బాలికపై అత్యాచారం.. యువకుడి అరెస్ట్ | Man arrested for rape of girl | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారం.. యువకుడి అరెస్ట్

Published Thu, Dec 10 2015 7:33 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిదిలో జరిగింది. సీఐ శేఖర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.....మౌలాలి గాయత్రీనగర్‌కు చెందిన కేశవ సాయికుమార్(21) రామంతాపూర్ పాలిటెక్నిక్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నాడు.

మౌలాలి కమాన్ ప్రాంతంలో నివాసం ఉండే ఓ బాలిక(17) అదే కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. కాగా గత నెల 24వ తేదీన కేశవ సాయికుమార్ బాలికను మాయమాటలు చెప్పి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు.

అక్కడినుండి తప్పించుకున్న బాలిక ఈ నెల 4వ తేదీన మౌలాలిలోని తన ఇంటికి చేరుకుంది. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు... అప్పటి నుంచి పరారీలో ఉన్న కేశవ సాయికుమార్‌ను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement