నిజామాబాద్: ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తున్న తెలంగాణ ప్రభుత్వం తీరుకు నిరసనగా.. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు నేతృత్వంలో రాస్తారోకో నిర్వహించారు. నిజామాబాద్ మండలంలోని బోర్గాం బ్రిడ్జీపై ధర్నా చేసిన నాయకులు వాహనాలను అడ్డుకోవడంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రాస్తారోకో చేస్తున్న వి. హనుమంతరావుతో పాటు ఇతర నాయకులను అరెస్ట్ చేశారు.