశాడు. విషయాన్ని గమనించిన స్థానికులు అక్కడకు చేరుకుని వెంటనే ఆమెను అనంతపురంలోని వైద్యశాలకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేశారు. -
అటవీశాఖ అధికారులపై గ్రామస్తుల దాడి
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ ఫారెస్ట్ రేంజ్ అటవీ అధికారులపై దాడి జరిగింది. తప్పించుకునే క్రమంలో పరుగెడుతూ 8 నెలల గర్భిణీ అయిన ఎఫ్బీవో అస్వస్థతకు గురయ్యారు. కాగజ్నగర్ ఫారెస్ట్ రేంజ్ ఆధ్వర్యంలో అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించడం కోసం కుమురంభీం జిల్లా కాగజ్నగర్ మండలం ఊట్పల్లిలో మంగళవారం కళాజాత నిర్వహించారు. వంట చెరుకును తీసుకోనివ్వకుండా అధికారులు అడ్డుకుంటున్నారని, గొడ్డళ్లు, సైకిళ్లను స్వాధీనం చేసుకుంటున్నారని అధికారులను గ్రామస్తులు ఘెరావ్ చేశారు. దీంతో కళాజాత బృందం సభ్యులు అర్ధాంతరంగా కార్యక్రమాలను ఆపేసి వెళ్లిపోయారు. కోసిని ఎఫ్బీవో శిరీష, వాచ్మేన్లు దేవ్సింగ్, రాములు, శంకర్ తమ ద్విచక్ర వాహనాలపై బయల్దేరుతుండగా గ్రామస్తులు అడ్డుకొని కర్రలతో దాడికి దిగారు. శిరీష ఎడమ చేతికి గాయాలయ్యాయి. దాడి నుంచి తప్పించుకోవడానికి పరుగెత్తడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న శిరీష భర్త బైక్పై ఆమెను పట్టణంలోని ప్రైవేటు హాస్పిటల్కు తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం అటునుంచి ఆమెను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. -
పాకిస్తాన్ రక్తసిక్తం.. వందకుపైగా సైనికులు మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని బలూచిస్తాన్ రక్తసిక్తమైంది. మిలటరీ బేస్లను లక్ష్యంగా చేసుకొని తిరుగుబాటుదారులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. పంజూర్, నోష్కీ పోస్టులపై రెండు ఆత్మాహుతిదాడులు జరిగాయి. ఒక్కో దాడిలో ఆరుగురు సూసైడ్ బాంబర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ దాడుల్లో వందల మంది పాక్ సైనికులు మరణించినట్లు సమాచారం. కాగా, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనా పర్యటనకు ముందు ఈ దాడులు జరగడం పాక్ ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. చదవండి: ('సీఎం సార్ హెల్ప్ మీ'.. గమనించి వెంటనే కారు ఆపి..) -
నడి రోడ్డుపై ట్రాఫిక్ పోలీసును చితకబాదాడు
పట్నా: బిహర్లో ఒక వ్యక్తి నడిరోడ్డుపై రెచ్చిపోయాడు. ట్రాఫిక్ పోలీసుపైనే దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జెహనాబాద్ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి ట్రాఫిక్కు అంతరాయం కలిగే విధంగా.. రోడ్డు మధ్యలో తన ద్విచక్ర వాహనాన్ని నిలిపాడు. దీంతో ట్రాఫిక్ పోలీసు వాహనాన్ని తీసేయాలని సూచించాడు. దీంతో సదరు వ్యక్తి పోలీసుతో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా కిందపడేసి మరీ దాడి చేశాడు. ఆ తర్వాత స్థానికులు అతడిని వారించారు. ఆ తర్వాత నిందితుడు బైక్ను రోడ్డుపైనే వదిలేసి పారిపోయాడు. ట్రాఫిక్ పోలీసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: తెలుగు అకాడమీ స్కాం కేసు: డైరెక్టర్ సోమిరెడ్డిపై వేటు -
వరంగల్లో దారుణం.. అన్న కుటుంబంపై కత్తులతో దాడి
సాక్షి, వరంగల్: వరంగల్ ఎల్బీనగర్లో దారుణం చోటు చేసుకుంది. అన్న కుటుంబంపై తమ్ముడు కత్తులతో దాడి చేశాడు. ఈ ఘటనలో అన్న సహా ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతులను బాంద్పాషా, ఖలీల్, సబీరాగా గుర్తించారు. ఆస్తి తగాదాలే హత్యలకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారు జామున మూడు గంటల సమయంలో దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో తొమ్మిది మంది పాల్గొన్నట్లు సమాచారం. ఇవీ చదవండి: యువతికి ఇటీవలే నిశ్చితార్థం.. కన్నీటిసంద్రంలో కుటుంబం భర్తతో విడిపోయి, మరొకరితో సహజీవనం.. బాలికపై అత్యాచారం -
రెచ్చిపోయిన ఉన్మాది, మహిళపై కత్తితో దాడి
తిరువనంతపురం: కేరళలో మరో ఉన్మాది రెచ్చిపోయాడు. తనతో పెళ్లికి నిరాకరించిందన్న అక్కసుతో మహిళపై దారుణానికి తెగబడ్డాడు. గతంలో కూడా వేధింపులకు పాల్పడిన నిందితుడు సమయం చూసి ఇంట్లోకి చొరబడి మరీ బాధితురాలిని పొట్టన పెట్టుకున్న ఘటన విషాదాన్ని నింపింది. పెద్దమాల పోలీస్ స్టేషన్ పరిధిలోని కరీపూర్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం నాలుగేళ్ల క్రితం తిరువనంతపురానికి చెందిన సూర్యగాయత్రిని పెళ్లి చేసుకుంటానంటూ ఆమె కుటుంబాన్ని సంప్రదించాడు నిందితుడు, పెయాడ్కు చెందిన అరుణ్(29).అయితే ఈ ప్రతిపాదనను వారు తిరస్కరించారు. దీంతో అరుణ్ వేధింపుల పర్వం మొదలైంది. దీనికి తోడు తన స్మార్ట్ఫోన్, బంగారు నగలు దొంగిలించాడంటూ నాలుగేళ్ల క్రితమే సూర్యగాయత్రి తల్లి తిరువనంతపురంలోని ఆర్యనాడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, అప్పట్లో కేసు నమోదు చేయని పోలీసులు అరుణ్కు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలివేశారు. ఆ తరువాత కొంత కాలానికి సూర్యగాయత్రి మరొక వ్యక్తిని వివాహం చేసుకోగా, అరుణ్ కూడా వివాహం చేసుకున్నాడు. అయితే భర్తతో విబేధాల కారణంగా సూర్య గాయత్రి ఇటీవల పుట్టింటికి తిరిగి వచ్చింది. దీంతో అరుణ్ మళ్లీ ఆమె వెంటపడటం మొదలు పెట్టాడు. తనతో సంబంధం పెట్టుకోవాలని బెదిరించాడు. దీనికి నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. అదును చూసి ఎటాక్ చేసి కత్తితో ఏకంగా 15 సార్లు పొడిచాడు. వెంటనే స్పందించిన పొరుగువారు అరుణ్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన సూర్యగాయత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూసింది. అరుణ్పై అంతకు ముందే క్రిమినల్ కేసులున్న నేపథ్యంలో అతని పెళ్లి ప్రస్తావనను తిరస్కరించామని గాయత్రి తల్లి వల్సల తెలిపారు. అరుణ్ దాడిలో గాయ పడిన వల్సల ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. అయితే తనను అవమానించినందుకే ప్రతీకారం తీర్చుకున్నానని పోలీసుల విచారణలో నిందితుడు తెలిపాడని చెప్పారు. -
యువకుడిపై గొడ్డలితో దాడి
కొత్తగూడెం రూరల్: పాత కక్షలు మనసులో ఉంచుకున్న కొందరు పుట్టినరోజు వేడుకలకు పిలిచి ఓ యువకుడిపై గొడ్డలితో దాడి చేసిన ఘటన గురువారం అర్ధరాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఇందిరానగర్ కాలనీలో చోటుచేసుకుంది. కొత్తగూడెం పట్టణంలోని గణేశ్ ఆలయం ప్రాంతానికి చెందిన మిర్యాల శ్రీకాంత్కు, లక్ష్మీదేవిపల్లి మండలం ఇందిరానగర్ కాలనీలోని సంపత్కు మధ్య పాతకక్షలున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సంపత్ పుట్టినరోజు కావటంతో మిర్యాల శ్రీకాంత్ను ఇందిరానగర్ వద్దకు గురువారం అర్ధరాత్రి పిలిచారు. కేక్ కోసిన అనంతరం సంపత్తోపాటు అతడి స్నేహితులు భరత్, అఖిల్, మరికొందరు ముందుగా తెచ్చుకున్న గొడ్డలి, కర్రలతో శ్రీకాంత్పై దాడి చేసి అక్కడ్నుంచి పారిపోయారు. శ్రీకాంత్ శరీరంపై 14 చోట్ల గాట్లు పడి తీవ్రంగా రక్తస్రావమైంది. కేకలు విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా..మెరుగైన చికిత్స కోసం అక్కడ్నుంచి ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై శ్రీకాంత్ సోదరి సింధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
కిరాతక భర్త: ఆస్తి విక్రయానికి ఒప్పుకోలేదని
తుమకూరు(కర్ణాటక): డబ్బు కోసం ఓ భర్త రాక్షసునిగా మారాడు. ఆస్తిని విక్రయించడానికి భార్య ఒప్పుకోకపోవడంతో ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు. ఈ ఘటన తుమకూరు జిల్లా సీఎస్పుర పరిధిలోని జన్నేనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... జన్నేనహళ్లి గ్రామానికి చెందిన నాగ వైరముడి, మమత లకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ దంపతులకు బెంగళూరుతో పాటు గ్రామంలో కొంత ఆస్తి ఉంది. ప్రస్తుతం నాగవైరముడికి డబ్బులు అవసరం వచ్చాయి. బెంగళూరులో ఉన్న ఇంటిని విక్రయించడానికి సన్నాహాలు చేస్తుండగా భార్య అడ్డుకుంది. ఆస్తిని అమ్మడానికి ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన నాగవైరముడి స్నేహితులతో కలిసి వచ్చి భార్యను చితకబాదాడు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితురాలిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు గురువారం పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. సీఎస్ పుర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
కన్నతల్లిపై కత్తితో కొడుకు దాడి
నంగునూరు(సిద్దిపేట): కన్న కొడుకే తల్లిపై కత్తితో దాడి చేశాడు. శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బండి సారవ్వ (52) పదేళ్ల కిందట భర్త మరణించడంతో కూలీ పనులు చేస్తూ ముగ్గురు కూతుళ్లు, కొడుకును పెంచి పోషించి పెళ్లిళ్లు జరిపించింది. అయితే తాగుడుకు బానిసగా మారిన కొడుకు తిరుపతి (23) కొన్ని రోజులుగా డబ్బుల విషయమై భార్య, తల్లితో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం తల్లీ కొడుకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆవేశానికి లోనైన తిరుపతి ఇంట్లో ఉన్న కత్తితో తల్లిపై దాడి చేశాడు. కొడుకు బారి నుంచి తప్పించుకునేందుకు ఆమె ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తినా.. వెంబడించి మెడ, చేతులు, ఛాతీ భాగంపై ఇష్టారీతిగా దాడి చేశాడు. దీంతో సారవ్వ ఒక్కసారిగా కుప్పకూలింది. ఇది గమనించిన గ్రామస్తులు ఆమెను 108 అంబులెన్స్లో సిద్దిపేటలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట రూరల్ సీఐ సురేందర్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. సర్పంచ్ తిప్పని రమేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మాజీ భార్యను చూసేందుకు వచ్చి...
కెలమంగలం(కర్ణాటక): మాజీ భార్యను చూసేందుకు వెళ్లిన భర్తపై ఆమె తరఫు బంధువులు దాడికి పాల్పడగా తీవ్ర గాయాలతో మృతి చెందాడు. ఈ ఘటన కెలమంగలం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. బెంగళూరు మంగళమ్మపాళ్యంకు చెందిన మహమ్మద్ ఇమ్రాన్(32)కు కెలమంగలం సమీపంలోని దొడ్డబేళూరుకు చెందిన రుక్కు అనే మహిళతో నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఆరు నెలలకే విడిపోయారు. అయితే భార్యను చూసేందుకు ఇమ్రాన్ మంగళవారం వెళ్లగా ఆమె తరఫు బంధువులు అతన్ని కారులో కెలమంగలంవైపు తీసుకెళ్లి చిన్నట్టి వద్ద దాడి చేసి ఉడాయించారు. అతన్ని స్థానికులు క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితులుగా భావిస్తున్న కెలమంగలం గణేష్కాలనీకి చెందిన సిద్దిక్, మాలిక్, రహమ్మాన్, దొడ్డబేళూరుకు చెందిన సాధిక్, జమీర్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
పిచ్చెక్కిన పిల్లి.. అర్ధరాత్రి వీరంగం
కొమరాడ: విజయనగరం జిల్లా కొమరాడ మండలం దళాయపీట గ్రామంలో ఓ పిచ్చెక్కిన పిల్లి శనివారం అర్ధరాత్రి వీరంగం సృష్టించింది. గ్రామస్తులపై దాడి చేసి దొరికినవారినల్లా కరిచింది. పిల్లి కరవడంతో ఆర్.తవిటమ్మ, జి.లక్ష్మి, ఎం.శ్రీధర్, డి.రాములనాయుడు, ఎం.గౌరునాయుడు, ఎస్.లక్ష్మి, వలంటీర్ బి.దామోదర్నాయుడులు గాయపడ్డారు. వీరిని రాత్రికి రాత్రే గ్రామస్తులు 108లో చినమేరింగి సీహెచ్సీకి తరలించి చికిత్స అందించారు. వీరిలో ఎం.శ్రీధర్ పరిస్థితి విషమంగా ఉండడంతో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
అయ్యో తల్లి: పొత్తిళ్లలోని పాపాయిని కొట్టి, కాళ్లతో తొక్కి
లక్నో: వద్దు..! నాకు అబ్బాయే కావాలి. అమ్మాయి వద్దంటూ అప్పుడే పుట్టిన పసికందుపై తల్లి రాక్షసంగా ప్రవర్తించింది. పొత్తిళ్లలోని పాపాయిని గోడకేసి కొట్టింది. అంతటితో ఆగలేదు. ఆ నొప్పి తాళలేక గుండెలవిసేలా ఏడుస్తున్న పసికందును కనికరం లేకుండా కాళ్లతో తొక్కింది. జననాంగ భాగాల్ని తీవ్రంగా గాయపరిచింది. ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా..పేగు తెంచుకొని జన్మనిచ్చిన పసిపిల్లను తన చేతులతో తానే చంపేందుకు ప్రయత్నించిన ఆ తల్లికి చేతులెలా వచ్చాయోనని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరువుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ప్రదేశ్ ఘజియాబాద్ లోని నందిగ్రామ్కు చెందిన ఓ మహిళకు గతేడాది వివాహం జరిగింది. అయితే గర్భిణీగా ఉన్న ఆమె ఈ ఏడాది జూన్ 21న పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో తనకు ఆడపిల్ల పుట్టిందని జీర్ణించుకోలేకపోయింది. భర్త, అత్తమామలు మనకు దుర్గమ్మ పుట్టి, లక్ష్మీదేవి పుట్టిందని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు పాపాయికి ఏం పేరుపెడితే బాగుటుందోనని తెలుసుకునేందుకు పక్కనే ఉన్న పూజారి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో తల్లి.. పసికందుపై దారుణానికి ఒడిగట్టింది. విచక్షణా జ్ఞానం మరిచి తీవ్రంగా గాయపరిచింది. కిందపడేసి కాళ్లతో తొక్కుతు రాక్షసానందం పొందింది. అయితే ఈ దాడి జరిగే సమయంలో ఇంట్లో పిల్లలు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు చిన్నారిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు దారుణానికి ఒడిగట్టిన తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: ఫోన్ మాట్లాడుతూ..60 అడుగుల లోతైన బావిలోపడి -
సీసాతో పొడిచి.. సపర్యలు చేసి..
కాకినాడ క్రైం(తూర్పుగోదావరి): వ్యక్తిగత కక్షల నేపథ్యంలో బీరు సీసాతో పొడిచిన వ్యక్తే తిరిగి బాధితుడికి సపర్యలు చేయడం.. ఆనక ఆసుపత్రులకు తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం గాయపడిన వ్యక్తి కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. సామర్లకోట మండలం వేట్లపాలేనికి చెందిన పుప్పల అప్పారావుకు అదే గ్రామానికి చెందిన పుప్పల లోవరాజు మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో అప్పారావుపై లోవరాజు బీరు సీసాతో దాడిచేసి, విరిగిన సీసాను ఎడమ దవడలోకి దించాడు. తీవ్ర రక్తస్రావం అవుతున్న బాధితుడ్ని స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు జీజీహెచ్కు సిఫార్సు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసాతో పొడిచిన లోవరాజే అప్పారావును తొలుత పీహెచ్సీకి అక్కడి నుంచి జీజీహెచ్కి తరలించి దగ్గరుండి మరీ వైద్యం చేయిస్తూ సపర్యలు చేయడం కొసమెరుపు. చదవండి: చదివింది ఎమ్మెస్సీ.. అమ్మేది గంజాయి అర్ధరాత్రి కారు చీకటి.. ఆ ఫోన్ కాల్ కాపాడింది -
గొంతు కోసిన భర్త.. కనికరించిన భార్య
యడ్లపాడు (చిలకలూరిపేట): క్షణికావేశంలో ఓ యువకుడు తన భార్య గొంతును బ్లేడ్తో కోసిన ఘటన మండలంలోని బోయపాలెం గ్రామంలో ఆదివారం జరిగింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఫోపుల్ గనున్, రీటా దంపతులు కొద్దికాలం కిందట మండలానికి వలస వచ్చారు. బోయ పాలెం గ్రామంలోని ఓ నూలుమిల్లులో కార్మికులుగా పనిచేస్తున్నారు. 12 ఏళ్ల క్రితం వివాహమైన వారి మధ్య ఇటీవల కలహాలు మొదలయ్యాయి. తనను లెక్కచేయడం లేదన్న అక్కసుతో గనున్ భార్య రీటాపై ఆదివారం బ్లేడుతో దాడి చేసి గొంతు కోశాడు. స్థానికులు గమనించి అతన్ని పట్టుకుని విద్యుత్ స్తంభానికి కట్టి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. యడ్లపాడు ఎస్ఐ పైడి రాంబాబు సిబ్బందితో ఘటనా స్థలికి వెళ్లి బాధితురాలు రీటాను చికిత్స నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇంత జరిగినా తన భర్తపై ఫిర్యాదు చేయనని, స్టేషన్కు తీసుకెళ్లకుండా అతడిని విడిచి పెట్టాలని ఎస్ఐను రీటా కోరడం గమనార్హం. చదవండి: టీడీపీ నేతల దాడి: ఇద్దరి పరిస్థితి విషమం కోవిడ్తో ఆస్పత్రిలో చేరితే ఇల్లు దోచేశారు -
టీడీపీ నేతల దాడి: ఇద్దరి పరిస్థితి విషమం
శ్రీకాళహస్తి రూరల్(చిత్తూరు జిల్లా): మండలంలోని మన్నవరం పంచాయతీ నిమ్మరాళ్లపల్లెలో వలంటీర్ జయప్రకాష్, అతడి తమ్ముడు వెంకటాద్రిపై టీడీపీ నాయకులు కత్తులతో దాడి చేయడంతో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల తల్లి నాగమ్మ కథనం మేరకు.. గత స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున వలెంటీర్ తమ్ముడు వెంకటాద్రి చురుగ్గా పార్టీ వ్యవహారాల్లో పాల్గొన్నాడు. దీంతో తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు 600 నుంచి 120కి తగ్గిందన్న కక్షతో ఆదివారం గ్రామ శివారులో ఉన్న కొంతమంది స్థానికులను తీసుకొచ్చి కత్తులు, రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో వలెంటీర్ జయప్రకాష్, అతడి తమ్ముడు వెంకటాద్రి గాయపడ్డారు. క్షతగాత్రుల అరుపులు విని గ్రామస్తులు అక్కడికి చేరుకోవడంతో వారు పరారయ్యారు. క్షతగాత్రులను శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించి వారి పరిస్థితి విషమంగా ఉందని తిరుపతి రుయాకు సిఫార్సు చేశారు. ఈ మేరకు శ్రీకాళహస్తి పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: విడిపించేందుకు వెళ్లి.. ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు కోవిడ్తో ఆస్పత్రిలో చేరితే ఇల్లు దోచేశారు -
దారుణం: సినిమా పిచ్చితో రౌడీలుగా గుర్తింపు పొందాలని..
తిరువళ్లూరు(తమిళనాడు): రౌడీలుగా గుర్తింపు పొందాలన్న ఉద్దేశంతో నలుగురు యువకులు కలిసి రోడ్డుపై వెళుతున్న ఇద్దరిని అడ్డగించి కత్తులతో విచక్షణరహితంగా నరికి హల్చల్ సృష్టించారు. ఈ సంఘటన బుధవారం రాత్రి తిరువళ్లూరు సమీపంలో కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా తిరువేళాంగాడు యూనియన్ రాజ్పద్మనాభపురం గ్రామానికి చెందిన వినోద్(36), విజయకుమార్(41). ఇద్దరూ ఊత్తుకోటలోని ప్రయివేటు కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్లు. వీరు విధులు ముగించుకుని బుధవారం రాత్రి బైక్లో ఇంటికి బయలుదేరారు. తిరువళ్లూరు సమీపంలోని కలియనూర్ వద్ద వెళుతుండగా నలుగురు యువకులు వారిని అడ్డగించి బైకులు లాక్కుని వారిపై కత్తులతో దాడి చేసి కలియనూర్ గ్రామానికి వెళ్లి కత్తులతో హల్చల్ చేసారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రాణాప్రాయస్థితిలో పడి వున్న బాధితులను చెన్నై ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసుల విచారణలో కలియనూర్ గ్రామానికి చెందిన సూర్య(21), ఏకాటూరు గ్రామానికి చెందిన సునాల్(24), పాక్కుపేట గ్రామానికి చెందిన సతీష్(19), కడంబత్తూరు చెందిన భాగవత్(25)గా గుర్తించారు. విచారణలో తమకు సినిమా పిచ్చి ఎక్కువగా వుండడంతో సినిమాల్లో రౌడీలుగా రాణించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. చదవండి: కి‘లేడీ’ల హల్చల్: వృద్ధులను కత్తితో బెదిరించి భారీ దోపిడీ కూకట్పల్లిలో కాల్పుల కలకలం..చంపేసి.. దోచేశారు -
ఇసుక తోడేళ్ల రాక్షసం..కాపు కాసి కత్తిపోట్లు..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇసుక మాఫియా విజృంభిస్తోంది. అక్రమ రవాణాను అడ్డుకున్న వారు ఎవరైనా సరే.. అడ్డుతొలగించుకోవడమే లక్ష్యంగా రోజురోజుకూ రెచ్చిపోతోంది. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని మిడ్జిల్ మండలం వాడ్యాల్ శివారులో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఓ వ్యక్తిపై ఇసుకాసురులు కత్తితో దాడి చేయడం ఇందుకు మరో నిదర్శనం. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వాడ్యాల్కు చెందిన ట్రాక్టర్ల యాజమానులు రాత్రివేళ అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు. గురువారం రాత్రి కూడా రెండు ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా చేస్తుండగా.. అనేగళ్ల జంగయ్య, భాస్కర్తో పాటు కొందరు రైతులు అడ్డుకున్నారు. వారితో ట్రాక్టర్ యాజమానులు బీర్ల రమేష్, బీర్ల రామకృష్ణ, బెల్లె భీరయ్య, సిద్దపురం శ్రీశైలం, శ్రీను ఘర్షణకు దిగారు. దీనిపై జంగయ్య, భాస్కర్ అదేరోజు రాత్రి మిడ్జిల్ పోలీస్స్టేషన్లో ట్రాక్టర్ యజమానులు ఐదుగురిపై ఫిర్యాదు చేశారు. అనంతరం జడ్చర్ల పట్టణంలో ఉన్న వాడ్యాల్కు చెందిన మధు అనే యువకుడికి ట్రాక్టర్ యాజమాని భీరయ్య ఫోన్ చేశాడు. మధు, తదితరులు ఇసుక రవాణాను అడ్డుకుంటున్నారనే కోపంతో.. ‘ఇసుక ఆపేందుకు వస్తే మంచిగా ఉండదు.. మీ వాళ్లు అడ్డం వస్తే బెదిరించాం.. నీవు వస్తే నీ అంతుచూస్తాం..’అని హెచ్చరించారు. ఈ క్రమంలోనే మధు శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో రైతులతో కలిసి దుందుభీ వాగువైపు వెళ్తుండగా.. అప్పటికే కాపు కాసిన ట్రాక్టర్ యాజమానులు కత్తితో దాడికి దిగారు. చేతులు వెనక్కి విరిచి... ధును ట్రాక్టర్ యజమాని భీరయ్య రెండు చేతులు వెనక్కి విరిచి పట్టుకోగా.. మరో ట్రాక్టర్ యజమాని రమేష్ కత్తితో చేతి భుజంపైన, కడుపులో పొడిచి పారిపోయారు. గాయపడిన మధును అతడితో వచ్చిన వారు 108లో మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మధు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని కాలి తొడ భాగంలో ఆరు, చేతికి పది, కడుపులో నాలుగు కుట్లు పడ్డాయి. మధు సోదరుడు రాజేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఎస్పీ వెంకటేశ్వర్లు మిడ్జిల్ పోలీస్స్టేషన్కు చేరుకుని ఘటనపై విచారించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి వాడ్యాల్కు చెందిన బీర్ల రామకృష్ణ, బీర్ల రమేష్, బెల్లె భీరయ్య, సిద్దపురం శ్రీశైలంను పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. వీరిని కల్వకుర్తి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్టు ఎస్ఐ జయప్రసాద్ తెలిపారు. గతంలోనూ దురాగతాలు గతంలో అల్లీపూర్ వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా.. ఆత్మకూరు మండలం పిన్నంచెర్లకు చెందిన ఓ రైతు అడ్డుకున్నాడు. అతడిని ఇసుకాసురులు ట్రాక్టర్ టైర్లతో తొక్కించి చంపి వేశారు. మక్తల్ మండలంలోని వాగుల నుంచి ఇసుకను తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నందుకు షాద్నగర్కు చెందిన ఓ ఇసుక వ్యాపారి ఏకంగా ఎమ్మెల్యేనే బెదిరించాడు. కోయిల్కొండ మండలంలోని అంకిళ్లవాగు నుంచి టిప్పర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ అడ్డుకున్నాడు. దీంతో ఇసుకాసురులు రెచ్చిపోయి అతడిపై దాడి చేశారు. అదేవిధంగా సూరారంంలో ఇసుక రవాణాకు అడ్డుపడుతున్నారనే కారణంతో బైక్పై వెళ్తున్న వీఆర్ఏ, వీఆర్ఓలను టిప్పర్లతో తొక్కించేందుకు యత్నించగా.. వారు ఎలాగో తప్పించుకుని బయటపడ్డారు. ఇలాంటివి మరెన్నో ఘటనలు ఈ ప్రాంతంలో జరిగాయి. రాజకీయ నేతల అనుచరులే..! జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోవడానికి రాజకీయ నేతల అండదండలే ప్రధాన కారణమనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. రాజకీయ నేతల ఒత్తిళ్లు, నెలవారీగా మామూళ్లు అందుతుండడంతో అధికార యంత్రాంగం కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తోంది. మిడ్జిల్ మండలంలో రెచ్చిపోయిన ఇసుకాసురులు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన అనుచరులేననే ఆరోపణలు విన్పిస్తున్నాయి. చదవండి: తన దోషం పోతుందని బిడ్డను బలిచ్చింది -
మహిళ గొంతు కోసిన కానిస్టేబుల్..
-
మహిళ గొంతు కోసిన కానిస్టేబుల్..
సాక్షి, నెల్లూరు: కోవూరు దళితవాడలో దారుణం చోటు చేసుకుంది. కానిస్టేబుల్ సురేష్.. ఓ మహిళపై కర్కశంగా దాడికి పాల్పడ్డాడు. కత్తితో గొంతు కోశాడు. తన భార్య ఆత్మహత్యకు మహిళ షేకున్ (35) కారణమని అనుమానంతో కానిస్టేబుల్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. పోలీసులు ఆమెను ఆసుప్రతికి తరలించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డిపై దాడి
ఖమ్మం: ఖమ్మం, వరంగల్, నల్ల గొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ సరళిని పరిశీలించేందుకు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో పర్యటిస్తుండగా ఆయనపై దాడి జరిగింది. ఆయనపై కొంతమంది చాతీపై ఇటుకలతో దాడి చేయడంతో గాయపడ్డారు. పోలీసులు, పార్టీ నాయకులు సమీపంలోని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. ఆస్పత్రికి చేరుకున్న పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి, బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రేమేందర్రెడ్డి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని, పోలింగ్ ముగిసిన తర్వాత హైదరాబాద్ తరలిస్తామని తెలిపారు. -
డోర్ డెలివరీ సిబ్బందిపై టీడీపీ కార్యకర్తల దాడి
తడ (నెల్లూరు జిల్లా): రేషన్ సరుకులు సరఫరా చేసేందుకు వెళ్లిన డోర్ డెలివరీ వాహన సిబ్బందిపై కొందరు టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. అడ్డుపడిన ఇద్దరు వలంటీర్లపై సైతం దాడి చేశారు. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తడ మండలం వేనాడు పంచాయతీ మట్టిగుంటలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు శనివారం మట్టిగుంట సెంటర్లో బియ్యం పంపిణీ చేస్తున్న సమయంలో నెట్వర్క్ సమస్య తలెత్తింది. ఎన్నికల వివాదాన్ని దృష్టిలో ఉంచుకున్న కొందరు టీడీపీకి చెందిన వ్యక్తులు దీనిని ఆసరాగా చేసుకుని డోర్ డెలివరీ వాహనం డ్రైవర్ ఆర్ముగం, సహాయకుడు తోట ప్రసాద్లపై దాడికి దిగారు. ఈ దాడిలో ప్రసాద్కు రక్త గాయాలయ్యాయి. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వలంటీర్లు దేవి, సురేష్లపై కూడా దాడి చేసి బీభత్సం సృష్టించారు. స్థానికులు కలగజేసుకుని అడ్డుపడ్డారు. దీనిపై బాధితులు తడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వైఎస్సార్సీపీ శ్రేణులపై జనసేన రాళ్ల దాడి ప్రలోభాలతో ఓటర్లకు టీడీపీ ఎర -
టీడీపీ దౌర్జన్యం.. కర్రలతో దాడి..
నరసరావుపేట రూరల్(గుంటూరు జిల్లా): పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థులను భయాందోళనకు గురిచేసే లక్ష్యంతో గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. నరసరావుపేట మండలం అర్వపల్లికి చెందిన సర్పంచి అభ్యర్థి ధర్మవరపు అంజనాకు మద్దతుగా గురువారం యంపరాల వెంకట్రావు, పులుసు శ్రీనివాసరావులు నామినేషన్ కేంద్రానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మెయిన్ రోడ్డుపై వేచి ఉన్న సమయంలో టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని అంజనాకు ఎందుకు మద్దతిస్తున్నారంటూ.. కర్రలతో దాడికి పాల్పడ్డారు. బాధితులను ఆస్పత్రికి తరలించగా, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.(చదవండి: డబ్బులిస్తాం.. మా వెంట రండహో!) నామినేషన్ వేశాడని 500 మామిడి మొక్కలకు నిప్పు రామగిరి: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండల పరిధిలోని పోలేపల్లి గ్రామానికి చెందిన సిద్ధయ్య గురువారం వార్డు మెంబర్గా నామినేషన్ వేశాడు. అయితే ఇది జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు సిద్ధయ్య పొలంలో సాగు చేసిన 550 మొక్కలతో పాటు, వ్యవసాయ సామగ్రికి నిప్పుపెట్టారు. ఘటనలో సమీపంలోని రాము, రాంగోపాల్రెడ్డికి చెందిన పొలాల్లోని వ్యవసాయ సామగ్రి, పైపులు కూడా కాలిపోయాయి. రామగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.(చదవండి: ఒక ఊరు.. మూడు పంచాయతీలు!) పోలేపల్లిలో కాలిపోయిన మొక్కలను పరిశీలిస్తున్న పోలీసులు.. -
ఎమ్మెల్యే చల్లా ఇంటిపై దాడి.. అట్టుడికిన వరంగల్
సాక్షి, హన్మకొండ: బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణలతో వరంగల్ నగరం ఆదివారం అట్టుడికిపోయింది. హన్మకొండ నక్కలగుట్టలోని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిని బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆదివారం ముట్టడించి దాడి చేయగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలోనే హంటర్రోడ్డులోని బీజేపీ కార్యాలయంపై టీఆర్ఎస్ నేతలు దాడి చేశారు. ఇటు సుబేదారి పోలీస్స్టేషన్ వద్దకు చేరుకుని స్టేషన్ ఎదుట ఉన్న బీజేపీ నేతల వాహనాలను ధ్వంసం చేశారు. చల్లా వ్యాఖ్యలతో దుమారం.. ఇటీవల రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు బీజేపీ శ్రేణులు దొంగ బుక్కులు తయారు చేసుకుని చందాలు వసూలు చేస్తున్నారంటూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం హన్మకొండ నక్కలగుట్టలోని ఆయన ఇంటిని ముట్టడించారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు రోప్పార్టీతో అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నా ప్రతిఘటించి దూసుకుపోయారు. ఈ క్రమంలో పోలీసులు బలవంతంగా నెట్టేయడంతో కొందరు అక్కడే బైఠాయించారు. వెనుక వైపు నుంచి కొందరు ధర్మారెడ్డి ఇంటిపైకి కోడిగుడ్లు, రాళ్లు, చెప్పులు విసిరారు. దీంతో ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన బీజేపీ కార్యాలయ సామగ్రి పోలీసులు అడ్డుకోగా వారి లాఠీలను లాక్కొని ఇంటిపైకి విసిరారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో దాడికి పాల్పడిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి హన్మకొండలోని సుబేదారి, కాకతీయ యూనివర్సిటీ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఇటు బీజేపీ దాడులకు ప్రతిగా టీఆర్ఎస్ నేతలు హన్మకొండ హంటర్రోడ్డులోని బీజేపీ కార్యాలయంపై కర్రలు, రాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా వేద బాంక్వెట్ హాల్ ఎదుట ఉన్న తోరణాన్ని ధ్వంసం చేశారు. ఇటు సుబేదారి పోలీసుస్టేషన్ వద్దకు చేరుకుని స్టేషన్ ఎదుట ఉన్న బీజేపీ నేతల వాహనాలపై దాడులు చేశారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సిద్ధం నరేశ్ కారు అద్దాలు పగులకొట్టారు. దీక్ష చేపట్టిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు.. టీఆర్ఎస్ నేతల చర్యను నిరసిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ సుబేదారి పోలీస్స్టేషన్లో దీక్ష చేపట్టారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధిగా ఉండి క్షుద్ర పూజలు చేసే మీకు అవతార పురుషుడైన రాముడి గురించి ఏమి తెలుసని ధర్మారెడ్డిని ప్రశ్నించారు. రామ మందిర నిర్మాణానికి భక్తులు సమర్పించే ప్రతి పైసకూ లెక్క ఉందని చెప్పారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న బీజేపీ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సుబేదారి పోలీసు స్టేషన్ ఎదుట బీజేపీ శ్రేణులు ధర్నా చేశారు. ఆదివారం రాత్రి పెద్ద ఎత్తున స్టేషన్కు చేరుకున్న నాయకులు, కార్యకర్తలు అక్కడే బైఠాయించారు. రాత్రి 10.20 గంటల వరకు కూడా ధర్నా కొనసాగింది. ఇటు ఎమ్మెల్యే చల్లా ఇంటిపై జరిగిన దాడి ఘనటనపై సుబేదారి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మతో పాటు ఇతర నేతలపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేతల పరామర్శ చల్లా ఇంటిపై బీజేపీ దాడి ఘటన సమాచారం తెలుసుకున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, మేయర్ గుండా ప్రకాశ్రావు తదితరులు ఆయన ఇంటికి చేరుకుని పరిశీలించారు. చల్లా కుటుంబ సభ్యులను పరామర్శించారు. దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇదిలాఉండగా.. వరంగల్ పోలీసు కమిషనర్ ప్రమోద్కుమార్ చల్లా ఇంటికి చేరుకుని పరిశీలించారు. పోలీసు ఏసీపీ జితేందర్రెడ్డి, ఎమ్మెల్యేతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. -
వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ వర్గీయుల దాడి
గుత్తి (అనంతపురం జిల్లా): పట్టణంలోని కమాటం వీధికి చెందిన వైఎస్సార్సీపీ నేత, 11వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి ఫరూక్పై టీడీపీ వర్గీయులు శుక్రవారం దాడి చేశారు. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఫరూక్ సోదరుడు అన్వర్ సీఎస్ఐ చర్చివద్ద ఉండగా కోట వీధికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు కె.ఎస్.ఉమర్, కుమారుడు మైను, అల్లుడు జబీర్, కార్యకర్తలు రామకృష్ణ (రాంకీ), సాదిక్, ఫయాజ్, ఏజస్, సయ్యద్, సాబాజ్, ఇర్ఫాన్, కరీమ్, విజయ్, రసూల్ మరో ఐదుగురు గొడవ పెట్టుకున్నారు. సర్దిచెప్పేందుకు వెళ్లిన ఫరూక్పై టీడీపీ వర్గీయులంతా రాళ్లు, కట్టెలతో విచక్షణారహితంగా దాడిచేశారు. తీవ్రంగా గాయపడ్డ ఫరూక్కు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. ఫరూక్పై దాడిచేసిన 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి గురుప్రసాద్ యాదవ్, బీసీ సెల్ జిల్లా నాయకులు వాల్మీకి శివ, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకుడు బుస్సా సుధీర్రెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. -
చిరుత దాడి.. తప్పించుకున్న యువకుడు
బెజ్జూర్ (సిర్పూర్): కుమురం భీం జిల్లాలో పులుల సంచారం అధికమవుతోంది. బుధవారం ఓ పెద్దపులి హల్చల్ సృష్టించింది. ఒకే రోజు మూడు చోట్ల సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఇందులో బెజ్జూర్ మండలం ఏటిగూడ వద్ద రోడ్డుపై ఉన్న ప్రయాణికులను వెంటాడింది. బెజ్జూర్ మండలం నందిగామ్కు చెందిన కేశయ్య, బానయ్య బుధవారం మండల కేంద్రానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఏటిగూడ పరిసర ప్రాంతం మాణికదేవర అటవీ ప్రాంతంలో వీరికి పెద్దపులి ఎదురుపడింది. దీంతో వారు వాహనాన్ని వదిలి పరుగులు తీశారు. కొద్ది దూరం వెంటాడటంతో తప్పించుకుని సమీపంలోని చెట్టు ఎక్కి ప్రాణాలతో బయటపడ్డారు.చదవండి:(పులి హల్చల్.. చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు) ఈ విషయమై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో బెజ్జూర్ రేంజ్ అధికారి దయాకర్ సిబ్బందితో కలసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పులి కదలికలను గుర్తించి అది వెళ్లిన మార్గాన్ని తెలుసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే కమ్మర్గాం నుంచి చింతలమానెపల్లి మండల కేంద్రానికి వెళ్తున్న ఇద్దరు యువకులకు పులి కనిపించింది. దీంతో పాటు బుధవారం సాయంత్రం బెజ్జూర్ మండలం గబ్బాయి గ్రామ సమీపంలో మేత మేస్తున్న ఆవుపై పులి దాడి చేసి చంపేసిందని బీట్ అధికారి అనిత తెలిపారు. వారం రోజుల క్రితం దహెగాం మండలం దిగిడలో ఓ యువకుడిపై పులి దాడి చేసి హతమార్చింది. ప్రస్తుతం ఇలా సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పులిని బంధించేందుకు దిగిడ అడవుల్లో పది బోన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎనిమిది పులుల వరకూ ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిరుత దాడి.. తప్పించుకున్న యువకుడు ఇంద్రవెల్లి (ఖానాపూర్): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం వాల్గొండ శివారులో చిరుతపులి దాడి నుంచి ఓ యువకుడు తప్పించుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచి్చంది. గ్రామానికి చెందిన ఉయిక కుమార్ (25) మంగళవారం ఉదయం తన ఎడ్లను మేత కోసం పొలానికి తీసుకువెళ్లాడు. సాయంత్రం ఎడ్లను తీసుకుని ఇంటికి వస్తుండగా అటవీ ప్రాంతంలో చిరుత పులి ఒక్కసారిగా యువకుడిపై జంప్ చేసింది. కొంతలో గురి తప్పడంతో అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. -
పూజ చేయొద్దని మహిళపై...
సాక్షి, అత్తాపూర్: ఇంటి ఎదుట ఉన్న ఆలయంలో పూజ చేయవద్దు అంటూ ఓ వ్యక్తి మహిళపై దాడి చేసిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అత్తాపూర్ పాండురంగానగర్ ప్రాంతంలో కవిత ఇంటి ఎదుట ఉన్న ఆలయంలో రోజూ పూజ చేస్తుంది. శుక్రవారం అమ్మవారికి పూజ చేస్తున్న సమయంలో పక్కనే నివాసం ఉండే యేసు అనే వ్యక్తి పూజ చేసే సమయంలో గంట శబ్ధం ఎక్కువగా వస్తుందని దీంతో ఇబ్బందిగా మారుతుందన్నాడు. దీంతో ఇరువురి మధ్య మాటా మాటా పెరగడంతో యేసు కవితపై కట్టెలు, రాడ్తో దాడి చేశాడు. ఈ ఘటనతో కవిత తల, మొహం, చేతి, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక సిత్థిలో పడి ఉన్న కవితను స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ మేరకు కవిత రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్లో యేసుపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నమస్తే పెట్టలేదని.. విద్యార్థిపై దాడి
సాక్షి, కొత్తూరు: తమకు నమస్తే పెట్టలేదనే కోపంతో కొందరు యువకులు డిగ్రీ విద్యార్థిని కిడ్నాప్ చేసి కర్రలతో తీవ్రంగా కొట్టి గాయపర్చారు. ఈ సంఘటన కొత్తూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో నివాసముండే మహేష్కుమార్సింగ్ శంషాబాద్లోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. గురువారం తన స్నేహితులతో కలిసి శంషాబాద్ మండలం నానాజీపూర్లోని వాటర్ఫాల్స్ వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న కొత్తూరుకే చెందిన పల్లెల చందు, కొల్లంపల్లి మురారి, ముడావత్ వినోద్, శ్రీకాంత్ తమను చూసి కూడా నమస్తే పెట్టలేదని ఆగ్రహంతో మహేష్కుమార్తో గొడవకు దిగారు. అనంతరం అక్కడి నుంచి మహేష్కుమార్ తన బైకుపై కొత్తూరుకు వస్తుండగా యువకులు మార్గమధ్యలో అడ్డగించి తమ బైకుపై ఎక్కించుకొని కిడ్నాప్ చేశారు. సుమారు రెండు గంటల పాటు మండలకేంద్రంలోని ఆయా వెంచర్లలో తిప్పుతూ కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన మహేష్కుమార్ వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుని, శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నలుగురు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మద్యం మత్తులో హత్య శంకర్పల్లి: కన్న తండ్రిని కత్తితో నరికి చంపిన ఉన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, మద్యం మత్తులో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో నివాసముంటున్న మ్యాదరి అంజయ్య(60)ను గురువారం రాత్రి అతడి కుమారుడు యాదయ్య కత్తితో తల నరికి హత్య చేశాడు. ఇది గమనించిన స్థానికులు ఇంటి బయట నుంచి తలుపులు వేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యాదయ్యను పట్టుకునేందుకు యత్నించగా కత్తితో బెదిరించే ప్రయత్నం చేశాడు. దీంతో గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో చేవెళ్ల ఏసీపీ రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో ఆక్టోపస్, ఫైర్ సిబ్బంది, 50 మందికి పైగా పోలీసులు ఇంటిని చుట్టుముట్టారు. ఆక్టోపస్ సిబ్బంది టియర్ గ్యాస్ను ఇంట్లోకి వదలడంతో వాసన తట్టుకోలేక యాదయ్య ఇంట్లో నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చాడు. అప్పటికే బయట సిద్ధంగా ఉన్న పోలీసులను తప్పించుకుని మరో ఇంటిపైకి ఎక్కాడు. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఇంటి పక్కనే ఉన్న మరో భవనం పైనుంచి నీటిని బలంగా వదలడంతో యాదయ్య కిందపడిపోయాడు. వెంటనే పోలీసులు అతడిని బంధించి పోలీస్స్టేషన్ తరలించారు. అనంతరం అంజయ్య మృతదేహం వద్ద వివరాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం యాదయ్యను విచారించగా.. మద్యం మత్తులో కత్తితో తల నరికానని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. యాదయ్య మానసికస్థితి బాగోలేదని తరచూ భార్య, తల్లిదండ్రులతో గొడవçప³డేవాడని చెల్లెలు సరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. -
చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతల బరితెగింపు..
శాంతిపురం(చిత్తూరు జిల్లా): ఉపాధి హామీ అధికారులపై టీడీపీ నాయకులు గూండాగిరి ప్రదర్శించారు. వారిని బెదిరించి తమ చెప్పుచేతుల్లో పెట్టుకునే యత్నంలో భాగంగా భౌతిక దాడులకు తెగబడ్డారు. ఈ ఘటన శాంతిపురం మండలంలో బుధవారం కలకలం రేపింది. ఉపాధిహామీ ఏపీఓ అశోక్రెడ్డి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. టీడీపీ మండల అధ్యక్షుడు జనార్దనరెడ్డి ఉపాధిహామీ పనుల కింద అక్రమంగా బిల్లులు పెట్టాడు. వీటిని తిరస్కరించడంతో రెచ్చిపోయాడు. శాంతిపురం ఉపాధి హామీ కార్యాలయంలో విధుల్లో ఉన్న ఏపీఓ అశోక్రెడ్డిపై ఆయన సోదరుడు రాజశేఖరరెడ్డితో కలిసి దౌర్జన్యం చేశాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన గుంజార్లపల్లె ఫీల్డ్ అసిస్టెంట్ సుబ్బారెడ్డిని విచక్షణా రహితంగా కొట్టి బట్టలు చింపేశాడు. సిబ్బంది ఆత్మరక్షణ కోసం ఆఫీసు లోపల గడియ పెట్టుకున్నా రాద్దాంతం చేసి, తలుపులు తీయించారు. ఫోన్లు చేసి తమ పార్టీ శ్రేణులను పిలిపించుకుని కార్యాలయంలోని కంప్యూటర్ మానిటర్, ప్రింటర్, కాట్రేజ్లు, రెండు కుర్చీలను ధ్వంసం చేశారు. పోలీసుల జోక్యంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన టీడీపీ శ్రేణులు కుప్పం–పలమనేరు జాతీయ రహదారిపై బైఠాయించారు. దాడికి గురైన ఏపీఓ, ఫీల్డు అసిస్టెంట్లను ఎంపీడీఓ చిన్నరెడ్డెయ్య కారులో పోలీసు స్టేషన్కు తరలించే ప్రయత్నం చేయడంతో వారినీ అడ్డుకున్నారు. పోలీసుల ఎదుటే దుర్భాషలాడుతూ కారుపై దాడికి యత్నించారు. కుప్పం రూరల్ సీఐ యతీంద్ర, రాళ్లబూదుగూరు ఎస్ఐ మురళీమోహన్ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించి, వారిని తరలించారు. అధికారుల ఫిర్యాదుకు కౌంటరుగా టీడీపీ నాయకులు కూడా తమపై దాడిచేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి
ఇచ్ఛాపురం రూరల్ (శ్రీకాకుళం జిల్లా): మండలంలోని మశాఖపురంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. గత కొంత కాలంగా గ్రామంలో తరచూ వర్గ విభేదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో పోలీసులు గ్రామస్తులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఒకే తాటిపైకి తెచ్చారు. అయినప్పటికీ అడపాదడపా ఘర్షణలు ఈ జరుగుతునే ఉన్నాయి. వైఎస్సార్ సీపీ నాయకులు దుర్గాశి చినబాబు, దుర్గాశి పురుషోత్తం, నగిరెడ్ల చిరంజీవిలకు టీడీపీ వర్గీయులు ఆశి గోపాలు, ఆశి విజయ్, ఆశి జగ్గయ్య, దుర్గాశి ప్రతాప్, దుర్గాశి దేవరాజులకు మధ్య గత కొంత కాలంగా పొలం సమస్యపై తగాదా ఉంది. ఆదివారం ఉదయం ఒంటరిగా పొలానికి వెళ్లిన దుర్గాశి చినబాబుకు, టీడీపీ వర్గీయులకు మధ్య పొలం గట్టు విషయమై ఘర్షణ తలెత్తింది. దీంతో టీడీపీ వర్గీయులు చినబాబుపై తలపై కత్తులతో దాడిచేయడంతో తీవ్రగాయాలతో పొలంలో పడిపోయాడు. పది నిమిషాల తరువాత అదే పొలానికి వెళ్లిన పురుషోత్తం, చిరంజీవిలపై మళ్లీ కత్తులతో దాడి చేయడంతో ఇరువర్గాలు కొట్టుకున్నారు. ఈ ఘటనలో పురుషోత్తంకు కాలు, తొడ భాగంలో తీవ్రగాయాలు కాగా, చిరంజీవి చూపుడు వేలు తెగిపడటంతో పాటు కాలు విరిగింది. స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిగా ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రికి తరలించగా, దుర్గాశి చినబాబు పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తీసుకెళ్లారు. పురుషోత్తం స్థానిక ఆసుపత్రిలో, చిరంజీవి సోంపేటలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న సీఐ ఎం.వినోద్బాబు, రూరల్ ఎస్సై కె.లక్ష్మీలు ఆసుపత్రికి చేరుకొని విచారించారు. ఇరువర్గాల వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల దాష్టీకం
సాక్షి, అనంతపురం: ఉరవకొండ మండలం ముష్టూరులో టీడీపీ నేతలు దాష్టీకానికి పాల్పడ్డారు. అధిక వడ్డీలపై నిలదీసిన ముగ్గురు వ్యక్తులపై టీడీపీ నేత రాంబాబు, ఆయన అనుచరులు కర్రలు,రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో సాయికుమార్,సాయికిషోర్,నిఖిల్ అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. -
తిట్టాడని జేసీబీతో దాడి
-
ఈడ్చికెళ్లి.. టీడీపీ నేతల బీభత్సం
పుట్టపర్తి అర్బన్(అనంతపురం జిల్లా): మండలంలోని వెంగళమ్మ చెరువు గ్రామంలో టీడీపీ నాయకులు చెలరేగిపోయారు. పాత కక్షలను మనసులో పెట్టుకుని స్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ కుటుంబంపై దాడికి తెగబడ్డారు. రూరల్ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి తెలిపిన మేరకు స్కూల్ కమిటీ చైర్మన్ వడ్డే వెంకటరమణ ఇంటి సమీపంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి తన కారును ఆపి ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చేవాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఆదివారం ఘర్షణ చోటు చేసుకుంది. రాత్రి పొద్దుపోయాక ఆదినారాయణరెడ్డి తన వర్గీయులతో కలిసి వెంకటరమణ ఇంటిపై దాడికి తెగబడ్డాడు. వాకిలి తీయక పోవడంతో రాళ్లు రువ్వారు. ఇంటి ఎదుట నిలిపిన ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారు. (వైఎస్సార్ సీపీ నేత దారుణ హత్య) తలుపులు తోసుకుని లోపలకు ప్రవేశించి, వెంకటరమణపై రాళ్లు, ఇనుప రాడ్లతో తీవ్రంగా గాయపరిచారు. ప్రాణభయంతో వెంకటరమణ ఇంటి నుంచి బయటపడి చీకట్లో తప్పించుకున్నాడు. అదే సమయంలో వెంకటరమణ భార్య వనజను జుట్టుపట్టుకుని బజారులోకి ఈడ్చుకొచిచ కాళ్లతో తన్నారు. అడ్డుకోబోయిన తండ్రి వీరన్నపై చేయిచేసుకున్నారు. మిమ్మల్ని చంపితే ఎవరు దిక్కొస్తారంటూ కేకలు వేస్తూ భయాందోళనలు సృష్టించారు. విషయాన్ని చుట్టుపక్కల వారు తమకు సమాచారం అందించడంతో పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ దాదాపీర్, సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు సీఐ వివరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసరెడ్డి, పాపన్న, వీరాస్వామి, రమేశ్, కేశప్ప మరో 16 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. -
అర్నాబ్ గోస్వామి దంపతులపై దాడి...
ముంబై : రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి దంపతులపై బుధవారం అర్ధరాత్రి దాడి జరిగింది. ముంబైలోని స్టూడియో నుంచి ఆర్నాబ్ గోస్వామి, అతని భార్య ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వారిపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. బైక్పై దూసుకొచ్చిన వ్యక్తులు అర్నాబ్ వాహనం దాడికి యత్నించారు. తనపై దాడికి సంబంధించి అర్నాబ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దాడిలో అర్నాబ్ దంపతులకు ఎటువంటి గాయాలు కాలేదు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఆర్నాబ్ వీడియో సందేశాన్ని రిపబ్లిక్ టీవీ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో.. తనపై దాడికి పాల్పడింది కాంగ్రెస్ యూత్ నాయకులేనని అర్నాబ్ ఆరోపించారు. ఆఫీసు నుంచి తిరిగివస్తున్న తమపై రాత్రి 12.15 గంటలకు దాడి జరిగిందని చెప్పారు. బైక్ వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారు అద్దాలు పగలకొట్టడానికి యత్నించారని తెలిపారు. తనకు ఏదైనా జరిగితే కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుటుంబమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, తనపై జరిగిన దాడిని వ్యక్తిగతంగా ఎదుర్కొంటానని.. దీనిపై ఎంత దూరమైనా వెళ్తానని తెలిపారు. తాను, తన టీవీ చానెల్ నిజం కోసమే పనిచేస్తుందని అన్నారు. #BREAKING | Arnab's message after being physically attacked by Congress goons #SoniaGoonsAttackArnab https://t.co/RZHKU3fdmK pic.twitter.com/SdAvoerhIH — Republic (@republic) April 22, 2020 -
మొబైల్ చోరీ చేశాడంటూ చావబాదారు..
జైపూర్ : మొబైల్ ఫోన్ చోరీ చేశాడనే అనుమానంతో దళిత వ్యక్తిని దారుణంగా కొట్టడంతో బాధితుడు మరణించిన ఘటన రాజస్ధాన్లోని సికార్ జిల్లాలో వెలుగుచూసింది. 12 రోజుల కిందట జరిగిన ఈ ఘటనలో మదన్ లాల్ మీనా (75) సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకూ ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వృద్ధుడిపై దాడి కేసులో నిందితులు జితేంద్ర యాదవ్, భరత్భూషణ్, దిలీప్ సింగ్, సందీప్ మీనా, సందీప్ యాదవ్లను అరెస్ట్ చేశామని అదనపు ఎస్పీ దినేష్ అగర్వాల్ వెల్లడించారు. ఓ హోటల్ వద్ద తమ మొబైల్ ఫోన్ను మదన్ లాల్ మీనా దొంగిలించాడనే అనుమానంతో ఐదుగురు నిందితులు అతడిని తీవ్రంగా కొట్టారు. మార్చి 4న ఈ ఘటన జరగ్గా, వృద్ధుడిని నిందితులు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాధితుడి కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి : మహిళా కండక్టర్పై దాడి.. కానిస్టేబుళ్లపై వేటు! -
బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీతో పాటు ఇతర పార్టీలు పోటాపోటీగా పాల్గొంటున్నాయి. అదేవిధంగా ప్రచారంలో ఆప్, బీజేపీ చేసే విమర్శలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో బాదర్పూర్ నియోజకర్గం బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ్ దత్ శర్మపై బుధవారం దాడి జరిగింది. ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి జరగటం ఢిల్లీలో చర్చనీయ అంశంగా మారింది. నారయణ్ దత్ శర్మ తన కారులో పార్టీ మీటింగ్కు హాజరై తిరిగి వస్తుండగా పదిమంది గుర్తు తెలియని దుండగులు ఆయనపై దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కారు అద్దాలు పగిలి మీద పడటంతో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ దత్.. తన రాజకీయ ప్రత్యర్థులు ఈ దాడి చేయించారని ఆరోపించారు. కాగా, ఇటీవల ఆయన ఆప్ నుంచి బయటకు వచ్చి బీఎస్పీలో చేరిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బాదర్పూర్ నియోజకవర్గంలో ఆప్ ఆయనకు టికెట్ నిరాకరిచంటంతో బీఎస్పీలో చేరినట్లు తెలుస్తోంది. -
మహిళా రైతుపై వీఆర్వో దాడి
మంథని: పట్టా చేసేందుకు తీసుకున్న డబ్బు తిరిగి అడిగినందుకు ఓ మహిళా రైతులపై వీఆర్వో దాడి చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో గురువారం జరిగింది. నాగెపల్లికి చెందిన తన తండ్రి కొయ్యల దుర్గయ్య పేరిట పట్టా చేస్తానంటే మంథని మండలం అడవిసోమన్పల్లి వీఆర్వో సహీరాభానుకు రూ.30 వేలు ఇచ్చినట్లు దుర్గయ్య కూతురు సమ్మక్క తెలిపింది. తన తండ్రి చనిపోయాక తల్లి పేరిట పట్టా చేస్తానని చెప్పడంతో ఏడాదిగా తిరుగుతున్నానని తెలిపింది. దీనిపై తహసీల్దార్కు ఫిర్యాదు చేస్తే.. ఆన్లైన్లో దరఖాస్తు చేయమని చెప్పినట్లు వివరించింది. వీఆర్వో ఇంటికి వెళ్లి డబ్బులు అడగ్గానే దాడి చేసిందని చెప్పింది. తాను డబ్బులు తీసుకున్నానన్న ఆరోపణల్లో నిజం లేదని వీఆర్వో తెలిపారు. కాగా, వీరిద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
బ్యాంకు ఉద్యోగిని చితకబాదారు..
-
వీఆర్వోపై టీడీపీ కార్యకర్త దాడి, బండబూతులు..
సాక్షి, ప్రకాశం : రోజు రోజుకు పచ్చ నేతల ఆగడాలు అధికమవుతున్నాయి. టీడీపీ నేతలు ఓటమి అక్కసుతో రగిలిపోతున్నారు. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. కడుపు మంటతో భౌతిక దాడులకు దిగుతున్నారు. నిన్నటి వరకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేసేవారు. తాజాగా వారు మరో అడుగు ముందుకేసి.. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం మల్లపాలెం గ్రామంలో ఓ టీడీపీ కార్యకర్త ఏకంగా వీఆర్వోపైనే దాడికి తెగబడ్డాడు. తాము చెప్పిన పనులు చేయాల్సిందే అంటూ బండ బూతులు తిట్టాడు. అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు. అంతటితో ఆగకుండా ఓటరు గుర్తింపు కార్డులకి ఆధార్ అనుసంధానం చేసే పనిలో ఉన్న వీఆర్వో వెంకటేశ్వర్లుపై గ్రామస్తుల సమక్షంలోనే టీడీపీ నాయకుడు బాలూ నాయక్ విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బండ్లగూడ డిపో వద్ద ఉద్రిక్తత
-
మేయర్ను ట్రక్కు కట్టి ఈడ్చుకెళ్లిన పౌరులు
మెక్సికోలో దారుణం చోటు చేసుకుంది. ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చలేదన్న ఆగ్రహంతో దక్షిణ మెక్సికో పౌరులు చట్టాన్ని తమ చేతుల్లోకి చాలా అమానుషంగా ప్రవర్తించారు. మెక్సికన్ రాష్ట్ర మేయర్ను కిడ్నాప్ చేస, ఒక ట్రక్కుకు కట్టి, వీధుల గుండా లాక్కెళ్లిన ఘటన సంచలనం సృష్టించింది. దేశంలోని చిపాస్ రాష్ట్రంలోని లాస్ మార్గరీటాస్ పట్టణంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మీడియా నివేదికల ప్రకారం తోజోలాబల్ కమ్యూనిటీకి చెందిన 30మంది సభ్యులు మేయర్ కార్యాలయంలోకి చొరబడి మేయర్ జార్జ్ లూయిస్ ఎస్కాండన్ హెర్నాండెజ్ను బయటకు లాక్కొచ్చారు. అనంతరం పికప్ ట్రక్ వెనుక భాగంలో కట్టి ఈడ్చుకెళ్లారు. ఇలా కొన్ని మీటర్లు లాక్కెళ్లారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చివరకు పోలీసుల జోక్యంతో ప్రాణాపాయం నుంచి తృటిలో క్షేమంగా బయటపడ్డాడు మేయర్. అయితే ఈ సంఘటన జరిగిన ఎనిమిది గంటల తరువాత, మేయర్ హెర్నాండెజ్ లాస్ మార్గరీటాస్లో ప్రసంగించారు, శాంటారీటా సమాజంలోని నాయకులు దీనికి బాధ్యులుగా ప్రకటించారు. కిడ్నాప్, హత్యాహత్నం కింద ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. అటు ఈ సంఘటనలో 10 మంది గాయపడ్డారని, 11 మందిని అరెస్టు చేసినట్లు ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం తెలిపింది. కాగా ప్రత్యక్ష నగదు బదిలీలతో సహా అందించిన దానికంటే ఎక్కువ ప్రజా వనరులను అందోళనకారులు డిమాండ్ చేశారని, ఈ విషయంలో మేయర్ వైఫ్యలం ఈ సంఘటనకు దారి తీసిందని స్టేట్ ప్రాసిక్యూటర్ జార్జ్ లూయిస్ లావెన్ వెల్లడించారు. #Enterate Circula en redes video en el que pobladores del ejido Santa Rita en el municipio de #LasMargaritas, #Chiapas, suben en una camioneta al alcalde Jorge Luis Escandón Hernández. Los motivos es porque no ha cumplido lo prometido en campaña. pic.twitter.com/Yywx2exGAC — Tabasco Al Minuto (@Tabalminutomx) October 8, 2019 UNA SU ARRASTRADA. Alcalde de #LasMargaritas, Jorge Luis Escandón Hernández, es sujetado a una camioneta que lo arrastra en pleno parque central, luego de haber sido secuestrado de la propia alcaldía #Chiapas #VideoViral pic.twitter.com/ptdP7g2w92 — Tinta Fresca Chiapas (@tinta_fresca) October 8, 2019 -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ దౌర్జన్యం
-
రాపిడో డ్రైవర్లపై కస్టమర్ల దాడి కలకలం
సాక్షి, బెంగళూరు: బైక్ సేవల సంస్థ రాపిడో డ్రైవర్లపై దాడి చేసి దోచుకున్న ఘటన కలకలం రేపింది. కస్టమర్ల ముసుగులో వచ్చిన ముగ్గురు దుండగులు రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు డ్రైవర్లను బెదిరించి డబ్బు, మొబైల్, బ్యాంకు కార్డులను ఎత్తుకుపోయారు. ఈ రెండు ఘటనలు సోమవారం ఉదయం బెంగళూరు నగరంలో చోటు చేసుకున్నాయి. బెంగళూరులోని ధానేశ్వర్ బేకు హోసూర్ రోడ్లోని కుడ్లు గేట్ సమీపంలో ని ఘటనలో డ్రైవర్ను ఎత్తుకుపోయి మరీ చోరీకి పాల్పడ్డారు. రాపిడో డ్రైవర్ ధనేశ్వర్ (37) యాప్ ద్వారా వచ్చినసమాచారం ప్రకారం కస్టమర్ను పికప్ చేసుకునేందుకు సంబంధిత ప్రదేశానికి వెళ్లాడు. అప్పటికే అక్కడున్న ఒక వ్యక్తి కత్తితో ఎటాక్ చేసి డ్రైవర్ మెడ కోశాడు. అనంతరం రెండు మొబైల్ ఫోన్లు, రూ .1200 నగదుతో పాటు క్రెడిట్, డెబిట్ కార్డు, పవర్ బ్యాంక్ లాక్కున్నాడు. అనంతరం ధనేశ్వర్ను బలవంతంగా మరో ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ మరో ఇద్దరు దుండగులు పొంచి వున్నారు. ఈ ముగ్గురూ కలిసి ధనేశ్వర్ను కొట్టి మరీ ఏటీఎం కార్డు పిన్ అడిగి రూ .500 డ్రా చేశారు. గూగుల్ పే ద్వారా రూ .165 బదిలీ చేయమని బలవంతం చేశారు. అక్కడితో ఆగకుండా మరింత డబ్బుకోసం డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఎలాగోలా ధనేశ్వర్ అక్కడినుంచి తప్పించుకుని పారిపోయి పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సోమవారం తెల్లవారుజామున 2:45 గంటలకు జరిగిన మరో సంఘటనలో, మరో రాపిడో డ్రైవర్ అమల్ సింగ్ (27) ను ముగ్గురు వ్యక్తులు ఇదే విధంగా కత్తితో బెదిరించి, దోచుకోవడం గమనార్హం. పరప్పన అగ్రహార సమీపంలో ఉన్న పికప్ పాయింట్ వద్దకు అమల్సింగ్ చేరుకోగానే, ముగ్గురు సాయుధ వ్యక్తులు అతడిపై మూకుమ్మడిగా దాడిచేసి మొబైల్ ఫోన్, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఆధార్, పాన్ కార్డు ఉన్న వాలెట్ , ఇతర విలువైన వస్తువులు దోచుకున్నారు. ఈ ముగ్గురు వ్యక్తులే ఈ రెండు ఘటనల్లోనూ నిందితులు కావచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
డబ్బులు అడిగాడని.. వేళ్లు నరికేశారు
నాగ్పూర్ : మహారాష్ట్రలోని నాగ్పూర్లో చోటుచేసుకున్న దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తను చేసిన పనికి కూలి అడిగిన ఓ 60 ఏళ్ల వృద్ధున్ని ఇద్దరు వ్యక్తులు అతి దారుణంగా హింసించారు. వివరాల్లోకి వెళితే.. ఒడిశాకు చెందిన చమ్రూ పహరియాకు పని కల్పిస్తామని చెప్పి కొందరు వ్యక్తులు నాగ్పూర్కు తీసుకువచ్చారు. అక్కడ ఒక కన్స్ట్రక్షన్ సైట్లో ఈ ఏడాది జూలైలో బాండెడ్ లేబర్గా చమ్రూను పనిలో చేర్చుకున్నారు. అయితే కొంతకాలం తరువాత చమ్రూ తనకు రావాల్సిన డబ్బులు అడగడంతో డోలాల్ సట్నామి, బిడేసి సునామి అనే ఇద్దరు వ్యక్తులు అతనిపై దాడికి దిగారు. చమ్రూను దారుణంగా కొట్టడమే కాకుండా.. కుడి చేతి మూడు వేళ్లను, కుడి కాలి ఐదు వేళ్లను పదునైన ఆయుధంతో కత్తిరించారు. ఈ దాడి అనంతరం చమ్రూకు ఏం చేయాలో తోచలేదు. భయంతో తన సొంతూరు వెళ్లేందుకు నాగ్పూర్ రైల్వేస్టేషన్కు చేరుకున్నాడు. అయితే గాయాలతో ఉన్న చమ్రూను గుర్తించిన రైల్వే పోలీసులు అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత చమ్రూ కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో అతన్ని తిరిగి వారి ఊరికి తీసుకెళ్లారు. దిలీప్కుమార్ అనే ఉద్యమకారుడు చమ్రూకు న్యాయం చేయాలని ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించాడు. అలాగే చమ్రూ కుటుంబానికి తగిన పరిహారం చెల్లించేలా అధికారులను ఆదేశించాలని కోరాడు. ఈ ఘటనపై చమ్రూ కుమారుడు తులరామ్ మాట్లాడుతూ.. ‘మా కుటుంబానికి వారు తీవ్ర అన్యాయం చేశారు. మా నాన్న తన పనులు కూడా తాను చేసుకోలేపోతున్నాడు. కనీసం చేతులతో ఏ వస్తువును కూడా పట్టుకోలేకపోతున్నాడ’ని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ ఘటనపై మాట్లాడేందుకు చమ్రూ మాత్రం భయపడుతున్నాడు. మరోవైపు చమ్రూపై దాడికి దిగిన వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. -
టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థి, ప్రజా సంఘాలు!
సాక్షి, కర్నూలు : రాజధాని విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీ కృష్ణ కమిటీ నివేదికలను తుంగలో తొక్కి రాయలసీమకు తీరని ద్రోహం చేశారని పలు విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు ధ్వజమెత్తారు. కర్నూలును రాజధానిగా ప్రకటించి, రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ నేపథ్యంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లును అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. కార్యక్రమంలో ఆర్యూ జేఏసీ నాయకుడు శ్రీరాములు, బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనారిటీ విద్యార్థి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కే రామకృష్ణ, ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడ రేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్ చంద్రప్ప, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి వీ. భరత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతు శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధాని, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుపై టీడీపీ నేతలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. ఇటీవల టీడీపీ జిల్లా అధ్యక్షుడు రాజధాని మారిస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాజధాని, హైకోర్టుకు సంబంధించి రాయలసీమ వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలు టీడీపీ నేతలకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు వీవీ నాయుడు, బీ రంగమునినాయుడు, రాజునాయుడు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
తండ్రీకొడుకుపై దాడి
సాక్షి, పెండ్లిమర్రి, కడప: మొయిళ్లకాల్వ గ్రామం మసీదు మత గురువు మహమ్మద్ హనీఫ్, ఆయన కుమారుడు యూసఫ్పై అదే గ్రామానికి చెందిన మహబూబ్ బాషా కత్తితో దాడి చేశాడు. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. మహమ్మద్ హనీఫ్కి, మహబుబ్ బాషాకు గతంలో గొడవ అయ్యింది. పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని గురువారం తెల్లవారుజామను తండ్రీకొడుకుపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. గాయపడిన ఇద్దరినీ కడప రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతున్నారు. ఎస్ఐ కొండారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సెయిల్ ఛైర్మన్పై హత్యాయత్నం?
సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్) ఛైర్మన్ అనిల్ కుమార్ చౌదరి (58) పై హత్యాయత్నం వార్త కలకలం రేపింది. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఆయన కారును దుండగులో మరో కారుతో ఢీకొట్టారు. దీంతో అనిల్, ఆయన డ్రైవర్ కిందకు దిగి ప్రశ్నించారు. కారులో ఉన్న సాయుధులైన నలుగురు యువకులు ఇనుప రాడ్లతో ఒక్కసారిగా వీరిపై దాడికి తెగబడ్డారు. అయితే తృటిలో వారిరువురూ ప్రాణా పాయం నుంచి బయటపడ్డారు. బుధవారం రాత్రి దక్షిణ దిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ ఘటనపై సెయిల్ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. సెయిల్ అందించిన సమాచారం ప్రకారం కారుతో ఢీకొట్టిన నిందితుల్లో ఒకరు డ్రైవర్ను అతని మెడకు పట్టుకోగా, మిగతా ముగ్గురు అనిల్పై దాడి చేశారు. ఈ ఘటనలో అనిల్ తల, మెడ, కాళ్లపై ఐరన్ రాడ్లతో తీవ్రంగా కొట్టారు. అటుగా వెళ్తున్న డిఫెన్స్ కాలనీకి చెందిన హైవే పెట్రోలింగ్ సిబ్బంది దాడిని చూసి వెంటనే అక్కడకు చేరుకున్నారు. అనిల్ను రక్షించి ఎయిమ్స్కు తరలించారు. నిందితుల్లో ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఛైర్మన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారనీ, డ్రైవర్కూడా క్షేమంగా ఉన్నాడని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు ఇది యాదృచ్ఛికంకా జరిగిన ఘటన కాదని, ఎవరో కావాలనే ఛైర్మన్పై దాడి చేసి ఉంటారని పెరు చెప్పడానికి ఇష్టపడని కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. -
సీరియల్ నటిపై దాడి చేసిన హెయిర్ డ్రెసర్
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సీరియల్ నటి రాగమాధురిపై షూటింగ్ సెట్లోనే దాడి జరిగింది. తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారనే నెపంతో మాధురిపై కోపం పెంచుకున్న హెయిర్ డ్రెసర్ జ్యోతిక తన అనుచరులతో కలిసి ఆమెపై దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లోని లక్ష్మీపార్వతి నివాసం వద్ద ఓ తెలుగు సీరియల్ షూటింగ్ జరుగుతుంది. అయితే రెండు రోజుల క్రితం ఆ సీరియల్లో నటిస్తున్న రాగమాధురి నల్లపూసల గొలుసు కనబడకుండా పోయింది. తన గొలుసు మిస్ కావడంపై రాగమాధురి సెట్లో ఉన్నవారిని అడిగారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆమె బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. హెయిర్ డ్రెసర్తోపాటు మరో ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాగమాధురి ఫిర్యాదు మేరకు పోలీసులు జ్యోతికను విచారించేందుకు సిద్దమయ్యారు. అయితే ఆ సమయంలో షూటింగ్ సెట్లోని వారు కారులో గొలుసు లభించిందని చెప్పి పోలీసులకు దాన్ని అప్పగించి జ్యోతికను అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే జ్యోతిక మరో ఎనిమిది మంది అనుచరులతో కలిసి షూటింగ్ వద్దకు వెళ్లి నానా హంగామా సృష్టించారు. రాగమాధురిని తీవ్రంగా కొట్టారు. సెట్లో వారు నిలువరించిన వినకుండా ఆమె చీరను కూడా లాగేశారు. దీంతో రాగమాధురి మరోసారి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. నాగమాధురి ఫిర్యాదు మేరకు జ్యోతికతోపాటు ఆమె అనుచరలపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
నాటు సార కేంద్రలపై ఎక్సైజ్ పోలీసులు దాడి
-
లోక్సభ అభ్యర్థి కారుపై దుండగులు దాడి
-
మేరుగ నాగార్జునపై దాడి.. బయటకు వచ్చిన వీడియో
సాక్షి, గుంటూరు : పోలింగ్ రోజున టీడీపీ నేతలు చేసిన దారుణాలు, దౌర్జన్యాల గురించి తెలిసిందే. వైఎస్సార్సీపీ నాయకుడు మేరుగ నాగార్జునపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కేసు నమోదు చేసినా.. ఇప్పటివరకు ఒక్కరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు. అయితే వారిని అరెస్ట్చేయకుండా పోలీసులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆ దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వేమూరు మండలం బూతుమల్లిలో మేరుగపై టీడీపీ గూండాల దాడి చేశారు. కారుపైకి ఎక్కి ధ్వంసం చేశారు. కారు అద్దాలు పగిలి మేరుగ నాగార్జునకు గాయాలయ్యాయి. రిగ్గింగ్ ను అడ్డుకునేందుకు వెళ్లిన నాగార్జునపై దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో పుటేజి వెలుగులోకి వచ్చింది. -
మేరుగ నాగార్జునపై టీడీపీ నేతల దాడి
సాక్షి, గుంటూరు : పోలింగ్ ముగిసినా కానీ ఇంకా పరిస్థితులు సద్దుమణగలేదు. కొన్ని చోట్ల టీడీపీ దాడులు చేస్తూ.. దౌర్జన్యాలకు పాల్పడుతోంది. రిగ్గింగ్ జరుగుతోందన్న సమాచారంతో పోలింగ్ బూత్లోకి వెళ్లిన వైఎస్సార్సీపీ అభ్యర్థి మేరుగ నాగార్జునపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. రాళ్లతో దాడి చేయగా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. రణరంగంగా మారిన గురజాల అంతేకాకుండా గురజాల కూడా రణరంగంగా మారింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడులు చేసింది. తెలుగు తమ్ముళ్లు యధేచ్చగా ఆస్థులను ధ్వంసం చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో స్వైర విహారం చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ నాయకుడు యనుముల మురళీధర్ రెడ్డి ఆస్థులను ధ్వంసం చేశారు. సినిమాహాలు, ఆస్పత్రి, షాపులపై దాడులు చేస్తున్నారు. సీఐ రామారావు కళ్లెదుటే ఆస్తులను ధ్వంసం చేస్తూ రెచ్చిపోయారు. ఈ ఘటనలతో గురజాల వాసులు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు. -
సీబీఐ అధికారులనే చితకబాదారు!
నోయిడా/న్యూఢిల్లీ: సాధారణంగా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అధికారులు తనిఖీలు, విచారణకు వస్తే ఎవరైనా భయపడతారు. కానీ ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో విచిత్రంగా నిందితుడి బంధువులే సీబీఐ అధికారులకు చుక్కలు చూపించారు. మూకుమ్మడిగా చుట్టుముట్టి కర్రలు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. అధికారుల స్మార్ట్ఫోన్లు, గుర్తింపు కార్డులను లాక్కుని తగలబెట్టారు. చివరికి పోలీసులు సరైన సమయానికి అక్కడకు చేరుకోవడంతో బతుకుజీవుడా.. అనుకుంటూ అధికారులు బయటపడ్డారు. 2014లో యూపీలోని యమునా ఎక్స్ప్రెస్వే పారిశ్రామిక అభివృద్ధి సంస్థ(వైఈఐడీఏ)కు సంబంధించి రూ.126 కోట్ల కుంభకోణం జరిగింది. ఈ కేసును తొలుత విచారించిన సీబీఐ ఇన్స్పెక్టర్ వీఎస్ రాథోడ్, ఏఎస్సై సునీల్దత్ అవినీతికి పాల్పడ్డారు. వీరిపై కేసు నమోదు చేసి రాథోడ్ను సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో సునీల్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఈ నేపథ్యంలో సునీల్ ఇంటిలో సోదాలు నిర్వహించేందుకు ఐదుగురు సీబీఐ అధికారుల బృందం శనివారం సునీల్ సొంతూరు సోన్పురాకు చేరుకుంది. అంతలోనే అక్కడ సునీల్ కనిపించడంతో ఆయన్ను అరెస్ట్చేసేందుకు అధికారులు యత్నించారు. దీంతో సునీల్ బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా సీబీఐ అధికారులను చుట్టుముట్టి కర్రలు, రాడ్లతో దాడికి దిగారు. ఇదే అదనుగా సునీల్ అక్కడి నుంచి పారిపోయాడు. కాగా, సీబీఐ అధికారుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడి కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత సీబీఐ అధికారులు ఫిర్యాదుచేయడంతో సునీల్ సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
చిత్తూరు జిల్లాలో పెరిగిపోయిన టీడీపీ అరాచకాలు
-
కేజ్రీవాల్పై కారంపొడి దాడి
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై సచివాలయంలోనే ఓ వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం కారంపొడి చల్లాడు. అత్యంత భద్రత ఉండే సచివాలయంలోని సీఎం కార్యాలయం బయటే ఈ దాడి జరిగింది. నిందితుణ్ని ఢిల్లీకి చెందిన అనిల్ కుమార్ శర్మగా గుర్తించిన పోలీసులు, అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఖైనీ పొట్లాల్లో కారంపొడి నింపుకుని వచ్చిన అనిల్, మధ్యాహ్నం భోజనానికి సీఎం తన కార్యాలయం నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ దాడి చేశాడు. కేజ్రీవాల్ కంట్లో కారం చల్లేందుకు అనిల్ ప్రయత్నించాడనీ, ఆయన కళ్లద్దాలు కిందపడి దెబ్బతిన్నాయని అక్కడ ఉన్న అధికారులు చెప్పారు. -
దేవరకొండ బీజేపీ అభ్యర్థిపై స్థానిక నేతల దాడి
-
మద్యం మత్తులో.. బీరుసీసాలతో దాడి!
సాక్షి, రాజన్న సిరిసిల్లా : హనుమాజీ పేట గ్రామంలోని పర్మిట్ రూమ్ వద్ద నలుగురు వ్యక్తులు నానా హంగామాచేశారు. మద్యం మత్తులో ఒకరిపైఒకరు బీరు సీసాలతో దాడి చేసుకున్నారు. పాత కక్షలతోనే ఒకరిపై ఒకరు ఈ దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వేములవాడ రూరల్ పోలీసుల కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. వేములవాడ మండలం మల్లారంకు చెందిన గంగరాజు, ప్రవీణ్, జానీలతో పాటు చందుర్తి మండల మూల పల్లెకు చెందిన ప్రశాంత్లు పర్మిట్ రూమ్లో మద్యం సేవిస్తూ ఉండగా.. మాటలతో వాగ్వాదానికి దిగారు. మద్యం మత్తులో బీరుసీసాలతో కొట్టుకున్నారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. మిగతా ముగ్గురిని వేములవాడ ఆసుపత్రికి తరలించారు. -
వ్యాపారవేత శ్రీనివాస్ ఇంటిపై ఈడీ అధికాతులు దాడులు
-
కడపలో పోలీసులపై దాడి చేసిన ఎర్ర కూలీలు
-
మా ముందే కుర్చీలో కూర్చుంటావా?
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఓ దళిత మహిళ తమముందు కుర్చీపై కూర్చుని పనిచేయడం నచ్చని రాజ్పుత్ వర్గీయులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడి వారిని సజీవదహనం చేసేందుకు యత్నించారు. అహ్మదాబాద్ జిల్లా వాల్తేరాలోని అంగన్వాడీ కేంద్రంలో పల్లవిబెన్ జాదవ్(45) పనిచేస్తున్నారు. గ్రామస్తులకు మంజూరైన ఆధార్ కార్డుల్ని పంచే బాధ్యతను అధికారులు ఆమెకు అప్పగించారు. దీంతో పల్లవిబెన్ బుధవారం గ్రామంలో ఆధార్కార్డులు పంచుతుండగా అక్కడికి చేరుకున్న కరదియా రాజ్పుత్ వర్గానికి చెందిన జయరాజ్ వేగద్ ‘దళితురాలివైన నువ్వు మాముందే కుర్చీలో కూర్చుంటావా?’ అని తిడుతూ దాడికి పాల్పడ్డాడు. అదేరోజు రాత్రి జయరాజ్ నేతృత్వంలో 25 మంది దుండగులు పల్లవి ఇంటివద్ద ఆమె కుటుంబ సభ్యులపై కర్రలు, పదునైన ఆయుధాలతో దాడికి దిగారు. ఆమె కుటుంబ సభ్యుల్ని సజీవదహనం చేసేందుకు యత్నించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టుచేశారు. -
భర్తపై దాడిచేసిన నవ వధువు అరెస్టు
సంతబొమ్మాళి/కాశీబుగ్గ : మనసులో ఒకరు... మనువు మరొకరితో జరగడం వల్లే భర్త నవీన్కుమార్పై దాడికి ప్రేరేపించిందని భార్య నీలిమ పోలీసుల సమక్షంలో ఒప్పుకుంది. స్థానిక ఎస్ఐ రామారావు మంగళవారం చెప్పిన వివరాలు ప్రకారం... మూలనర్సాపురం గ్రామానికి చెందిన బుడ్డ నవీన్కుమార్పై భార్య నీలిమ చాకుతో సోమవారం దాడి చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. నవీన్కుమార్ అత్తవారి గ్రామమైన గొలదాం నుంచి సోమవారం సాయంత్రం బైక్పై వస్తున్న సమయంలో మూలనర్సాపురం గ్రామ సమీపంలోని తోటల వద్దకు వచ్చేసరికి నీలిమ ఈ అఘాయిత్యానికి పాల్పడిన విషయం విదితమే. అయితే వేరొకరితో ప్రేమ వ్యవహారం నడుస్తుండడంతో ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేయడంతో నీలిమ ఈ దారుణానికి పూనుకుందన్నారు. ప్లాన్ ప్రకారం వెంట తెచ్చుకున్న చాకుతో మూలనర్సాపురం సమీప తోటల్లో దాడి చేసిందన్నారు. నేరం ఒప్పుకున్నందున కేసు నమోదు చేసి, ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు పంపించామని ఎస్ఐ తెలిపారు. ఇదే విషయాన్ని కాశీబుగ్గ డీఎస్పీ ఎస్.రాఘవ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలో విలేకరుల సమావేశంలో తెలిపారు. నీలిమను అరెస్టు చేసి శ్రీకాకుళం కోర్టులో మంగళవారం హాజరుపరిచామన్నారు. 307 సెక్షన్ కింద ఈమెపై కేసు నమోదు చేశామన్నారు. -
వర్తకుడిపై టీడీపీ ఎంపీటీసీ దాడి
సోంపేట శ్రీకాకుళం : సామాన్యులపై టీడీపీ నాయకుల ఆగడాలు అధికమవుతున్నాయి. అధికారం అండతో తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. నెల రోజుల క్రితం కాశీబుగ్గ మున్సిపాలిటీలో వ్యాపారి సమక్షంలో దుకాణంలో పనిచేస్తున్న బాలుడిపై దాడి చేసిన ఘటన మరువక ముందే సోంపేటలో వర్తకుడిపై టీడీపీ ఎంపీటీసీ గురువారం దాడి చేశారు. టీడీపీ నేతల ఆగడాలపై వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సోంపేట పట్టణంలోని మధు ఎంటర్ ప్రైజెస్ యజమాని పైడి శెట్టి హరిహరరావు స్థానిక స్టేట్బ్యాంకు పక్కన ఎలక్ట్రానిక్ వస్తువుల దుకాణం నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం స్టేట్ బ్యాంకుకు వచ్చిన కొర్లాం గ్రామానికి చెందిన తంగుడువర ప్రసాదరావు, దాసరి దుర్యోధన.. హరిహరరావు దుకాణానికి ఎదురుగా ద్విచక్రవాహనాన్ని నిలిపివేశారు. దీంతో షాపునకు కొనుగోలుదారులు రావడానికి రహదారి లేదని, కొద్దిగా పక్కకు పెట్టాలని హరిహరరావు సూచించారు. దీంతో వరప్రసాదరావు, దుర్యోధన తమ హెల్మెట్తో దాడి చేశారు. ఆ సమయంలో కొర్లాం గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు ఎస్.వెంటకరమణ అక్కడే ఉన్నారు. ఆయన కూడా తనపై దాడి చేశారని హరిహరరావు తెలిపారు, గొడవను ఆపాల్సింది పోయి దాడి చేసినవారికి సాయం చేయడం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈదాడిలో హరిహరరావు తలకు తీవ్రగాయమైంది. సోంపేట సామాజిక ఆస్పత్రిలో వైద్యుడు శివాజీ వైద్య చికిత్సలు నిర్వహించారు. పోలీస్స్టేషన్లో పిర్యాదు చేయడానికి వెళితే అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు స్టేషన్ వద్దకు చేరుకుని దాడి చేసిన వారికి మద్దతు తెలిపారని ఆయన వాపోతున్నారు. హరిహరరావు ఫిర్యాదు మేరకు తంగుడు వర ప్రసాద్, దాసరి దుర్యోధన, ఎస్.వెంటకరమణపై సోంపేట ఎస్ఐ సి.హెచ్ దుర్గా ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. -
మతిస్థితిమితం లేని వ్యక్తి దాడి
సంతబొమ్మాళి: మండలంలోని నౌపడలో మతిస్థిమితం లేని వ్యక్తి శుక్రవారం దాడి చేయడంతో ఇద్దరు గాయపడ్డారు. తన చేతిలో ఉన్న రాయిని విసరడంతో నౌపడ గ్రామానికి చెందిన పుచ్చకాయల రాజేష్ తలకు తీవ్రగాయమవగా, నందిగాం గ్రామానికి చెందిన పొందల షణ్ముఖరావుకు స్వల్ప గాయమైంది. తీవ్రంగా గాయపడిన రాజేష్ను నౌపడ పీహెచ్సీలో ప్రథమ చికిత్స చేసి టెక్కలి ఆస్పత్రికి తరలించారు. మతిస్థిమితం లేని వ్యక్తిని నౌపడ పోలీసులు పట్టుకుని స్టేషన్కు తరలించారు. అక్కడ ఆ వ్యక్తికి గుండు చేయించి వస్త్రాలు మార్చి సపర్యలు చేశారు. దాడి చేసిన మతిస్థిమితం లేని వ్యక్తి -
నంద్యాలలో విజిలెన్స్ అధికారుల దాడులు
-
మైనర్ బాలికపై యువకుల దాడి
సాక్షి, సూర్యాపేట : సూర్యాపేటలోని అంజనపురి కాలనీలో ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకులు దాడి చేశారు. బాధితురాలిని హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. అర్దరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. -
నటుడు కార్తీక్ విక్రంపై దుండగుల దాడి
సాక్షి, కర్ణాటక(యశవంతపుర) : కన్నడ నటుడు కార్తిక్ విక్రంపై దుండగులు దాడి చేసి నిలువు దోపిడీ చేశారు. ఈఘటన బసవేశ్వరనగర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. కెహెచ్బీ కాలనీలో నివాసముంటున్న నటుడు కార్తీక్ విక్రం మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో స్నేహితుడిని ఇంటి వద్ద డ్రాప్ చేశాడు. తిరిగి కారులో ఇంటికి వెళ్తుండగా కిలోస్కర్ కాలనీ వద్ద ఏడుగురు దుండుగులు వాహనాన్ని అడ్డగించి ఘర్షణకు దిగారు. అనంతరం అతనిపై దాడి చేసి కారు, మొబైల్ లాక్కొని ఉడాయించారు. తర్వాత కార్తీక్ విక్రం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.