మంత్రి కాన్వాయ్ పై బాంబు దాడి | Bomb attack on minister kills two in Pakistan | Sakshi
Sakshi News home page

మంత్రి కాన్వాయ్ పై బాంబు దాడి

Published Thu, Nov 26 2015 8:36 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM

Bomb attack on minister kills two in Pakistan

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ లో జరిగిన బాంబుదాడిలో మంత్రి తృటిలో తప్పించుకున్నారు.  గృహ మంత్రి అక్రం కాన్ దురానీ   టార్గెట్ గా గురువారం సాయంత్రం  నార్త్ వెస్ట్ పాకిస్తాన్ లో జరిగిన ఈ దాడిలో ఆయన  సురక్షితంగా బయటపడ్డారు.  
తన స్వగ్రామానికి వెళుతుండగా మంత్రి కాన్వాయ్ మార్గంలో  బాంబులుపేల్చడం ద్వారా  మంత్రిని హతమార్చాలని పథకం వేశారు.  ఈ క్రమంలో వారు  అమర్చిన బాంబులు ఒక్కసారిగా పేలాయి. కానీ,  అదృష్టవశాత్తూ  అక్రం బతికి  బయటపడ్డారు. అయితే స్తానికంగా బీభత్సం సృష్టించిన ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా  మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.  పోలీసు వాహనం పూర్తిగా ధ్వంసమైంది.

దాదాపు 7  కిలోల పరిమాణంలో పేలుడు పదార్థాలను రోడ్డు  పక్కన అమర్చి  రిమోట్తో పేల్చి వేసినట్టు భద్రతా వర్గాలు  ప్రకటించాయి.  ఈ దాడికి  బాధ్యత తమది అని   ఏ గ్రూపు ప్రకటించలేదని తెలిపాయి.  పాకిస్తాన్  అధ్యక్షుడు  హుస్సేన్, ప్రధాని నవాజ్  షరీఫ్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.   మృతుల కుటుంబాలకు  ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement