గిరిజన మున్సి‘పోల్స్’కు గ్రీన్‌సిగ్నల్! | Tribal munsi 'polls' to the green signal! | Sakshi
Sakshi News home page

గిరిజన మున్సి‘పోల్స్’కు గ్రీన్‌సిగ్నల్!

Published Wed, Mar 30 2016 2:16 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

Tribal munsi 'polls' to the green signal!

♦ మణుగూరు, మందమర్రి, పాల్వంచల్లో ఎన్నికలకు తొలగనున్న అడ్డంకి
♦ గవర్నర్ అనుమతితో నిర్వహణకు సన్నాహాలు
 
 సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ సరవణ జరగక ఎన్నికలకు నోచుకోని షెడ్యూల్డ్ ప్రాంత మున్సిపాలిటీలైన మణుగూరు, మందమర్రి, పాల్వంచలలో ఎట్టకేలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యాంగ సవరణ కోసం వేచి చూడకుండా ఒడిశా తరహాలో గవర్నర్ ప్రత్యేక అనుమతితో ఈ పురపాలికల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ మున్సిపాలిటీలు ఉండటంతో ఎస్టీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. రాజ్యాంగ సవరణతోనే ఇది సాధ్యం కావడంతో ఈ మున్సిపాలిటీలు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నికలు జరగలేదు.

అయితే ఒడిశా ప్రభుత్వం ఆ రాష్ట్ర గవర్నర్ ప్రత్యేక అనుమతితో గిరిజనులకు 50 శాతం వార్డులు, చైర్మన్ పదవిని రిజర్వ్ చేయడం ద్వారా షెడ్యూల్డ్ ప్రాంత మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించింది. ఈ తరహాలోనే ఆదిలాబాద్ జిల్లా మందమర్రి, ఖమ్మం జిల్లా మణుగూరు, పాల్వంచ మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు మున్సిపాలిటీల్లోని 50 శాతం వార్డులతోపాటు చైర్మన్ పదవులను గిరిజనులకు రిజర్వ్ చేసి ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతించాలంటూ మంగళవారం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు లేఖ రాసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement