చేనేత రంగాన్ని జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం డిమాండ్ చేసింది.
నేటికీ చేనేత రంగంపై ఆధారపడి లక్షలాది కుటుంబాలు జీవిస్తున్నాయని, ప్రభుత్వం నుంచి సరైన సహకారం లభించక ఈ రంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిశ్రమను కాపాడేందుకు చర్యలు తీసుకోవాల్సిందిపోయి, జీఎస్టీలో చేర్చి నూలుపై 5 శాతం, వస్త్రాలపై 18 శాతం పన్ను విధించడం వల్ల చేనేత రంగం మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.