speaker
-
స్పీకర్ Vs హరీష్ రావు.. దద్దరిల్లిన అసెంబ్లీ
-
‘జమిలి’ బిల్లులపై ఉత్కంఠ
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల బిల్లుల అంశంపై ఏర్పాటు చేసే జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)పై ఉత్కంఠ నెలకొంది. గురువారం(డిసెంబర్ 19) లోక్సభలో స్పీకర్ ఓంబిర్లా జేపీసీని ఏర్పాటు చేస్తు ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారంతో పార్లమెంట్ సెషన్ ముగుస్తుండడంతో ఈలోపే జేపీసీపై స్పీకర్ ప్రకటన చేయాల్సి ఉంటుంది. లేదంటే జమిలిపై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రెండు రాజ్యాంగ సవరణ బిల్లులు వృథా అయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వం ఈ బిల్లులపై ధృడ నిశ్చయంతో ఉన్నందున జేపీసీపై గురువారం ప్రకటన వస్తుందనే అంతా భావిస్తున్నారు.అధికారపక్ష సభ్యులే కాకుండా ప్రతిపక్ష సభ్యులకూ జేపీసీలో స్థానం ఉంటుంది. జేపీసీలోకి గరిష్టంగా 31 మందిని తీసుకోవచ్చు. ఇందులో లోక్సభ నుంచే 21 మంది ఉంటారు.ఇందుకు సంబంధించి తమ సభ్యుల పేర్లను ప్రతిపాదించాలని ఇప్పటికే పార్టీలకు స్పీకర్ ఛాంబర్ నుంచి ఆదేశాలు వెళ్లాయి.అయితే బీజేపీ లార్జెస్ట్ పార్టీ కావడంతో ఆ పార్టీకే కమిటీ చైర్మన్ పదవి వెళ్లే అవకాశాలెక్కువగా ఉన్నాయి. ఒకవేళ జేపీసీ ఏర్పాటు గనుక అనుకున్న టైంకి జరగకుంటే.. ప్రక్రియ మళ్లీ మొదటికి చేరుతుంది. అంటే.. వచ్చే సెషన్లో బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. -
జార్ఖండ్ కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం.. మంత్రులు వీరే
రాంచీ: ఎట్టకేలకు జార్ఖండ్లో మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని మంత్రి మండలి గురువారం ప్రమాణ స్వీకారం చేసింది. రాంచీలో జరిగిన ఈ కార్యక్రమంలో 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మహేశ్పూర్ ఎమ్మెల్యే స్టీఫెన్ మరాండీతో జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గంగ్వార్ జార్ఖండ్ విధానసభ ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేయించారు అనంతరం పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.ఇక గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన రాందాస్ సోరెన్, దీపక్ బీరువా, హఫీజుల్ హసన్, కాంగ్రెస్కు చెందిన దీపికా పాండే సింగ్లు తమ పదవులను కొనసాగించారు. వీరితోపాటు జేఎంఎం నుంచి చమ్ర లిండా, యోగేంద్ర ప్రసాద్, సుదివ్య కుమార్, ఇర్ఫాన్ అన్సారీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాధా కృష్ణ కిషోర్, శిల్పి నేహా టిర్కీ, ఆర్జేడీ ఎమ్మెల్యే సంజయ్ ప్రసాద్ యాదవ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.Ranchi, Jharkhand | Congress MLA Radha Krishana Kishore, JMM MLA Deepak Birua, JMM MLA Chamra Linda and RJD MLA Sanjay Prasad Yadav take oath as Ministers in the JMM-led Mahagathbandhan Government in the state. pic.twitter.com/BXU7ozCGcx— ANI (@ANI) December 5, 2024Ranchi, Jharkhand | JMM MLA Ramdas Soren, Congress MLA Irfan Ansari, JMM MLA Hafizul Hasan and Congress MLA Dipika Pandey Singh take oath as Ministers in the JMM-led Mahagathbandhan Government in the state. pic.twitter.com/46PTFLlabh— ANI (@ANI) December 5, 2024 Ranchi, Jharkhand | JMM MLA Stephen Marandi took oath as Protem Speaker of the Legislative Assembly pic.twitter.com/n45Ih1sQ4V— ANI (@ANI) December 5, 2024కాగా జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రాంచీలోని మొరాబాది మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఆ రోజే జేఎంఎం సీనియర్ ఎమ్మెల్యే అయిన మరాండీని ప్రొటెం స్పీకర్గా నియమించారు. డిసెంబర్ 9-12 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని జేఎంఎం ప్రభుత్వం నిర్ణయించారు.#WATCH | Ranchi: After the Jharkhand cabinet expansion, CM Hemant Soren says, " As the time is moving forward, everything is happening quickly. Govt will get the direction now and we will move forward at a fast pace" pic.twitter.com/mGgfaDh0r2— ANI (@ANI) December 5, 2024ఇక ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్కు చెందిన జార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం) ఆధ్వర్యంలోని కూటమి ఘన విజయం సాధించింది. 81 మంది సభ్యులుండే అసెంబ్లీలో జేఎంఎం 34, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ 2 సీట్లు గెలుచుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 24 సీట్లు సాధించింది. -
ఓంబిర్లా కుమార్తె వివాహ విందుకు ప్రముఖుల హాజరు
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓంబిర్లా కుమార్తె వివాహ విందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఓంబిర్లా కుమార్తె అంజలీ బిర్లా ప్రముఖ వ్యాపారవేత్త అనీష్ రజనీల వివాహం ఈనెల 12న జరగ్గా సోమవారం ఢిల్లీలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.దీనికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, కాంగ్రెస్ ఎంపీలు అనిల్కుమార్ యాదవ్, చామల కిరణ్కుమార్రెడ్డి, బీజేపీ ఎంపీ రఘునందన్రావు తదితరులు హాజరయ్యారు. అలాగే ఏపీ నుంచి గవర్నర్ అబ్దుల్ నజీర్, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మండలి చైర్మన్ కొయ్యె మోషేన్ రాజు, వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, ప్రసాద్, బాలశౌరి, ఉదయ్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. -
శాసనసభలో ఏపీ మంత్రులకు స్పీకర్ మందలింపు
అమరావతి, సాక్షి: ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి.. సభలో కూటమి నేతల తీరు ఏమాత్రం సహించడం లేదు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం వేళ.. తమ అనుచరుల్ని సభలోకి తోలుకురావడంపై టీడీపీ ఎమ్మెల్యేలపైనే అసహనం వ్యక్తం చేసింది తెలిసిందే. అయితే..ఇవాళ నాలుగో రోజు సెషన్లో మంత్రులపైనే ఆయన మండిపడినట్లు తెలుస్తోంది. ఉదయం 9.గంకు సభ ప్రారంభం కాగా.. మంత్రుల్లో కొందరు సభకు ఆలస్యంగా వచ్చారు. ఇది గమనించిన స్పీకర్.. కాసేపు చూస్తూ ఉండిపోయారు. ఇంతలో కార్మిక శాఖకు సంబంధించిన ప్రశ్న ఎదురుకాగా.. సదరు మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆ టైంకి సభలో లేరు. అనంతరం వచ్చిన మంత్రితో స్పీకర్ అయ్యన్న.. క్వశ్చన్ అవర్ ని మంత్రులు సీరియస్ గా తీసుకోవాలని, మంత్రులే ఆలస్యంగా వస్తే ఎలా? అని, సమయం పాటించాలని హితవు పలికినట్లు సమాచారం. ఆలస్యానికి మంత్రి సుభాష్ క్షమాపణ చెప్పి.. మరోసారి ఇలా జరగదంటూ తన సీట్లో కూర్చున్నారు. ఇక సమావేశాల ప్రారంభ రోజు.. ‘‘మీ అనుచరులను సచివాలయం, ఇతర ప్రాంతాల్లో వుండే విధంగా చూస్కోండి. అసెంబ్లీ హాల్లోకి తేకండి’’ అని కాస్త కటువుగానే సొంత ఎమ్మెల్యేలతో స్పీకర్ అయ్యన్న చెప్పారు. -
కూటమి ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్న అసహనం
అమరావతి, సాక్షి: ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి కోపమొచ్చింది. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. ఎమ్మెల్యేలతో పాటు వాళ్ల అనుచరులు కూడా అసెంబ్లీ హాల్కు వచ్చారు. దీంతో ఆయన ఒకింత అసహనానికి గురయ్యారు. అయితే..అంతటితో ఆయన ఆగలేదు. అనుచరులను తీసుకొని రాకుండా ఉండాలని ఎమ్మెల్యేలకు గట్టిగానే చెప్పారు. ‘‘మీ అనుచరులను సచివాలయం, ఇతర ప్రాంతాల్లో వుండే విధంగా చూస్కోండి. అసెంబ్లీ హాల్లోకి తేకండి’’ అని కాస్త కటువుగానే సొంత ఎమ్మెల్యేలతో చెప్పినట్లు తెలుస్తోంది. -
US Election 2024 నాన్సీ పెలోసీ వరుసగా 20వ సారి గెలుపు, ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక విశేషం చోటు చేసుకుంది. 2024 అమెరికా ఎన్నికల ఫలితాలతో కాలిఫోర్నియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రటిక్ ప్రతినిధి నాన్సీ పెలోసి యుఎస్ హౌస్ స్థానానికి తిరిగి ఎన్నికయ్యారు. దీంతో ఈ స్థానం నుంచి వరుసగా 20 సార్లు గెలుపొందిన మహిళగా ఖ్యాతి దక్కించుకున్నారు. అంతేకాదు హౌస్ స్పీకర్గా ఎన్నికైన తొలి మహిళ కూడా నాన్సీ పెలోసి రికార్డు సృష్టించిన ఘనత కూడా ఆమె సొంతం. 1987లో తొలిసారిగా కాలిఫోర్నియాలో జరిగిన ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. 2003 నుండి హౌస్ డెమొక్రాట్లకు నాయకత్వం వహించారు. హౌస్ ఆఫ్ కాంగ్రెస్లో ప్రధాన పార్టీకి నాయకత్వం వహించిన తొలి మహిళ. 2007- 2011 వరకు, తిరిగి 2019- 2023 వరకు హౌస్ స్పీకర్గా వ్యవహరించారు. ఎక్కువ కాలం పనిచేసిన హౌస్ డెమోక్రాటిక్ నాయకురాలు పెలోసి. అలాగే చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన హౌస్ స్పీకర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఎఫర్డబుల్ కేర్ రక్షణ చట్టంతో సహా కొన్ని కీలకమైన చట్టాలను ఆమోదించడంలో పెలోసి కీలక పాత్ర పోషించారు. అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై అభిశంసన లాంటి ఇతర ముఖ్యమైన సందర్భాలలో పార్టీలో ఆమె పాత్ర కీలకం.రాజకీయ వారసత్వం: రాజకీయంగా చురుకైన కుటుంబం నుండి వచ్చారు. నాన్సీ పెలోసి బాల్టిమోర్లో జన్మించారు. ఆమె తండ్రి రాజకీయ మేత్త మేయర్ , కాంగ్రెస్ సభ్యుడు థామస్ డి'అలెసాండ్రో జూనియర్. వాషింగ్టన్ ట్రినిటీ కళాశాల నుండి నాన్సీ 1962లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. వ్యాపారవేత్త పాల్ పెలోసిని వివాహం చేసున్నారు. -
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ స్పీకర్గా అబ్దుల్ రహీమ్ రాథర్
శ్రీనగర్: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ తొలి సమావేశాలు నేటి(సోమవారం) నుంచి ప్రారంభమయ్యాయి. సీనియర్ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత, చరార్-ఎ-షరీఫ్ స్థానం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన అబ్దుల్ రహీమ్ రాథర్ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికయ్యారు.ఐదు రోజుల పాటు కొనసాగనున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజున ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ప్రొటెం స్పీకర్ ముబారక్ గుల్ కొత్త అసెంబ్లీ స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్కు నూతన బాధ్యతలను అప్పగిస్తూ, అభినందనలు తెలియజేశారు. 80 ఏళ్ల అబ్దుల్ రహీమ్ రాథర్ గతంలో కూడా జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో స్పీకర్ పదవిని నిర్వహించారు. 2002 నుంచి 2008 వరకు పీడీపీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.సోమవారం జరిగే అసెంబ్లీ తొలి సమావేశంలో స్పీకర్ను ఎన్నుకుంటారని అసెంబ్లీ సచివాలయం ఇంతకుముందు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా నరేంద్ర సింగ్ రైనాను బీజేపీ ఎన్నుకుంది. అదే సమయంలో ప్రతిపక్ష నేత బాధ్యతలను సునీల్ శర్మకు అప్పగించారు. అబ్దుల్ రహీమ్ రాథర్ ఏడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇది కూడా చదవండి: అది ఫేక్ సర్వే: తాజా పోల్పై మండిపడ్డ ట్రంప్ -
ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై స్పీకర్కు ఫిర్యాదు
సాక్షి,హైదరాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మహిళా కాంగ్రెస్ నేతలు శుక్రవారం (సెప్టెంబర్13) స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో కౌశిక్రెడ్డి ఓటర్లను బెదిరించి గెలిచారని ,గెలిచాక మహిళలను కించపరుస్తూ మాట్లాడినందున కౌశిక్రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేసిన వారిలో మహిళా కాంగ్రెస్ నేతలు బండ్రు శోభారాణి, కాల్వ సుజాత తదితరులున్నారు. ఫిర్యాదు అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ కౌశిక్రెడ్డితో బీఆర్ఎస్ అధినేత కేసీఆరే ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నాడా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. అంతకుముందు కౌశిక్రెడ్డి మీడియా సమావేశంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ వారికి చీర,గాజులను పంపిస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం పట్ల మహిళా కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ గురువారం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్లో ఆందోళన చేశారు. ఇదీ చదవండి.. మళ్లీ ఉద్రిక్తత.. ఎమ్మెల్యే అరికెపూడి ఇంటి వద్ద బందోబస్తు -
అసెంబ్లీ సెక్రటరీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
సాక్షి,హైదరాబాద్: పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలపై బీఆర్ఎస్ యాక్షన్ మొదలుపెట్టింది. కోర్టు ఆదేశాలు అమలు చేయాలని కోరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బుధవారం(సెప్టెంబర్11) అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కె.పి. వివేకానంద అసెంబ్లీ సెక్రటరీకి వినతి పత్రాన్ని అందజేశారు.బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలపై నెలరోజుల్లో చర్య తీసుకోవాలని, లేదంటే తామే సుమోటోగా కేసు మళ్లీ విచారిస్తామని హైకోర్టు ఇటీవల స్పీకర్కు సూచించిన విషయం తెలిసిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విచారణ షెడ్యూల్ను తేదీలవారిగా ప్రొసీడింగ్స్ విడుదల చేయాలని హైకోర్టు అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. ఇదీ చదవండి.. వాల్మీకి స్కామ్లో మేం చెప్పిందే జరిగింది: కేటీఆర్ -
స్పీకర్ స్పందించకుంటే మళ్లీ కోర్టుకే!
సాక్షి, హైదరాబాద్: పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో అసెంబ్లీ స్పీకర్ నుంచి సానుకూల స్పందన రాని పక్షంలో మరోమారు కోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఫిరాయింపులపై పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కేపీ వివేకానంద వేసిన రిట్ పిటిషన్పై రాష్ట్ర హైకోర్టు సోమవారం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. స్పీకర్ నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.ఈ నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్కుమార్ అనుసరించే వైఖరిని బట్టి తమ భవిష్యత్తు న్యాయ పోరాటం ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), కడియం శ్రీహరి (స్టేషన్ ఘనపూర్)పై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఈ ఏడాది మార్చిలో స్పీకర్కు బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. స్పీకర్ స్పందించకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్లో హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా కోర్టు తీర్పు నేపథ్యంలో.. ఇటీవలి కాలంలో ఇదే తరహాలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఆయా రాష్ట్రాల స్పీకర్లు అనుసరించిన వైఖరిని బీఆర్ఎస్ పరిశీలిస్తోంది. మహారాష్ట్ర, హిమాచల్ప్రదేశ్లో చోటు చేసుకున్న ఫిరాయింపులు, ఆయా సందర్భాల్లో స్పీకర్, కోర్టులు స్పందించిన తీరును అధ్యయనం చేస్తోంది. మహారాష్ట్ర, హిమాచల్లో ఏం జరిగింది? మహారాష్ట్రలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశం సుమారు రెండేళ్లుగా అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. 2022 జూన్ 21న ప్రస్తుత మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కొందరు శివసేన ఎమ్మెల్యేలతో సొంత గ్రూప్ను ఏర్పాటు చేసుకుని బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తర్వాతి కాలంలో కొందరు ఎన్సీపీ ఎమ్మెల్యేలు కూడా షిండే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో చేరారు. షిండే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ అప్పట్లో సీఎంగా ఉన్న శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే డిప్యూటీ స్పీకర్ (స్పీకర్ పదవి ఖాళీగా ఉండటంతో)కు పిటిషన్లు సమరి్పంచారు.మరోవైపు తమదే అసలైన శివసేన అంటూ షిండే వర్గం అనర్హత పిటిషన్లు ఇచి్చంది. అయితే కొత్త స్పీకర్ ఈ అనర్హత పిటిషన్లపై స్పందించకపోవడంతో విషయం సుప్రీంకోర్టుకు చేరింది. తొలుత 2023 డిసెంబర్ 31లోగా అనర్హత పిటిషన్ల అంశాన్ని తేల్చాలని స్పీకర్కు గడువు విధించిన సుప్రీంకోర్టు.. ఆ తర్వాత మరో పది రోజులు పొడిగిస్తూ ఈ ఏడాది జనవరి 10వరకు గడువు విధించింది. అయితే స్పీకర్.. షిండే, ఉద్ధవ్ వర్గాలు ఇచ్చిన అనర్హత పిటిషన్లను తిరస్కరించారు.దీంతో అనర్హత వేటు అంశం మరోమారు సుప్రీంకోర్టుకు చేరింది. ఇక హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర స్పీకర్ ఈ ఏ డాది ఫిబ్రవరి 29న అనర్హత వేటు వేశారు. అయితే తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఉపఎన్నిక నిర్వహించవద్దని అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ ఈ అంశంలో స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఉప ఎన్నికలు జరిగాయి. మరో ఏడుగురు ఎమ్మెల్యేలపైనా వేటు వేయాలి హిమాచల్ తరహాలో ఉప ఎన్నికలు జరిగేలా చూడాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరితో పాటు మరో ఏడుగురు ఎమ్మెల్యేలపై ఇచ్చిన అనర్హత పిటిషన్లపైనా స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరుతోంది. కాంగ్రెస్లో చేరిన అరికెపూడి గాం«దీ, ప్రకాశ్గౌడ్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, డాక్టర్ సంజయ్, గూడెం మహిపాల్రెడ్డి, పోచారం శ్రీనివాస్రెడ్డిని కూడా అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పిటిషన్లు సమరి్పంచింది. కోర్టు తీర్పులో పేర్కొన్న ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఈ ఏడుగురు ఎమ్మెల్యేలను కూడా అనర్హులుగా ప్రకటించని పక్షంలో కోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. -
ప్రొటోకాల్ ఉల్లంఘన.. స్పీకర్కు కూకట్పల్లి ఎమ్మెల్యే ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రొటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫిర్యాదు చేశారు. మూడు సార్లు ప్రజల మద్దతుతో భారీ మెజారీతో గెలుపొందిన తాను ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంటే కొందరు అధికారులు ప్రొటోకాల్ ఉల్లంఘిస్తూ పనులు చేయకుండా పబ్బం గడుపుతున్నారని ఫిర్యాదు చేశారు.ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి శాసనసభ్యుడి హక్కులకు భంగం కలిగించే అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలు పునరావృతం అయితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించినట్లు కృష్ణారావు తెలిపారు. -
‘ప్రధాని ప్రసంగంలో తప్పులున్నాయ్.. తొలగించండి’
న్యూఢిల్లీ: లోక్సభ సమావేశాల్లో విపక్ష నేత, ఇతర నేతల ప్రసంగాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. మరోవైపు ప్రతిపక్ష రాహుల్ గాంధీ ప్రసంగాన్ని లోక్సభ రికార్డుల నుంచి తొలగించారు. అయితే దీనికి ప్రతిపక్ష కాంగ్రెస్ కౌంటర్ దాడికి దిగింది. ప్రధాని మోదీ ప్రసంగమే తప్పుల తడకగా సాగిందని పేర్కొంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసింది.లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలో తప్పుదోవ పట్టించే అంశాలున్నాయని పేర్కొంటూ చాలా భాగాన్ని రికార్డుల నుంచి తొలగించారు. ఈ పరిణామంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు స్పందిస్తూ.. ‘‘సభను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించే ఏ సభ్యుడైనా సులభంగా తప్పించుకోలేరు. నియమాలు వాళ్లను అడ్డుకుంటాయి’’ అని వ్యాఖ్యానించారు. అయితే దీనికి కౌంటర్గా కాంగ్రెస్ ఇప్పుడు.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే క్రమంలో ప్రధాని మోదీ ప్రసంగంలో చాలా తప్పులు, అసత్యాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని లోక్సభ స్పీకర్కు లేఖ రాసింది.‘‘2014లో బీజేపీ అధికారంలోకి రాక ముందు వరకు భారత రక్షణ దళాల్లో సరిపడా ఆయుధ సంపత్తి లేదని.. యుద్ధ విమానాలు అసలే లేవని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. కానీ, జాగ్వార్, మిగ్ 29, ఎస్యూ-30, మిరేజ్ 2000 లాంటి ఫైటర్ జెట్లు అప్పటికే ఉన్నాయి. అలాగే.. న్యూక్లియర్ బాంబులు, అగ్ని, పృథ్వీ, ఆకాశ్, నాగ్, త్రిశూల్, బ్రహ్మోస్ క్షిపణులు కూడా ఉన్నాయి. అన్నింటికి మించి.. పదేళ్లలో 25 కోట్ల మంది దారిద్ర్యపు రేఖ దిగువ నుంచి పైకి తీసుకొచ్చినట్లు ప్రధాని ప్రకటించుకున్నారు. దీనిని కూడా మేం సవాల్ చేస్తున్నాం. అలాగే.. 16 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటు షేర్ పడిపోయిందని ప్రధాని మోదీ అన్నారు. ఇది ముమ్మాటికీ తప్పు. హిమాచల్, ఉత్తరాఖండ్, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ఓటు షేర్ పెరిగింది. కాంగ్రెస్పార్టీ మహిళలకు ప్రతీ నెలా రూ.8,500 ఇస్తుందనే తప్పుడు హామీ ఇచ్చిందని మోదీ మాట్లాడారు. కానీ, అది హామీ మాత్రమే. గెలిచి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అది నేరవేర్చాల్సిన విషయం. అలాంటప్పుడు అది అసత్య ప్రచారం ఎలా అవుతుంది?.కేవలం ప్రధాని మోదీతో పాటు కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాగూర్ ప్రసంగంలోనూ తప్పులు ఉన్నాయని కాంగ్రెస్ ఆ లేఖలో ప్రస్తావించింది. ఈ మేరకు.. కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ పేరిట ఈ లేఖ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు వెళ్లింది. 115(1)వ ఆదేశం అమలు చేసి.. ప్రధాని మోదీ, అనురాగ్ ఠాకూర్ ప్రసంగాల్లోని తప్పులు, తప్పుదోవ పట్టించే ప్రకటనల్ని తొలగించేలా చూడాలని మాణిక్కం ఠాగూర్ లేఖలో కోరారు.115(1) ఆదేశాల ప్రకారం.. మంత్రులుగానీ, ఇతర ఎంపీలుగానీ సభలో అసత్య ప్రకటనలు చేస్తే.. అభ్యంతరం వ్యక్తం చేసే సభ్యులు స్పీకర్కు లేఖ రాయాల్సి ఉంటుంది. చర్చ జరిపిన తర్వాత ఆ ప్రకటనలు తప్పని నిరూపిస్తే.. రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలను తొలగిస్తారు. మోదీ, అనురాగ్ ఠాకూర్ ప్రసంగాల విషయంలో 115(1)ని అమలు చేయాలని అభ్యర్థిస్తూ కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ స్పీకర్కు లేఖ రాశారు. -
Weekly Roundup : పార్లమెంట్ చిత్రం
18వ లోక్ సభ కొలువుదీరింది. పార్లమెంట్ తాత్కాలిక సమావేశాల్లో భాగంగా నూతనంగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార సమయంలో పలువురు ఎంపీలు చేసిన నినాదాలపై ఎన్డీయే కూటమి అభ్యంతరం వ్యక్తం చేసింది. 48 ఏళ్ల లోక్ సభ చరిత్రలో తొలి సారి స్పీకర్కు ఎన్నిక జరిగింది. స్పీకర్ ఓం బిర్లా ఎన్నిక, రాష్ట్రపతి ఎమర్జెన్సీపై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా నీట్ పరీక్ష పేపర్ లీక్పై చర్చ జరగాలని ప్రతి పక్షాలు పట్టుబట్టాయి. ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉభయ సభలు హోరెత్తిరిపోవడంతో సోమవారానికి (జులై 1)కి వాయిదా పడ్డాయి. 18వ లోక్సభ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు ప్రధాని మోదీతో సహా 262 మంది ఎంపీలు ప్రమాణం చేశారు.ఇంగ్లీష్, సంస్కృతం, హిందీ, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, కన్నడ, తెలుగు, మరాఠీ ఇలా భారతీయ భాషలలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడం వల్ల లోక్సభ భాషా వైవిధ్యాన్ని ప్రదర్శించింది.మోదీ ప్రమాణం చేసేటప్పుడు ఎన్డీయే నేతలు జైశ్రీరామ్ నినాదాలు చేశారు. అప్పుడు విపక్ష నేతలంతా లేచి రాజ్యాంగ ప్రతిని చూపించారు.ఏపీ నుంచి కేంద్రమంత్రిగాఉన్న రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ కు పంచె కట్టులో వెళ్లారు.రైతు నేత వీపీఐ (ఎం) ఆమ్రా రామ్ ట్రాక్టర్లో పార్లమెంట్ కు వచ్చారు.తీహార్ జైలులో ఉన్న బారాముల్లా స్వతంత్ర ఎంపీ, నిందితుడు అబ్దుల్లా రషీద్ షేక్ బెయిల్ దొరక్కపోవడంతో ప్రమాణం చేయలేకపోయారు.పార్లమెంట్ సమావేశాల తొలి రోజు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్ హౌజ్కు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు సైకిల్పై చేరుకున్నారు. లోక్సభలో తొలిసారి అడుగుపెట్టిన అప్పలనాయుడు, ఢిల్లీలో తన అతిథి గృహం నుంచి సైకిల్పై పార్లమెంట్కు చేరుకున్నారు.ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి ప్రమాణ స్వీకార సమయంలో నీట్ అంటూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. నీట్ ఫెయిల్డ్ మినిస్టర్ అని నినాదాలు చేశారు.రెండో రోజు ప్రమాణ స్వీకారాలు..రెండో రోజు 274 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.రెండో రోజు ప్రమాణ స్వీకారంలో భాగంగా స్వతంత్ర సభ్యుడు రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ ' నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలి' అని రాసి ఉన్న టీ షర్ట్ ధరించి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.తమిళనాడులోని కృష్ణగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన గోపీనాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం. తాజాగా జరిగిన ఎన్నికల్లో క్రిష్ణగిరి ఎంపీగా గోపీనాథ్ 1,92, 486 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన జయప్రకాష్ పై గెలుపొంది పార్లమెంటులో అడుగు పెట్టారు.రెండో రోజు సభాపతి స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు.హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఉర్ధూలో ప్రమాణం చేస్తూ.. జై భీం, జై తెలంగాణ, జై పాలస్తీనా, అల్లాహో అక్బర్ అంటూ ప్రమాణం పూర్తి చేశారు. ఇక అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా నినాదం ఇవ్వడంపై పలువురు మంత్రులు, బీజేపి సభ్యులు అభ్యంతరం చెప్పారు. దీనిపై సభాపతి స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తానని, నిబంధనలు పరిశీలించి.. రికార్డుల నుంచి తొలగించే విషయాన్ని పరిశీలిస్తానని సభ్యులకు సూచించారు.ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రమాణం చేసి.. 'జై హింద్, జై సంవిధాన్' అని నినదించారు. ఆయన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా సందర్శకుల గ్యాలరీ నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీదాదాపు పదేళ్ల తర్వాత లోక్సభలో విపక్ష పార్టీ సభ్యుడికి ప్రతిపక్ష నేత హోదా దక్కింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ బాధ్యతలు స్వీకరించారు. దీంతో కేబినెట్ మంత్రికి ఉండే సౌకర్యాలు పొందనున్నారు. లోక్సభలో విపక్ష కూటమికి నేతృత్వం వహించడమే కాకుండా.. ఈసీ, సీబీఐ, ఈడీ వంటి ప్రభుత్వ సంస్థలకు బాస్ల నియామకంలో కీలక భూమిక పోషించనున్నారు.2014, 2019లలో మొత్తం సీట్లలో 10 శాతం దక్కించుకోకపోవడంతో ప్రతిపక్ష నేత పాత్ర పోషించే అవకాశం ఎవరికీ రాలేదు. దీంతో రెండుసార్లు ప్రతిపక్ష సభ్యుడి హోదా ఖాళీగా ఉంటూ వచ్చింది. ఈసారి 99 సీట్లను గెలుచుకోవడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్కు ఆ హోదా దక్కింది. మూడో రోజు సమావేశాల్లో మూజూవాణి ఓటు ద్వారా బుధవారం స్పీకర్గా ఓం బిర్లా రెండోసారి ఎన్నిక అయ్యారు.అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 48 ఏళ్ల లోక్ సభ చరిత్రలో తొలి సారి స్పీకర్ కు ఎన్నిక జరిగింది. మూజువాణి ఓటుతో ఎన్డీయే స్పీకర్ అభ్యర్థి కోట ఎంపీ మరోసారి స్పీకర్గా ఎన్నిక అయ్యారు.స్పీకర్ తొలి ప్రసంగంలో ఎమర్జెన్సీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యంతం తెలపగా.. ఎన్డీయే ఎంపీలు అనుకూలంగా నినాదాలు చేశారు. రాష్ట్రపతి నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 1975 నాటి ఎమర్జెన్సీ రోజుల్ని ప్రస్తావించారు.మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు 61 ఏళ్ళ ఓం బిర్లాను స్పీకర్ స్థానం వరకు తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టారు.స్పీకర్ ఎన్నిక అయ్యక బిర్లాను పోడియం వరకు తీసుకువెళ్లే సందర్భంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బిర్లాను అభినందించే క్రమంలో మోదీ, రాహుల్ కరచాలనం చేసుకున్నారు.స్పీకర్ ఎన్నిక సందర్భంగా రాహుల్ సరికొత్త వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. తెలుపు రంగు లాల్చీ పైజామ ధరించి లోక్ సభకు వచ్చారు.స్పీకర్ బాధ్యతలు చెబడుతూనే ఓం బిర్లా తీసుకున్న తొలి నిర్ణయం లోక్ సభ కాక రేపింది.1975 నాటి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధానాన్ని ఖండిస్తూ స్పీకర్ స్వయంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఎమర్జెన్సీ ప్రస్తావన నిరసిస్తూ ప్రతిపక్షాలు నినాదాలతో హోరెత్తించారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఉభయ సభలను ఉదేశిస్తూ ప్రసంగించారు. ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం. రాజ్యాంగంపై దాడి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఎమర్జెన్సీ అంశాన్ని చొప్పించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.రాష్ట్రపతి ప్రసంగం పూర్తిగా ప్రభుత్వ స్క్రిప్ట్. తప్పుల తడక అని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. చివరికి రాష్ట్రపతి ప్రసంగంలో కూడా ఎమర్జెన్సీ ప్రస్తావన తీసుకురావడం సిగ్గుచేటు. నిజానికి మోదీ పదేళ్ల పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని విపక్షాలు దుయ్యబట్టాయి. ప్రధాని మోదీ మంత్రి వర్గ సభ్యులను ఎగువ సభకు పరిచయం చేశారు.పార్లమెంట్ లో నీట్ రగడ..శుక్రవారం నీట్ పరీక్ష లో అక్రమాలపై వెంటనే చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. లోక్ సభ స్పీకర్ , రాజ్య సభలో చైర్మన్ అంగీకరించలేదు. దీంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి.నీట్ పరీక్షపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం ఎందుకు వెనకంజ వేస్తోందని రాజ్య సభలో విపక్షాలు నిలదీశాయి. నీట్పై చర్చించాలని 22 నోటీసులు వచ్చాయని, వాటిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెల్లోకి దూసుకువెళ్లారు. బిగ్గరగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. రాజ్య సభ మూడు సార్లు వాయిదా పడింది.ప్రతి పక్ష నేత మల్లికార్జున ఖర్గే సైతం వెల్లోకి దూసుకురావటంపై రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు చేశారు. అనంతరం నీట్ రగడ నడుమ ఉభయ సభలు సోమవారానికి (జులై 1) వాయిదా పడ్డాయి. -
ఎమ్మెల్యేల పార్టీ మార్పు పిటిషన్.. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం ఎమ్మెల్యే పార్టీ మార్పు అంశంపై స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని.. ఆ గడువు దాటి వారమైనా ఇంకా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పిటిషనర్ల (బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కేపీ వివేకానంద్) తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేకు కనీసం ఇప్పటివరకు నోటీసులు కూడా జారీ చేయలేదన్నారు. వెంటనే నిర్ణయం తీసుకునేలా స్పీకర్ను ఆదేశించాలని కోరారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావులను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘వీరు 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున విజయం సాధించి, తర్వాత కాంగ్రెస్లో చేరారు. ఒక పార్టీ అభ్యరి్థత్వంపై గెలిచి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరిన వీరిని అనర్హులుగా ప్రకటించాలి. స్పీకర్ను కలవాలని ప్రయత్నించినా సమయం ఇవ్వడం లేదు. ఈ మెయిల్ ద్వారా పంపిన పిటిషన్పై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకునేలా స్పీకర్ ఆదేశించాలి’అని కోరారు. ఇదే విధంగా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన దానం నాగేందర్.. ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్లో చేరారని, ఆయనను కూడా అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మరో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి గురువారం మరోసారి విచారణ చేపట్టారు. రెండు తీర్పులను పరిశీలిస్తే.. సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపిస్తూ.. ‘ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పార్టీ మారడమే కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఆయనను ప్రజలు ఓడించారు. మార్చి 18న పిటిషన్ ఇచ్చినా స్పీకర్ కార్యాలయం ఇంత వరకు ఏం చర్యలు చేపట్టిందో కూడా చెప్పలేదు. ఈ రోజు విచారణ ఉండగా, ఒక రోజు ముందు కౌంటర్ దాఖలు చేశారు. మహారాష్ట్ర, మణిపూర్ కేసులలో సుప్రీంకోర్టు వెలువరించిన రెండు తీర్పులను పరిశీలిస్తే.. తమ ముందు పెండింగ్లో ఉన్న అనర్హత పిటిషన్లపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రూల్ 6, 7 ప్రకారం స్పీకర్ నడుచుకోవడం లేదు. వెంటనే నిర్ణయం తీసుకునేలా స్పీకర్ను ఆదేశించాలి’అని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రతివాదుల వాదన కోసం తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్రెడ్డి, అనధికారిక ప్రతివాది తరఫున సీనియర్ న్యాయవాది మయూర్రెడ్డి హాజరయ్యారు. -
Parliament Special Session: కాక రేపిన ఎమర్జెన్సీ తీర్మానం
న్యూఢిల్లీ: స్పీకర్గా బాధ్యతలు చేపడుతూనే బుధవారం బిర్లా తీసుకున్న తొట్ట తొలి నిర్ణయమే లోక్సభలో కాక రేపింది. విపక్షాల నుంచి, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి తీవ్ర నిరసనలకు, వ్యతిరేకతకు దారి తీసింది. 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడాన్ని ఖండిస్తూ స్పీకర్ సభలో స్వయంగా తీర్మానం ప్రవేశపెట్టారు! ‘‘భారత్ ఎప్పుడూ ప్రజాస్వామిక విలువలకు పెద్దపీట వేసింది. అలాంటి దేశంలో ఇందిర 50 ఏళ్ల క్రితం ఇదే రోజున ఎమర్జెన్సీ విధించారు. ప్రజాస్వామిక విలువలపై, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపారు. విపక్ష నేతలను జైళ్లలో కుక్కారు. రాజ్యాంగంపై నేరుగా దాడి చేశారు. ఎమర్జెన్సీ విధించిన 1975 జూన్ 26 దేశ చరిత్రలో ఎన్నటికీ చెరగని మచ్చగా మిగిలిపోతుంది’’ అంటూ తీర్మానాన్ని చదవి విన్పించారు. ఇందిర తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ‘‘ఎమర్జెన్సీ కాలంలో ప్రజలపై ఇందిర సర్కారు చెప్పలేనన్ని అకృత్యాలకు పాల్పడింది. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఎమర్జెన్సీ బాధితుందరికీ 18వ లోక్సభ సంతాపం తెలుపుతోంది. ఎమర్జెన్సీ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తోంది’’ అన్నారు. ఎమర్జెన్సీకి నిరసనగా నిమిషం పాటు మౌనం పాటించాలని సభ్యులను కోరారు. ఎన్డీఏ సభ్యులంతా నిలబడి మౌనం పాటించగా విపక్షాలన్నీ స్పీకర్ తీరును తీవ్రంగా ఖండించాయి. ఎమర్జెన్సీ ప్రస్తావనను నిరసిస్తూ నినాదాలతో హోరెత్తించాయి. దాంతో స్పీకర్గా తొలి రోజే సభను బిర్లా వాయిదా వేయాల్సి వచ్చింది. అనంతరం విపక్షాల నిరసనలకు ప్రతిగా బీజేపీ సభ్యులంతా పార్లమెంటు ప్రాంగణంలో ప్రదర్శనకు దిగారు. ఎమర్జెన్సీ విధింపుపై కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ తీరు ప్రశంసనీయం: మోదీ ఎమర్జెన్సీని స్పీకర్ గట్టిగా ఖండించడం హర్షణీయమని మోదీ అన్నారు. ‘‘ఇందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఎమర్జెన్సీ వేళ జరిగిన అకృత్యాలను స్పీకర్ తన తీర్మానంలో ఎత్తి చూపారు. రాజ్యాంగాన్ని తోసిరాజంటే, ప్రజాభిప్రాయాన్ని అణగదొక్కితే, వ్యవస్థలను నాశనం చేస్తే ఏమవుతుందో చెప్పేందుకు ఇందిర తీసుకున్న ఆ తప్పుడు నిర్ణయం ఒక చక్కని ఉదాహరణ’’ అని ఎక్స్లో ప్రధాని పేర్కొన్నారు. -
ఎంపీల సస్పెన్షన్ జరగదని ఆశిస్తున్నా: స్పీకర్తో అఖిలేష్
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్గా మరోసారి ఓం బిర్లా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఎంపీ కే సురేష్పై ఓం బిర్లా అత్యధిక ఓటింగ్ సాధింగా వరుసగా రెండోసారి స్పీకర్ పదవి దక్కించుకున్నారు. అనంతరం స్పీకర్ అధ్యక్షతన సమావేశాలు కొనసాగాయి. ఈ సందర్భంగా లోక్సభ స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అభినందనలు తెలిపారు. అదేవిధంగా గత సమావేశాల్లో జరిగిన విషయాలను ప్రస్తావిస్తూ స్పీకర్కు చురకలంటించారు.గతంలో ఎంపీల సస్పెన్షన్ వంటి చర్యలు సభ గౌరవాన్ని దెబ్బతీశాయని అన్నారు. ఎంపీల సస్పెన్షన్, బహిష్కరణ వంటి చర్యలు కొత్త లోక్సభలో జరగవని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 'ప్రజాప్రతినిధి గొంతు అణచివేయడం, బహిష్కరణ వంటి చర్యలు మళ్లీ జరగవని మేము ఆశిస్తున్నాము. మీ నియంత్రణ కేవలం ప్రతిపక్షంపైనే ఉంది, కానీ అది కూడా అధికార వర్గం వైపు కూడా ఉండాలి' అని అన్నారు.కాగా గత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రికార్డు స్థాయిలో వందకుపైగా ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. టీఎంసీ మహువా మొయిత్రా కూడా నైతిక దుష్ప్రవర్తన కారణంగా బహిష్కరణకు గురరయ్యారు.స్పీకర్ ప్రతిపక్షాల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. నిష్పాక్షకతంగా ఉండటం అనేది ఈ పదవికి గొప్ప బాధ్యత అని పేర్కొన్నారు.సభ మీ సంకేతాలపై పనిచేయాలని కానీ ఇతర మార్గాల్లో కాదని అన్నారు. స్పీకర్ తీసుకునే న్యాయమైన నిర్ణయాలకు తాము కట్టుబడి నిలబడతామని అన్నారు. ప్రజాస్వామ్య న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా స్పీకర్ ఇక్కడ కూర్చున్నారని, పాలక వ్యవస్థను గౌరవించినట్లే ప్రతిపక్షాలను కూడా గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. -
పోచారం, సంజయ్పై బీఆర్ఎస్ ఫిర్యాదు.. స్పీకర్కు మెయిల్
సాక్షి,హైదరాబాద్: పార్టీ మారుతున్న ఎంఎల్ఏలపై అనర్హతపై దూకుడు బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్,శాసన సభ సెక్రటరీకి ఈ మెయిల్,స్పీడ్ పోస్ట్ ద్వారా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు.వెంటనే వారిద్దరిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి మెయిల్లో విజ్ఞప్తి చేశారు. స్పీకర్ సమయమడగడానికి ఫోన్ చేసినా ఆయన ఆఫీస్ స్పందించకపోవడంతో ఈ మెయిల్,స్పీడ్ పోస్ట్ ద్వారా బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం, దానం, తెల్లంలపైనా బీఆర్ఎస్ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. వీరందరిపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసింది. -
స్పీకర్ ఎన్నిక: ఓటింగ్కు ఆ ఏడుగురు దూరం!.. ప్రభావమెంత?
ఢిల్లీ: అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఏకాభిప్రాయం కుదరకపోవటంతో 18వ పార్లమెంట్లోని లోక్సభ స్పీకర్ ఎన్నిక అనివార్యం అయింది. ఇవాళ లోక్సభ సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. అయితే రెండురోజులు పాటు పార్లమెంట్లో ఎంపీల ప్రమాణ స్వీకారం జరగ్గా.. మరో ఏడుగురు సభ్యులు ఎంపీలుగా ప్రమాణం చేయలేదు. ఇది ఇవాళ్టి ఓటింగ్పై ప్రభావం చూపబోతుందా? అనే చర్చ నడుస్తోంది. ఎంపీలుగా ప్రమాణం చేయని వాళ్లలో ఇండియా కూటమికి చెందినవారే ఐదుగురు ఉండగా, మిగతా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు. శశిథరూర్, శతృఘ్న సిన్హాలాంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. ఎంపీలుగా ప్రమాణం చేయలేదు కాబట్టి ఇవాళ స్పీకర్ ఎన్నికలో ఈ ఏడుగురు ఓటింగ్కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అయితే.. ఓటింగ్పై ఇది ప్రభావం చూపెట్టే అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు చెబుతున్నారు. సభకు హాజరయ్యే సభ్యుల ఆధారంగనే ఓటింగ్ మెజార్టీని లెక్కగడతారని వారంటున్నారు. అదే సమయంలో.. ఎన్డీయే కూటమి 293 సీట్లతో మెజార్టీలో ఉంది. స్పీకర్ ఎన్నికకు మ్యాజిక్ ఫిగర్ 269గా ఉంది. మరోవైపు బీజేపీ విజ్ఞప్తి మేరకు వైఎస్సార్సీపీ సానుకూలంగానే స్పందించింది. ఇక.. ఇండియా కూటమిలో మొత్తం 232గాను 227 మంది ఎంపీలు ప్రమాణం చేశారు. అంటే ఇండియా కూటమికి మెజార్టీ లేదనే చెప్పాలి. దీంతో స్పీకర్ ఎన్నిక ఎన్డీయే వైపు ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇక.. స్పీకర్ ఎన్నిక కోసం మెజార్టీ ఎంపీలు ఉన్నప్పటికీ బీజేపీ స్పీకర్ ఎన్నికలో 300 ఎంపీల ఓట్ల కోసం టార్గెట్ పెట్టుకుంది. అందులో భాగంగానే ఎన్డీయే కూటమిలో లేని పార్టీలను సైతం బీజేపీ మద్దతు కోరింది. స్పీకర్ ఎన్నికకు ఎన్డీయే కూటమి మాజీ స్పీకర్ కోటా ఎంపీ ఓం బిర్లాను, ఇడియా కూటమి కేరళ ఎంపీ కే. సురేష్ను బరిలోకి దింపాయి. ఇవాళ 11 గంటలకు స్పీకర్ ఓటింగ్ జరగనుంది. -
స్పీకర్ ఎన్నిక.. ‘ఇండియా’ కూటమిలో చిచ్చు !
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ పదవికి అభ్యర్థి ఎంపిక ఇండియా కూటమిలో చిచ్చు పెట్టింది. ప్రతిపక్షాల తరపున స్పీకర్ పదవికి కె.సురేష్ను కాంగ్రెస్ ఏకపక్షంగా ఎంపిక చేసిందని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆరోపిస్తోంది. స్పీకర్ పదవికి కె.సురేష్ను పోటీపెట్టేముందు తమను సంప్రదించలేదని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్బెనర్జీ పార్లమెంటు బయట మంగళవారం(జూన్25) మీడియాకు తెలిపారు. ‘మమల్ని ఎవరూ సంప్రదించలేదు. చర్చ జరగలేదు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ఏకపక్షంగా కె.సురేష్ను స్పీకర్ పదవికి పోటీలో నిలబెట్టింది’అని అభిషేక్ బెనర్జీ మీడియాకు చెప్పారు. ఈ పరిణామంతో తృణమూల్ కాంగ్రెస్ స్పీకర్ ఎన్నికలో పాల్గొంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.కాగా, 18వ లోక్సభ స్పీకర్ ఎన్నిక బుధవారం(జూన్26) జరగనుంది. స్పీకర్ ఎన్నికకు సహకరించాల్సిందిగా ప్రతిపక్షాలను బీజేపీ కోరినప్పటికీ అవి అంగీకరించలేదు. సాంప్రదాయానికి విరుద్ధంగా డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ప్రతిపక్షానికి ఆఫర్ చేయకపోవడంతో స్పీకర్ పదవికి ప్రతిపక్షాలు అభ్యర్థిని పోటీ పెట్టాయి. -
లోక్సభలో నినాదాల వివాదం.. స్పీకర్ కీలక ప్రకటన
సాక్షి,న్యూఢిల్లీ: లోక్సభలో రెండోరోజు మంగళవారం(జూన్25) కొత్త ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రమాణాలు చేసిన తర్వాత పలువురు ఎంపీలు చేసిన నినాదాలు వివాదాస్పదమయ్యాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన ప్రమాణం ముగిసిన తర్వాత జై తెలంగాణ, జై భీం, జై పాలస్తీనా అని నినాదాలు చేశారు.BREAKING : Huge uproar in the Parliament after Hyderabad MP Asaduddin Owaisi says “ Jai Palestine” at the end of his oath. Your thoughts on this. pic.twitter.com/FQMEIeaFHX— Roshan Rai (@RoshanKrRaii) June 25, 2024తమిళనాడులోని తిరువళ్లూర్ ఎంపీ శశికాంత్ సెంథిల్ రాజ్యాగం చేత పట్టుకుని తమిళ్లో ప్రమాణం చేశారు. ఈయన కూడా తన ప్రమాణం ముగిసిన తర్వాత ‘ఆదివాసీలు, దళితులు, మైనారిటీల మీద వేధింపులు ఆపండి. జై భీం, జై సంవిధాన్’అని నినదించారు. ఈయన కాశ్మీర్ స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా అప్పట్లో తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. The IAS officer who resigned after the abrogation of #Article370 in #Kashmir and #Tiruvallur's #Congress MP #SasikanthSenthil took oath in Tamil.When he said, "Stop the shameful atrocities against the Minorities, Dalits & Adivasis. Jai Bhim, Jai Sanvidhan" #BJP MPs protested.… pic.twitter.com/jv1uyp2pGu— Hate Detector 🔍 (@HateDetectors) June 25, 2024సభలో అసదుద్దీన్, శశికాంత్ సెంథిల్ చేసిన నినాదాలపై బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్ కలుగజేసుకుని ఎంపీలు చేసిన వివాదాస్పద నినాదాలను రికార్డుల నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు. -
తొలిసారి లోక్సభ స్పీకర్ ఎన్నిక.. అభ్యర్థుల నేపథ్యం ఇదే..
ఢిల్లీ: 18వ లోక్సభ స్పీకర్ పదవి కోసం అధికార-ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కోసం మంగళవారం జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో ఎన్డీయే కూటమి, ఇండియా కూటమి తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. ఎన్డీయే తరఫున గతంలో స్పీకర్గా సేవలు అందించిన కోటా ఎంపీ ఓం బిర్లా, ఇండియా కూటమి తరఫున 8 సార్లు ఎంపీగా గెలిచిన కేరళ ఎంపీ కే. సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో దేశ చరిత్రలోనే.. రేపు(జూన్ 26,2024) తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. స్పీకర్ బరిలో ఉన్న అభ్యర్థులు రాజకీయ నేపథ్యాలు ఇవే..ఇండియా కూటమి అభ్యర్థి కే. సురేష్తిరువనంతపురం జిల్లాలోని కోడికున్నిల్లో కుంజన్, థంకమ్మ దంపతులకు 1962లో సురేష్ జన్మించారు. తిరువనంతపురంలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. అనంతరం ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1989లో మొదటిసారి కేరళలోని అదూర్ లోక్సభ స్థానంలో ఎంపీ గెలిచారు. 1991, 1996, 1999 వరుస సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదే స్థానంలో విజయం సాధించారు. అనంతరం మావేలికర లోక్సభ నియోజకవర్గం నుంచి 2009, 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచారు. ఇటీవల జరిగిన 2024 లోక్సభ ఎన్నికల్లో సైతం మావేలికర నుంచి ఆయన విజయం సాధించారు. ఎంపీ సురేష్.. కేరళ పీసీసీ సభ్యునిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా, పీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అనేక పదవులు చేపట్టి పార్టీని ముందుకు నడిపించారు. ఇ ఇప్పటివరకు మొత్తం 8 సార్లు ఎంపీగా గెలిచిన ఆయన ప్రస్తుతం కేరళ పీసీసీ చీఫ్ ఉన్నారు. ఇవాళ ఇండియా కూటమి తరఫున స్పీకర్ ఎన్నికకు నామినేషన్ వేశారు.ఎన్డీయే కూటమి అభ్యర్థి ఓం బిర్లా ఓం బిర్లా 1962లో శ్రీకృష్ణ బిర్లా, శకుంతలాదేవి దంపతులకు జన్మించారు. కోటాలోని ప్రభుత్వ కామర్స్ కళాశాల నుంచి మాస్టర్స్ డిగ్రీ, ఆజ్మీర్లోని మహర్షి దయానంద్ సరస్వతి విశ్వవిద్యాలయం నుంచి కామర్స్ డిగ్రీ పూర్తి చేశారు. రామమందిరం నిర్మాణ ఉద్యమంలో పాల్గొని ఆయన యూపీలో జైలుశిక్ష కూడా అనుభవించారు. అనంతరం ఆయన రాజకీయాల్లో చేరి మొదటిసారి 2003లో కోటా దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంపీగా ఎన్నిక కాకముందు 2013లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2014, 2019లో కోటా లోక్సభ స్థానం నుంచి గెలుపొదారు. 16 లోక్భలో ఓం బిర్లా సామాజిక న్యాయం, సాధికారకత కొరకు ఎనర్జీ, కన్సాల్టేటివ్ స్టాండింగ్ కమిటీలో సభ్యుని పనిచేశారు.2019లో ఎంపీగా గెలిచిన ఆయన 17 లోక్సభకు స్పీకర్గా పనిచేశారు. 2014లో కోటా నుంచి ఎంపీగా గెలుపొందిన ఓం బిర్లా.. లోక్సభ స్పీకర్ ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు. -
చాన్స్ ఇచ్చినా మోదీ కాదన్నారు: రాహుల్ గాంధీ
ఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఎన్నికపై అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో లోక్సభ స్పీకర్ ఎన్నిక అనివార్యం అయింది. అధికార ఎన్డీయే కూటమి నుంచి బీజేపీ ఎంపీ ఓం బిర్లా, ఇండియా కూటమి కేరళ కాంగ్రెస్ ఎంపీ కే సురేష నామినేన్లు దాఖలు చేశారు. దీంతో దేశ చరిత్రలోనే.. రేపు(జూన్ 26,2024) తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. అయితే ఇవాళ ఉదయం కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. డిప్యూటీ స్పీకర్ వ్యవహారంపై బీజేపీ వ్యవరించిన తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘‘ స్పీకర్ పదవికి ఎన్నికకు ఇండియా కూటమి విపక్షాలు సహరిస్తాయని చెప్పాం. డిప్యూటీ స్పీకర్ విషయంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మాకు ఫోన్ చేస్తాని చెప్పి ఇప్పటికీ చేయలేదు. మా అధ్యక్షుడు ఖర్గేను రాజ్నాథ్సింగ్ అవమానించారు. మోదీ తాను వ్యవహరిస్తున్న తీరును మార్చుకోవాలి. ఖర్గేతో జరిగిన చర్చలో రాజ్నాథ్ సింగ్ డిప్యూటీ స్పీకర్పై ఎటుంటి హామీ ఇవ్వలేదు.ప్రధాని మోదీ చెప్పెది ఒకటి.. చేసేది ఒకటి. సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకు కావాలన్నాం. డిప్యూటీ స్పీకర్పై స్పష్టమైన హామీ ఇస్తేనే స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరిస్తామని చెప్పాం. యూపీఏ హయాంలో మేము డిప్యూటీ స్పీకర్ పదవిని అప్పటి విపక్షాలకు ఇచ్చాం’’ అని రాహుల్ గాంధీ అన్నారు.రాజకీయం చేయటం సరికాదు: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. ‘స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగితే బాగుంటుంది. ఇలా రాజకీయం చేయటం సరికాదు. విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలాని ఎలాంటి నిబంధనల లేవు. ముందు డిప్యూటీ స్పీకర్ ఎవరో? తేల్చాలని కాంగ్రెస్ పట్టుబట్టింది’అని అన్నారు. -
మళ్లీ ఓం బిర్లాకే ఛాన్స్
-
దేశ చరిత్రలోనే తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక!
ఢిల్లీ, సాక్షి: లోక్సభ స్పీకర్ ఎన్నికలో ట్విస్ట్ చోటుచేసుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆ పోస్టుకు ఎన్నిక జరగబోతోంది. ఇన్నేళ్లలో ఏకగ్రీవంగానే లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగుతూ వచ్చింది. అయితే 18వ లోక్సభ స్పీకర్ పదవి కోసం అధికార-ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కోసం జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో.. ఇటు ఎన్డీయే కూటమి, అటు ఇండియా కూటమి అభ్యర్థుల్ని బరిలో నిలిపాయి. ఎన్డీయే కూటమి తరఫున ఓం బిర్లా, ఇండియా కూటమి తరపున సీనియర్ ఎంపీ కే.సురేష్ నామినేషన్ వేశారు. లోక్సభలో ఎన్డీయే కూటమికి 294 మంది ఎంపీల బలం ఉంది. అయినప్పటికీ తొలిసారి జరుగుతుండడంతో ఈ ఎన్నికపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. మరోసారి లోక్సభ స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లానే ఎన్డీయే కూటమి ఎంచుకుంది. స్పీకర్ పోస్టుకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు.. ఓం బిర్లాను లోక్సభ స్పీకర్గా కొనసాగిస్తారని ప్రచారం నడిచిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఇవాళ ఉదయం ఓం బిర్లా.. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అదే సమయంలో.. ఓం బిర్లా ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీయే తీవ్రంగా యత్నించింది. బీజేపీ అగ్రనేత రాజ్నాథ్ సింగ్.. ఇండియా కూటమి నేతలతో చర్చలు జరిపారు. అయితే ఆనవాయితీగా వస్తున్న డిప్యూటీ స్పీకర్ పోస్టును ప్రతిపక్షాలకు వదిలేయాలని కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో పాటు ఇండియా కూటమి నేతలంతా ప్రతిపాదించారు. దీంతో.. మరోసారి ఫోన్ చేసి పిలుస్తామంటూ రాజ్నాథ్సింగ్ వాళ్లకు చెప్పారు. అయితే డిప్యూటీ స్పీకర్ విషయంలో అధికార కూటమి తటపటాయించింది. ఈ క్రమంలో మరోసారి ఎన్డీయే నుంచి పిలుపు రాకపోవడంతో.. అభ్యర్థినే నిలపాలని ఇండియా కూటమి నిర్ణయించింది. దీంతో దేశచరిత్రలోనే.. రేపు(జూన్ 26, 2024) తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. No consensus on Speaker's post. INDIA bloc is likely to field its candidate for the post of Speaker of the 18th Lok Sabha: Sources pic.twitter.com/seZyieAIhS— ANI (@ANI) June 25, 2024 ఇంతకు ముందు ప్రొటెం స్పీకర్ విషయంలోనూ కే.సురేష్ పేరు తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత అయిన సురేష్.. ఎనిమిదిసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు.నిన్న 280 మంది ఎంపీలు లోక్సభలో ప్రమాణం చేయగా.. ఇవాళ మిగతా వాళ్లు చేస్తున్నారు. ఇక రేపు(జూన్ 26) స్పీకర్ ఎన్నిక జరగనుంది. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ సమక్షంలో ఎంపీలు స్పీకర్ను ఎన్నుకోనున్నారు. -
లోక్సభ స్పీకర్పై ఉత్కంఠ.. ఖర్గే సహా కూటమి నేతలతో చర్చలు
ఢిల్లీ: లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయంపై తీసుకువచ్చేందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు రంగంలో దిగారు. ఈ క్రమంలో ప్రతిపక్షాల ఇండియా కూటమిని ఒప్పించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఇతర నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.ప్రతిపక్షాల ఇండియా కూటమి లోక్సభ డిప్యూటీ స్పీకర్ కోసం పట్టుపడుతున్న విషయం తెలిసిందే. లోక్సభ స్పీకర్ ఎన్నిక నామినేషన్కు మధ్యాహ్నం 12 గంటల వరకు గడువు ముగియనుండటంతో ఇరు కూటముల మధ్య ఉత్కంఠ నెలకొంది.మరోవైపు మాజీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈసారి కూడా బీజేపీ ఓం బిర్లాను స్పీకర్గా ఎంపిక చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎన్నికైన లోక్సభ స్పీకర్లు అందరూ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఇక, స్పీకర్ ఎంపికకు ఎన్నిక జరిగితే.. ఇలా ఎన్నిక జరగటం ఇదే తొలిసారి అవుతుంది.డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించటం ఆనవాయితీగా వస్తోంది. 2014లో బీజేపీ తన మిత్ర పక్షం అన్నాడీఎంకే ఎంపీ ఎం తంబిదురైని డిప్యూటీ స్పీకర్గా ఎంపిక చేసింది. ఇక.. 2019 నుంచి ఆ పోస్ట్ ఖాళీగా ఉంది.16,17 లోక్సభల్లో కాంగ్రెస్కు కనీసం ప్రతిపక్షహోదా కూడా దక్కలేదు. కానీ, ఈసారి లోక్సభ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు సాధించి ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ లోక్సభలో డిప్యూటీ స్పీకర్ దక్కించుకోవాలని పట్టుపడుతోంది. -
రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. స్పీకర్ ఆయనేనా?
సాక్షి, ఢిల్లీ: రేపు(సోమవారం) నుంచి 18వ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. సోమవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. భర్తృహరి మెహతాజ్ను ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేయించనున్నారు. ఇక, జూన్ 26వ తేదీన లోక్సభ స్పీకర్ ఎన్నికల జరుగనుంది.కాగా, ప్రొటెం స్పీకర్గా ఎంపికైన మెహతాజ్.. రేపు, ఎల్లుండి కొత్త ఎన్నికైన లోక్సభ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేపించనున్నారు. తొలిరోజు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఏపీ మంత్రులు సహా 280 మంది ఎంపీలతో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. రెండో రోజు తెలంగాణ సహా మిగిలిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు.ఇక, జూన్ 26న లోకసభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. మరోవైపు.. ఏకాభిప్రాయంతో స్పీకర్ ఎన్నికకు ప్రయత్నం చేస్తోంది ఎన్డీయే ప్రభుత్వం. ఓం బిర్లాకే మళ్లీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇవ్వాలని విపక్ష కూటమి కోరుతున్నట్టు తెలుస్తోంది.సంప్రదాయంగా ప్రతిపక్షానికి, లేదంటే మిత్రపక్షాలకు డిప్యూటి స్పీకర్ పదవి ఇస్తారు. 2014లో అన్నాడీఎంకేకు డిప్యూటీ స్పీకర్ పదవిని బీజేపీ ఇచ్చింది. 16వ లోక్సభలో తంబిదొరై డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఇక, 17వ లోక్సభ(2019)లో మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికీ ఇవ్వకపోవడంతో ఖాళీగానే ఉంది. ఇదిలా ఉండగా.. జూన్ 27వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేయనున్నారు. -
ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక
సాక్షి, విజయవాడ: ఆంధప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి కోసం ఒకటే నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అయ్యన్న పాత్రుడు ఇప్పటి వరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా, అనకాపల్లి ఎంపీగానూ, పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. కాగా, ఏపీ అసెంబ్లీలో ఇవాళ 172 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాలుగు పార్టీల ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. ఇక రేపు మిగిలిన ముగ్గురు సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయనున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్ పోస్ట్ జనసేన లేదంటే బీజేపీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.. టీడీపీనే ఆ పోస్ట్ దక్కించుకునే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్ బదులు జనసేనకు విప్ పోస్ట్తో సరిపెట్టవచ్చని సమాచారం. -
లోక్ సభ స్పీకర్ ఎన్నికకు బీజేపీ కసరత్తులు
-
లోక్ సభ స్పీకర్ ఎన్నిక..
-
స్పీకర్ పదవి.. బీజేపీ రిస్క్ చేస్తుందా?
హోరాహోరీ సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. అంతా ఊహించినట్టే నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. మోదీ 3.0 మంత్రివర్గమూ కొలువుదీరింది. కానీ గత రెండు ఎన్నికల మాదిరిగా సొంతంగా మెజారిటీ సాధించడంలో బీజేపీ ఈసారి విఫలమైంది. దాంతో ఎన్డీఏ సంకీర్ణ సర్కారు మనుగడలో భాగస్వామ్య పక్షాల పాత్ర కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో అందరి కళ్లూ అతి కీలకమైన లోక్సభ స్పీకర్ పదవిపైనే నెలకొన్నాయి. ఎన్డీఏ కీలక భాగస్వామి టీడీపీ ఆ పదవిపై ఆసక్తిగా ఉందంటూ ముందునుంచీ వార్తలొస్తున్నాయి. తాజాగా జేడీ(యూ) పేరూ విని్పస్తోంది. అవి నాలుగైదు కేబినెట్ బెర్తులు కోరినా ఎన్డీఏ పెద్దన్న బీజేపీ మాత్రం చెరో రెండింటితో సరిపెట్టింది. కనుక స్పీకర్ పోస్టుపై ఆ పార్టీలు పట్టుదలగా ఉన్నట్టు చెబుతున్నారు. కానీ అపారమైన విచక్షణాధికారాలుండే స్పీకర్ పాత్ర కీలక సమయాల్లో అత్యంత నిర్ణాయకంగా మారుతుంటుంది. మరీ ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల్లో లోక్సభ స్పీకర్ పాత్రకుండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. పైగా గతంలో టీడీపీకి స్పీకర్ పోస్టు ఇచ్చి సర్కారును కుప్పకూల్చుకున్న అనుభవమూ బీజేపీకి ఉంది. ఈ నేపథ్యంలో కీలక పదవిని మిత్రపక్షాల చేతిలో పెట్టే రిస్క్కు బీజేపీ పెద్దలు మరోసారి సిద్ధపడతారా అన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది...అది 1999. రాజకీయ అస్థిరతకు చెక్ పెట్టే ఉద్దేశంతో వాజ్పేయి సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం లోక్సభలో బలపరీక్షకు సిద్ధపడింది. మద్దతిస్తామన్న పలు ఇతర పారీ్టలు తీరా అసలు సమయానికి అడ్డం తిరగడంతో ఒకే ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం కుప్పకూలింది. నాడు స్పీకర్గా ఉన్న టీడీపీ నేత జీఎంసీ బాలయోగి తీసుకున్న నిర్ణయమే అందుకు కారణంగా మారడం విశేషం! అంతకు కొద్ది రోజుల ముందే ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కాంగ్రెస్ ఎంపీ గిరిధర్ గమాంగ్ను ఓటింగ్కు అనుమతించాలా, లేదా అన్న ధర్మసందేహం తలెత్తింది. స్పీకర్గా తన విచక్షణాధికారాలను ఉపయోగించి గమాంగ్ను ఓటింగ్కు అనుమతిస్తూ బాలయోగి నిర్ణయం తీసుకున్నారు. చివరికి విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 269 ఓట్లు రాగా వ్యతిరేకంగా 270 వచ్చాయి. అలా గమాంగ్ వేసిన ఒక్క ఓటు ప్రభుత్వాన్ని పడ గొట్టింది. ఎన్డీఏ సర్కారుకు బయటినుంచి మద్దతిచి్చన టీడీపీ అధినేత చంద్రబాబు కోరిక మేరకు స్పీకర్ పదవిని ఆ పారీ్టకిస్తూ నాటి ప్రధాని వాజ్పేయి నిర్ణయం తీసుకున్నారు. పాతికేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు బాబు మరోసారి టీడీపీకి స్పీకర్ పదవి కోరుతున్నట్టు వార్తలొస్తుండటం విశేషం! జిస్కా స్పీకర్, ఉస్కీ సర్కార్! మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరినా బీజేపీకి సొంతంగా మెజారిటీ రాని విషయం తెలిసిందే. లోక్సభలో మెజారిటీ మార్కు 272 కాగా బీజేపీకి 240 మంది ఎంపీలే ఉన్నారు. ఎన్డీఏ భాగస్వాముల్లో 16 ఎంపీలున్న టీడీపీ, 12 మంది ఉన్న జేడీ(యూ) ప్రభుత్వ మనుగడకు కీలకంగా మారాయి. సంకీర్ణ ప్రభుత్వాల మనుగడలో స్పీకర్ పదవి ఎంత కీలకమో 1999 నాటి వాజ్పేయి ప్రభుత్వ ఉదంతం నిరూపించింది. పైగా ‘జిస్కా స్పీకర్, ఉస్కీ సర్కార్ (స్పీకర్ పదవి దక్కిన వారిదే సర్కారు)’ అన్న నానుడి హస్తిన రాజకీయ వర్గాల్లో బాగా ఫేమస్ కూడా. అలాంటి కీలకమైన స్పీకర్ పదవిని ఈసారి టీడీపీ కోరుతోంది. మోదీ అందుకు అంగీకరించే సాహసం చేస్తారా అన్నదానిపై రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. 2014, 2019ల్లో బీజేపీ సొంతగానే మెజారిటీ సాధించడంతో ఆయనకు ఇలాంటి పరీక్ష ఎదురవలేదు. అయితే మంత్రివర్గ కూర్పులో భాగస్వాముల డిమాండ్లకు మోదీ పెద్దగా తలొగ్గలేదు. టీడీపీ ఐదారు, జేడీ(యూ) నాలుగైదు బెర్తులు అడిగినా వాటికి చెరో రెండు పదవులతో సరిపెట్టారు. పైగా కీలకమైన శాఖలన్నింటినీ బీజేపీకే కేటాయించారు. కనుక స్పీకర్ పదవిని కూడా బీజేపీయే అట్టిపెట్టుకోవచ్చన్న అభిప్రాయం విని్పస్తోంది. పవర్స్ అన్నీ ఇన్నీ కావులోక్సభ స్పీకర్కు సాధారణ అధికారాలతో పాటు అత్యంత కీలకమైన విచక్షణాధికారాలు కూడా ఉంటాయి. సభా నిబంధనలను తన విచక్షణ మేరకు నిర్వచించగలుగుతారు. అందుకే స్పీకర్ పదవిని పాలక పక్ష బలానికి, ఆధిపత్యానికి ప్రతీకగా భావిస్తుంటారు. లోక్సభను అజమాయిషీ చేస్తూ కార్యకలాపాలను సజావుగా నడిపించేది స్పీకరే. కనుక ఆ పదవి దక్కే పార్టీ సహజంగానే లోక్సభ కార్యకలాపాల అజెండా తదితరాలను ప్రభావితం చేయగలుగుతుంది. నిర్ణాయక సందర్భాల్లో ఇది కీలకంగా మారుతుంది. సభలో ప్రవేశపెట్టే బిల్లులు ద్రవ్య బిల్లా, సాధారణ బిల్లా అన్నది స్పీకరే నిర్ధారిస్తారు. సభా సంఘాలను ఏర్పాటు చేస్తారు. వాటి చైర్పర్సన్లు, సభ్యులను నియమిస్తారు. సభ్యుల సస్పెన్షన్ వంటి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సింది స్పీకరే. పార్లమెంటు సంయుక్త సమావేశాలకు సారథ్యం వహిస్తారు. అన్నింటికీ మించి ఏ అంశంపై అయినా సభలో ఓటింగ్ జరిగి రెండు పక్షాలకూ సమానంగా ఓట్లొస్తే స్పీకర్ పాత్ర మరింత కీలకంగా మారుతుంది. ఆయన నిర్ణాయక ఓటు ఎవరికి వేస్తే వారే నెగ్గుతారు!– సాక్షి, నేషనల్ డెస్క్ -
AP: స్పీకర్ రేసులో సీనియర్లు..
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు(బుధవారం) కొలువుదీరనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, స్పీకర్ పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. స్పీకర్ రేస్లో సీనియర్లు పోటీ పడుతున్నారు.కళా వెంకట్రావ్, అయ్యన్నపాత్రుడు, బుచ్చయ్య చౌదరి పేర్లు పరిశీలనలో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ముగ్గురు కూడా ఏడు సార్లు ఏడుసార్లు గెలిచిన ఎమ్మేల్యేలే.. గతంలో చంద్రబాబును రఘురామకృష్ణం రాజు.. స్పీకర్ పదవి అడగ్గా, 2014 ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొడెల శివప్రసాద్కి చంద్రబాబు స్పీకర్ పదవి ఇచ్చారు. ఈ సారి అదే ఫార్ములా అనుసరిస్తారా? సామాజిక సమీకరణలు పాటించి బీసీ, ఎస్పీలకు ఇస్తారా?. గతంలో స్వీకర్ గా పని చేసిన అనుభవం ఉన్న నాదెండ్లకి మరోసారి అవకాశం కల్పిస్తారా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది.చంద్రబాబు కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ మరోవైపు, చంద్రబాబు కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. మంత్రుల జాబితా ఇంకా ప్రకటించలేదు. మంత్రి పదవి ఫోన్ల కోసం టీడీపీ ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నారు. రాత్రికి చంద్రబాబు నివాసానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకోనున్నారు. అమిత్ షా అనుమతి తర్వాతే మంత్రుల జాబితా వెల్లడించే అవకాశం ఉంది. -
‘స్పీకర్ పదవి తీసుకోండి.. లేదంటే మీ పని అంతే!’
ముంబై: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ ఎంపీ స్థానాలు సాధించలేకపోయింది. దీంతో కేంద్రంలో భాగస్వామ్య పార్టీల మద్దతుతో బీజేపీ.. ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరడానికి తెలుగుదేశం(టీడీపీ), జేడీ (యూ)లు కీలకంగా వ్యవహరించి మద్దతు పలికాయి.టీడీపీ, జేడీ(యూ) పార్టీల మద్దతుతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీపై విపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఎన్నికవ్వడానికి మద్దతు పలికిన టీడీపీ, జేడీ(యూ) భవిష్యత్తులో చాలా జాగ్రత్తగా ఉండాలని శివసేన (యూబీటీ) వర్గం నేత ఆదిత్య ఠాక్రే హెచ్చరించారు.If TDP and JDU want to save their party, they should keep Loksabha speaker post with them otherwise BJP will break their parties for sure. — Aditya Thackeray pic.twitter.com/vopynhKkVp— Shantanu (@shaandelhite) June 10, 2024 ‘టీడీపీ, జేడీ(యూ) పార్టీలు.. తమ పార్టీను రక్షించుకోవాలి. అందుకోసం బీజేపీ నుంచి లోక్సభ స్పీకర్ పదవి డిమాండ్ చేసి తీసుకోండి. లేదంటే త్వరలోనే మీ పార్టీలను బీజేపీ చీల్చివేస్తుంది’ అని ఆదిత్య ఠాక్రే ‘ఎక్స్’ వేదికగా అన్నారు.మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ చీలిన విధానాన్ని ఆదిత్య పరోక్షంగా ప్రస్తావించారు. ఎన్డీయే కూటమి ఇంకా లోక్సభ స్పీకర్ పదవిని ఎవరికీ కేటాయించలేదు. భాగస్వామ్య పార్టీలు స్పీకర్ పదవిని కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే వారి డిమాండ్కు బీజేపీ ఒప్పుకోవటం లేదని ఎన్డీయే పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
శాసనసభలో సెల్ఫోన్లు వాడొద్దు
సాక్షి, హైదరాబాద్: శాసనస సభ స్పీకర్ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక నుంచి సభలో సభ్యులెవరూ సెల్ఫోన్లు, ట్యాబ్లు, ఇతర ఎల్రక్టానిక్ గ్యాడ్జెట్స్ను వినియోగించకూడదని రూలింగ్ ఇచ్చారు. వాటిని ఉపయోగించి వీడియోలు ప్రదర్శించకూడదని ఆదేశించారు. ‘కృష్ణా నది మీద నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేఆర్ఎంబీకి అప్పగించే అంశం’మీద సభలో ఇటీవల జరిగిన చర్చ సందర్భంగా అధికార–ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగిన విషయం తెలిసిందే. కేఆర్ఎంబీకి తాము ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత అప్పగించటం లేదని ప్రభుత్వం స్పష్టం చేసిన సమయంలో, ఆ నిర్ణయానికి భిన్నమైన అభిప్రాయాన్ని వెల్లడించిన అప్పటి నీటి పారుదల శాఖ ఈఎన్సీ (ప్రస్తుతం మాజీ) మురళీధర్రావు పేర్కొన్నట్టుగా ఉన్న వీడియోను ఫోన్ ద్వారా ప్రదర్శించారు. ఇది ప్రభుత్వాన్ని కొంత ఇ రుకున పెట్టింది. ఈ నేపథ్యంలో సభలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వినియోగంపై గురువారం స్పీకర్ నిర్ణ యం వెల్లడించటం విశేషం. స్పీక ర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా సభలో వాటిని వినియోగించవద్దని స్పష్టం చేశారు. మీడియా పాయింట్ వద్ద కూడా ఇక సీఎం రేవంత్రెడ్డి బుధవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన మీదట బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం వారు మీడియాతో మాట్లాడేందుకు సభ ఆవరణలోని మీడియా పాయింట్ వద్దకు వస్తుండగా భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. సభ జరుగుతున్న తరుణంలో మీడియా పాయింట్ వద్ద మీడియా సమావేశానికి అనుమతి లేదంటూ వారు పేర్కొనడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ బీఆర్ఎస్ సభ్యులు నేలమీద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం సభ ప్రారంభం అవుతూనే స్పీకర్ ప్రసాద్కుమార్ కీలక ప్రకటన చేశారు. సభ జరుగుతున్న తరుణంలో సభా ప్రాంగణంలో మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశానికి అనుమతి లేదని, టీ, లంచ్ విరామ సమయాల్లో, సభ వాయిదా పడ్డ తర్వాత యధావిధిగా మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడవచ్చని పేర్కొన్నారు. -
శరద్ పవార్కు మరో షాక్.. ‘అజిత్దే నిజమైన ఎన్సీపీ’: మహారాష్ట్ర స్పీకర్
సాక్షి, ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) వివాదంలో రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్కి మరోసారి షాక్ తగిలింది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీనే నిజమైన పార్టీ అని మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ స్పష్టం చేశారు. ఎన్సీపీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యే అజిత్ పవార్ వెంటే ఉన్నారని.. ఆయన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేమని పేర్కొన్నారు. ‘అజిత్ పవార్ వర్గం ఎన్సీపీనే నిజమైన పార్టీ. అసెంబ్లీలో మొత్తం 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉండగా.. అజిత్ పవార్కు 41 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. శరద్ పవార్ వర్గానికి 12 మంది ఎమ్మెల్యేల వర్గం ఉంది. మెజార్టీ ఎమ్మెల్యేలు అజిత్ వెంటే ఉన్నందున ఆయన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేము’ అని తెలిపారు. చదవండి: టీఎంసీకి షాక్.. ఎంపీ సభ్యత్వానికి మిమీ చక్రవర్తి రాజీనామా కాగా శరద్ పవార్ ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ తిరుగుబాటు చేసి 2023 జూలైలో బీజేపీ-శివసేన (షిండే వర్గం) ప్రభుత్వంలో చేరడంతో ఇరు నాయకుల మధ్య వివాదం రాజుకుంది. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. ముఖ్యంగా పార్టీ ఎవరిది, ఏ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారనే రెండు అంశాలపై రెండు వర్గాల మధ్య చిచ్చు నెలకొంది. అయితే ఇటీవల అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గాన్ని 'అసలైన రాజకీయ పార్టీ'గా ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే.. దీంతో పార్టీ పేరు, గడియారం గుర్తు అజిత్కే దక్కింది. ఎన్నికల కమిషన్ నిర్ణయం అనంతరం శరద్ పవార్ నేతృత్వంలోని వర్గానికి 'నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ - శరద్ చంద్ర పవార్' అనే కొత్త పేరు వచ్చింది. -
AP: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ మరో ఛాన్స్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. రేపు(గురువారం) ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎదుట హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు ఈ మేరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అధికారులు లేఖ రాశారు. ఈ నెల 12న విచారణకు రావాలని ఇంతకు ముందు స్పీకర్ నోటీసులు జారీ చేయగా, వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నామని స్పీకర్కు వైఎస్సార్సీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు లేఖ పంపించారు. తాజాగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అధికారులు నోటీసులు పంపించారు. ఇదీ చదవండి: CM Jagan: ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడులు -
కేసీఆర్కు ఈ చాంబర్ ఏంటి?
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఇన్నర్ లాబీలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఏళ్ల తరబడి కేటాయిస్తూ వస్తున్న చాంబర్ను తొలగించి తాజాగా కె.చంద్రశేఖరరావుకు ఔటర్ లాబీలో ఇరుకైన చిన్న గదిని కేటాయించడంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శాసనసభ సమావేశాల తొలిరోజున గురువారం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్ చాంబర్కు వెళ్లి తమ నిరసన తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, హరీశ్రావు, సీనియర్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి తదితరులు కేసీఆర్ చాంబర్ను మార్చడాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. 39 మంది ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ప్రధాన ప్రతిపక్షం నేత కార్యాలయాన్ని ఇన్నర్ లాబీ నుంచి ఔటర్ లాబీకి మార్చడాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచీ ఇన్నర్ లాబీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ప్రత్యేక చాంబర్ను కేటాయించడం ఆనవాయితీగా వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతకు కేటాయించిన చాంబర్ను ఔటర్ లాబీకి తరలించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలపైనా ఫిర్యాదు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాసేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తూ నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలకు సంబంధించిన పలు సంఘటలను కూడా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అనారోగ్యంతో బాధపడుతున్నా ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి భార్య వచ్చేంత వరకు సుమారు రెండు గంటల పాటు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు నిలిపివేశారన్నారు. నర్సాపూర్, దుబ్బాక, జహీరాబాద్ తదితర నియోజకవర్గాల్లోనూ ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థులను పోలీసులు ఎస్కార్ట్ వాహనంతో అనుసరిస్తున్నారని స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరగకుండా అధికారులను ఆదేశించాలని స్పీకర్ను కోరారు. పని చేయని టీవీ.. డోర్ హ్యాండిల్ లేని బాత్ రూం గతంలో ఐదుగురు సభ్యులున్న కాంగ్రెస్కు కూడా చాంబర్ను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇన్నర్ చాంబర్లోని ప్రతిపక్ష నేత చాంబర్ను తాను వాడుకుంటానని స్పీకర్ కోరడంతో ఔటర్ లాబీకి తన కార్యాలయాన్ని తరలించేందుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారన్నారు. అయితే ఔటర్ లాబీలో ఇరుకైన చిన్న గది కేటాయించారని, అందులోని మూత్రశాలకు కనీసం డోర్ హ్యాండిల్ లేదనీ, టీవీ పనిచేయడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్కు తెలిపారు. ఇది ప్రతిపక్ష నేతను అవమానించడం లాంటిదేనని, విశాలమైన చాంబర్ను కేటాయించాలని కోరారు. వచ్చే సెషన్లోగా ప్రతిపక్ష నేత చాంబర్ను విశాలంగా తీర్చిదిద్ది అన్ని వసతులు కల్పిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. -
AP: పార్టీ ఫిరాయించారు.. వేటేనా?
విజయవాడ: వైస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనర్హత పిటిషన్లపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం విచారణ చేపట్టారు. పార్టీ ఫిరాయింపు పిటీషన్పై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీలో విచారణకు హాజరయ్యారు. పార్టీ ఫిరాయింపుపై నలుగురు ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిసి మరింత గడువు కావాలని కోరారు. స్పీకర్ ఎదుట విచారణ సందర్భంగా వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు మెమో దాఖలు చేశారు. న్యాయ నిపుణులతో సంప్రదించేందుకు, పేపర్, వీడియో క్లిప్పింగుల నిజనిర్ధారణకు సమయం అవసరమని, పిటిషన్ దాఖలు తర్వాత రిప్లైకి 30 రోజుల సమయం కావాలని కోరామని తెలిపారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేసినట్టు స్పీకర్తో భేటీ తర్వాత తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కొత్త సాకులు స్పీకర్తో విచారణ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు కొత్త కారణాలను తెరమీదికి తెచ్చారు ఉండవల్లి శ్రీదేవి : నాకు కోవిడ్ వచ్చింది, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఇంకా సెలైన్ పెట్టుకుంటూనే ఉన్నాను. కోవిడ్ తగ్గే దాకా సమాధానం ఇవ్వడానికి సమయం కావాలి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి : నేను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాను. వైద్యుల నివేదిక ఇచ్చినా పట్టించుకోలేదు, విప్ ఉల్లంఘించామనడానికి ఉన్న ఆధారాలేమిటి? ఆనం రాంనారాయణ : నోటీసులిచ్చిన 2 వారాల్లోనే సమాధానం ఇవ్వమనడం సరికాదు, అసలు నాకు వ్యతిరేకంగా ఆధారాలున్నాయా? కాగా పార్టీ ఫిరాయించినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే. ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని వ్యక్తిగతంగా విచారిస్తుండగా.. ఎమ్మెల్సీలను శాసనమండలి ఛైర్మన్ మోషెన్ రాజు విచారించారు. దీ చదవండి: చెప్పింది చేయకపోవడం బాబు నైజం -
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం ఆమోదించారు. గతంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్కు గంటా శ్రీనివాస్ లేఖ రాసిన విషయం తెలిసిందే. గంటా శ్రీనివాస్ స్పీకర్ ఫార్మాట్లో తన రాజీనామాను సమర్పించారు. స్పీకర్ను కలిసి రాజీనామా ఆమోదించాలని కూడా గంటా శ్రీనివాస్ గతంలో కోరిన సంగతి తెలిసిందే. స్పీకర్ తమ్మినేని సీతారాం గంటా శ్రీనివాసరావు కోరిక మేరకు తన రాజీనామాను ఆమోదించారు. చదవండి: భీమిలి సీటుపై గంటా కర్చీఫ్.. టికెట్ ఇస్తే ఓటమి ఖాయం! -
Shivsena Row: స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు ఉద్ధవ్ థాక్రే
ముంబై: ఉద్ధవ్ థాక్రే శివసేన, షిండే శివసేన మధ్య వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనే అసలైన శివసేన పార్టీ అని ఇటీవలే ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకార్ ఇటీవల రూలింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే స్పీకర్ ఇచ్చిన రూలింగ్పై తాజాగా ఉద్ధవ్ థాక్రే సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో పాటు పార్టీ వీడి షిండేతో పాటు వేరు కుంపట్టి పెట్టిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోవడాన్ని కూడా ఉద్ధవ్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కాగా, జూన్ 2022లో పార్టీ రెండుగా చీలిపోయిన తర్వాత రెండు శివసేన వర్గాలు ఒకరిపై ఒకరు స్పీకర్కు అనర్హత పిటిషన్లు ఇచ్చారు. షిండేతో పాటు వెళ్లిన మొత్తం 40 మంది ఎమ్మెల్యేలపైనా ఉద్ధవ్ వర్గం అనర్హత పిటిషన్లు వేయగా ఉద్ధవ్ వర్గంలోని 14 మంది ఎమ్మెల్యేలపై షిండే వర్గం అనర్హత పిటిషన్లు ఇచ్చింది. షిండే నేతృత్వంలోని పార్టీయే అసలైన శివసేన అని గుర్తిస్తూ ధనుస్సు బాణం గుర్తును ఎన్నికల కమిషన్ గతేడాది వారికే కేటాయించడం గమనార్హం. ఇదీచదవండి.. విమాన ప్రయాణికులు మాతో సహకరించాలి : సింధియా -
Maharashtra politics: షిండే వర్గమే అసలైన శివసేన
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన రాజకీయ పార్టీ అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నర్వేకర్ బుధవారం తేల్చేశారు. ఏడాదిన్నరగా కొనసాగుతున్న అనిశి్చతికి తెరదించారు. శివసేన పార్టీ 2022 జూన్లో రెండుగా విడిపోయిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు రెండు పక్షాలుగా చీలిపోయారు. ఒక వర్గానికి నేతృత్వం వహిస్తున్న ఏక్నాథ్ షిండే బీజేపీ, ఎన్సీపీ మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. మరో వర్గానికి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వం వహిస్తున్నారు. తమ వర్గమే అసలైన శివసేన అంటూ ఇరువురు నేతలు వాదిస్తున్నారు. అవతలి వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ షిండే, ఉద్ధవ్ ఠాక్రే అసెంబ్లీ స్పీకర్కు విజ్ఞాపనలు సమరి్పంచారు. వీటిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ తన నిర్ణయం ప్రకటించారు. షిండే వర్గమే అసలైన శివసేన అని స్పష్టం చేశారు. ఉద్ధవ్ వర్గానికి చెందిన సునీల్ ప్రభును విప్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. ఈ తొలగింపు 2022 జూన్ 21 నుంచి వర్తిస్తుందన్నారు. షిండే వర్గానికి చెందిన భరత్ గోగావాలేను అధికారికంగా విప్గా గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. ఏ ఒక్క ఎమ్మెల్యేపై కూడా అనర్హత వేటు వేయడం లేదన్నారు. పార్టీ నుంచి నేతలను బహిష్కరించే అధికారం శివసేన చీఫ్కు లేదని పేర్కొన్నారు. 2018 నాటి శివసేన రాజ్యాంగాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఉద్ధవ్ వర్గం కోరగా, స్పీకర్ అంగీకరించలేదు. 1999 నాటి రాజ్యాంగాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నామని చెప్పారు. శివసేన ఎన్నికల సంఘం సైతం ఈ రాజ్యాంగాన్నే గుర్తించిందని పేర్కొన్నారు. మొత్తం 54 మంది ఎమ్మెల్యేలకు గాను 37 మంది ఎమ్మెల్యేలు షిండే వర్గంలోనే ఉన్నాయని గుర్తుచేశారు. స్పీకర్ నిర్ణయంపై షిండే వర్గంసంబరాలు చేసుకుంది. సీఎం ఏక్నాథ్ షిండే కూడా దీనిపై హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంను ఆశ్రయిస్తాం: ఉద్ధవ్ వర్గం స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని శివసేన(ఉద్ధవ్) ప్రకటించింది. స్పీకర్ నిర్ణయాన్ని అంగీకరించబోమని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. ఇదంతా బీజేపీ కుట్ర అని పార్టీ నేతలు ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ మండిపడ్డారు. బాల్ ఠాక్రే స్థాపించిన శివసేనను ఎవరూ అంతం చేయలేరన్నారు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారమని ఆరోపించారు. షిండే వర్గమే అసలైన శివసేన అయితే తమ వర్గం ఎమ్మెల్యేలపై ఎందుకు అనర్హత వేటు వేయలేదని ప్రశ్నించారు. స్పీకర్ నిర్ణయాన్ని ప్రజాస్వామ్య హత్యగా ఉద్ధవ్ ఠాక్రే అభివరి్ణంచారు. -
ఛత్తీస్గఢ్లో ఇద్దరు డిప్యూటీ సీఎంలు, రమణ్ సింగ్కు స్పీకర్
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో ఇద్దరు ఉపముఖ్యమంత్రులను బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసింది. అరుణ్ సావో, విజయ్ శర్మల పేర్లను ఖరారు చేశారు. మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా నియమితులయ్యారు. సీఎంగా విష్ణు దేవ్ సాయిని బీజేపీ కేంద్ర నాయకత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఛత్తీస్గఢ్ నూతన ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయిని బీజేపీ కేంద్ర నాయకత్వం ఎంపిక చేసింది. రాయ్పూర్లో బీజేపీ కొత్తగా ఎన్నికైన 54 మంది ఎమ్మెల్యేల కీలక సమావేశం తర్వాత విష్ణు దేవ్ సాయిని సీఎంగా ప్రకటించారు. 2003 నుంచి 2018 వరకు మూడు సార్లు సీఎంగా పనిచేసిన సీనియర్ నాయకుడు రమణ్ సింగ్ను స్పీకర్ పదవికి పరిమితం చేశారు. ఇటీవల ముగిసిన ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే బీజేపీ పోటీలో నిలిచింది. మొత్తం 90 స్థానాలకు గాను 54 స్థానాలను కైవసం చేసుకుని ఘనవిజయం సాధించింది. గెలుపు అనంతరం సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడంపై గత వారం రోజులుగా బీజేపీ పెద్దలు నిమగ్నమయ్యారు. ఎట్టకేలకు నేటి సమావేశంలో విష్ణుదేవ్ సాయిని సీఎంగా ఎంపిక చేయడానికే బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. గిరిజన వర్గానికి చెందిన విష్ణు దేవ్ సాయి .. ఈ ఎన్నికల్లో బీజేపీకి భారీ ఎత్తున గిరిజనుల మద్దతు కూడగట్టారు. ఇదీ చదవండి: ఛత్తీస్గఢ్ నూతన సీఎంగా విష్ణుదేవ్ సాయి -
ప్రజాస్వామ్య పద్ధతిలో సభ నిర్వహిస్తా
సాక్షి, హైదరాబాద్: పాలక, ప్రతిపక్ష సభ్యులను సమన్వయం చేసుకుంటూ శాసనసభ ఔ న్నత్యం ఇనుమడింపజేసేలా ప్రజాస్వామ్య ప ద్ధతిలో సభా కార్యక్రమాలు నిర్వహిస్తానని వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. శాసనసభ స్పీకర్గా గడ్డం ప్రసాద్కుమార్ ఎన్నికకానున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. స్పీకర్ పదవికి కాంగ్రెస్ తనను ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందని... దళితుడికి ఇంత పెద్ద హోదా కేవలం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమన్నారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే... మంత్రి పదవి వస్తుందని అనుకున్నా... నాతో పాటు నియోజకవర్గ, జిల్లా ప్రజలు కూడా ఈసారి నాకు మంత్రి పదవి వస్తుందని అనుకున్నాం. కానీ పార్టీ అధిష్టానం ఇంకా గొప్పగా ఆలోచించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పెద్ద బాధ్యత అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తను నేను. పార్టీ ఏ పదవి ఇచ్చినా కాదనకుండా చేసుకుంటూపోతా. కాంగ్రెస్ పేరుకు దెబ్బ తగలకుండా ఇచ్చిన పదవికి గౌరవం తెచ్చేలా పనిచేస్తా. రెండు పర్యాయాలుస్పీకర్ నామమాత్ర పాత్రనే... గత రెండు పర్యాయాలు శాసనసభ కార్యక్రమాల నిర్వహణను రాష్ట్ర ప్రజలంతా గమనించారు. నియంతృత్వ ధోరణిలో ప్రతిపక్షాలను లెక్క చేయకుండా ఏకపక్షంగా సభానాయకుడే సభలో నిర్ణయాలు తీసుకున్న పరిస్థితిని గమనించాం. స్పీకర్ పాత్ర నామమాత్రమైంది. నేను స్పీకర్గా ఎన్నికైతే ప్రజాస్వామ్య పద్ధతిలో, సభ గౌరవం తగ్గకుండా, స్పీకర్ విలువ పెంచేలా సభను నడిపిస్తా. మహామహులు సభలో ఉన్నా... సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మాజీ సీఎం కేసీఆర్ ఇతర సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు. పాలక, ప్రతిపక్షాల సభ్యులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతా. ఇప్పటి వరకు పాలక పక్షం చెప్పిందే వేదంగా సాగేది. సభలో ప్రతిపక్షాలకు కూడా తగిన సమయం ఇస్తా. అందరినీ కలుపుకొని ముందుకు వెళతా. మొదటి దళిత స్పీకర్ను నేనే అవుతా... నేను ఎన్నికైతే తెలంగాణ శాసనసభలో తొలి దళిత స్పీకర్గా నాదే రికార్డు అవుతుంది. ఉమ్మడి ఏపీలో ప్రతిభాభారతి తొలి దళిత స్పీకర్గా ఉండేవారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇంత పెద్ద పదవి దక్కింది కూడా నాకే. -
పార్లమెంట్ సాక్షిగా ట్రూడో చిల్లర చేష్టలు
ఒట్టావా: కెనడా పార్లమెంట్ సాక్షిగా ప్రధాని జస్టిన్ ట్రూడో చేష్టలపై నెటిజన్లు ఫైరవుతున్నారు. దేశ ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి ప్రదర్శించాల్సిన తీరుకాదని విమర్శలు గుప్పిస్తున్నారు. మంగళవారం కెనడా పార్లమెంట్లో నూతన స్పీకర్ కొలువుదీరిన నేపథ్యంలో జస్టిన్ ట్రూడో నాలుకతో సంజ్ఞలు చేస్తూ.. కన్నుగీటారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కెనడా పార్లమెంట్లో నూతన స్పీకర్ గ్రెగ్ ఫెర్గస్.. ప్రధాని జస్టిన్ ట్రూడోను సభకు పరిచయం చేస్తూ..'గౌరవనీయులైన ప్రధాని' అని సంబోధించారు. ఇంతలోనే ట్రూడో మధ్యలో కలగజేసుకుని 'చాలా గౌరవనీయులైన ప్రధాని' అని సరిచేశారు. ఈ క్రమంలోనే స్పీకర్ గ్రెగ్ వైపు చూస్తూ నాలుకతో సంజ్ఞలు చేస్తూ.. కన్నుగీటారు. The rig is in. Canadian Prime Minister Justin Trudeau gives a wink and bites his tongue at new Speaker of the House of Commons, Greg Fergus. What is going on in Canada? Fergus, who is a liberal, was elected after the previous speaker was forced to resign for praising a Nazi on… pic.twitter.com/WjuaaVuLIu — illuminatibot (@iluminatibot) October 4, 2023 ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రధాని స్థానంలో ఉండి ట్రూడో వైకరి చిన్నపిల్లల వలె ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కన్నగీటడం, నాలుకతో సంజ్ఞలు సాధారణ పౌరులకే ఇబ్బందికరంగా ఉంటాయి. అలాంటిది పార్లమెంట్ సాక్షిగా ఇలా ప్రవర్తించడం దారుణమని కామెంట్లు పెట్టారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్షనాయకులు విమర్శలు సందించారు. నాజీ సైన్యంలో పనిచేసిన ప్రముఖునికి పార్లమెంట్లో గౌరవసన్మానం చేసిన వ్యవహారంలో మాజీ స్పీకర్ ఆంటోని రోటా తన పదవికి రాజీనామా చేశారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగింది. యూదులను ఊచకోత కోసిన హిట్లర్ తరుపున యుద్ధంలో పాల్గొన్న వ్యక్తికి సన్మానం చేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో మాజీ స్పీకర్ రాజీనామా చేయడంతో కొత్త స్పీకర్ను నియమించాల్సిన అవసరం ఏర్పడింది. ఇదీ చదవండి: మోదీ చాలా తెలివైన వ్యక్తి: పుతిన్ -
స్పీకర్నే దించేసుకున్నారు!
వాషింగ్టన్: అమెరికాలో విపక్ష రిపబ్లికన్ పార్టీ సంక్షోభంలో చిక్కుకుంది. ప్రతినిధుల సభ స్పీకర్ పదవి నుంచి రిపబ్లికన్ నేత కెవిన్ మెకార్తీని సొంత పారీ్టకి చెందిన సభ్యులే సాగనంపారు! అగ్రరాజ్య చరిత్రలో స్పీకర్ ఇలా ఉద్వాసనకు గురవడం ఇదే తొలిసారి. ఆయనపై రిపబ్లికన్ నేత మాట్ గేట్జ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఆ పారీ్టకి చెందిన మరో ఏడుగురు కాంగ్రెస్ సభ్యులు మద్దతివడం ద్వారా అధికార డెమొక్రటిక్ పారీ్టతో చేతులు కలిపారు. దాంతో మంగళవారం మధ్యాహ్నం (అమెరికా కాలమానం ప్రకారం) జరిగిన ఓటింగ్లో 216–210 ఓట్లతో మెకార్తీ ఓటమి చవిచూశారు. ఈ ఏడాది జనవరిలో ఏకంగా నాలుగు రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన 15 రౌండ్ల ఓటింగ్ అనంతరం మెకార్తీ స్పీకర్గా నెగ్గడం తెలిసిందే. పది నెలలు తిరక్కుండానే ఆయన ఇలా అవమానకరంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడిక తదుపరి స్పీకర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. కొంప ముంచిన షట్డౌన్ కెవిన్ పారీ్టలో అందరి నమ్మకమూ కోల్పోయారని గేట్జ్ ఆరోపించారు. సైద్ధాంతికంగా తనతో అన్ని విషయాల్లోనూ విభేదించే తమ పార్టీ సభ్యులు కూడా ఆయన్ను దించేసే విషయంలో కలసి రావడమే ఇందుకు రుజువని చెప్పారు. ఆర్థిక షట్డౌన్ను తాత్కాలికంగా నివారించే సాకుతో అధికార పారీ్టతో కెవిన్ చేతులు కలిపారన్నది గేట్జ్ వర్గం ఆరోపణ. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్తో ఆయన చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించింది. స్పీకర్కు ఉద్వాసనను కనీవినీ ఎరగని ఘటనగా డెమొక్రటిక్ పార్టీ కాంగ్రెస్ సభ్యుడు, ఇండియన్ అమెరికన్ అమీ బెరా అభివరి్ణంచారు. రిపబ్లికన్ల మధ్య నెలకొన్న పరస్పర అపనమ్మకానికి ఇది తాజా నిదర్శనమన్నారు. రిపబ్లికన్ల ఇంటిపోరు వల్లే... గేట్జ్ సారథ్యంలోని రైట్ వింగ్ రిపబ్లికన్ సభ్యులకు నిజానికి కెవిన్ మీద ఆది నుంచీ వ్యతిరేకతే! జనవరిలో స్పీకర్గా ఆయన ఎన్నిక కావడాన్ని వారు చివరిదాకా వ్యతిరేకించారు. దాంతో తనను తొలగించాలని ఒక్క రిపబ్లికన్ సభ్యుడు కోరినా దానిపై ఓటింగ్కు అనుమతిస్తానని వారితో ఒప్పందం చేసుకుని మెకార్తీ స్పీకర్గా నెగ్గారు. చివరికి అదే ఒప్పందం కారణంగా పదవిని కోల్పోయారు! అయితే సొంత పారీ్టలోనే ఇప్పుడు కెవిన్ ఉద్వాసనను తీవ్రంగా తప్పుబడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. గేట్జ్ చర్య ద్రోహపూరితమని వారు ఆరోపిస్తున్నారు. వారిమీద కఠిన చర్యలకు డిమాండ్ చేస్తుండటంతో రిపబ్లికన్ పారీ్టలో సంక్షోభం కాస్తా రసకందాయంలో పడింది! ఇప్పుడేంటి? ► తదుపరి స్పీకర్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ► అమెరికా కాంగ్రెస్లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభకు జరిగిన మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్లకే మెజారిటీ దక్కడం తెలిసిందే. ► గత జనవరిలో జరిగిన ఓటింగ్లో గెట్జ్ సారథ్యంలోని రైట్ వింగ్ వ్యతిరేకులను బుజ్జగించి మెకార్తీ కనాకష్టంగా స్పీకర్ అయ్యారు. ► అక్టోబర్ 11న కొత్త స్పీకర్ ఎన్నిక జరగాల్సి ఉంది. ► తాజా పరిస్థితుల నేపథ్యంలో మరోసారి పోటీకి మెకార్తీ ససేమిరా అంటున్నారు. ► రిపబ్లికన్లలో ఇంటి పోరు తీవ్రంగా సాగుతుండటంతో స్పీకర్ అభ్యరి్థపై ఏకాభిప్రాయం కష్టంగానే కనిపిస్తోంది. ► ప్రస్తుతానికి రిపబ్లికన్ నేతలు స్టీవ్ స్కలైస్ (లూసియానా), టామ్ ఎమ్మర్ (మిన్నెసోటా) పేర్లు వినిపిస్తున్నాయి. -
అమెరికా రాజకీయాల్లో పెను సంచలనం
వాషింగ్టన్: అమెరికా రాజకీయాల్లో మరో సంచలనం నమోదు అయ్యింది. ఊహించని రీతిలో యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ మెక్కార్తి తన పదవిని కోల్పోయారు. ఆయనపై ప్రవేశపెట్టిన తీర్మానానికి motion to vacate.. సొంత పార్టీ రిపబ్లికన్ సభ్యులు మద్దతు ప్రకటించడం గమనార్హం. తద్వారా అమెరికా 234 ఏళ్లలో తొలిసారిగా స్పీకర్ ఓటింగ్ ద్వారా తొలగింపు పరిణామం చోటు చేసుకున్నట్లయ్యింది. అధికారిక డెమొక్రట్స్కు సహకరిస్తున్నారనే ప్రధాన ఆరోపణపై రిపబ్లికన్లు ఆయనపై మంటతో ఉన్నారు. ఈ క్రమంలోనే డెమొక్రట్స్ ఆయనకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టారు. మంగళవారం జరిగిన ఓటింగ్లో తీర్మానానికి అనుకూలంగా 216 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 210 ఓట్లు పడ్డాయి. ఎనిమిది మంది రిపబ్లికన్ రెబెల్స్ ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు. అందులో రిపబ్లికన్ల రెబల్ గ్రూప్ నేత మ్యాట్ గాయెట్జ్ కూడా ఉన్నారు. డెమొక్రట్స్తో రెబల్స్ మెక్కార్తి వైఖరిపై రిపబ్లికన్లు చాలాకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. అధ్యక్షుడు జో బైడెన్పై (Joe Biden) అభిశంసన విచారణకు అనుమతి మంజూరు చేయడంలోనూ ఆయన అలసత్వం ప్రదర్శించడంపై రగిలిపోయారు. అయితే అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతుండడం, ట్రంప్పై న్యాయపరమైన చిక్కులు తదితరాలతో సంయమనం పాటించారు. ఈ క్రమంలో.. ప్రభుత్వ షట్డౌన్ను నివారించడానికి నిధులను పాస్ చేయడానికి డెమొక్రాట్లపై ఆయన ఆధారపడటాన్ని రిపబ్లికన్లలో కొందరు సహించలేకపోయారు. ఓటింగ్లో వ్యతిరేకంగా ఓటేసే ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ రోజు ఎవరూ ఆయన్ని నమ్మే పరిస్థితిలో లేరు అంటూ ఓటింగ్కు తర్వాత సభ్యులు నినాదాలు చేశారు. రిపబ్లికన్ రెబల్ మ్యాట్ గాయెట్జ్.. ఈ తీర్మానాన్ని ముందుండి నడిపించడం గమనార్హం. తద్వారా మెక్కార్తితో సుదీర్ఘకాలం వైరం ఉన్న గాయెట్జ్.. అదను చూసి దెబ్బ కొట్టినట్లయ్యింది. I will not seek to run again for Speaker of the House. I may have lost a vote today, but I fought for what I believe in—and I believe in America. It has been an honor to serve. https://t.co/4EMpOuwtzy — Kevin McCarthy (@SpeakerMcCarthy) October 3, 2023 ఎన్నిక కూడా ఉత్కంఠే 2022 మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీకి సెనేట్లో స్వల్ఫ ఆధిక్యం లభించింది. ఇక హౌజ్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్లో మాత్రం రిపబ్లికన్ పార్టీకి మెజార్టీ దక్కడంతో స్పీకర్ ఛాన్స్ దక్కింది. రిపబ్లికన్ పార్టీ తరపున కాలిఫోర్నియా 20th కాంగ్రెసియోనల్ డిస్ట్రిక్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారాయన. 58 ఏళ్ల ఈ మాజీ ఎంటర్ప్రెన్యూర్.. యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కు ఈ ఏడాది జనవరిలో 55వ స్పీకర్గా ఎన్నికయ్యారు. అయితే ఆయన ఎన్నిక ఏకగ్రీవం కాలేదు. 15 రౌండ్ల ఓటింగ్.. అతికష్టం మీద ఐదు రోజుల సమయం పట్టింది. ఓట్లకు ఓట్లు తగ్గించుకుంటూ పోగా.. చివరకు ఆయన స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ►చివరిసారిగా.. 1910లో తిరుగుబాటు తర్వాత జోసెఫ్ జి కెనాన్ను తొలగించేందుకు మోషన్ ప్రవేశపెట్టారు. కానీ, అది విఫలమైంది. ►ఇక 2015లోనూ జాన్ బోహెనర్ను తొలగించేందుకు ప్రతినిధి మార్క్ మెడోస్ మోషన్ ప్రవేశపెట్టగా.. బోహెనర్ రాజీనామాతో అది జరగలేదు. ►స్పీకర్ పదవికాలం రెండేళ్లు. కానీ, ఈలోపే మెక్కార్తి పదవిని కోల్పోయారు. తద్వారా.. అమెరికాలో 147 ఏళ్లలో అతితక్కువ కాలం స్పీకర్గా పని చేసిన మూడో వ్యక్తిగా మెక్కార్తి నిలిచారు. -
ఉగ్రవాద వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీకి లోక్సభ స్పీకర్ వార్నింగ్..
న్యూఢిల్లీ: బీఎస్పీ ఎంపీని కించపరిచేలా పార్లమెంట్లో బీజేపీ సభ్యుడు రమేష్ బిధూరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీ ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన్ను సస్పెండ్ చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. లోక్సభ స్పీకర్ సైతం బిధురి అనుచిత వ్యాఖ్యలపై అసంతృప్తి, ఆగ్రహం చేశారు. మరోసారి ఇలాంటి ప్రవర్తన పునరావృతం అయితే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చంద్రయాన్-3 మిషన్ విజయంపై చర్చ సందర్భంగా లోక్సభలో బిధురి మాట్లాడుతూ.. అమ్రోహా బీఎస్పీ ఎంపీ కున్వర్ డానిష్ అలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సౌత్ ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బిధూరి.. మైనార్టీ ఎంపీని ఉగ్రవాదిగా పేర్కొంటూ పదేపదే దూషణలు చేశారు. డానిష్ అలీని కించపరిచే వ్యాఖ్యలు చేస్తుండగా.. పార్టీ సహచరుడు, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్ నవ్వుతూ కనిపించారు. ఇలాంటి మాటలు పడటం బాధగా ఉంది బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై డానిష్ అలీ స్పీకర్కు లేఖ రాశారు. కొత్త పార్లమెంటు భవనం సాక్షిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమన్నారు. మీ నాయకత్వంలో మైనారిటీ ఎంపీగా నాకు ఇలాంటి మాటలు పడడం చాలా బాధగా ఉందంటూ లేఖలో పేర్కొన్నారు. ఆయనతోపాటు అధికార పార్టీ తీరుపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిధురిపై ఎంపీపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎంపీ తరపున క్షమాపణలు ఈ వివాదం అదుపు తప్పుతోందని గమనించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. బీజేపీ ఎంపీ తరపున క్షమాపణలు చెప్పారు. తన మాటల వల్ల విపక్షాలు బాధపడితే చింతిస్తున్నానమని అన్నారు. మరోవైపు స్పీకర్ కూడా బీజేపీ ఎంపీని హెచ్చరించారు. తన భాష, గౌరవాన్ని కాపాడుకోవాలని హితవుపలికారు. మరోసారి ఇలా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. బిధూరి ఉపయోగించిన పదాలను తీవ్రంగా పరిగణిస్తూ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు? సస్పెండ్కు డిమాండ్ అయితే క్షమాపణలు సరిపోదని, బిధురిని సస్పెండ్ చేయాలని లేదా అరెస్టు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఇది పూర్తిగా అవమానకరమని.. రాజ్నాథ్ సింగ్ క్షమాపణలు ఆమోదయోగ్యం కాదని, ఇది పార్లమెంటును అవమానించడమేనని పేర్కొన్నారు. అధికార దుర్వినియోగం క్షమించరానిది బిధూరిపై చర్యలు తీసుకోకుండా ‘మరోసారి పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని అనడం సిగ్గుచేటని లోక్సభ స్పీకర్పై నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నాయకుడు ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే ప్రతిపక్ష ఎంపీలు చేసిన చిన్న తప్పులకే సస్పెండ్ చేస్తారని.. తమ పార్టీ ఎంపీలు తప్పు చేస్తే చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. దుర్వినియోగం చేయడం క్షమించరానిదని అన్నారు. ఇదే బీజేపీ సంస్కృతి కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ స్పందిస్తూ.. బింధూరి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి భాష ఎప్పుడూ వినలేదని, పార్లమెంట్ లోపలా, బయటా ఇది వాడకూడదని తెలిపారు. ఇది కేవలం డానిష్ అలీనే కాకుండా తామందరిని అవమానించేలా ఉన్నాయన్నారు. కొత్త పార్లమెంటుకు బిధురీమాటలతోనే నాంది జరిగిందని.. ఇది బీజేపీ ఉద్దేశాలను తెలియజేస్తోందని విమర్శించారు. కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ క్షమాపణలు చెప్పడం కంటే బింధూరిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బిధూరిపై చర్యలు తీసుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ముస్లింలు, ఓబీసీలను వేధించడం బీజేపీ సంస్కృతిలో అంతర్భాగమని ఆమె ఆరోపించారు. చదవండి: ఉదయనిధి స్టాలిన్కు సుప్రీం నోటీసులు -
అవిశ్వాస తీర్మానానికి అనుమతిచ్చిన స్పీకర్
-
విపక్షాల అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ అనుమతి
-
అలా అయితే ‘ట్రిపుల్ ఇంజన్’లో మొత్తం వాళ్లే ఉన్నారుగా సార్! ఎలా?
అలా అయితే ‘ట్రిపుల్ ఇంజన్’లో మొత్తం వాళ్లే ఉన్నారుగా సార్! ఎలా? -
ఇరు‘సేన’లకూ నోటీసులు.. వారంలోగా బదులివ్వాలి: స్పీకర్
ముంబై: అనర్హత పిటిషన్ల వ్యవహారంలో శివసేన షిండే వర్గానికి చెందిన 40 మంది, యూబీటీ వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చినట్టు మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్ శనివారం వెల్లడించారు. వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లకు ఏడు రోజుల్లోగా బదులివ్వాల్సిందిగా కోరినట్టు వివరించారు. వీరిలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, యూబీటీ వర్గం నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే తదితరులున్నారు. గతేడాది శివసేనలో చీలిక అనంతరం ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎంబీటీ వర్గానికి చెందిన రుతుజా లాట్కేకు నోటీసులు ఇవ్వలేదు. శివసేన నియమావళి తాలూకు ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అందుకున్నట్టు, షిండేతో పాటు 16 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ త్వరలో మొదలవుతుందని స్పీకర్ శుక్రవారం వెల్లడించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. అయితే తమకింకా ఎలాంటి నోటీసులూ రాలేదని సేన ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి సంజయ్ షిర్సత్ తెలిపారు. షిండే వర్గంపై తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై వేగవంతంగా విచారణ జరిపేలా స్పీకర్ను నిర్దేశాలు జారీ చేయాలంటూ కొద్ది రోజుల క్రితం సేన (యూబీటీ) వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ‘గత రెండు నెలలుగా ఈ విషయంలో స్పీకర్ ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. అందుకే సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సి వచ్చింది’ అని యూబీటీ నేత అర్వింద్ సావంత్ చెప్పారు. ఇదీ చదవండి: అబద్ధాల బజార్లో దోపిడీ దుకాణం -
‘నేను–నాది’ అనే భావన వీడాలి
కాకినాడ కల్చరల్: నేను–నాది అనే భావ దరిద్య్రాలను విడిచిపెట్టినప్పుడే వ్యక్తులతోపాటు దేశం బాగు పడుతుందని పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రవచనకర్త డాక్టర్ గరికిపాటి నరసింహారావు అన్నారు. స్థానిక సూర్యకళామందిర్లో సరస్వతీగాన సభ ఆధ్వర్యంలో మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న నలదమయంతి చరిత్రపై గరికిపాటి ప్రవచనాలు ఆదివారంతో ముగిశాయి. నలదమయంతుల కథను ఆదర్శంగా తీసుకొని జీవిత పయనంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంతో నిలవాలని అన్నారు. నలుడు అడవిలో దమయంతిని విడిచి వెళ్లిన తర్వాత ఆమె పడిన కష్టాలను వివరించారు. సుందర రూపుడయిన నలుడు అడవిలో పాముకాటుకు గురై నల్లగా మారిపోవడం, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నలుడు, బాహుకుడనే పేరుతో ఋతుపర్ణ మహారాజు వద్ద వంటవానిగా చేరిన ఘట్టాలను వివరించారు. కష్టాలలో కూడా తనకు ఉన్న అవకాశాన్ని ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలో నలుడి వ్యక్తిత్వం తెలుపుతోందని వివరించారు. చివరకు ఇంద్రుని దయంతో నలుడు పూర్వ రూపం పొంది తన రాజ్యాన్ని దక్కించుకొన్న ఘట్టాలను వివరించారు. ధైర్యంగా బతకాలి, సంతోషంగా మరణించాలని అన్నారు. అహంకారం, మమకారం రెండు ప్రమాదాలే అన్నారు. కష్టం వచ్చిందంటే వెనుక సుఖం వస్తోందని సూచన అని వివరించారు. జీవితంలో కష్టాలు పెరిగాయి అంటే అర్థం సుఖాలు రానున్నాయని భావించాలి తప్ప జీవితం ముగిసిపోయిందని అధైర్య పడరాదన్నారు. అలాగే ఎండలు మండిపోతున్నాయంటే వర్షాలు బాగా పడతాయని సూచన అని మండుతున్న ఎండలపై చమత్కరించారు. అనంతరం సరస్వతీ గాన సభ సభ్యులు నరసింహరావును ఘనంగా సత్కరించారు. గాన సభ అధ్యక్షుడు కేవీఎస్ ఆంజనేయమూర్తి, కార్యదర్శి పేపకాయల రామకృష్ణ, ఉపాధ్యక్షులు ఎల్.సత్యనారాయణ్, నారాయణ్ మురళి, మునుగంటి వెంకట్రావు, శ్రీరామచందరమూర్తి, ఎస్కేవీడీ వెంకట్రావు, పెద్దాడ సూర్యకుమారి, చావలి సూర్యకుమారి పాల్గొన్నారు. -
Karnataka: అసెంబ్లీ స్పీకర్గా ఖాదర్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్గా మలయాళీ కాంగ్రెస్ నేత యూటీ ఖాదర్ సోమవారం నామినేట్ అయ్యారు. ఆయన మంగళవారం ఉదయం ఈ పదవికి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్లు అధినేత ఖాదర్కు మద్దతుగా నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయనున్నారు. ఖాదర్ విధాన సభ ఎన్నికల్లో ఐదుసార్లు విజయం సాధించారు. ఖాదర్ నేపథ్యం.. ఆయన కేరళలోని కాసర్గోడ్లోని ఉప్పల ప్రాంతానికి చెందినవాడు. మూలాలు కాసర్గోడ్లో ఉన్నప్పటికీ పుట్టి పెరిగింది అంతా మంగళూరులోనే. ఖాదర్ గత కర్ణాటక అసెంబ్లీలో ఉప ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాదర్ దాదాపు 22, 790 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి సతీష్ కుంపలాపై విజయం సాధించారు. అంతేగాదు అంతకమునుపు సిద్ధరామయ్య ప్రభుత్వం హయాంలో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఆరోగ్యం, ఆహారం పౌర సరఫరాల మంత్రిగా కూడా పనిచేశారు. కాగా, ఖాదర్ను స్పీకర్గా ప్రతిపాదించడం బట్టి కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సంఘాల నాయకులకు అవకాశాలు కల్పించడంపై దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ముఖ్యమైన స్థానాల్లో తమ ప్రాతినిధ్యాన్ని కాపాడుకునేలా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. (చదవండి: 'ది కేరళ స్టోరీ' సినిమా చూసొచ్చి.. బాయ్ఫ్రెండ్పై కేసు పెట్టిన మహిళ) -
ఈ గిటార్ చాలా స్మార్ట్ గురూ..!.. ధర ఎంతంటే?
ఫొటోలో కనిపిస్తున్న గిటార్ సాదాసీదా గిటార్ కాదు. ఇది చాలా స్మార్ట్ గిటార్. చైనాకు చెందిన బహుళజాతి సంస్థ ‘ఎన్యా ఇంటర్నేషనల్’ ఇటీవల ఈ ఆల్ ఇన్ వన్ స్మార్ట్ గిటార్ను మార్కెట్లోకి తెచ్చింది. బిల్టిన్ ప్రీయాంప్, 50 వాట్ల బ్లూటూత్ స్పీకర్ ఈ గిటార్ ప్రత్యేకతలు. ఈ గిటార్ వాయిస్తున్నప్పుడు బ్లూటూత్ స్పీకర్ ద్వారా ఇతర సంగీత పరికరాలను కనెక్ట్ చేసుకోవచ్చు. దీనిని స్మార్ట్ఫోన్ యాప్కు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సోలో కచేరీలకు, గ్రూప్ బ్యాండ్ కార్యక్రమాలకు కూడా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది నాలుగు రంగుల్లో దొరుకుతోంది. దీని ధర 900 డాలర్లు (రూ.74,007) మాత్రమే చదవండి👉 రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కేంద్రం ఆమోదిస్తే.. త్వరలో -
కలిస్తే ఖబడ్దార్.. తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన చైనా
బీజింగ్: తైవాన్కు చైనా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ ప్రస్తుతం దౌత్యపరమైన ఒప్పందాల కోసం మధ్యఅమెరికాలో పర్యటిస్తున్నారు. అయితే.. దేశ అంతర్గత వ్యవహారాలను ఈ పర్యటనలో అగ్రరాజ్యంతో చర్చిస్తే.. చూస్తూ ఊరుకోబోమని డ్రాగన్ హెచ్చరించింది. అంతేకాదు.. పర్యటనకు ముందు సాయ్ చేసిన వ్యాఖ్యలను ధిక్కార స్వరంగా భావిస్తున్నామని స్పష్టం చేసింది. సాయ్ ఇంగ్-వెన్ పర్యటనకు ముందు మాట్లాడుతూ.. తైవాన్కు ప్రపంచంతో సంబంధాలు కొనసాగించే హక్కు ఉందని, బయటి శక్తులు(చైనాను ఉద్దేశించి..) ఈ మేరకు ఎలాంటి ప్రభావం తమపై చూపలేదంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు ఆమె మధ్యలో కాలిఫోర్నియాను సందర్శించాల్సి ఉండగా.. యూఎస్ హౌజ్ స్పీకర్ కెవిన్ మెక్కార్థీతో భేటీ అవుతారనే సమాచారం అందుతోంది. అయితే.. ఈ భేటీ పరిణామంపై డ్రాగన్ కంట్రీ తీవ్రంగా స్పందించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. ఒకవేళ తైవాన్ అధ్యక్షురాలు గనుక అమెరికా చట్టసభ స్పీకర్ను కలిస్తే మాత్రం పరిణామాలను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని, ఇది చైనా సార్వభౌమత్వాన్ని దెబ్బ తీసే అంశంగా భావించక తప్పదని పేర్కొంది. మరోవైపు సాయ్ ఇంగ్-వెన్ వ్యాఖ్యపైనా చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలను, చర్యలను బీజింగ్ వర్గాలను రెచ్చగొట్టడం కిందే చూడాల్సి వస్తుందని, ప్రతీకార చర్యలు తప్పవని, తర్వాతి పరిణామాలకు తైవాన్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
టీడీపీ నేతల దాడి: ‘ఇది బ్లాక్ డే.. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లోనే’
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సభలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. సభ సజావుగా సాగకుండా అడ్డతగిలి.. స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యుల అనుచిత ప్రవర్తించారు. టీడీపీ నేతలు పేపర్లు చించి స్పీకర్పైకి విసరడంతో పాటు ప్లకార్డ్ను ఆయనకు అడ్డుగు పెట్టిన సభలో గందరగోళ పరిస్థితికి దారి తీశారు. స్పీకర్కు రక్షణగా పోడియం వద్దకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మోహరించగా, ఈ క్రమంలో వైఎస్సార్సీపీ సభ్యులపై టీడీపీ నేతల దాడికి దిగారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు దీనిపై స్పందించారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ.. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు నాయుడు బీసీలకు ఎస్సీలకు గొడవ పెట్టాలని భావిస్తున్నారు.. అందులో భాగంగానే ఎస్సీ ఎమ్మెల్యేలను కావాలని రెచ్చగొట్టి పంపుతున్నారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం అయిన నాపై దుషణకు దిగారు. బాల వీరాంజనేయ స్వామి మాట్లాడితే ఆయనకు మిగిలిన టీడీపీ సభ్యులు మద్దతు పలికారు. ఎవరైతే మద్దతు పలికారు వారందరి పైన అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా మాట్లాడుతూ.. సభ సజావుగా జరగకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని, చంద్రబాబు డైరెక్షన్లోనే ఈ గలాటా జరిగిందని ధ్వజమెత్తారు. ‘ఈ రోజు మితిమీరిపోయింది.. డోలా వీరాంజనేయులు స్పీకర్ పై దాడి చేశారు, నేను, సుధాకర్ బాబు అడ్డుకోవడానికి వెళ్తే మాపైనా దాడి చేశారని’ మండిపడ్డారు. సభాపతిని టీడీపీ అవమానించింది, బీసీ అయిన సభాపతిపై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించిన ఆయన టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు. సుధాకర్ బాబు స్పందిస్తూ.. ఇది బ్లాక్ డే.. స్పీకర్ పై దాడి చేయడానికి ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. టీడీపీ ఎమ్మెల్యే స్పీకరపై దాడి దిగారు.. అడ్డుకోవడానికి వెళ్తే తనపై కూడా దాడి చేశారన్నారు. చంద్రబాబు దిగజారి ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. -
ప్రతినిధుల సభ స్పీకర్గా మెక్కార్తీ.. 15వ రౌండ్లో తేలిన ఫలితం
వాషింగ్టన్: అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్)లోని ప్రతినిధుల సభ నూతన స్పీకర్గా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కెవిన్ మెక్కార్తీని ఎన్నికయ్యారు. గత మూడు రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి ముగింపు పలుకుతూ మెక్కార్తీకి మద్దతు తెలిపారు నేతలు. రిపబ్లికన్ పార్టీ నేతల మధ్య అంతర్గత కలహాలతో 15 రౌండ్ల హైడ్రామా తర్వాత స్పీకర్ను ఎన్నుకున్నారు. ప్రతినిధుల సభ స్పీకర్గా ఎన్నికయ్యేందుకు ఈ 57 ఏళ్ల కాలిఫోర్నియన్ నేత మెక్కార్తీకి మొదటి రౌండ్లోనే సులభంగా మెజారిటీ రావాల్సింది. కానీ, పార్టీలో అంతర్గతంగా నెలకొన్న విభేదాల కారణంగా కొంత మంది నేతలను ఆయనను వ్యతిరేకిస్తూ వచ్చారు. అమెరికా కాంగ్రెస్ 160 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యంత సుదీర్ఘ కాలం సాగిన స్పీకర్ ఎన్నికగా నిలించింది. మెక్కార్తీని స్పీకర్గా ఎన్నుకునేందుకు రిపబ్లికన్ నేతలు 15 రౌండ్ల ఓటింగ్ వరకు తీసుకెళ్లారు. ఇదీ చదవండి: స్పీకర్ పదవికి పోటీలో డొనాల్డ్ ట్రంప్.. వచ్చింది ఒకే ఒక్క ఓటు -
TRS పేరును BRS పార్లమెంటరీ పార్టీగా మార్చండి
-
మీ కూతురుతో కలిసి పఠాన్ సినిమా చూడండి: షారూక్కు మంత్రి సవాల్
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్, దీపికా పదుకొనె నటించిన ‘పఠాన్’ సినిమాపై విడుదలకు ముందే వివాదాలు చుట్టుముట్టాయి. వచ్చే జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్న పఠాన్ మూవీపై దేశ వ్యాప్తగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల విడుదలైన సినిమాలోని బేషరం రంగ్ పాటపై హిందూ సంఘాలతో పాటు బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘బాయ్కాట్ పఠాన్’ హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ పాట హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని విమర్శిస్తున్నారు. ఆ సాంగ్లో దీపిక, షారూఖ్ ధరించిన దుస్తుల్ని మధ్యప్రదేశ్ కాషాయ నేతలు తప్పుపడుతున్నారు. బేషరం రంగ్ అనే పాట టైటిల్, దాని అర్థం అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఇప్పటికే మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఈ పాటలో ఉన్న కాస్ట్యూమ్ కలుషితమైన మైండ్సెట్ను చాటుతుందని ఆయన ఆరోపించారు. పాటలో కొన్ని మార్పులు చేయాలని లేదంటే ఈ సినిమాను విడుదల చేయకుండా బహిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. తాజాగా పఠాన్ చిత్రాన్ని మధ్యప్రదేశ్ స్పీకర్ గిరీష్ గౌతమ్ వ్యతిరేకించారు. షారుక్ఖాన్ తన కూతురితో కలిసి ఈ సినిమాను చూడాలని సవాల్ విసిరారు. కూతురితో పఠాన్ చిత్రాన్ని చూసినట్లు ప్రపంచానికి తెలియజేస్తూ ఓ ఫోటో సోషల్ మీడియాలో పోస్టు చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాక ఇలాంటి సినిమానే ప్రవక్తపై తీయాలని షారూక్కు స్పీకర్ గౌతమ్ చాలెంజ్చేశారు. కాగా మధ్యప్రదేశ్లో సోమవారం నుంచి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయిదు రోజులపాటు కొనసాగనున్న ఈ సమావేశాల్లో పఠాన్ అంశాన్ని అధికార బీజేపీ అసెంబ్లీలో చర్చకు తీసుకువచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రతిపక్ష నాయకుడు డాక్టర్ గోవింద్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి సురేష్ పచౌరితో సహా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా పఠాన్ చిత్రాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ సినిమా తమ విలువలకు విరుద్ధంగాఉందటూ విమర్శిస్తున్నారు. -
అధికారం దాహంతో చంద్రబాబుకు నిద్ర పట్టడంలేదు : స్పీకర్ తమ్మినేని
-
అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కాదు : స్పీకర్ తమ్మినేని
-
నాన్సీ పెలోసీ భర్తపై దాడి.. విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ భర్తపై దాడికి పాల్పడిన పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించాడు. శుక్రవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న పాల్ (82)పై అతను సుత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఇది రాజకీయ ప్రేరేపిత, ఉద్దేశపూర్వక దాడి అని శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీ బ్రూక్ జెంకిన్స్ వెల్లడించారు. ‘‘నాన్సీ ఎక్కడున్నారంటూ ఆరా తీశాడు. ఆమె కొన్ని రోజుల వరకు రాదని తెలుసుకుని పాల్ చేతులు కట్టేశాడు. కిందికి వెళ్లాలని ప్రయత్నించిన పాల్ను అడ్డుకున్నాడు. చివరికి రెస్ట్రూంకు వెళ్లేందుకు అంగీకరించాడు. రెస్ట్ రూం నుంచే పోలీసులకు పాల్ సమాచారమిచ్చారు. తర్వాత డేవిడ్ సుత్తితో పాల్ తలపై మోదాడు. పెనుగులాట జరుగుతుండగా పోలీసులు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు’’ అని చెప్పారు. ‘డెమోక్రాటిక్ పార్టీలోని అబద్ధాలాడే వారికి నాయకురాలు నాన్సీ. నిజం చెబితే వదిలేయాలని, లేదంటూ సుత్తితో మోకాళ్లు విరగ్గొట్టి, వీల్ చైర్లో కాంగ్రెస్కు తీసుకెళ్లాలనుకున్నా. అబద్ధాలు మాట్లాడితే ఫలితం ఎలా ఉంటుందో మిగతా సభ్యులకు చూపాలనుకున్నా అని డేవిడ్ విచారణలో తెలిపాడు’అని జెంకిన్స్ వెల్లడించారు. నాన్సీ తర్వాత మరో కాంగ్రెస్ సభ్యుడిపైనా దాడి చేయాలనుకున్నట్లు చెప్పిన డేవిడ్ ఆ వివరాలు మాత్రం వెల్లడించలేదన్నారు. అంతేకాదు, పాల్, డేవిడ్లకు మధ్య ఇంతకు ముందు ఎటువంటి పరిచయం కూడా లేదని జెంకిన్స్ చెప్పారు. పెలోసీ ఇంట్లోకి దొంగతనంగా చొరబడిన డేవిడ్ డిపపే(42) వెంట సుత్తితోపాటు చేతులను కట్టేసేందుకు జిప్ టేప్, తాడు వెంట తీసుకెళ్లాడు. కెనడా పౌరుడైన డేవిడ్ 2000వ సంవత్సరం నుంచి అమెరికాలో ఉంటున్నాడు.అతడి వీసా గడువు కూడా ఎప్పుడో ముగిసిపోయిందని అధికారులు పేర్కొన్నారు. -
నాన్సీ పెలోసీ భర్తపై పైశాచికంగా దాడి
శాక్రమెంటో: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ అయిన నాన్సీ పెలోసీ భర్త పాల్ పెలోసీపై దాడి జరిగింది. ఈ దాడిలో పాల్ పెలోసీ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం.. శుక్రవారం ఉదయం సమయంలో కాలిఫోర్నియాలోని ఆమె నివాసంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్పీకర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తైవాన్లో ఆమధ్య నాన్సీ పెలోసీ పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆపై ఆమెపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది చైనా. ఇక ప్రస్తుత దాడి సమయంలో ఆమె ఇంట్లో లేరని తెలుస్తోంది. డెమొక్రట్స్తో కలిసి ఆమె నవంబర్8న జరగబోయే మధ్యంతర ఎన్నికల కోసం ఫండ్రైజింగ్ క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు. ఘటన సమయంలో ఆమె వాషింగ్టన్లో ఉన్నారు. పోలీసుల అదుపులోనే దుండగుడు ఉండగా.. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆగంతకుడి దాడిలో పాల్ పెలోసీ(82).. ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది. సుత్తితో ఇంట్లోకి ప్రవేశించాడు ఆగంతకుడు. అయితే దాడికి ఆ సుత్తిని ఉపయోగించాడా? అనేది తెలియాల్సి ఉంది. పాల్ పెలోసీ పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. శాన్ఫ్రాన్సిస్కో(కాలిఫోర్నియా స్టేట్)కు చెందిన పాల్ పెలోసీ ప్రముఖ వ్యాపారవేత్త. నాన్సీ-పాల్కు 1963లో వివాహం జరిగింది. ఈ జంటకు ఐదుగురు సంతానం. ఈ కుటుంబం మొత్తం ఆస్తిపాస్తుల ద్వారా నాన్సీ పెలోసీ మొత్తం కాంగ్రెస్ సభ్యుల్లో అత్యంత ధనవంతురాలిగా నిలవడం విశేషం. బాల్టిమోర్కు చెందిన నాన్సీ పెలోసీ.. 1987 నుంచి శాన్ఫ్రాన్సిస్కో తరపున కాంగ్రెస్కు ఎన్నికవుతూ(మధ్య మధ్యలో కాలిఫోర్నియా, వాషింగ్టన్ నుంచి కూడా) వస్తున్నారు. అమెరికాలో పవర్ఫుల్ నేతల్లో పెలోసీ ఒకరు. ప్రతినిధుల సభకు స్పీకర్గా 2021లో ఆమె నాలుగో సారి ఎన్నికయ్యారు. పాతికేళ్లలలో తైవాన్ను సందర్శించిన అమెరికా అతిపెద్ద నేత ఈమెనే కావడం గమనార్హం. స్పీకర్ నాన్సీ పావెల్ భర్తపై దాడి ఘటనను యూఎస్ఐ, యూఎస్ కాపిటోల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో " స్ట్రెయిట్ టాక్ "
-
అలాంటివాళ్లు సభకు రావడం దురదృష్టకరం: ఏపీ స్పీకర్
సాక్షి, అమరావతి: పోడియంపైకి వచ్చి విపక్ష ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం బాధాకరమని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. అలాంటివాళ్లు సభకు రావడం దురదృష్టకరమన్నారు. అరాచకం సృష్టించేవాళ్లను చూస్తే బాధగా ఉందన్నారు. ఇలాంటి ఆగడాలను ఎక్కడో ఒక చోట అరికట్టాలని స్పీకర్ అన్నారు. సభ సమష్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. టీడీపీ సభ్యుల తీరుపై చర్యలకు ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేస్తున్నా. అరాచకం చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని స్పీకర్ అన్నారు. చదవండి: కరవు, బాబు ఇద్దరూ కవలలు: సీఎం జగన్ దౌర్జన్యం సరికాదు: అంబటి రాంబాబు ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలపాలని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ సభ్యులు దౌర్జన్యంగా ప్రవర్తించారన్నారు. నచ్చని అంశాలపై నిరసన తెలుపొచ్చు కానీ దౌర్జన్యం చేయడం సరికాదన్నారు. ఏ ఒక్కరోజూ సభ సజావుగా జరిగేందుకు టీడీపీ సభ్యులు సహకరించలేదని అంబటి రాంబాబు మండిపడ్డారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల రభస.. కాగా, అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు నానా రభస సృష్టించారు. పేపర్లు చించి స్పీకర్పైకి విసిరి కొట్టిన అనుచితంగా ప్రవర్తించారు. స్పీకర్ చైర్ వద్దకు వచ్చి దురుసుగా ప్రవర్తించారు. అసెంబ్లీ వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా టీడీపీ సభ్యుల తీరు మారలేదు. సభకు పదే పదే ఆటంకం కలిగించడంతో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. -
ఏపీ అసెంబ్లీ సమావేశాలపై మండలి ఛైర్మన్, స్పీకర్ సమీక్ష
సాక్షి, అమరావతి: ఈ నెల 15వ తేదీ నుంచి జరుగనున్న ఆంధ్రప్రదేశ్ శాసన మండలి, శాసన సభా సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు, శాసనసభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్ని శాఖల కార్యదర్శులను, పోలీస్ అధికారులను కోరారు. గత సమావేశాల్లో ప్రస్తుతం సభ్యులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలను సకాలంలో అందజేయాలని అన్ని శాఖల కార్యదర్శులను వారు కోరారు. చదవండి: దమ్ముంటే అసెంబ్లీకి రా.. చంద్రబాబుకు పార్థసారథి సవాల్ సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా పటిష్టమైన బందో బస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. బుధవారం.. ఆంధ్రప్రదేశ్ శాసన సభ కమిటీ హాల్లో పలు శాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులతో వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో వారిరువురూ పాల్గొని సభ్యుల ప్రశ్నలకు సకాలంలో సరైన సమాధానాలను అందజేయడం, పోలీస్ బందో బస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్బంగా కొయ్యే మోషేను రాజు మాట్లాడుతూ శాసన మండలి సభ్యులు అడిగే ప్రశ్నలకు సకాలంలో సరైన సమాధానాలను అందజేస్తూ వారి గౌరవాన్ని కాపాడాల్సి బాధ్యత అధికారులపై ఉందన్నారు. అటువంటి సత్సంప్రదాయం కొనసాగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపాలని ఆయన కోరారు. శాసనసభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ ప్రజల యావత్ దృష్టి ఈ నెల 15 నుండి జరుగబోవు శాసన సభా సమావేశాలపై ఉంటుందని, వాటికి ఎంతో ప్రత్యేకత ఉందనే విషయాన్ని అధికారులు అందరూ గుర్తించాలన్నారు. సమాచార, సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ సమావేశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజు, చీఫ్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి, డీజీపీ కే. రాజేంద్రనాథ్ రెడ్డి, శాసనసభ సెక్రటరీ పి.బాలకృష్ణమాచార్యులు, శాసన మండలి ఓఎస్డీ కే.సత్యనారాయణరావు తదితరులతో పాటు పలు శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
ఈటలపై సస్పెన్షన్ వేటు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమా వేశాల సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావే శానికి బీజేపీకి ఆహ్వానం లేకపోవడం క్రమంగా రాజకీయ వేడిని పెంచుతోంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పీకర్ మరమ నిషి అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఈ వ్యాఖ్యలను ఖండించడంతో పాటు ఈటల బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన విష యం తెలిసిందే. ఈటల క్షమాపణ చెప్పకుంటే నిబంధనల మేరకు వ్యవహరిస్తామని వేముల ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈట లను అసెంబ్లీ నిబంధనలను అనుసరించి సస్పెండ్ చేసేందుకు ఉన్న అవకాశాల పరిశీ లన జరుగుతున్నట్లు తెలిసింది. మంగళవా రం వాయిదా పడిన వానాకాల సమావేశాలు తిరిగి వచ్చే సోమవారం ప్రారంభం కానుండగా, ఈటల చేసిన వ్యాఖ్యలు ఆరోజు సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. ఈటలపై చర్యలకు డిమాండ్ చేసే చాన్స్ ‘కేసీఆర్ చెప్తే చేసే మర మనిషిలా కాకుండా గతంలో ఉన్న సభా సంప్రదాయాలను స్పీకర్ కొనసాగించాలి’ అంటూ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అయితే బుధవారం మీడియాతో మాట్లాడిన ఈటల.. స్పీకర్ తమ హక్కులు కాపాడాలని కోరారు. మరమనిషి అనే పదం నిషిద్ధమైనది ఏమీ కాదని ఎమ్మెల్యే రఘునందన్రావు, స్పీకర్ పదవికి కళంకం తెస్తున్న పోచారం శ్రీనివాస్రెడ్డిపై చర్యలు తీసుకోవా లని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ వేర్వేరు చోట్ల వ్యాఖ్యానించారు. బీజేపీ వైఖరి నేప థ్యంలో ఈటలపై అసెంబ్లీ వేదికగా చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసే అవ కాశముంది. సభ, సభా కమిటీలు, సభ్యుల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించకుండా అనుసరించాల్సిన సభా సంప్రదాయాలను టీఆర్ఎస్ ఉటంకిస్తోంది. సభ గౌరవం కాపా డేందుకు పలు కమిటీలు, నియమాలు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈటల వ్యాఖ్యల ఎపిసోడ్ను స్పీకర్ ద్వారా అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ ముందుకు తీసుకువెళ్లాలని టీఆర్ఎస్ భావిస్తోంది. తీర్మానం ద్వారా ఎథిక్స్ కమిటీకి.. నిబంధనల ప్రకారం.. మంత్రులు సహా శాససనసభ్యులు ఎవరైనా సభ బయట అనైతికంగా ప్రవర్తించినా, మాట్లాడినా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లవచ్చు. ఈ మేరకు ఫిర్యాదును స్పీకర్ ఒక తీర్మా నం ద్వారా ఎథిక్స్ కమిటీ (నైతిక విలు వల కమిటీ)కి అప్పగించి విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరతారు. ప్రస్తు తం ఈ నిబంధన మేరకు స్పీకర్ విషయమై ఈటల చేసిన వ్యాఖ్యలను సభ దృష్టికి టీఆర్ఎస్ తీసుకెళ్లే అవకాశం ఉంది. నిబంధనల మేరకు ఈటలను అవస రమైతే సభ నుంచి సస్పెండ్ చేసే అవకా శముంటుందని టీఆర్ఎస్ శాసనసభా పక్షం వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన ఈటల రాజేందర్, రఘునందన్రావు, రాజాసింగ్లను సమావేశాలు ముగిసేంత వరకు సభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు.. ఈటల రాజేందర్కు నోటీసులు? -
స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి ఎంఐఎం లేఖ
-
స్పీకర్కు ఎంఐఎం లేఖ.. రాజాసింగ్పై సంచలన కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి ఎంఐఎం లేఖ రాసింది. రాజాసింగ్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని పేర్కొంది. సెక్షన్ 41 సీఆర్పీసీ కింద నోటిస్ ఇవ్వలేదనే కారణంతోనే రాజాసింగ్కు బెయిల్ ఇచ్చారని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. చట్టప్రకారం మరోసారి రాజాసింగ్ను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చదవండి: Telangana: హీటెక్కిన స్టేట్..! హైదరాబాద్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఉద్దేశంతోనే రాజాసింగ్ వీడియో విడుదల చేశారని అసదుద్దీన్ మండిపడ్డారు. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో హైదరాబాద్లో సాప్ట్వేర్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాజాసింగ్ను అరెస్ట్ చేసి వీడియో శాంపిల్ తీసుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాగా, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చెలరేగిన దుమారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా.. రాజాసింగ్పై సస్పెన్షన్ వేటు వేసింది బీజేపీ. మరోవైపు రాజాసింగ్ వ్యాఖ్యలపై పాతబస్తీలోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. నాటకీయ పరిణామాల తర్వాత మంగళవారం రాత్రి రాజాసింగ్కు బెయిల్ దక్కిన నేపథ్యంలో.. భారీగా యువత ఓల్డ్సిటీలో రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ సమర్పించిన రాజగోపాల్ రెడ్డి
-
సాక్షి కార్టూన్ 15-7-2022
మన గొంతు నొక్కారు! మాట్లాడటానికేం మిగిలింది! -
అసెంబ్లీని సందర్శించిన ఛత్తీస్గఢ్ స్పీకర్
సాక్షి, హైదరాబాద్: అధికారిక పర్యటనలోభాగంగా ఛత్తీస్గఢ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ చరణ్దాస్ మహంత శుక్రవారం తెలంగాణ శాసనసభను సందర్శించారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు ఛత్తీస్గఢ్ స్పీకర్కు స్వాగతం పలికారు. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ నిర్వహణ తీరుతెన్నులపై వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పార్లమెంటరీ, లెజిస్లేటరీ సభల నిర్వహణలో రావాల్సిన మార్పులు, సభ్యుల పనితీరు తదితరాలపై చర్చించారు. శాసనసభ లాబీతోపాటు సమావేశ మందిరాన్ని కూడా మహంత పరిశీలించారు. సుమారు గంటపాటు పోచారం, సుఖేందర్రెడ్డితో చరణ్దాస్ భేటీ అయ్యారు. అనంతరం ఆయనకు తెలంగాణ అసెంబ్లీ తరఫున జ్ఞాపికను బహూకరించారు. గతంలో కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రిగా పనిచేసిన చరణ్దాస్ మహంత, ఛత్తీస్గఢ్ హోం, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగానూ పనిచేశారు. -
సరిగమలు ఎక్కడంటే అక్కడ.. శాస్త్రవేత్తల అద్భుత సృష్టి!
శబ్ధం, సంగీతం విషయంలో టెక్నాలజీ ఎవాల్వ్ అవుతూ వస్తోంది. గ్రామోఫోన్తో మొదలు పెట్టి ఐపాడ్ వరకు సంగీతం క్వాలిటీ పెరుగుతుంటే సంగీతాన్ని అందించే పరికరాల పరిమాణం తగ్గుతూ వస్తోంది. తాజాగా అమెరికాకు చెందని మసాచుసెట్స్ యూనివర్సిటీలో జరిగిన పరిశోధన ఫలితాలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. స్పీకర్లు, ట్వీటర్లు, వూఫర్లు వంటి హంగామా ఏమీ లేకుండా కేవలం ఒక కాగితం సైజు పరిమాణంలో ఉండే పరికరాన్ని రూపొందించారు మసాచుసెట్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. కాగితంలా సన్నగా, అతి తక్కువ బరువుతో ఉండే ఈ పరికరాన్ని ఎక్కడంటే అక్కడ అమర్చుకోవచ్చు. ఏం చక్క సంగీతాన్ని ఎంజాయ్ చేయవచ్చు,. వాల్పేపర్ స్పీకర్లకు సంబంధించిన పరిశోధనలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయంటున్నారు మసాచుసెట్స్ పరిశోధకులు. అయితే పేపర్ థిన్ స్పీకర్ల విషయంలో కీలక దశను అధిగమించామని.. ఇకపై క్వాలిటీ, డ్యూరబులిటీని పెంచడంపైనే దృష్టి పెడతామంటున్నారు. మరికొద్ది రోజుల్లో మ్యూజిక ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో రివల్యూషనరీ మార్పులు అయితే వస్తాయంటున్నారు. చదవండి: యాపిల్ నుంచి కొత్తగా స్మార్ట్ బాటిల్స్! ధర ఎంతంటే? -
Pakistan: పాక్ అసెంబ్లీలో ఓటింగ్పై సస్పెన్స్
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. శనివారం పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రధాని ఇమ్రాన్ఖాన్పై అవిశ్వాస తీర్మానంపై కాసేపట్లో ఓటింగ్ జరుగనుంది. అవిశ్వాస తీర్మానం సందర్భంగా అసెంబ్లీకి 176 మంది ఎంపీలు ప్రతిపక్ష నేతలు హాజరు కాగా, అధికార పార్టీ పీటీఐ పార్టీ నుంచి కేవలం 27 మంది ఎంపీలు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. కాగా, అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్కు మిత్రపక్షాల నేతలు హ్యాండ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ మరోసారి అసెంబ్లీకి గైర్హాజరయ్యారు. పాక్ సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ఇమ్రాన్ సభకు వస్తారని అంత భావించినప్పిటికీ ప్రధాని మాత్రం రాలేదు. దీంతో అవిశ్వాస తీర్మానం కంటే ముందే ఇమ్రాన్ రాజీనామా చేస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవిశ్వాస తీర్మానం సందర్భంగా సభలో ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశానుసారం మీరు (స్పీకర్) సభా కార్యకలాపాలను నిర్వహిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. రాజ్యాంగం, చట్టం కోసం నిలబడాలని స్పీకర్ అసద్ ఖైజర్ను కోరారు. Pakistan National Assembly Speaker Asad Qaiser adjourns the House proceedings till 1230pm local time. (Source: PTV) pic.twitter.com/6MAeahkoAz — ANI (@ANI) April 9, 2022 ఈ సందర్బంగా పాక్ విదేశాంగ శాఖ మంత్రి, పీటీఐ నేత షా మహమూద్ ఖురేషీ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు అవిశ్వాసం తీర్మానం పెట్టడం వారికి రాజ్యంగం కల్పించిన హక్కు అని అన్నారు. ఈ తీర్మానాన్ని ప్రభుత్వం సమర్థించడం ప్రభుత్వం బాధత్య అని పేర్కొన్నారు. వీరు మాట్లాడిన అనంతరం సభలో గందరగోళం జరిగింది. అధికార పార్టీ నేతలు అవిశ్వాస తీర్మానంపై చర్చకు రావాలని పట్టుబట్టారు. దీంతో ప్రతిపక్ష నేతలు అవిశ్వాసంపై ఓటింగ్ జరపాలని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో స్పీకర్ సభను మధ్యాహ్నం 12.30 గంటలకు వాయిదా వేశారు. మళ్లీ మధ్యాహ్నం ఒంటి గంటకు సభ ప్రారంభం కానుంది. -
ఇది గౌరవ సభ.. రౌడీల్లా ప్రవర్తించొద్దు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ సభ్యుల తీరు మారలేదు. జంగారెడ్డిగూడెంలో మద్యం మరణాలంటూ అసత్య ఆరోపణలతో సోమవారమూ గందరగోళం సృష్టించారు. వారి నిరసనలు శృతి మించడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఉన్న టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేశారు. సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు పోడియం చుట్టిముట్టి నినాదాలు చేశారు. వారి నిరసనల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించారు. పది నిమిషాల తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, అనగాని సత్యప్రసాద్ స్పీకర్కు రక్షణగా ఉన్న సిబ్బందిని తోసేశారు. ఇది సరైన పద్థతి కాదని, వారి స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ హితవు చెప్పారు. అయినా వినకపోవడంతో మార్షల్స్ వచ్చి టీడీపీ సభ్యులను వారి స్థానాల వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి వారు వీరంగం సృష్టించారు. ఖాళీ వాటర్ బాటిళ్లు, పుస్తకాలతో బల్లలను చరుస్తూ, స్పీకర్ను నిందిస్తూ నినాదాలు చేశారు. దీనిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది గౌరవ శాసన సభ. బజారు కాదు. మీరు వీధి రౌడీలు కారు. ఇలా ప్రవర్తించడం సరికాదు. సభకు, స్పీకర్ స్థానానికి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. సంస్కారం, మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారు. మత్స్యకారుల సమస్యలు, మహిళా సంక్షేమం వంటి ముఖ్యమైన అంశాలపై చర్చ జరుగుతుంటే ఈ విధంగా ప్రవర్తించడం సరికాదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యులందరినీ ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. టీడీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిన అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. ‘ప్రతి రోజూ సభను అడ్డుకోవడమే లక్ష్యంగా వస్తున్నారు. గత వారం రోజులుగా మంచి అంశాలపై చర్చలో పాల్గొనలేకపోయారు. కనీసం గౌరవ సభకైనా గౌరవం ఇవ్వాలిగా. గవర్నర్కు, స్పీకర్కు, ప్రజలు ఎన్నుకున్న సీఎంకు కూడా గౌరవం ఇవ్వడంలేదు. ఇలాంటి ప్రవర్తనకు అడ్డుకట్ట వేయాల్సిందే. స్పీకర్కు ఉన్న విచక్షణాధికారాలు ఉపయోగించడం చాలా చిన్న పని. కానీ సభను గౌరవంగా నడపాలని చూస్తుంటే అల్లరి మూకలు మాదిరిగా బాటిళ్లు, పుస్తకాలు చించుతూ ఇష్టం వచ్చినట్లు కేకలు వేయడం సహించలేనిది. ఎన్ని రూలింగ్స్ ఇచ్చినా ఉపయోగం లేకుండా పోతోంది. ఇటువంటి ప్రవర్తన పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవడానికి సభ్యులు ఎథిక్స్ కమిటీకి సూచనలు ఇవ్వాలి’ అని కోరారు. చదవండి: ఏపీ ప్రభుత్వ చొరవ.. అమూల్ రాకతో పాలకు మంచి ధర కఠిన చర్యలు తీసుకోండి టీడీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని, సభ ఔన్నత్యాన్ని కాపాడాలని మంత్రి కన్నబాబు కోరారు. ‘చంద్రబాబు సభను అకారణంగా బాయ్కాట్ చేసి ఎక్కడో కూర్చొని సభలో రాజకీయాలు చేస్తున్నారు. బాబులాంటి దిగజారుడు రాజకీయాలు చేసే నాయకుడు ఎవరూ ఉండరు. దుర్మార్గంగా సభా సమయాన్ని అడ్డుకుంటున్నారు. ఎథిక్స్ కమిటీలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి. టీడీపీ సభ్యులను కంట్రోల్ చేయకపోతే సభ ఔన్నత్యం దెబ్బతింటుంది’ అని కన్నబాబు అన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ భక్తులు అయ్యప్పమాల వేసుకుంటే ప్రభుత్వం ఆదాయం పడిపోతుందంటూ బహిరంగంగా భాదపడిన వ్యక్తికి లిక్కర్ అమ్మకాలపై మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. గత ప్రభుత్వం విచ్చలవిడిగా కొత్త బ్రాండ్లు, డిస్టలరీలకు అనుమతినిచ్చి రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించిందని, ఇప్పుడు కొత్త నాటకాలకు తెరతీస్తున్నారని విమర్శించారు. -
AP Assembly: టీడీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ రూలింగ్
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాం కొత్త రూల్ ప్రవేశపెట్టారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనకు సంబంధించి స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. ఇకపై సెల్ఫోన్లు అసెంబ్లీలోకి తీసుకురావొద్దని ఆదేశాలిచ్చారు. లోపల జరిగే యాక్టివిటీ టీడీపీ రికార్డ్ చేస్తోందని స్పీకర్ అన్నారు. ఇకపై ఈ రూల్ అందరికీ వర్తిస్తుందని.. సభ్యులు సభా సంప్రదాయాలను పాటించాలని స్పీకర్ తమ్మినేని పేర్కొన్నారు. చదవండి: వేసవిలో 24/7 నాణ్యమైన విద్యుత్ ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ శాసన సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేశారు. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించడంతో ఒక రోజు పాటు 11 మంది టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. సత్యప్రసాద్, చినరాజప్ప, రామ్మోహన్, అశోక్, సాంబశివరావు, గొట్టిపాటి రవి, రామరాజు, గణబాబు, భవానీ, జోగేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణలను సస్పెన్షన్ చేశారు. -
ఎమ్మెల్యేల సస్పెన్షన్పై స్పీకర్దే తుది నిర్ణయమన్న హైకోర్టు
-
బిహార్ సీఎం స్పీకర్ మధ్య మాటల యుద్ధం: నిగ్రహం కోల్పోయిన్ నితీశ్ కుమార్
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అసెంబ్లీలో నిగ్రహాన్ని కోల్పోయారు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నలను లేవనెత్తతూ రాజ్యాంగాన్ని బహిరంగంగా ఉల్లంఘించారంటూ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా పై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ విజయ్ కుమార్ సిన్హాతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ నితీష్కుమార్ అతని బీజేపీ మిత్రపక్షం ప్రశ్నలు లెవనెత్తారు. దీంతో కలత చెందిన ముఖ్యమంత్రి నితీష్కుమార్ మీరు పదేపదే ఈ ప్రశ్నలనే లేవనెత్తడమే కాక అందర్నీ ఈ విషయంలోకి లాగుతున్నారంటూ మండిపడ్డారు. గతంలో ఎప్పడూ లేనివిధంగా ప్రవర్తస్తాన్నరంటూ కాస్త అత్యుత్సహాం ప్రదర్శించారు. అసలేం జరిగిందంటే ...సరస్వతీ పూజ వేడుకల సందర్భంగా కోవిడ్ పరిమితులను ఉల్లంఘించినందుకు కొంతమంది బీజేపీ మద్దతుదారులను అరెస్టు చేయడం జరిగింది. అయితే స్పీకర్ జోక్యం చేసుకునేందుకు యత్నించగా పోలీసులు ఆయనతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో సిన్హా పోలీసులపై చర్య తీసుకోవాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. పైగా బీజేపీ నేతలు కూడా దీనికి వంత పాడటంతో నితీష్ కుమార్ ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఈ మేరకు నితీష్ కుమార్ మాట్లాడతూ.."నేను మా సభ్యులకు కూడా చెప్పాలనుకుంటున్నాను. ఆ ఘటన పై విచారణ జరుగుతోంది అని చెబుతున్నప్పటికీ మీరు ఈ ప్రశ్నను పదే పదే లేవనెత్తుతున్నారు. మీరు విచారణ గురించి ఆందోళన చెందుతున్నారా లేక కోర్టుకు వెళ్లాలనుకుంటున్నారా. అయినా నేను కూడా ఆ ఘటన గురించి బాధపడుతున్నాను, మీ ఆవేదనను కూడా అర్థం చేసుకుంటున్నాను. మీరు ఈ విధంగా ప్రవర్తించడం సరికాదు. నేను చెప్పేది వినండి. ఇలాంటి వాటిని అంగీకరించను అని స్పీకర్పై ఆగ్రహంతో విరుచుకు పడ్డారు. అయితే స్పీకర్ ముఖ్యమంత్రిని వారించేందకు యత్నించినప్పటకీ ఆయన వినేందుకు నిరాకరించారు. (చదవండి: లోక్ సభలో ‘మోదీ.. మోదీ..’) -
గత వందేళ్లలో ఎవరు చేయనిది చేస్తున్నాడు:స్పీకర్ తమ్మినేని సీతారాం
-
చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని తీవ్ర స్థాయిలో ధ్వజం