హైదరాబాద్ : తెలంగాణ సీఎం క్యాంప్ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం కలకలం సృష్టించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసేందుకు అనుమతి ఇవ్వటం లేదంటూ నాచారానికి చెందిన రాజు...ఈరోజు ఉదయం క్యాంప్ ఆఫీస్ వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకునేందుకు ప్రయత్నించాడు.
ఈ విషయాన్ని గమనించిన పోలీసులు అతడిని అడ్డుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. తనను ఉద్యోగం నుంచి అన్యాయంగా తొలగించారని, సీఎంకు విన్నవించుకునేందుకు వస్తే అనుమతి ఇవ్వకపోవటంతోనే ఆత్మహత్యాయత్నం చేసినట్లు రాజు తెలిపాడు.
సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం
Published Sat, Dec 27 2014 12:01 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement