టీడీపీ నేతల బరితెగింపు.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల బరితెగింపు.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు

Published Tue, May 14 2024 8:58 AM

Palnadu District: TDP Activists Attacked The Houses Of YSRCP Workers

సాక్షి, పల్నాడు:  జిల్లాలో టీడీపీ నేతలు బరి తెగించారు. తమకు ఓట్లు వేయని వారిని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని మాదల, తొండపి గ్రామాల్లో రాత్రి విధ్వంసం సృష్టించారు.

గురజాల మండలం కొత్త గణేషన్‌ పాడులో కర్రలు రాళ్లతో వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యకర్తల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. పోలింగ్ అనంతరం మూడు గంటల పాటు నిరంతరాయంగా దాడులు చేశారు. కొత్త గణేషన్‌పాడులో బీసీలపైన టీడీపీ గూండాలు దాడులు చేశారు. సీఐ స్థాయి నుంచి డీఐజీ వరకు సమాచారం ఇచ్చిన పట్టించుకోలేదు.

 
Advertisement
 
Advertisement