స్మితా సభర్వాల్‌కు నిధుల విడుదలపై కోర్టులో పిటిషన్ | petition in the4 court on smitha sabarwal | Sakshi
Sakshi News home page

స్మితా సభర్వాల్‌కు నిధుల విడుదలపై కోర్టులో పిటిషన్

Published Thu, Sep 3 2015 10:12 PM | Last Updated on Sun, Sep 3 2017 8:41 AM

'ఔట్‌లుక్' మ్యాగజైన్ కథనం వివాదంలో సీఎం కార్యాలయం అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్‌కు న్యాయపరమైన ఖర్చుల కోసం రూ.15 లక్షలు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో గురువారం మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.

హైదరాబాద్: 'ఔట్‌లుక్' మ్యాగజైన్ కథనం వివాదంలో సీఎం కార్యాలయం అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్‌కు న్యాయపరమైన ఖర్చుల కోసం రూ.15 లక్షలు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో గురువారం మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని హైదరాబాద్‌కు చెందిన కె.ఈశ్వరరావు దాఖలు చేశారు. ఇందులో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డెరైక్టర్, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్, అకౌంటెంట్ జనరల్, స్మితాసబర్వాల్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనున్నది. స్మితా సబర్వాల్ ఓ హోటలో పాల్గొన్న ప్రైవేటు కార్యక్రమం గురించి సదరు పత్రిక కథనం, కార్టూన్ ప్రచురించిందని, ఇది పూర్తిగా ఆమె వ్యక్తిగత వ్యవహారమని, దీని వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినలేదని పిటిషనర్ తెలిపారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ప్రభుత్వ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement