హైదరాబాద్: అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్కు అనుమతి కోరుతూ స్పీకర్కు లేఖ రాయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. శనివారం గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది.
పవర్ పాయింట్ ప్రజంటేషన్తో పాటు వ్యాప్కోస్ సంస్థకు లీగల్ నోటీసులు ఇచ్చే అంశంపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. గతంలో తమకు ఒక రకంగా...ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీకు మరో రకంగా ప్రాజెక్టు డిజైన్లు ఇవ్వడంపై వ్యాప్కోస్ సంస్థకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అన్ని ప్రాజెక్టులను సమర్థించాల్సిందేనని నేతలు అభిప్రాయపడ్డారు.
ప్రజంటేషన్కు కాంగ్రెస్ సన్నాహాలు
Published Sat, Apr 9 2016 7:40 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement