‘పాలమూరు’ పై విచారణకు ఆదేశించాలి | ordered an inquiry on palamuru project | Sakshi
Sakshi News home page

‘పాలమూరు’ పై విచారణకు ఆదేశించాలి

Published Sun, Jan 1 2017 2:01 AM | Last Updated on Fri, Mar 22 2019 3:19 PM

‘పాలమూరు’ పై విచారణకు ఆదేశించాలి - Sakshi

‘పాలమూరు’ పై విచారణకు ఆదేశించాలి

నాగం జనార్దన్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్‌:  పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో వచ్చిన అవి నీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించి సీఎం కేసీఆర్‌ తన చిత్తశుద్ధిని, నిజాయితీని నిరూపించు కోవాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులో అవినీతిని కోర్టులు తప్పుపడితే కేసీఆర్‌ తప్పుకుంటా రా అని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి సేకరించిన డాక్యుమెంట్ల ఆధారంగా ఈ ప్రాజెక్టులోని అవినీతినిపై సత్వరం విచా రణ జరిపి చర్యలు తీసుకోవాలని డిసెంబర్‌ 21న విజిలెన్ప్ డీజీని కలసి కోరినట్లు తెలిపారు.

ఈ నివేదిను సీబీఐకి పంపి నిజాలు నిగ్గుతేల్చాలన్నారు. దీనికి సంబం ధించి 864 పేజీల నివేదికను సమర్పిం చానని, దీంట్లో ఒక్కపేజీ తప్పుగా ఉందని నిరూపించినా ఏ శిక్షకైనా సిద్ధమేనని చెప్పా రు. వచ్చేవారం జరగనున్న అసెంబ్లీ సమా వేశాల సందర్భంగా అన్ని రాజకీయపార్టీల సభ్యులను కలిసి సమాచారాన్ని ఇస్తామ నని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement