ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా ఐదుగురు డిప్యూటీ సీఎంలతో సహా మొత్తం 25మందితో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన వైఎస్సార్ఎల్పీ సమావేశంలో ఆయన పార్టీ ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.