ఐదు ప్రైవేటు బస్సులు సీజ్
Published Fri, Mar 17 2017 7:50 AM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM
రంగారెడ్డి: నగరంలోని శంషాబాద్ సమీపంలో ఐదు ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ సీజ్ చేసింది. శుక్రవారం ఉదయం ఆర్టీఏ చేపట్టిన తనిఖీల్లో 23 బస్సులు నిబంధనలు పాటించకుండా దొరికాయి. వీటిలో ఐదు బస్సులను సీజ్ చేసిన అధికారులు మిగిలిన 18 ప్రైవేటు బస్సులపై కేసులు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.
Advertisement
Advertisement