'ప్రత్యేక హోదా కోసం కోటి ఎస్ఎంఎస్ల ఉద్యమం' | 1 crore sms moment starts for sake of ap special status, says sailajanath | Sakshi
Sakshi News home page

'ప్రత్యేక హోదా కోసం కోటి ఎస్ఎంఎస్ల ఉద్యమం'

Published Sat, Sep 19 2015 2:43 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

'ప్రత్యేక హోదా కోసం కోటి ఎస్ఎంఎస్ల ఉద్యమం' - Sakshi

'ప్రత్యేక హోదా కోసం కోటి ఎస్ఎంఎస్ల ఉద్యమం'

హైదరాబాద్ : నెలాఖరు వరకు కోటి ఎస్ఎంఎస్ లు పంపే ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు ఏపీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ తెలిపారు. 23న విశాఖలో ఎస్ఎంఎస్ లు పంపే ఉద్యమం ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందిరాభవన్ లో ఏపీలోని 13 జిల్లాల యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ లీడర్లతో ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన శైలాజానాథ్ ఈ విషయాలను వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులకు ఎస్ఎంఎస్లు పంపుతామని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ తో ఎస్ఎంఎస్ ఉద్యమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఉద్యమానికి విద్యార్ధిలోకం సహకరించాలంటూ శైలజానాథ్ పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement