Etala Rajendar
-
కులగణనపై ఈటల కీలక వ్యాఖ్యలు
సాక్షి,యాదాద్రి భువనగిరి జిల్లా:కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కుల గణన ఒక డ్రామా అని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు.యాదగిరిగుట్టలో ఆదివారం(ఫిబ్రవరి16) ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.‘బీసీ గణనను చట్టబద్దమైన సంస్థలతో సర్వే చేసి అసేంబ్లీలో చట్ట బద్దత కల్పించాలి. బీసీ కుల గణనకు బీజేపీ వ్యతిరేకం కాదు.కులగణనను పార్లమెంట్లో ఆమోదించేందుకు సిద్దంగా ఉన్నాం. 70ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీ సీఎం కూడా లేడు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. కాంగ్రెస్ అంటేనే స్కామ్లు, భూ దందాలు,లంచాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డబ్బు సంచులతో ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల చుట్టూ తిరుగుతున్నాడు.ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చిల్లరగా ఉన్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో మూడు స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది. బీఆర్ఎస్ గతంలో టీచర్లను మోసం చేసి పోటీ చేసే అర్హత కోల్పోయింది’అని ఈటల అన్నారు. -
రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై దాడి.. ఈటల స్ట్రాంగ్ రియాక్షన్
-
క్లైమాక్స్కు బీజేపీ అధ్యక్ష పదవి కసరత్తు.. రేసులో ఈటల, అరవింద్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడెవరన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేందుకు ఎవరికి వారు తమ తమ పద్ధతుల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. సరిగ్గా ఏడాది కిందట అకస్మాత్తుగా బండి సంజయ్ స్థానంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని అధిష్టానం నియమించింది. అప్పటి నుంచి కిషన్రెడ్డి తాత్కలికంగా బీజేపీ సారథ్య బాధ్యతలు నెట్టుకొస్తున్నారు. అయితే ఫుల్ టైం అధ్యక్షుడిగా రాష్ట్రమంతగా తిరిగి పార్టీని పటిష్టం చేసే నాయకుడికోసం తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. అయితే సంస్థాగత ఎన్నికలు, సభ్యత్వం పేరుతో అధిష్టానం బీజేపీ అధ్యక్షుడి ఎంపిక పెండింగ్లో పెట్టింది.అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై అధిష్టానం వివిధ మార్గాల్లో సమాచారాన్ని సేకరిస్తోంది. కానీ ఇప్పటి వరకు అధ్యక్షుడి నియామకం హైకమాండ్ ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేకపోతోంది. దానికి ప్రధాన కారణం అధ్యక్ష పదవి కోసం పోటీ ఎక్కువకావడంతో పాటు, ఒకరిపై ఒకరు పోటాపోటీగా అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. దాంతో అధ్యక్షుడి ఎంపిక బీజేపీ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఒకరికి పదవి ఇస్తే మరొకరు పనిచేయకుండా, సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఈ ఎంపిక ప్రక్రియను సాగదీస్తోంది. అయితే, అధ్యక్ష పదవి కోసం ప్రధానంగా ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ మధ్య పోటీ నెలకొంది. ఈ ఇద్దరు అధిష్టానం పెద్దలను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని తమతమ బలాలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఈటలకు బలం కాగా, ఆయనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేదని ఆయన వ్యతిరేకులు అంటున్నారు. మరో వైపు ధర్మపురి అరవింద్ రెండు సార్లు నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించి తన సత్తాను చాటారు. తొలి ప్రయత్నంలోనే కేసీఆర్ కూతరు కవితను ఓడించి అధిష్టానం దృష్టిలో పడ్డ అరవింద్ రెండో సారి కూడా గెలిచి తాను బలమైన నేతనని నిరూపించుకున్నారు.అయితే ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తారని, అందరినీ కలుపుకుపోలేరని ఆయన వ్యతిరేకవర్గం ఫిర్యాదులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల బలాలను, బలహీనతలను అధిష్టానం బేరీజు వేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ బీసీని తెలంగాణ అధ్యక్షుడిగా నియమించిన నేపథ్యంలో బీజేపీ కూడా ఈసారి బీసీకే సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఫ్లోర్ లీడర్గా మహేశ్వర్ రెడ్డిని నియమించిన అధిష్టానం, అధ్యక్ష పదవి బీసీకే అప్పగిస్తామనే సంకేతం పంపింది. ఈ కోణంలో కసరత్తు చివరి దశకు చేరుకుంది. ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్లో ఎవరో ఒకరికి సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఈ దిశగా ఏకాభిప్రాయం కుదరకపోతే కిషన్రెడ్డిని యథావిధిగా మరికొంత కాలం కొనసాగించే అవకాశముంది. -
మోదీతో పెట్టుకుంటే కేసీఆర్కు పట్టిన గతే: రేవంత్కు ఈటల హెచ్చరిక
సాక్షి,హైదరాబాద్:కాంగ్రెస్ పార్టీకి పోయే కాలం వచ్చిందని,ప్రజాస్వామ్య చరిత్రలో ఒక పార్టీ ఇంకొక పార్టీ కార్యాలయంపై దాడి చేసిన సంఘటన లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం(జనవరి 8) రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఈటల మీడియాతో మాట్లాడారు. ‘పథకం ప్రకారమే బీజేపీ ఆఫీసుపై దాడి జరిగింది. రేవంత్ ప్రభుత్వం ఇంత బలహీనంగా ఉందా? అనుభవం ఉన్న పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉన్నారు.రేవంత్ అధికార భ్రమలో ఉన్నారు. రేవంత్.. మేము తలచుకుంటే మీరు ఉండరు. మేము దాడి చేస్తే తుక్కు తుక్కవుతారు. ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయ్యిందా! దీనిపై ప్రజలకు వివరణ ఇవ్వాలి. రేవంత్..మోదీని చూసి పరిపక్వత తెచ్చుకో. తెలంగాణలో ప్రతి గడపలో సీఎంను చీదరించుకుంటున్నారు. హై కమాండ్ మెప్పు కోసమే ఈ చిల్లర పని.రేవంత్ ప్రజల దృష్టిలో చిల్లరగాడిలా మిగిలిపోతారు. జనరల్ గా పార్టీ ఆఫీసులో అధ్యక్షుడు ఉంటారు.నిన్న మేము పార్టీ ఆఫీస్ లో ఉంటే పరిస్థితి ఏంటి? కేంద్రాన్ని అడిగేటప్పుడు మర్యాద పాటిస్తారు.బయటికి వచ్చాక చిల్లరగాళ్ళలా వ్యవహరిస్తారా? దేశంలో ఎక్కడ లేని విధంగా చర్లపల్లి టెర్మినల్ నిర్మాణం జరిగింది. సీఎం ఇక్కడే ఉండి చర్లపల్లి టెర్మినల్ ఓపెనింగ్కు రాకుండా వర్చువల్గా పాల్గొన్నారు. కానీ చిన్న ఫ్లై ఓవర్ ఓపెనింగ్ కి మాత్రం వెళ్లే సమయం ఉందా? మోదీతో పెట్టుకుంటే కేసిఆర్కు పట్టిన గతే పడుతుంది. మీ విధానాలకు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.బేషరతుగా సీఎం,సీపీ బీజేపీ ఆఫీసు మీద దాడి పట్ల క్షమాపణ చెప్పాలి’అని ఈటల డిమాండ్ చేశారు. -
సీఎం రేవంత్కు ఎంపీ ఈటల హెచ్చరిక
సాక్షి,హైదరాబాద్:సర్వేజన సుఖీనోభవ అన్నది తమ సిద్ధాంతమని,తమ సంస్థల పట్ల సీఎం రేవంత్ ద్వేషబావంతో ఉన్నారని బీజేపీ సీనియర్నేత, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. మంగళవారం(అక్టోబర్22) ఈటల మీడియాతో మాట్లాడారు.‘కాంగ్రెస్ పార్టీ లౌకిక వాదం పేరుతో మతోన్మాదులకు షెల్టర్ ఇస్తున్నారు.కాంగ్రెస్ పార్టీది నీచమైన కల్చర్. సీఎంను దించడానికి మత కల్లోలాలు సృష్టించడం కాంగ్రెస్కు అలవాటు. మర్రి చెన్నారెడ్డిని దించడానికి,కోట్ల విజయభాస్కర్ రెడ్డిని దించడానికి మతకల్లోల్లాలు సృష్టించారు.శవాల మీద రాజకీయాలు చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మతకల్లోలాలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. గుడిపై దాడిచేసిన వారిని పట్టుకునే దమ్ములేక ఓట్ల రాజకీయం కోసం శాంతియుత ర్యాలీ చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. స్లీపర్ సెల్స్ ఉన్నాయని,రోహింగ్యాలు ఉన్నారని కేంద్రం హెచ్చరికలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నివారించలేకపోతోంది.టెర్రరిస్టులు ఎవరు ? రెచ్చగొట్టేవారు ఎవరు ? సంఘ విద్రోహ శక్తులు ఎవరో తేల్చాలి.హిందువుల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో రేవంత్ విఫలమయ్యారు.శాంతిభద్రతల పరిరక్షణ కోసమే బీజేపీ పనిచేస్తోంది. హిందూ కార్యకర్తల అరెస్టులను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్న.చేతులు ముడుచుకొని కూర్చోవడానికి సిద్ధంగా లేము’అని ఈటల హెచ్చరించారు.ఇదీ చదవండి: కేటీఆర్పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్ -
సుందరీకరణ కాదు.. పునరుజ్జీవం!: సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్:‘అధికారం కోల్పోయి నిస్పృహ, అసహనంతో మూసీ నది పునరుజ్జీవానికి కొంతమంది అడ్డుపడుతున్నారు. మూసీ సుందరీకరణ అనే డైలాగ్ను ప్రచారంలోకి తెచ్చారు. మేము అందాల కోసం పని చేయడం లేదు. అందాల భామలతో కలిసి పనిచేయడం లేదు. అలాంటి కొంతమంది.. మంత్రులు, ప్రజాప్రతినిధుల ముసుగులో పదేళ్లు రాష్ట్రాన్ని పట్టిపీడించి బందిపోటు దొంగలకంటే దుర్మార్గంగా పట్టపగలు దోపిడీ చేసి స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మూసీ పునరుజ్జీవన ప్రయత్నాలపై విష ప్రచారంతో ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. మూసీ మురికిని మించి మెదడులో విషం నింపుకుని తెలంగాణ సమాజంపై దాడి చేస్తున్నారు..’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. గురువారం సచివాలయంలో మంత్రులు డి.శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒక్కొక్కరిని ఒప్పించి తరలిస్తాం ‘ఇది సుందరీకరణ కాదు.. దుబాయ్కి వెళ్లి నెత్తిమీద జుట్టును నాటు వేయించుకున్న విధానం కాదు. పునరుజ్జీవంతో మూసీని, మురికిలో కాలం వెళ్లదీస్తున్న ప్రజలను కాపాడి మంచి జీవనాన్ని ఇవ్వాలని, ఉపాధి కల్పించాలని, ప్రత్యామ్నాయ ఇళ్లను ఇవ్వాలనే ఆలోచన మాకు ఉంది. కానీ పేదరికం, కట్టుబానిసలు ఉండాలనే దొరలు, భూస్వాములు, జమీందారుల భావజాలం ఉన్నవారు దీనికి అడ్డుపడుతున్నారు. అక్కడి ప్రజల భవిష్యత్తుపై అపోహలు సృష్టిస్తున్నారు. నిజానికి 4 కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తును, రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించగల కార్యాచరణ ఇది. గత 10 నెలల పాటు అధికారులు 33 బృందాలుగా ఏర్పడి మూసీ దుర్గంధంలో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న ప్రతి ఇంటికీ వెళ్లి వారి కష్టాలు, వివరాలను తెలుసుకున్నారు. వారిని ఏ విధంగా ఆదుకోవాలనే అంశంపై మేం ఆలోచన చేస్తున్నాం. అక్కడి సమస్యలు పరిష్కరించి ఒక్కొక్కరిని ఒప్పించి తరలిస్తాం..’ అని సీఎం స్పష్టం చేశారు. సెక్యూరిటీ లేకుండా వస్తా..మీరూ రండి ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం మల్లన్నసాగర్ భూసేకరణ కోసం వేములఘాట్ ప్రజలపై అర్ధరాత్రి పోలీసులతో దాడి చేయించి గుర్రాలతో తొక్కించినట్టుగా మేం చేయం. ఇక్కడికి వస్తావా? అక్కడికి వస్తావా? అని నన్ను అడుగుతున్నారు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట, గజ్వేల్లోని ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మకు నేను సెక్యూరిటీ లేకుండా వస్తా. బీఆర్ఎస్ నేతలూ రావాలి. రచ్చబండ నిర్వహించి పదేళ్లలో ఎన్ని దుర్మార్గాలు చేశారో ప్రజలను అడుగుదాం..’ అని రేవంత్ సవాల్ చేశారు. బఫర్ జోన్లో మరో 10 వేల గృహాలు ‘మూసీ గర్భంలో 1,690 ఇళ్లు ఉండగా వారికి దసరా పండుగ వేళ డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు రూ.25 వేలు చొప్పున తోవ ఖర్చులకు ఇచ్చాం. అయితే హైడ్రా వస్తుంది..బుల్డోజర్లు పెడ్తున్నరు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మూసీలో ప్రభుత్వం ఒక్క ఇల్లు కూలగొట్టలేదు. ఖాళీ చేసిన లబ్ధిదారులే తమ ఇళ్ల తలుపులు, కిటికీల కోసం కూలగొట్టుకున్నారు. అడ్డగోలుగా కట్టిన 10, 20 అంతస్తుల ఆకాశహర్మ్యాలను కూల్చడానికే బుల్డోజర్లు, హైడ్రా అవసరం. అయినా హైడ్రా ఏమైనా ఫామ్హౌస్లో నిద్రపోయే భూతమా? మీద పడడానికి? మరో 10 వేల ఇళ్లు బఫర్జోన్లో ఉన్నాయి వారికి ప్రత్యామ్నాయం కల్పించి, మంచి జీవితాలు ఇచ్చి మనస్సు గెలవాలని భావిస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. అద్భుతాలు సృష్టించిన కంపెనీలతో కన్సార్టియం ‘ప్రపంచంలో అద్భుతాలను సృష్టించిన ఐదు కంపెనీలతో ఒక కన్సార్టియం ఏర్పాటు చేయించి రూ.141 కోట్లతో మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు డీపీఆర్ తయారీ బాధ్యతలను టెండర్ల ద్వారా అప్పగించాం. డీపీఆర్ తయారీతో పాటు అంచనా వ్యయం, నిధులు, పెట్టుబడులు, రుణాల సమీకరణకు సంబంధించి కన్సార్టియం సహకారం అందిస్తుంది. 18 నెలల్లో డీపీఆర్ తయారు చేస్తారు. ఆ తర్వాత నాలుగైదేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఆరున్నరేళ్ల పాటు కన్సార్టియం సేవలందిస్తుంది. ఈ కన్సార్టియంలో భాగమైన ‘మీన్హార్ట్’ కంపెనీకే ప్రధాని మోదీ గుజరాత్లో సర్దార్ పటేల్ విగ్రహం కట్టే బాధ్యత అప్పగించారు. అలాగే రాష్ట్రంలో కేసీఆర్, రామేశ్వర్రావు తమ కులగురువు చినజీయర్స్వామితో కలిసి సమతామూర్తి విగ్రహాన్ని కట్టే బాధ్యత అప్పగించారు. గత ప్రభుత్వం ఉప్పల్లో మూసీపై రూ.30 కోట్లతో పనులు ప్రారంభించి రూ.6 కోట్లు ఖర్చు చేసినట్టు రికార్డుల్లో ఉంది. కానీ వర్షం వచ్చి చేసిన పనికొట్టుకుపోయిందని అంటున్నారు. ఈ వ్యవహారంలో లోపల వేయవచ్చు. చర్లపల్లి జైల్లో వేస్తే తిండిదండగ అని మేం చూసీచూడనట్టుగా ఉంటే వారికి అలుసుగా ఉంది..’ అని రేవంత్ అన్నారు. ‘మూసీ’పై అసెంబ్లీలో చర్చకు సిద్ధం ‘మూసీ ఒడ్డున ఖాళీ చేసిన ఇళ్లల్లో హరీశ్, కేటీఆర్, ఈటల రాజేందర్ మూడు నెలలు ఉంటే ఈ ప్రాజెక్టును ఆపేస్తానంటూ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా. ప్రజలు అక్కడ ఉండడం అద్భుతం అనుకుంటే మీరూ ఉండండి. పునరుజ్జీవాన్ని అడ్డుకోవడం మాత్రం దేశద్రోహం. మంచి ప్రాజెక్టుగా భావిస్తే ప్రజలను తరలించడానికి ఏం చేయాలో సూచనలు చేయండి. దీనిపై అసెంబ్లీలో చర్చకు కూడా సిద్ధం. ఇళ్లు, ఉద్యోగం, ఉపాధి, ప్లాట్, నష్టపరిహారం ఇద్దామా? చెప్పండి. అనుమానాలుంటే నివృత్తి చేస్తాం ప్రత్యేక కేసుగా ఎంపీలను ఎంక్లోజర్లో పెట్టి శాసనసభలో మాట్లాడించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అసద్, కిషన్, కేసీఆర్ తమ అనుమానాలను శనివారంలోగా ప్రశ్నల రూపంలో తెలియజేస్తే రాతపూర్వకంగా సమాధానమిస్తాం. రాజకీయ సమ్మతి కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తాం..’ అని సీఎం తెలిపారు. దామగుండాన్ని వ్యతిరేకించేవాళ్లు కసబ్ లాంటోళ్లు ‘దేశ భద్రత కోసం ఏర్పాటు చేసే దామగుండం నేవీ రాడార్ కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడేవాళ్లు కసబ్లాంటి వాళ్లు. కేటీఆర్ కసబ్లాగా మాట్లాడితే ఎవడో వచ్చి ఇవ్వాల్సిన సమాధానం ఇస్తాడు. ఏటా రూ.500 కోట్ల లంచం వచ్చే బతుకమ్మ చీరలను నిలుపుదల చేస్తే కడుపు మండి ఆరోపణలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో వరద బాధితులకు రూ.10 వేలు చొప్పున గత ప్రభుత్వం చేసిన రూ.600 కోట్ల పంపిణీలో అక్రమాలపై ఏసీబీ విచారణకు ఆదేశించాలా?..’ అని కేటీఆర్ను ఉద్దేశించి రేవంత్ ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడటానికి ముందు.. ప్రస్తుతం మూసీ నది ఎలా ఉంది? పునరుజ్జీవం తర్వాత ఎలా ఉండబోతోంది తెలియజేస్తూ సీఎం ప్రెజెంటేషన్ ఇచ్చారు. -
తెలంగాణ బీజేపీ చీఫ్ నియామకంపై సస్పెన్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ చీఫ్ నియామకంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీసీ నేతకే బీజేపీ పగ్గాలు అంటూ ప్రచారం జరుగుతోంది. బీసీ కోటాల్లో ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ మధ్య పోటీ నెలకొంది. సామాజిక వర్గాల ప్రకారం మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్కి కేంద్రమంత్రి పదవి ఇవ్వడంతో అదే సామాజికవర్గానికి చెందిన అర్వింద్కు పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం లేదంటున్నాయి పార్టీ వర్గాలు.మరోవైపు, ఈసారి సంఘ్ పరివార్ క్షేత్రాల ప్రతినిధికి ఇవ్వాలనే వాదన ఉంది. మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావుకు కేటాయించాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. లోకల్బాడీ ఎన్నికల నేపథ్యంలో అధ్యక్ష నియామకంపై ఢిల్లీ జాతీయ నాయకత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.ఇప్పటికే కేంద్ర మంత్రిగా, పార్టీ రాష్ట్రఅధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. దీంతో టికెట్ ఆశిస్తున్న రెడ్డి సామాజికవర్గానికి చెందిన డీకే అరుణకు ఇస్తారా? లేదా? అన్నది కూడా ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉండగా ఇద్దరు సీఎంలను ఢీకొట్టి గెలిచిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి సైతం అధ్యక్షుడి రేసులో ఉన్నట్లు సమాచారం. కాగా, ఇప్పటికే బీజేఎల్పీ బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహేశ్వర్ రెడ్డికి ఇవ్వడంతో పార్టీ పగ్గాలు బీసీ నేతలకే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త అధ్యక్షుడి నియామకం శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నెలాఖరులోగా ఈ టెన్షన్కు తెరపడే చాన్స్ ఉంది. -
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి, ఈటల..
-
రైతు కంట నీరు మంచిది కాదు..
-
జాతీయ అధ్యక్షుడి నియామకం తర్వాతే... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొత్తనేతను నియమించాకే, రాష్ట్ర నూతన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలున్నాయి. జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న జేపీ.నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్రెడ్డిలను కేంద్ర కేబినెట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అటు నడ్డాను, ఇటు కిషన్రెడ్డిని తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగించిన విషయం తెలిసిందే. ఇద్దరూ కేబినెట్లో ఉండటంతో వీరిస్థానంలో అధ్యక్ష బాధ్యతలు వేరే వారికి అప్పగించనున్నారు. కర్ణాటకతోపాటు రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ టార్గెట్గా పెట్టుకుంది. ఏపీ, తమిళనాడు, కేరళలలో బలపడాలని కూడా బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ నేతకే అవకాశం ? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీ, ఎమ్మెల్యేల్లో ఒకరి అవకాశం ఉంటుందని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఓసీ సామాజికవర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్రెడ్డి బీజేఎల్పీనేతగా ఉన్న నేపథ్యంలో, రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీ సామాజికవర్గానికే చెందిన ఇస్తారని అంటున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ఎజెండాతో బీజేపీ ప్రజల్లోకి వెళ్లింది. అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని హామీ కూడా ఇచ్చింది. త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థలు, ఆ తర్వాత వచ్చే ఏడాది ప్రారంభంలో జరగాల్సిన మున్సిపల్ ఎన్నికల్లో సతా చాటడం అత్యవసరంగా పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు రాష్ట్ర అధ్యక్షుడిగా దాదాపుగా ఖరారైనట్టుగా పార్టీవర్గాల విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితుడైన నేతగా, బీసీలతోపాటు అన్నివర్గాల్లో గుర్తింపు ఉన్న వ్యక్తిగా, ఇరవై ఏళ్ల పాటు బీఆర్ఎస్లో నంబర్ –2గా, మంత్రిగా ఈటలకున్న అనుభవం బీజేపీ బలోపేతానికి ఉపయోగపడుతుందని పార్టీ నాయకత్వం గట్టిగా విశ్వసిస్తోంది. రాజకీయంగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగిసినందున, సంస్థాగతంగా బలపడేలా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వచ్చేలా పార్టీని అన్నివిధాలా సంసిద్ధం చేసుకునేందుకు ఉపయోగపడే నేతలకే అధ్యక్ష పదవి దక్కుతుందదని భావిస్తున్నారు. అయితే రాష్ట్రపార్టీ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న వారిలో ఎంపీలు అర్వింద్, డీకే.అరుణ, రఘునందన్రావు, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, పార్టీ సీనియర్ నేతలు యెండల లక్ష్మీనారాయణ, కాసం వెంకటేశ్వర్లు యాదవ్తోపాటు మరికొందరు ఉన్నారు. -
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కిషన్రెడ్డి?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్తో సమానంగా 8 ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ మరింత బలపడే చర్యల్లో భాగంగా కేంద్ర కేబినెట్ కూర్పులో రాష్ట్రానికి ప్రాధాన్యత కలి్పస్తుందని పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. ఇందులో భాగంగా రెడ్డి లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒకరికి కేంద్ర కేబినెట్ పదవితోపాటు ఓ మహిళ, ఓ బీసీ నేతకు కేంద్ర సహాయ మంత్రి పదవి లభించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాకా కేంద్ర మంత్రిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్రెడ్డికి మరోసారి కేబినెట్ హోదా లభించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.అయితే ఆయన్ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కూడా నియమించే అవకాశాలున్నాయనే చర్చ కూడా పార్టీలో సాగుతోంది. వెంటనే జాతీయ స్థాయిలో అధ్యక్ష మార్పు జరపకపోతే ముందుగా కిషన్రెడ్డిని కేబినెట్లోకి తీసుకొని 6 నెలలు లేదా సంవత్సరం తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేయొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం ఢిల్లీలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉంటానని పేర్కొనడం ఈ చర్చకు ఊతమిస్తోంది.ఓసీ, మహిళా కోటాలో డీకే అరుణకు, పారీ్టపట్ల విధేయుడిగా రెండోసారి ఎంపీగా సీనియారిటీ దృష్ట్యా బండి సంజయ్, రాష్ట్రంలో దాదాపు పాతికేళ్లుగా రాజకీయవేత్తగా, మంత్రిగా ఉన్న సుదీర్ఘ అనుభవం దృష్ట్యా ఈటల రాజేందర్కు మంత్రి పదవులు దక్కుతాయని ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే, ఉమ్మడి ఏపీలో, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక క్షేత్రస్థాయిలో బీజేపీ అంతగా బలపడలేదు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో పార్టీపరంగా ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం కూడా అంతంతగానే ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో సత్సంబంధాలు, స్థానిక పరిచయాలున్న ఈటల రాజేందర్ను కేంద్ర మంత్రిగా కంటే కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసి పార్టీ బలోపేతానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తారనే చర్చ సాగుతోంది. -
ఎమ్మెల్యేగా ఓడి ఎంపీగా గెలిచి..
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యుడిగా పోటీచేసి ఓటమి చవిచూశాక, మళ్లీ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగి ఎంపీలుగా గెలిచి సంచలనం సృష్టించిన వారి సంఖ్య ఈ సారి పెరిగింది. తాజాగా ప్రకటించిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో.. బీజేపీ నుంచి ఏకంగా నలుగురు ఎంపీలుగా గెలుపొందారు. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ల నుంచి పోటీ చేసి ఓడి, పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా ఈటల రాజేందర్, అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్రావు శాసనసభ ఎన్నికల్లో ఓడి మళ్లీ జరిగిన లోక్సభ ఎన్నికల్లో మెదక్ నుంచి విజయం సాధించారు. అదేవిధంగా అప్పటికే సిట్టింగ్ ఎంపీలుగా ఉంటూ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బండి సంజయ్, కోరుట్ల నుంచి ధర్మపురి అరి్వంద్ ఓటమి చెందాక పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి సంజయ్, నిజామాబాద్ నుంచి అరి్వంద్ ఎంపీలుగా గెలుపొంది సత్తా చాటారు. అలాగే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్పేట నుంచి ఓడిన బీజేపీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి, 2019 లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి మొదట కేంద్రహోంశాఖ సహాయ మంత్రి, ఆ తర్వాత కేంద్రమంత్రిగా ఆయన ప్రమోషన్ పొందారు. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ సికింద్రాబాద్ నుంచి కిషన్రెడ్డి విజయం సాధించారు. ఇదే ఒరవడిలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిన కాంగ్రెస్నేత, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి, ఆ వెంటనే జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి రేవంత్రెడ్డి గెలిచి ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే. అదేవిధంగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడి ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం రేవంత్రెడ్డి కేబినెట్లో ఆయన మంత్రిగా కొనసాగుతున్న సంగతి విదితమే. -
ఆ సీటు యమ హాట్.. బీజేపీలో ‘మల్కాజ్గిరి’ మంటలు
లోక్ సభ ఎన్నికల్లో ఆ సీటు యమ హాట్. దేశంలోనే దానిదొక ప్రత్యేక స్థానం. అక్కడ గెలిస్తే రాజయోగమే. అలాంటి లక్కీ సీట్ కోసం లీడర్ల పాట్లు అన్ని ఇన్నీ కావు. కేంద్రంలో అధికారంలో బీజేపీలో ఆ సీటు పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఈటలకే కన్ఫర్మ్ అయిందన్న ప్రచారంతో మిగిలిన ఆశావహులు రగిలిపోతున్నారు. నాన్ లోకల్ వద్దు.. లాంగ్ అండ్ లోకల్ లీడర్కే ఇవ్వాలంటూ స్థానిక ఆశావహులంతా ఏకమై నిరసన గళం వినిపిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద లోక్ సభ స్థానం మల్కాజ్గిరి. అన్ని పార్టీల కన్ను అటువైపు. అక్కడ గెలిస్తే మంత్రి లేదా ముఖ్యమంత్రి అవ్వొచ్చన లక్కీ థాట్స్ కూడా నేతలకు స్టార్ట్ అయ్యాయి. అలాంటి సీటుకు ఫుల్ డిమాండ్ ఉంది. దేశంలో ఊపు మీదున్న బీజేపీ నుంచి ఆ సీటుకున్న పోటీ అంతా ఇంత కాదు. మాజీ మంత్రి ఈటల, బీజేపీ జాతీయ నేత మురళిధర్ రావు, స్థానిక నేతలు వీరంద్రగౌడ్, కూన శ్రీశైలం గౌడ్, పన్నాల హరీశ్ రెడ్డి, చాడ సురేశ్ రెడ్డి, మల్క కొమురయ్య వంటి నేతల రేసులో ఉన్నారు. మల్కాజ్ గిరి సీటు తనకే కన్ఫర్మ్ అయిందని ఈటల రాజేందర్ ధీమాతో ఉన్నారు. ఈ మేరకు అధిష్టానం నుంచి సంకేతాలు ఉన్నాయని కేడర్తో ఆయన ఏర్పాటు చేసిన బ్రేక్ పాస్ట్ మీటింగ్ బిజెపి మల్కాజ్ గిరిలో మంటలు రేపింది. మల్కాజ్గిరి సీటు తనకే కన్ఫర్మ్ అయిందని ఈటల ప్రచారంపై మిగిలిన ఆశావహులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమ అసంతృప్తిని బాహటంగానే ప్రదర్శిస్తున్న నేతలు.. ఈటల వ్యవహారంపై అధిష్టానంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో గురువారం రాత్రి జరిగిన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో మల్కాజ్గిరిని పెండింగ్లో పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మల్కాజ్ గిరి సీటు విషయంలో స్థానిక ఆశావహులు అంతా ఒక్కతాటిపైకి వచ్చారు. నాన్ లోకల్కు సీటు కేటాయిస్తే సహకరించేది లేదని తెగెసి చెబుతున్నారు. అతిపెద్ద నియోజకవర్గంలో పోటీ చేసేందుకు నేతలే లేరా అంటూ అసంతృప్త నేతలు క్వశ్చన్ చేస్తున్నారు. వీరంద్ర గౌడ్, కూన్ శ్రీశైలం గౌడ్, హరీశ్ రెడ్డి, చాడ సురేశ్ రెడ్డి నేతలు అనుచరులు, కార్యకర్తలతో మల్కాజ్ గిరి సీటు వ్యవహారంపై భేటీ అయ్యారు. లోకల్ క్యాండిడేట్ ఎవరికి ఇచ్చినా ఓకే కానీ బయట నుంచి తీసుకొస్తే మాత్రం సహకరించేది లేదని పార్టీకి చెప్పాలని డిసైడ్ అయ్యారు. పార్టీని నమ్ముకొని ఎన్నో ఎళ్లుగా ఉన్న స్థానికులైన వారికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పన్నాల హరీశ్ రెడ్డి, వీరేంద్ర గౌడ్, కూన శ్రీశైలం గౌడ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీశ్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ టికెట్ను త్యాగం చేశారు. పార్లమెంట్ సీటు తనకే వస్తుందని భావించారు. మధ్యప్రదేశ్ ఇన్ చార్జీ మురళీధర్ రావు మల్కాజ్ గిరిలో మూడేండ్లుగా పలు కార్యక్రమాలు చేస్తున్నారు. చాడ సురేశ్ రెడ్డి సైతం సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. అంతేకాకుండా ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా పార్లమెంట్ పరిధిలో డబ్బులు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి టికెట్ ఈటలకు కన్ఫర్మ్ అయిందని ప్రచారం జరుగుతున్న తరుణంలో వీరితో పాటు బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ నేతలతో ఆయన టచ్లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ నిర్ణయం ఆధారంగా ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మరి అధిష్టానం మల్కాజ్ గిరి టికెట్ ఎవరికి కేటాయిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వీరికి కాకుండా ఇతరులకు ఇస్తే వీరు ఆ నేతకు సహకరిస్తారా? లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. -
నేను పార్టీ మారే వ్యక్తిని కాదు: ఈటల రాజేందర్
-
TS: కాంగ్రెస్లో చేరిక.. ఈటల క్లారిటీ
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్లో చేరనున్నారన్న వార్తలపై బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావుతో తాను ప్రత్యేకంగా భేటీ కాలేదని తెలిపారు. మన్సూరాబాద్ కార్పొరేటర్ నర్సింహరెడ్డి గృహ ప్రవేశ కార్యక్రమంలో వారిద్దరితో కలిసి భోజనం చేస్తున్న ఫోటోలను కొందరు ప్రచారం చేస్తున్నారని వివరణ ఇచ్చారు. మైనంపల్లి, పట్నంను రాజకీయాల కోసం కలవలేదన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ఉన్నానని,పార్టీ మారుతున్నట్లు తనపై జరుగుతున్న అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్లో చేరిన వెంటనే ఆ జెడ్పీచైర్పర్సన్పై బీఆర్ఎస్ -
గజ్వేల్ ఓటమితో ఇంకా కసి పెరిగింది: ఈటల రాజేందర్
సాక్షి, గజ్వేల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో ఓటమి.. తనలో ఇంకా కసి పెంచిందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఆయన గురువారం గజ్వేల్ నియోజకవర్గం బీజేపీ ముఖ్య కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఈటల రాజేందర్ తన ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్లో డబ్బు, మద్యం పంపిణీ చేసి మాజీ సీఎం కేసీఆర్ గెలిచారని ఆరోపించారు. గజ్వేల్లో తక్కువ సమయంలోనే ఎక్కువ ఓట్లు సాధించానని తెలిపారు. గజ్వేల్లో నైతికంగా బీజేపీ గెలిచిందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రజలను నమ్ముకున్న నాయకుడు కాదని మండిపడ్డారు. స్థానిక నేతలను భారీ మొత్తానికి కొని కేసీఆర్.. గజ్వేల్లో గెలిచారని ఆరోపించారు. విద్యార్థి దశ నుంచి ఇప్పటివరకు తనకు ఓటమి తెలియదని అన్నారు. గజ్వేల్లో ఓటమి తనలో ఇంకా కసి పెంచిందని రాజేందర్ తెలిపారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల టిక్కెట్ దక్కించుకున్న ఈటల రాజేందర్.. ఆ రెండు చోట్ల ఓడిపోవడం గమనార్హం. గజ్వేల్లో మాజీ సీఎం కేసీర్ చేతిలో ఓడిపోగా.. తనకు కంచుకోట లాంటి హుజురాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. చదవండి: ఉన్న వనరుల్నే వాడుకుంటాం : సీఎం రేవంత్ -
రెండు చోట్ల ఓడిన ఈటల రాజేందర్
-
ఈటల భూముల కోసమే రూ. 27 కోట్లు ఇచ్చా
భీమారం: బీజేపీ నేత ఈటల రాజేందర్ భూముల కోసమే రూ. 27 కోట్లు చెక్కుల రూపంలో ఇచ్చానని, ఆ భూముల వ్యవహారంలో తనకు నోటీసులు ఇచ్చిన ఐటీ అధికారులు... ఆయనకు ఎందుకు ఇవ్వలేదని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ గడ్డం వివేక్ ప్రశ్నించారు. బీజేపీలో ఉన్నాడనే ఉద్దేశంతోనే ఈటలకు నోటీసులు కూడా ఇవ్వడం లేదా అని నిలదీశారు. గురువారం మంచిర్యాల జిల్లా భీమారం మండలం కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వివేక్... బీఆర్ఎస్తోపాటు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీలో ఉన్నప్పుడు తనను సీతలా చూసిన ఆ పార్టీ నేతలు... కాంగ్రెస్లో చేరాక రావణుడిలా చూస్తున్నారన్నారు. చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చెప్పి తనపై కేంద్ర సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. గతంలో హుజూరాబాద్, మునుగోడులో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం తాను అహర్నిశలు కృషి చేశానని చెప్పారు. బాల్క సుమన్ ఫిర్యాదుతో ఐటీ అధికారులు 8 చోట్ల సోదాలు నిర్వహించి దాదాపు 12 గంటలపాటు తాను ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకున్నారని వివేక్ ఆరోపించారు. ఆ కంపెనీ నా మిత్రుడిదే... తాను నిజాయతీతో వ్యాపారం చేస్తున్నానని, ఇప్పటివరకు రూ. 10 వేల కోట్ల మేర పన్నులు చెల్లించా నని వివేక్ వివరించారు. 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్కు కూడా ఆర్థిక సాయం చేశానని, అలాంటిది తనపై దాడులు చేయించారన్నారు. కేసీ ఆర్కు దమ్ముంటే ఈ ఎన్నికల్లో గెలవాలని సవాల్ విసిరారు. తప్పుడు ఆరోపణలతో బీజేపీ, బీఆర్ఎస్ కలసి తనను అరెస్టు చేయాలని కుట్ర చేస్తున్నా యని వివేక్ ఆరోపించారు. రూ. 20 లక్షల కంపెనీ రూ. 200 కోట్ల మేర లావాదేవీలు చేసిందని అంటున్నారని, కానీ ఆ కంపెనీ తన మిత్రుడికి చెందినదని వివేక్ తెలిపారు. చట్ట నిబంధనల ప్రకారమే తాను ఆ కంపెనీని చూసుకుంటున్నానని చెప్పారు. ఇటీవలే ఆ కంపెనీ షేర్లు అమ్మితే రూ. 50 కోట్ల లాభం వచ్చిందని, అందులో రూ. 9 కోట్లను పన్నుగా చెల్లించామని వివేక్ వివరించారు. -
గజ్వేల్ లో బీజేపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఈటల
-
హుజురాబాద్లో బీజేపీకి మూడో స్థానమే : హరీశ్రావు
సాక్షి, హుజురాబాద్ : హుజురాబాద్లో సర్వేలన్నీ కౌశిక్ రెడ్డికి మొదటి స్థానాన్ని ఇస్తున్నాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉందని, బీజేపీ అయితే మూడో స్థానానికి పడిపోయిందని చెప్పారు. హుజురాబాద్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కౌశిక్ రెడ్డి ప్రజా జీవితంలో ఆల్ రౌండర్. కౌశిక్ రెడ్డి అంటే ముఖ్యమంత్రికి చాలా ఇష్టం. కౌశిక్ రెడ్డి గెలిచిన తర్వాత సీఎం వద్దకు వెళ్లి నియోజకవర్గ కోసం నిధులు తీసుకొస్తాడు. ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఈటల గెలిచిన నియోజకవర్గంలో తట్టెడు మన్ను కూడా పోయలేదు. ఇక్కడి ప్రజలను పూర్తిగా విస్మరించాడు. కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీ గెలిచినా తెలంగాణ మరోసారి అంధకారంలోకి వెళ్లిపోతుంది. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో సౌభాగ్య లక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 3వేల రూపాయలు అందిస్తాం. ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి 15 లక్షలకు పెంచుతాం. గ్యాస్ సిలిండర్ను కేవలం రూ. 400కు అందిస్తాం. కేసీఆర్ ధీమా ఇంటింటికి బీమా కింద రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ఎవరైనా మరణిస్తే 5 లక్షలు ఇస్తాం. ఇదీ చదవండి..సీబీఐ, ఈడీ విచారణకు కేసీఆర్ సిద్ధమా?: రేవంత్ సవాల్ హుజురాబాద్లో పేదలకిచ్చిన అసైన్ భూములన్నిటికీ బీఆర్ఎస్ గెలిచిన తర్వాత పట్టాలు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఏది కావాలన్నా ఢిల్లీ దగ్గర మోకరిల్లాల్సిందే. మొన్న కర్ణాటక నుంచి డీకే శివకుమార్ వచ్చి అక్కడ రోజుకు 5 గంటల కరెంటు ఇస్తున్నాం అని చెప్పాడు. డీకేకు తెలంగాణలో 24 గంటల కరెంటు ఉన్నది అనే విషయం కూడా తెలియదు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ వస్తే మోటర్లు జీపులో వేసుకొని పోతారు. దొంగ రాత్రి కరెంటు వస్తుంది. కాంగ్రెసోళ్లు కర్ణాటకలో ఆరు నెలలు గడవకముందే ఇచ్చిన హామీలను ఎగ్గొడుతున్నారు. కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అని మాట్లాడారు. రైతుకు రైతుబంధు ఇవ్వడం దుభారా అవుతుందా.. అలాగే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చే రైతు బంధును బిచ్చమేస్తున్నాం అన్నాడు. రైతుబంధు తీసుకునే రైతులను బిచ్చగాళ్ళ తో పోలుస్తూ మాట్లాడటం సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ప్రజల పరిస్థితి అధోగతి పాలవుతుంది’ అని హరీశ్ రావు హెచ్చరించారు. ఇదీ చూడండి.. మిషన్ తెలంగాణ -
కమలాన్ని ఆ ఇద్దరే ముంచారా..?
సాక్షి, హైదరాబాద్ : నాయకుల వల్ల పార్టీకి మేలు జరుగుతోందా? పార్టీ వల్ల నాయకులు లబ్ది పొందుతున్నారా? పార్టీకి ఇమేజ్ పెరిగితే లాభ పడేది ఎవరు? నాయకులకు పేరొస్తే ఎవరికి లాభం చేకూరుతుంది? ఇప్పుడు తెలంగాణ కమలం పార్టీలో ఇదే చర్చ జరుగుతోంది. ఇద్దరు నాయకుల వ్యవహారంపై హాట్ హాట్గా అంతర్గత చర్చలు సాగుతున్నాయి. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరు? వారే ఎందుకు చర్చనీయాంశాలుగా మారారు? కాషాయసేనకు తెలంగాణ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు, ప్రస్తుత జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఒకే జిల్లాకు చెందినవారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు ముఖ్యమైన బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బండి సంజయ్ రాజకీయ జీవితం అంతా బీజేపీలోనే కొనసాగుతోంది. ఈటల రాజేందర్ కొంతకాలం క్రితం గులాబీ పార్టీ నుంచి కాషాయ పార్టీలోకి వచ్చారు. ఉప ఎన్నికల్లో కేసీఆర్ను ధిక్కరించి కమలం పార్టీ తరపున మళ్ళీ హుజూరాబాద్నుంచి అసెంబ్లికి ఎన్నికయ్యారు. అయితే ఇద్దరి మధ్యా ఏర్పడిన విభేదాల అగాధం తెలంగాణ బీజేపీని ఓ కుదుపు కుదుపుతోంది. ఈటల వచ్చాకే రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి బండి సంజయ్కు దూరమైందనే చర్చలు సాగుతున్నాయి. బండిని అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత పార్టీ డీలా పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఆ ఎఫెక్ట్ ఇంకా పార్టీని వీడకపోగా..కాంగ్రెస్ ను కాదని సెకండ్ ప్లేస్ కు వచ్చి కారు పార్టీని ఢీకొట్టే స్థాయికి చేరిన కమలం పార్టీ..ఇప్పుడు మూడోస్థానంతో డీలా పడిపోవడంతో.. పార్టీలో అంతర్గతంగా ఈ చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని అనుకుని కమలం బాట పట్టిన ఈటల.. గులాబీ పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీని పరుగులు తీయిస్తున్న బండి సంజయ్ పై బాగానే ఫోకస్ చేశారు. ఈ క్రమంలో బండి వర్సెస్ ఈటల అన్నట్లుగా పార్టీలో వ్యవహారాలు మారాయి. ఇద్దరు నేతలు బాహాటంగానే ఒకరిపై మరొకరు కామెంట్స్ చేసుకోవడం..ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్రస్థాయిలో కీలకంగా ఉన్న ఓ నేత అడ్వాంటేజ్ గా తీసుకోవడం వంటి పరిణామాలు కొన్ని జరిగాయి. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండికి అప్పటికే నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ వంటివాళ్ళతో పొసగకపోవడం వంటి ఎన్నో కారణాలు, సంఘటనలు అన్నీ కలిసి..బండిని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించేలా చేశాయి. కొందరు నేతల మాట విన్న ఢిల్లీ పెద్దలు బండిని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో...బీజేపీ గ్రాఫ్ మొత్తం వేగంగా పడిపోయింది. అయితే, ఈ మొత్తం వ్యవహారానికి ఈటల రాజేందర్ పార్టీలో చేరికే ప్రధాన కారణమనేవారూ కొందరు తయారయ్యారు. దీంతో ఈటల చేరిక ఇప్పుడు బీజేపీకి ప్లస్సా..?మైనస్సా..అనే చర్చకు తెరలేపింది. బండి సంజయ్ విషయానికొస్తే.. మూడుసార్లు కరీంనగర్లో కార్పోరేటర్ గా పనిచేసి.. రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా.. తిరిగి పుంజుకుని కరీంనగర్ నుంచే ఎంపీగా గెల్చారు. ఆ తర్వాత అనూహ్యంగా బీజేపీ పెద్దల ఆశీస్సులతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడయ్యారు. బండి సంజయ్ రాష్ట్ర పార్టీ పగ్గాలు చేతబట్టినప్పటినుంచీ పరుగులు తీయించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ కేడర్లో ఒక కొత్త జోష్ నింపారు. బండి సంజయ్ కంటే ముందు.. బండి సంజయ్ హయాంలో.. బండి సంజయ్ తర్వాత.. బీజేపీ ఎలా ఉందనే స్పష్టమైన గ్రాఫ్ ను జనం ముందు బండి ఉంచారు. బండి హయాంలో పార్టీ గ్రాఫ్ అమాంతంగా పెరిగిందనే టాక్ కమలం శ్రేణుల్లో తీసుకురాగలిగారు. ఉమ్మడి రాష్ట్రంలో గాని..తెలంగాణలో గాని ఎవరికీ రానంత క్రేజ్తో ఓ సక్సెస్ ఫుల్ రథసారధిగా పేరు తెచ్చుకున్నారు బండి సంజయ్. ఇదే సమయంలో పార్టీలో వచ్చిన ఈ పేరును కాపాడుకోవడంలో మాత్రం సంజయ్ వైఫల్యం చెందాడనేవారూ ఉన్నారు. అందరినీ కలుపుకోలేకపోవడం.. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మొద్దో క్లారిటీ లేకపోవడం.. చేయకూడనివి చేయడం, చేయాల్సినవి చేయకపోవడం.. మీడియా ముందు ఆచితూచి మాట్లాడాల్సిన చోట తప్పటడుగులు వేయడం వంటివన్నీ.. పార్టీలోని ఆయన అంతర్గత ప్రత్యర్థులకు అస్త్రాలుగా మారాయి. అప్పటికే పార్టీ అంతర్గత ప్రథమ ప్రత్యర్థిగా తయారైన ఈటల రాజేందర్తో పాటు..బండి అంటే పడనివారంతా ఏకమై ఆయనపైకి తమ వద్ద ఉన్న అస్త్రాలను ఎక్కుపెట్టడంతో.. బండి పదవి ఊడిందనే టాక్ నడుస్తోంది. బండి సంజయ్ సారథిగా ఉన్నంతకాలం ఒక బూమ్ తో కనిపించిన బీజేపి ఎదుగుదల పాలపొంగులా పడిపోవడంతో.. ఇప్పుడు ఆ పార్టీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఒక రాజకీయ పార్టీని బలోపేతం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక్కసారిగా పుంజుకోవడం అంటే అంత సులభంగా జరిగేది కూడా కాదు. కానీ, బండి సారథ్యంలో బలంగా తయారైన పార్టీని, అధికార బీఆర్ఎస్ ను ఢీకొట్టే పార్టీగా తయారైన పార్టీని.. అందరూ కలిసి నిండా ముంచేశారన్నది ఇప్పుడు వినిపించే టాక్. దీంతో ఈటల చేరిక.. సంజయ్ అధ్యక్ష పదివి నుంచి దిగిపోవడం.. రెండూ పార్టీకి మేలు కంటే నష్టాన్నే చేకూర్చాయనే చర్చోపచర్చలకు తెరలేచింది. మరిప్పుడు మునిగిపోతున్న బీజేపీ నావను.. తిరిగి గట్టెక్కించే అవకాశం అసలుందా...? మరి ఇదంతా బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందమేనా..? లేక కీలక నేతలైన బండి, ఈటల వైరమే.. పుట్టి ముంచిందా అనే భిన్నరకాల విశ్లేషణలు జనం మధ్య జరుగుతున్నాయి. -
ఈటల ఎవరినీ ఎదగనివ్వలేదు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఈటల రాజేందర్ ముదిరాజుల్లో ఎవరిని ఎదగనివ్వలేదని అందుకే బండ ప్రకాష్ను తీసుకొచ్చి పదవులిచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం టీటీడీపీ మాజీ చీఫ్ కాసాని ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌజ్లో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఇప్పుడు ఈటల రాజేందర్ కన్నా పెద్ద మనిషి కాసాని బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారన్నారు. రాజ్యసభ ఎమ్మెల్సీ పదవులు ముదిరాజ్ లకు వస్తాయని తెలిపారు. ముదిరాజ్ ల నుంచి ఎక్కువ సంఖ్యలో నాయకులు తయారు అవ్వాలని పిలుపునిచ్చారు. ఎన్నికల తరువాత ముదిరాజ్ లతో సమావేశం అవుతానన్నారు.బీఆర్ఎస్ హయాంలో వృత్తి పరంగా ముదిరాజ్ లకు న్యాయం జరిగిందన్నారు. -
వివేక్ దారిలోనే కొండా? ఆయన వెంటే..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ బీజేపీ నేతలు ఒక్కరొక్కరుగా కాంగ్రెస్తో చేయి కలుపుతున్నారు. మొన్న రేవూరి ప్రకాశ్ రెడ్డి, నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తాజాగా వివేక్ వెంకటస్వామి పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్లారు. వీరి దారిలోనే బీజేపీ సీనియర్ నేత, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా పయనించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రెండు లిస్టుల్లో 53 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ మూడో లిస్టు పై ఢిల్లీలో కసరత్తు చేస్తోంది. ఇదే పని మీద స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. జనసేన తో పొత్తులో భాగంగా ఆ పార్టీకి కేటాయించే సీట్లపైనా బీజేపీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు టాక్. ఈ పొత్తులో భాగంగా సెటిలర్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి సీటును జనసేనకు కేటాయిస్తారన్న లీకులు బయటికి వస్తున్నాయి. శేరిలింగంపల్లి సీటు విషయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. తన పార్లమెంటు నియోనజకవర్గం పరిధిలోకి వచ్చే సీటును జనసేనకు ఎలా ఇస్తారని, ఎప్పటినుంచో నియోజకవర్గంలో పనిచేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ కొడుకు రవియాదవ్ కే సీటు కేటాయించాలని కొండా పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ సీటును రవియాదవ్ కు ఇవ్వకపోతే తానూ బీజేపీకి రిజైన్ చేస్తానని పార్టీకి అల్టిమేటం ఇచ్చినట్టు సమాచారం. ఈ వ్యవహారం ఇలా ఉంటే కొండా పార్టీని వీడితే ఆయన బాటలోనే స్టేట్ బీజేపీ మరో టాప్ లీడర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా వెళ్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఈటల భార్య జమునా రెడ్డి కొండాకు దగ్గరి బంధువవుతారు. రాజకీయంగా వీళ్లంతా కలిసి నడిచే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. తాజా పరిణామాలతో స్టేట్ బీజేపీ నుంచి నెక్ట్స్ ఎవరు అనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది. ఇదీ చదవండి: బీజేపీకి గడ్డం వివేక్ రాజీనామా.. కాంగ్రెస్లో చేరిక -
శాసనసభ ఎన్నికల్లో రికార్డులే రికార్డులు..
తెలంగాణ మంత్రి టి.హరీశ్ రావు సిద్దిపేటలో పలు రికార్డులు సృష్టించారు. ఆయన మూడు ఉప ఎన్నికలతో సహా ఆరుసార్లు ఇంతవరకు గెలిచారు. ఈ సారి గెలిస్తే ఏడోసారి గెలిచినట్లవుతుంది. 2004లో బీఆర్ఎస్ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేటతో పాటు కరీంనగర్ నుంచి పోటీ చేసి రెండు చోట్ల గెలిచారు. ఆ తర్వాత ఆయన కేంద్ర మంత్రి అయి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తదుపరి జరిగిన ఉప ఎన్నికలో హరీష్ రావు విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయనకు తిరుగులేదు. 2018 ఎన్నికలలో హరీశ్రావు తెలంగాణలోనే అత్యధిక మెజార్టీ సాధించారు. ఆయనకు తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీనివాసరెడ్డిపై 118669 ఓట్ల మెజార్టీ వచ్చింది. 2014లో ఆయనకు 93328 ఓట్ల ఆధిక్యత లభించింది. 2010 ఉప ఎన్నికలో ఆయనకు 95853 ఓట్ల మెజార్టీ లభించింది. 2009లో హరీష్ రావుకు 64677 ఓట్ల ఆధిక్యత, 2008 ఉప ఎన్నికలో 58935 ఓట్ల మెజార్టీ సాధించారు. ఆయన 2004 లో జరిగిన ఉప ఎన్నికలో మాత్రం 24827 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఆ తర్వాత నాలుగుసార్లు ఏభై వేల మించి మెజార్టీ సాధించడం, అందులోను ఒకసారి లక్ష ఓట్ల ఆధిక్యతను అధిగమించడం ఒక రికార్డే అని చెప్పాలి. హరీష్ పై ఐదుసార్లు పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్ధులకు డిపాజిట్లు రాకపోవడం కూడా మరో విశేషం ►ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా తెలంగాణ శాసనసభ ఎన్నికలలో తనకంటూ ఒక చరిత్ర సృష్టించుకున్నారు. ఆయన ఇంతవరకు ఏడుసార్లు విజయం సాధించారు. 2004 నుంచి ఇంతవరకు ఓడిపోకుండా గెలుస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో వచ్చిన విబేధాల కారణంగా ఈటెల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ పక్షాన పోటీచేసి గెలవడం ఒక సంచలనం. ప్రస్తుతం పోటీచేస్తున్న నేతలలో ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత అత్యధిక సార్లు గెలిచిన నేతగా ఈటల ఉన్నారు. ఆయన మూడు ఉప ఎన్నికలలో కూడా గెలిచారు. 2004, 2008 ఉప ఎన్నికలలో కమలాపురం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. తదుపరి ఆ నియోజకవర్గం రద్దు కావడంతో హుజూరాబాద్ నుంచి 2009, 2010 ఉ.ఎ., 2014, 2018, 2021 ఉప ఎన్నికలో విజయకేతనం ఎగురవేశారు. ►తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కె.తారక రామారావు 2009లో తన రాజకీయ జీవితం ఆరంభించినప్పుడు శాసనసభ ఎన్నికలలో తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నారు. ఆ ఎన్నికలలో తెలంగాణలో అప్పటి టీఆర్ఎస్ తీవ్ర సంక్షోభానికి గురైంది. తెలుగుదేశం, సీపీఐ, సీపీఎంలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసుకుని పోటీ చేసినా కేవలం పది సీట్లలోనే టీఆర్ఎస్ గెలిచింది. ఆ క్రమంలో కేటీఆర్ కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసిన కె.కె.మహేందర్ రెడ్డి నుంచి గట్టి పోటీని తట్టుకుని కేవలం 171 ఓట్ల ఆధిక్యతతోనే గెలిచారు. కాని ఆ తర్వాత మాతరం భారీ ఆధిక్యతలతో ఆయన గెలుస్తూ వస్తున్నారు. 2010 ఉప ఎన్నికలో 68220 ఓట్ల మెజార్టీ, 2014లో 53004 ఓట్లు, 2018లో 89009 ఓట్ల మెజార్టీతో గెలుపొంది రాజకీయాలలో రాణిస్తున్నారు. ఇంతవరకు నాలుగుసార్లు ఆయన పోటీచేయగా, మూడు సార్లు ఆయనకు ప్రత్యర్ధిగా మహేందర్ రెడ్డే ఉన్నారు. -
19 ఏళ్ల తరువాత రెండు స్థానాలకు కరీంనగర్ నేత పోటీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అసెంబ్లీ బరిలో నిలిచే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాలు ఉండగా.. తొమ్మిది స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. తొలిజాబితా అభ్యర్థులకు శనివారం రాత్రే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఫోన్ చేసి పోటీకి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినా అధికారికంగా ప్రకటించేవరకూ ఈ విషయాన్ని ఎవరూ వెల్లడించలేదు. 2018 ఎన్నికలతో పోల్చితే నాయకుల విషయంలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు స్థానాల్లో ప్రాతినిధ్యం కరవవడం.. లేదా పొత్తులతో సాగే చరిత్ర ఉన్న బీజేపీ తాజాగా బలోపేతమైంది. ప్రస్తుతం ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు, ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే, అలాగే మున్సిపల్ మాజీ చైర్పర్సన్, జెడ్పీటీసీ, మాజీ ఎమ్మెల్యే బరిలో ఉండటం గమనార్హం. పార్టీ ప్రకటించింది వీరినే.. ► కోరుట్లకు ధర్మపురి అరవింద్, జగిత్యాలకు భోగ శ్రావణి, ధర్మపురికి ఎస్.కుమార్, చొప్పదండికి బొడిగె శోభ, రామగుండంకు కందుల సంధ్యారాణి, సిరిసిల్లకు రాణీ రుద్రమదేవి, కరీంనగర్కు బండి సంజయ్, మానకొండూరుకు ఆరెపల్లి మోహన్, హుజూరాబాద్కు ఈటల రాజేందర్ పేర్లను పార్టీ ప్రకటించింది. ఈటల తన సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్తోపాటు ప్రస్తుతం సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి కూడా బరిలోకి దిగనుండటం విశేషం. జిల్లా చరిత్రలో కేసీఆర్ తరువాత రెండుసార్లు బరిలోకి దిగుతున్న ఏకై క నాయకుడు ఈటల కావడం గమనార్హం. 2004లో కరీంనగర్ ఎంపీ, సిద్దిపేట అసెంబ్లీకి పోటీ చేసిన కేసీఆర్.. రెండుచోట్లా విజయం సాధించారు. తరువాత సిద్దిపేట స్థానానికి రాజీనామా చేశారు. దాదాపు 19 ఏళ్ల తరువాత కరీంనగర్ నుంచి రెండుచోట్ల అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుండటం విశేషం. ముగ్గురు సీఎం అభ్యర్థులు ► బీసీ సీఎం నినాదంతో బీజేపీ ఈసారి ఎన్నికల బరిలోకి దిగే యోచనలో ఉంది. పార్టీలో బీసీ సీఎం అభ్యర్థి ప్రతిపాదన రాగానే.. ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల మధ్య పోటీ మొదలైంది. మరోవైపు తాను ఏమాత్రం తక్కువా..? అన్నట్లు కోరుట్ల అసెంబ్లీ నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రంగంలోకి దిగారు. ► బండి సంజయ్ 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గంగుల కమలాకర్ చేతిలో పరాజయం పాలయ్యారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించారు. ఆ తరువాత రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టి బీజేపీకి ఊపు తెచ్చారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీని విజయతీరా లకు చేర్చారు. 8శాతం ఉన్న ఓటుబ్యాంకును అమాంతం పెంచారు. పార్టీ తరఫున బీసీ సీఎంగా తమ నాయకుడే ఉండాలని రాష్ట్రవ్యాప్తంగా సంజయ్ అనుచరులు కోరుకుంటున్నారు. ► తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ వేదికగా రాజకీయ ఆరంగేట్రం చేసిన ఈటల రాజేందర్ 2004, 2008, 2009, 2010, 2014, 2018, 2021లో వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా, శాసనసభాపక్ష నేతగా పనిచేసిన అనుభవంతో రాజేందర్ సైతం పార్టీ సీఎం అభ్యర్థి అవుతారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. ► ఎలాగైనా అసెంబ్లీ బరిలో ఉండాలన్న పట్టుదలతో కొంతకాలంగా ధర్మపురి అర్వింద్ కోరుట్లలో చాపకింద నీరులా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కె.విద్యాసాగర్రావు కుమారుడు సంజయ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. సంజయ్ కొత్త అభ్యర్థి కావడం, తాను ఎంపీగా ఉన్న నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోనే కోరుట్ల ఉండటం, తన అమ్మమ్మ ఊరు కావడం, సొంత సామాజికవర్గం సహకారం తదితరాల లెక్కలతో అర్వింద్ ఈసారి కోరుట్లపై కన్నేశారు. బండి సంజయ్ జన్మదినం: 11–07–1971 విద్యార్హతలు: గ్రాడ్యుయేషన్ స్వగ్రామం: కరీంనగర్ అనుభవం: 2005, 2014లో కార్పొరేటర్, 2014, 2018 ఎమ్మెల్యే స్థానానికి పోటీ, 2019 ఎంపీగా విజయం. అదనపు సమాచారం: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి, ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శి సామాజిక వర్గం: మున్నూరుకాపు ఈటల రాజేందర్ జన్మదినం: 20–03–1964 విద్యార్హతలు: పీజీ (ఉస్మానియా) స్వగ్రామం: కమలాపూర్ (ప్రస్తుతం హన్మకొండ జిల్లా) అనుభవం: ఏడుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రి, శాసనసభ పక్షనేత అదనపు సమాచారం: 2021లో బీజేపీలో చేరిక. చేరికల కమిటీ చైర్మన్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్. సామాజిక వర్గం: ముదిరాజ్ పోటీకి బండి, ఎస్.కుమార్ అనాసక్తి.. కేంద్రమంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరుగుతున్న క్రమంలో అసెంబ్లీకి పోటీ చేయాలని ఆదేశాలు రావడంపై బండి సంజయ్.. అసలు తనకు మాట మాత్రమైనా చెప్పకుండా ధర్మపురిలో పోటీ చేయాలని చెప్పడంపై ఎస్.కుమార్ అసంతృప్తితో ఉన్నారని సమాచారం. బొడిగె శోభ జన్మదినం: 1972 విద్యార్హతలు: పదవ తరగతి స్వగ్రామం: వెంకటేశ్వర్లపల్లె, సైదాపూర్ మండలం అనుభవం: 2001 శంకరపట్నం జెడ్పీటీసీ, 2014లో ఎమ్మెల్యే (బీఆర్ఎస్), 2018 ఎమ్మెల్యేగా ఓటమి. అదనపు సమాచారం: చొప్పదండి బీజేపీ ఇన్చార్జి సామాజికవర్గం: ఎస్సీ (మాదిగ) ధర్మపురి అర్వింద్ జన్మదినం: 25–08–1976 విద్యార్హతలు: ఎంఏ.పొలిటికల్ సైన్స్ స్వగ్రామం: నిజామాబాద్ అనుభవం: 2019 నిజామాబాద్ ఎంపీ, అదనపు సమాచారం: కేంద్ర వాణిజ్య స్టాండింగ్ కమిటీ సభ్యులు సామాజికవర్గం: మున్నూరుకాపు ఎస్.కుమార్ జన్మదినం: 10–10–1966 విద్యార్హతలు: ఎంసీజే, ఎల్ఎల్ఎం (ఉస్మానియా) స్వగ్రామం: గోదావరిఖని అనుభవం: రామగుండం మున్సిపాలిటీ చైర్మన్ 2004, 2009 ధర్మపురి ఎమ్మెల్యే స్థానానికి, 2019 పెద్దపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేసిన అనుభవం అదనపు సమాచారం: జర్నలిస్టుగా అనేక అవార్డులు, బీజేపీ జాతీయస్థాయిలో పలు పదవుల నిర్వహణ. సామాజికవర్గం: ఎస్సీ (మాల) ఆరెపల్లి మోహన్ జన్మదినం: 6–6–1955 విద్యార్హతలు:ఎంకామ్,ఎల్ఎల్బీ స్వగ్రామం: మానకొండూరు అనుభవం: సర్పంచి, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, విప్. 2009లో మానకొండూరు ఎమ్మె ల్యే, 2014, 2018లో అక్కడ నుంచే పరాజయం. అదనపు సమాచారం: 2019లో బీఆర్ఎస్లో చేరిక, టికెట్ ఆశించి భంగపడి కమలం గూటికి. సామాజికవర్గం: ఎస్సీ (మాదిగ) -
ముదిరాజ్ల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్: ముదిరాజ్ల ఆత్మగౌరవం దెబ్బతీసేవిధంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కేటాయించలేదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఆదివారం జరిగిన ముదిరాజ్ల ఆత్మగౌరవసభలో ఈటల మాట్లాడుతూ జనాభానిష్పత్తి ప్రకారం ముదిరాజ్ లు 11 శాతం ఉన్నారని, పదకొండుమందికి ఎమ్మె ల్యేలుగా అవకాశం దక్కాలని, ఇరవై ఏళ్ల నుంచి ఇద్దరు లేక ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. తెలంగాణలో బీసీలు 52 శాతం ఉంటే... 9 మంత్రి పదవులు రావాలని, కానీ మూడు మాత్రమే ఇచ్చారని చెప్పారు. ఒకశాతం జనాభా లేని జాతి నుంచి సీఎంతో పాటు నలుగురుæ మంత్రులు ఉన్నారన్నా రు. మేము ఈ రాష్ట్రానికి ఏటా రూ.20 వేల కోట్ల ఆదాయం ఇస్తున్నామని, కానీ మీరు చేపపిల్లల పేరిట రూ. 500 కోట్లు ఖర్చు చేస్తున్నారని, చేపపిల్లలు కాదు నేరుగా నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓట్లు మావే సీట్లు మావే నినాదంతో బీసీలు ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు ముదిరాజ్లకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్ల ఆత్మగౌరవ సభను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారని, మీటింగ్కు వెళితే ప్రభుత్వ పథకాలు రావని బెదిరించారని ఈటల ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అన్నింటిని ఎదుర్కొని ఆత్మగౌరవసభకు భారీగా తరలివచ్చారన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితం అందరికీ తెలుసని తాను ప్రజల మనిషినని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా, గుండాలు చంపుతామని బెదిరించినా వెనక్కి తగ్గలేదని, రాష్ట్రంలో అన్ని కులాల సమస్యలపై గొంతెత్తి పోరాడానని గుర్తు చేశారు. ముదిరాజ్లను బీసీ డి నుంచి బీసీ ఏలోకి మార్చాలని తాను ఎమ్మెల్యే అయిన మొదటిరోజు నుంచే కొట్లాడుతున్నానని, వైఎస్.రాజశేఖరరెడ్డి 2008 జడ్చర్ల సభలో ముదిరాజ్లను బీసీడి నుంచి బీసీ ఏలోకి మారుస్తా అని చెప్పారని, అదే సభలో మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ ప్రకటించారన్నారు. అయితే బీసీ ఏ రిజర్వేషన్ ఒక్క సంవత్సరం మాత్రమే అమలైందని, మైనారిటీ వారు ఏడుగురు ఎమ్మెల్యేలుగా ఉన్నారని, సుప్రీంకోర్టుకు వెళ్లి వారు గెలిచారని, మనకు ఎవరు లేక పట్టించుకోవడం లేదని చెప్పారు. మేం వేరే రాష్ట్రం నుంచి వచ్చామా : నీలం మధు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఏ పార్టీ అయినా మా ముదిరాజ్లను గుండెల్లో పెట్టుకొని ఎవరు ఎన్ని సీట్లు కేటాయిస్తారో, వారితోనే పొత్తు పెట్టుకొని వారితోనే ఉంటామని ముది రాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు నీలంమధు చెప్పారు. ఆరోజు తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఎలా పోరాడామో.. అదే ఆత్మగౌరవం ముదిరాజ్ జాతికి దక్కేలా పోరాడతామన్నా రు. బీసీల్లో 60 లక్షల మంది ఉన్న ముదిరా జ్లకు రాజకీయ గుర్తింపు లేదా..?మేము వేరే రాష్ట్రం నుంచి వచ్చామని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ముదిరాజ్లందరం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆత్మగౌరవ సభతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ దద్దరిల్లింది. ఈటల రాజేందర్ ప్రసంగిస్తుండగా సభకు హాజరైన పలువురు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట శంకర్, పులుమేడ రాజు, చొప్పారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
TS Election 2023: కాంగ్రెస్, బీఆర్ఎస్.. మజ్లిస్ ఆత్మలే..! : మంత్రి కిషన్రెడ్డి
వరంగల్: భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే.. తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం 13 నెలల భీకర పోరాటం.. వేలాది మంది బలిదానాలతో వచ్చిందని, ఈ వాస్తవాలను నిజాం వారసుడు ఖాసీం రజ్వీకి చెందిన మజ్లిస్ పార్టీ కోసం నాడు కాంగ్రెస్.. నేడు బీఆర్ఎస్ సర్కార్ వక్రీకరిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి మండిపడ్డారు. ఈరెండు పార్టీలు.. మజ్ల్లిస్ ఆత్మలేనని చెప్పుకొచ్చారు. తెలంగాణ సమైక్యతా దినోత్సం పేరిట కేసీఆర్ సర్కారు తెలంగాణకు ఉన్న చరిత్ర కనుమరుగు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే.. వచ్చే ఏడాది సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతూ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి బైక్ ర్యాలీగా పరకాల అమరధామం చేరుకున్నారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. పరకాల పశువుల సంతలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అధ్యక్షత వహించగా.. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి హాజరయ్యారు. ముందుగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. భుక్తి కోసం.. స్వేచ్ఛా వాయువుల కోసం తుపాకులకు గుండెలను ఎదురుపెట్టి వేలాది మంది బలిదానాలతో 75 సంవత్సరాల తెలంగాణ విమోచన చరిత్రను దాచిపెట్టిన మొదటి ముద్దాయి కాంగ్రెస్ అన్నారు. అలాంటి పార్టీకి తెలంగాణలో విమోచన దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదన్నారు. కేసీఆర్ చదివిన 80 వేల పుస్తకాల్లో నాటి తెలంగాణ చరిత్ర గురించి లేదా అని ప్రశ్నించారు. చరిత్రకారులు విమోచన దినోత్సవం అంటారని.. తెలంగాణ సమైక్యత అనే వారంతా చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు ఓటేస్తే సోనియాగాంధీ కుటుంబం కోసమన్న ఆయన బీఆర్ఎస్కు ఓటు వేస్తే కేసీఆర్ కుటుంబం కోసమేనన్నారు. అదే బీజేపీకి ఓటు వేస్తే ప్రజల కోసం పార్టీ పని చేస్తుందన్నారు. ఆత్మగౌరవం ఉన్నోళ్లు.. బీఆర్ఎస్కు ఓటు వేయరు : ఈటల బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మగౌరవం ఉన్నవాళ్లు ఎవరూ బీఆర్ఎస్కు ఓటు వేయరని అన్నారు. కులమతాలకతీతంగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని మహా భారతంలో ధర్మరాజు సిద్ధాంతంతో ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎవరికి భయపడి అధికారికంగా నిర్వహించడం లేదని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. కేసీఆర్ సర్కార్ ఉద్దెర బేరం చేస్తుండగా.. బీజేపీ నగదు చెల్లించే పని చేస్తోందన్నారు. తనను ఓడించేందుకు ఉప ఎన్నికల్లో ఊరురా తిరిగిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ఈసారి ఓడించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అమరధామం వద్ద స్వాతంత్య్ర సమరయోధులను, సాయుధ పోరాటంలో అసువులు బాసిన వారి వారసులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ చాడ సురేశ్రెడ్డి, గరికపాటి మోహన్రావు, మాజీ ఎమ్మెల్యే గుండె విజయరామారావు, మార్తినేని ధర్మారావు, మొలుగూరి భిక్షపతి, జయపాల్, కొండేటి శ్రీధర్, చింతల రామచంద్రారెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, వరంగల్ పార్లమెంట్ ప్రబారీ మురళీధర్గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి, డాక్టర్ సిరంగి సంతోశ్కుమార్, రాష్ట్ర నాయకులు డాక్టర్ కాళీప్రసాద్రావు, దేవు సాంబయ్య, కాచం గురుప్రసాద్, ఎర్రబెల్లి ప్రదీప్రావు, ఏనుగుల రాకేశ్రెడ్డి, గుజ్జుల సత్యనారాయణరావు, కాచం గురుప్రసాద్, మార్త భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి నాయకులపై థర్డ్ డిగ్రీ అమానుషం.. పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని ప్రశ్నించి ఆందోళన చేసిన విద్యార్థులపై యూనివర్సిటీ అధికారులు కేసులు పెట్టి పోలీసులతో థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అమానుషం అని కిషన్రెడ్డి అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో వీసీ, రిజిస్ట్రార్లను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ విద్యార్థి సంఘాల జేఏసీ చేపట్టిన నిరాహార దీక్షా శిబిరాన్ని శుక్రవారం రాత్రి కిషన్రెడ్డి.. నాయకులతో కలిసి సందర్శించారు. పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థులను పరామర్శించి సంఘీభావం తెలిపారు. టాస్క్ఫోర్స్ పోలీ సులతో కొట్టించిన ఘటనపై డీజీపీ దృష్టికి తీసుకెళ్తానని కిషన్రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఈ నెల 18 నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని ఎంఎస్ఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ తిరుపతి మాదిగ, బాధ్యులు కలిసి మంత్రి కిషన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. -
గుడుంబా పోయి.. కేసీఆర్ బాటిల్ వచ్చింది: ఈటల
సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్రంలో గుడుంబా సీసాలు పోయి.. కేసీఆర్ బాటిల్ వచ్చిందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట, కొల్లాపూర్ పట్టణాల్లో బుధవారం నిర్వహించిన బీజేపీ నియోజకవర్గ స్థాయి బూత్ కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఏటా రూ.10,700 కోట్లున్న మద్యం ఆదాయం.. ఇప్పుడు రూ.45 వేల కోట్లకు చేరిందని ఆరోపించారు. మాజీ మంత్రి చిత్తరంజన్తో భేటీ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత చిత్తరంజన్దాస్తో కల్వకుర్తిలోని ఆయన నివాసంలో ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిత్తరంజన్ దాస్ను ఈటల బీజేపీలోకి ఆహ్వానించారు. కార్యక ర్తలు, అనుచరులతో చర్చించాక నిర్ణయం తీసుకుంటానని చిత్తరంజన్దాస్ ‘సాక్షి’కి తెలిపారు. ఇదీ చదవండి: నెలాఖరుకు బీజేపీ తొలి జాబితా? -
TS Election 2023: అధికారం ఎవరి సొత్తు కాదు! ఒక్క చాన్స్ ఇవ్వండి!
సంగారెడ్డి: జిల్లాతో బీజేపీకి అవినాభావ సంబంధం ఉందని, రెండు సార్లు మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఇక్కడి ప్రజలు బీజేపీని గెలిపించారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా అన్ని వర్గాల ప్రజలు పార్టీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు సోమవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా స్థానిక అంబేడ్కర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పార్టీ విజయ సంకల్ప సభలో కిషన్రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని, ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రభుత్వ భూములను అమ్మిన డబ్బులతో జీతాలిచ్చే పరిస్థితికి చేరిందని విమర్శించారు. రానున్న 90 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయని, కుటుంబం కోసం పనిచేసే పార్టీలను పక్కన బెట్టి, దేశం, రాష్ట్రం కోసం పనిచేసే బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్కు ఓటేస్తే కేసీఆర్ కుటుంబమే బాగుపడుతుందని, కాంగ్రెస్కు ఓటేస్తే సోనియా కుటుంబానికే మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల మాట్లాడుతూ, ప్రధాని మోదీ దేశాన్ని విశ్వగురువుగా నిలుపుతున్నారన్నారు. సమర్థవంతమైన పాలనతో ప్రగతిపథంలో నడుతున్నారని కొనియాడారు. ఇంట్లో ఇద్దరికి పింఛన్: ఈటల రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కుటుంబంలో ఇద్దరికి పింఛన్లు ఇస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించారు. రైతుబంధు పథకం అర్హులైన రైతులు, కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామన్నారు. దళితబంధు వంటి పథకాన్ని కలెక్టర్లుకు కూడా ఇస్తామన్న కేసీఆర్ తీరును తప్పుబట్టారు. ఈ పథకాన్ని డబ్బులున్న వారికి ఇవ్వబోమని, నిరుపేద దళితులకే అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి మాటలకు, చేతలకు ఏ మాత్రం పొంతన ఉండదని విమర్శించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీఆర్ఎస్కు ఓటమి తప్పలేదన్నారు. త్వరలో హైదరాబాద్లో నిర్వహించనున్న సీడబ్ల్యూసీ సమావేశాల్లో బీసీల జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తామని తీర్మానం చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు డిమాండ్ చేశారు. కేసీఆర్ కేబినెట్లో బీసీలకు ప్రాధాన్యం లేదని, కేంద్ర మంత్రి వర్గంలో బీజేపీ వారికి పెద్దపీట వేసిందని వివరించారు. ఈ వర్గాలు పార్టీ వైపు మొగ్గు చూపుతున్నాయని పేర్కొన్నారు. పార్టీలో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్ పులిమామిడిరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం.. ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. అధికారం ఎవరి సొత్తు కాదని, కొందరు నాయకులు గెలిచాక ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించుకుంటామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆ నాయకులు విజయ్పాల్రెడ్డి, నందీశ్వర్గౌడ్, రాజేశ్వర్రావు దేశ్పాండే, గోదావరి అంజిరెడ్డి, శ్రీకాంత్గౌడ్, జైపాల్రెడ్డి పాల్గొన్నారు. -
హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలి : ఈటల రాజేందర్
-
TS Election 2023: 'బీజేపీ ప్రభంజనాన్ని' ఎవరూ ఆపలేరు! : ఈటల రాజేందర్
మహబూబాబాద్: రాష్ట్రంలో బీజేపీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని, బీఆర్ఎస్ను గద్దె దించడం ఖాయమని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ఖమ్మంలో జగిరిన రైతు గోస.. బీజేపీ భరోసా సభకు పరకాల, వరంగల్ నుంచి కార్యకర్తలు, నాయకులు ప్రభంజనంలా తరలివస్తుండగా.. మండలంలోని పెద్దనాగారం స్టేజీ వద్ద వారికి ఈటల వారికి స్వాగతం పలికారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. పరకాల నియోజకవర్గం నుంచి డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు అధ్వర్యంలో వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరారని చెప్పారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతుందని, పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారని ధ్వజమెత్తారు. ఇటీవల బీఆర్ఎస్ ప్రకటించిన ఎమ్మెల్యేల జాబితాలో బీసీలకు, మహిళలకు అన్యాయం జరిగిందని, కేసీఆర్ మాయమాటలతో రెండుసార్లు అధికారంలోకి వచ్చారని, ఈసారి గద్దె దింపడం ఖాయమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారం చేపడుతుందన్నారు. అనంతరం ఖమ్మం సభకు తరలివెళ్లారు. కార్యక్రమంలో పరకాల మాజీ ఎమ్మెలే భిక్షపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి జయంతిలాల్, హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ మురళీధర్, జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, నాయకులు రవీందర్, సదానందం, శివకుమార్, రాజ్కుమార్, దివాకర్ పాల్గొన్నారు. -
కేసీఆర్ సర్కార్ది రియల్ ఎస్టేట్ కంపెనీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ అధీనంలోని భూములతోపాటు రైతుల భూములకూ ఎలాంటి రక్షణ లేకుండా పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పరిపాలనను పక్కనబెట్టిన కేసీఆర్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీగా మారిందని మండిపడ్డారు. గ్రామాల్లో ధరణి పేరుతో రైతుల భూములను లాక్కుంటున్నారని, ఇవ్వకుంటే కేసులు పెట్టి బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎన్నికల ముందు ప్రభుత్వ భూములను అమ్ముతోందని. ఇదేమిటని ప్రశ్నించేవారిని అణచివేస్తోందని మండిపడ్డారు. 111 జీవో ఎత్తేసి, హైదరాబాద్ సమీపంలోని విలువైన భూములను కావాల్సిన వ్యాపారులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. నిర్మల్లో నిలదీస్తే దాడులా? నిర్మల్ పట్టణంలో మాస్టర్ ప్లాన్ పేరిట భూమాయ జరుగుతోందని.. అధికార పార్టీ నేతలకు అనుకూలంగా, రైతుల భూములను అన్యాక్రాంతం చేసేందుకు కుట్ర జరుగుతోందని కిషన్రెడ్డి ఆరోపించారు. నిర్మల్లో సోఫీనగర్ ఇండ్రస్టియల్ జోన్ను రెసిడెన్షియల్గా మార్చేందుకు జీవో తెచ్చి రైతులకు నష్టం కలిగిస్తున్నారని.. దీనికి వ్యతిరేకంగా రైతులు, ప్రజలు ఆందోళన చేస్తుంటే పోలీసులతో లాఠీచార్జీ చేయిస్తున్నారని విమర్శించారు. పోలీసుల దాడిలో దాదాపు 30 మంది యువకులు తీవ్రంగా గాయపడ్డారని, పలువురి తల పగిలి గాయాలయ్యాయని చెప్పారు. నిర్మల్లో మహేశ్వర్రెడ్డి చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపేందుకు వెళుతున్న మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను పోలీసులు అడ్డుకున్నారని, మహిళా నాయకురాలనే గౌరవం లేకుండా బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్ట్చేశారని మండిపడ్డారు. పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రశ్నిస్తే అణచివేస్తారా? ఆదిలాబాద్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ కార్యకర్తలు, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిపైనా లాఠీచార్జి చేసి, బట్టలు చించారని కిషన్రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి సూర్యాపేటకు వెళితే అక్కడి బీజేపీ నేతలను అరెస్టు చేశారన్నారు. సీఎం, ఆయన కుమారుడు ఎక్కడికి వెళ్లినా బీజేపీ, ఇతర ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబంలో అభద్రతాభావం ఏర్పడిందని.. వారి అవినీతికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రశ్నిస్తే అణచివేసే ధోరణి నడుస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం అధికారంలో ఉండేది నాలుగు నెలలేనని, తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని, పక్షపాతం మంచిది కాదని హితవు పలికారు. పోలీసులు మహిళలనూ కొట్టారు: ఈటల తెలంగాణలో పోలీసులు చట్టానికి లోబడి కాకుండా కేసీఆర్ చెప్పినట్టుగా పనిచేస్తున్నారని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. నిర్మల్లో వందలమంది మహిళలను మగ పోలీసులు విపరీతంగా కొట్టారని ఆరోపించారు. లంబాడీ మహిళల పట్ల కేసీఆర్ నీచంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాళోజీ టీవీ దాసరి శ్రీనివాస్, బీజేపీ ఐటీ సెల్లో పనిచేసే బొమ్మ శరత్లను మఫ్టీలో ఉన్న పోలీసులు పట్టుకుపోయి బయటి ప్రాంతాల్లో తిప్పుతూ విపరీతంగా కొట్టారని.. హుజూరాబాద్లో చెల్పూరు సర్పంచ్ మహేందర్ను అలాగే కొట్టి హింసించి, పైశాచికానందనం పొందారని ఆరోపించారు. గిరిజన, దళిత మహిళలకు కేసీఆర్ ప్రభుత్వంలో రక్షణ లేదన్నారు. -
హుజురాబాద్: ఆ సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా?
గత ఉపఎన్నికల్లో స్థానికత, సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం చూపాయి. ఇదే ఈటలకు బాగా కలిసొచ్చింది. ఇచ్చిన హామీలను కొన్ని అమలుపర్చినప్పటికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ చేయలేదు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం, పెన్షన్లు అర్హులందరికీ అందినప్పటికీ కమ్యూనిటీ పరంగా కూడా ప్రభావం చూపే అవకాశాలు నియోజకవర్గంలో ఉంటుంది. బీజేపీ బీజేపీ నుంచి ఈటల రాజేందర్ లేదా ఈటల జమున పోటీ చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మండలాల వారిగా ఓటర్లు హుజురాబాద్- 61,673 జమ్మికుంట- 59,020 కమలాపూర్- 51,282 వీణవంక- 40,099 ఇల్లందకుంట- 24,799 ఈ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలు 306 కేంద్రాలు ఉన్నాయి సమస్యత్మక ప్రాంతాలు. 107 సంఖ్యగా అధికారులు గత ఉప ఎన్నికల్లో గుర్తించారు. 6వృత్తులపరంగా. ఈ నియోజకవర్గంలో ప్రభుత్వానికి రైతులు రైతుబంధు సానుకూలంగా ఉన్నప్పటికీ రుణమాఫీ కాలేదని నిరాశతో ఉన్నారు. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకమనే చెప్పవచ్చు వ్యాపారస్తులు వారి అవసరాల కోసం అధికార పార్టీని వాడుకుంటున్నప్పటికీ ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారు. కులాలపరంగా ఓటర్లు ఓసీలు- 23 వేలు కాపు- 31 వేల పై చిలుకు గొల్ల కురుమ- 29 వేలు ముదిరాజ్- 30 వేలు ఎస్సీలు- 47 వేలు ఎస్టిలు- 6,500 వేలు మైనార్టీ- 12,300 వేలు ► నియోజకవర్గంలో మానేరు వాగు ,ఇల్లందకుంట దేవాలయం ముఖ్యమైన ప్రదేశాలు -
తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశాలు
-
నాలుగేళ్లుగా చేయనిది.. ఈ రెండు నెలల్లో చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో చేయని రైతుల రుణమాఫీ ఈ రెండు నెలల్లో చేస్తుందా? అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఆర్టీసీ ఆస్తులు అమ్ముకునేందుకు కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతామని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ బస్సులు క్రమంగా ప్రైవేటుపరం చేస్తున్నారని, 56 వేల మంది ఉన్న ఆర్టీసీ కార్మికుల సంఖ్య 43 వేలకు చేరిందని, బస్సుల సంఖ్య 12 వేల నుంచి మూడు వేలకు పడిపోయిందన్నారు. ఆర్టీసీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న తాత్కాలిక కార్మికుల పరిస్థితేంటని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులకు పరిమితం చేస్తున్నారని, ఆరు నెలలకు ఒకసారి సభ జరగాలి కాబట్టి మొక్కుబడిగా నిర్వహించి చేతులు దులుపుకునేందుకు ప్రభుత్వం ప్రయతి్నస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని. వాటిపై సభలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. భారీ వర్షాలకు పంట పొలాలు దెబ్బతిన్న బాధితులకు తక్షణ సాయంగా రూ.25 వేలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా.. ముఖ్యమంత్రి నుంచి కనీస స్పందన లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తరువాతే పంటపొలాలు బ్యాక్ వాటర్ కారణంగా నష్టపోతున్నాయని ఈటల ఆరోపించారు. రాష్ట్రంలో ఏ మంత్రికి కూడా సమస్య పరిష్కరించే దమ్ము లేదని, అన్నింటికీ ముఖ్యమంత్రే అని ఎద్దేవా చేశారు. మూడు నెలలైతే ఈ ప్రభుత్వం ఉండదన్నారు. కక్షపూరితంగానే బీఏసీకి పిలువలేదు ఉమ్మడి ఏపీలో సైతం ఒక్క సభ్యుడు ఉన్నా బీఏసీకి పిలిచేవారని, బీజేపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా పిలవకపోవడం కక్షపూరిత చర్య అని ఈటల మండిపడ్డారు. సమైక్య పాలకులకు ఉన్న సోయి తెలంగాణ పాలకులకు లేదన్నారు. అసెంబ్లీలో చాలా రూములు ఖాళీగా ఉన్నా.. బీజేపీ సభ్యులకు కేటాయించలేదని విమర్శించారు. -
కరీంనగర్ హుజూరాబాద్ మండలం రాజకీయ చరిత్ర
హుజూరాబాద్ నియోజకవర్గం తెలంగాణ రాజకీయంలో పెద్ద పరిణామమే సంభవించింది. టిఆర్ఎస్ సీనియర్ నేత ఈటెల రాజేందర్ను ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం, ఆయనపై కొన్ని భూ కబ్జా కేసుల విచారణ జరగడం, తదనంతర పరిణామాలలో ఈటెల ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేసి, భారతీయ జనతా పార్టీలో చేరిపోవడం జరిగాయి. అ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో ఈటెల 23,855 ఓట్ల ఆదిక్యంతో గెలుపొంది సంచలన విజయం సాధించారు. ఈటెల రాజేందర్ను ఓడిరచడానికి టీఆర్ఎస్ గానీ, ముఖ్యమంత్రి తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ వారికి ఫలితం దక్కలేదు. ఈటెలకు 107022 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు 83,167 ఓట్లే వచ్చాయి. కాగా కాంగ్రెస్ అభ్యర్థికి నర్సింగరావుకు 3,014 ఓట్లు మాత్రమే తెచ్చుకొని డిపాజిట్ కొల్పోవడం జరిగింది. 2018 టీఆర్ఎస్ తరుపున పోటీ చేసిన ఈటెల రాజేందర్కు 104840 రాగా, కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కౌశిక్ రెడ్డికి 61,121 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ మిగిలిన అభ్యర్దులకన్నా నోటాకు అధిక ఓట్లు రావడం విశేషం. నోటాకు 2847 ఓట్లు పడ్డాయి. కాగా అప్పట్లో బిజేపీ డిపాజిట్ కొల్పోయింది. కానీ 2021లో ఈ ఉప ఎన్నిక సమయానికి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లోకి మారాడు. దీనివల్ల కాంగ్రెస్ దెబ్బతిన్నది కానీ టీఆర్ఎస్ మాత్రం గెలవలేకపోయింది. ఈటెల బిజేపిలోకి వెళ్లడం అంతకుముందు అక్కడ బలమే లేని బిజేపి గెలిచి సంచలనంగా మారింది. ఈటెల హుజూరాబాద్లో ఐదుసార్లు, అంతకుముందు కమలాపూర్లో రెండుసార్లు గెలిచారు. కొంతకాలం క్రితం టిఆర్ఎస్కు సొంతదార్లు ఎవరూ అంటూ వ్యాఖ్యానించి ఈటెల వివాదంలో పడ్డారు. ఆ తర్వాత ఆయన మంత్రి పదవిని కోల్పోయి, పార్టీని వీడవలసి వచ్చింది. ఈటెల రాజేందర్ బిసి వర్గానికి చెందినవారు. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన నేత. ఈయన 3 ఉప ఎన్నికలతో సహా ఏడు ఎన్నికలలో గెలిచిన కొద్ది మంది నేతలలో ఒకరుగా నమోదు అయ్యారు. 2008 ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత టిఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా ఉన్న ఈటెల రాజేందర్ హుజూరాబాద్లో 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాబినెట్లో మంత్రిగా బాద్యతలు చేపట్టారు. కాని ఆ తర్వాత మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయ్యారు. ఆయన అంతకుముందు ఆరేళ్ల వ్యవధిలో నాలుగుసార్లు గెలిచి రికార్డులకెక్కారు. కమలాపూర్ నుంచి 2004, 2008 ఉప ఎన్నిక, హుజూరాబాద్లో 2009, 2010 ఉప ఎన్నికలో ఆయన విజయం సాదించారు. హుజూరాబాద్లో తదుపరి 2014, 2018, 2021 ఉప ఎన్నికలలో కూడా ఆయన గెలుపొందారు. రెండుసార్లు తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆయన రాజీనామా చేసి విజయం సాదించారు. టిఆర్ఎస్ నేతలు హరీష్రావు, కొప్పుల ఈశ్వర్ , ఈటెల రాజేందర్లు మాత్రమే ఇలా ఆరేళ్లలో నాలుగుసార్లు గెలిచిన ఘనత పొందారు. ఈ నియోజకవర్గంలో ఈటెల 2014లో కాంగ్రెస్ సమీప ప్రత్యర్ధి కె.సుదర్శనరెడ్డిని 57037 ఓట్ల తేడాతో ఓడిరచారు. ఆ ఎన్నికలో టిడిపి, బిజెపి కూటమి అభ్యర్ధిగా పోటీచేసిన ముద్దసాని కశ్యప్ రెడ్డికి 15642 ఓట్లు వచ్చాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో నాలుగుసార్లు రెడ్లు, రెండుసార్లు వెలమ, నాలుగుసార్లు బిసి నేతలు, మూడుసార్లు బ్రాహ్మణ, మూడుసార్లు ఇతరులు గెలుపొందారు. మొదట ఈటెల రాజేందర్ కమలాపూర్లో 2004లోను, ఆ తరువాత 2008లో రాజీనామా చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు 16 మందిలో ఒకరిగా ఉన్న ఈయన ఉప ఎన్నికలో పోటీ చేసి తిరిగి గెలుపొందారు. ఆ ఉప ఎన్నికలలో అప్పటి టిఆర్ఎస్ శాసనసభా పక్షనేతగా ఉన్న డాక్టర్ విజయరామారావు ఓటమి పాలవడంతో ఆ పక్ష నేతగా రాజేందర్ ఎంపికయ్యారు. రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో భాగంగా పార్టీ నిర్ణయం మేరకు 2010 ఫిబ్రవరిలో మళ్ళీ శాసనసభకు రాజీనామా చేసి తిరిగి ఉపఎన్నికలో టిడిపి నేత ముద్దసాని దామోదరరెడ్డిపై ఘన విజయం సాధించారు. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గం 1952, 57లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. 1952లో ఒక స్థానం కాంగ్రెస్, మరోస్థానం సోషలిస్టు పార్టీ గెలుచుకున్నాయి. 1957లో రెండూ ఇండిపెండెంట్లు గెలుచుకున్నారు. 1983 నుంచి ఒక్కసారి కూడా ఇక్కడ కాంగ్రెస్ ఐ గెలుపొందలేదు. 1957లో ఇండిపెండెంటుగా గెలిచిన పి.నర్సింగరావు 1967లో కాంగ్రెస్ పక్షాన గెలిచారు. 1957, 62లలో గెలిచిన గడిపల్లి రాములు 1967లో మేడారం నుంచి గెలిచారు. 1978లో కాంగ్రెస్ పక్షాన గెలిచిన దుగ్గారాల వెంకట్రావు 1985లో టిడిపి అభ్యర్ధిగా గెలిచారు. 1994, 99లలో టిడిపి అభ్యర్ధిగా గెలుపొందిన ఏనుగుల పెద్దిరెడ్డి 2009లో ప్రజారాజ్యం అభ్యర్ధిగా హుస్నాబాద్లో పోటీచేసి ఓడిపోయారు. ఇక్కడ ఒకసారి గెలిచిన ఒడితెల రాజేశ్వరరావు, ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈయన సోదరుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు కమలాపూర్ నుంచి 2004 సాధారణ ఎన్నికలలోను, 2008లో టిఆర్ఎస్ వ్యూహంలో భాగంగా రాజీనామా చేసి రెండోసారి గెలుపొందారు. అయితే 2009లో హుస్నాబాద్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. లక్ష్మీకాంతరావు కొంతకాలం వై.ఎస్. క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. లక్ష్మీకాంతరావు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఈటల, కిషన్ రెడ్డి మాస్టర్ ప్లాన్..
-
వైరానికి కారణం ఇదేనా..?
-
బీజేపీ ఏ పార్టీతో కలవలేదు.. కలవదు
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘బీజేపీ ఏ పార్టీతో కలవ లేదు, కలువబోదు’ అని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ‘మా మీద గుడ్డి ద్వేషంతో.. వారి కాళ్ల కింద భూమి కదిలిపోతోందని కొందరు కుట్రలు చేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు, పేపర్లు, యూట్యూబ్ చానళ్లు కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి’’ అని విమర్శించారు. బీజేపీలో సంస్థాగత మార్పులు రాబోయే కాలంలో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి రావడానికి నాంది పలుకుతున్నాయన్నారు. శనివారం ప్రధాని మోదీ వరంగల్కు వస్తున్న సందర్భంగా ఈటల హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానాన్ని సందర్శించి సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వరంగల్లో ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో నిర్వహించే విజయ సంకల్పసభతో ఎన్నికల శంఖారావం పూరిస్తామ న్నారు. బీజేపీలో భేదాభిప్రాయాలకు తావులేదని, అందరం ఐక్యంగా ఉన్నామని చెప్పారు. ప్రజాస్వామ్యం ఖూనీపై మోదీ ఆందోళన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మోదీ ఆందోళన చెందారని ఈటల చెప్పారు. రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ కుటుంబాన్ని వదిలేది లేదు, చట్టం నుంచి వారు తప్పించుకోలేరన్నారు. కేసీఆర్ కుటుంబపాలనకు అంతం పలికేది బీజేపీయేన న్నారు. ఆర్థిక మంత్రిగా చేసిన అనుభవంతో చెబుతు న్నానని, కాంగ్రెస్ హామీలు అమలు సాధ్యం కాద న్నారు. ఓరుగల్లు గడ్డమీద ముప్పై ఏళ్ల తర్వాత దేశ ప్రధానిగా మోదీ అడుగు పెట్టబోతున్నారని చెప్పా రు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, మాజీ మంత్రి విజయరామారావు పాల్గొన్నారు. -
సమయం తక్కువ.. సవాళ్లు ఎక్కువ!
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: పార్టీలో సమన్వయ లోపం, పదవులు దక్కని అసంతృప్తులు, పాత–కొత్త నేతల మధ్య భేదాభిప్రాయాలను సరిదిద్దడం ఓ వైపు.. అధికార బీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్ వ్యూహాలను ఎదుర్కొంటూ, విమర్శలను తిప్పికొడుతూ పార్టీని ముందుకు దూకించాల్సిన బాధ్యత ఇంకోవైపు.. ముంచు కొస్తున్న అసెంబ్లీ ఎన్నికలు మరోవైపు.. రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడు జి.కిషన్రెడ్డికి ముప్పేట ముసిరిన సవాళ్లు ఇవి. వీటన్నింటినీ చక్కదిద్ది రాష్ట్రంలో బీజేపీని విజయతీరాలకు నడిపించేందుకు ఆయనకు ఉన్న సమయం కూడా నాలుగైదు నెలలే.. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై అవగాహన, సంఘ్ పరివార్ అండదండలున్న కిషన్రెడ్డికి తోడుగా.. కేసీఆర్ వ్యూహాలు, ఎత్తుగడలపై పూర్తి అవగాహన ఉన్న ఈటల రాజేందర్ను రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా నియమించిన నేపథ్యంలో వారు పరిస్థితులను ఎలా అధిగమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇంత తక్కువ సమయంలోనే పార్టీని చక్కదిద్ది, ఎన్నికలకు సిద్ధం చేయడం కత్తిమీద సామేనని బీజేపీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. అన్నింటికన్నా ముందు ఈ నెల 8న ప్రధాని మోదీ వరంగల్ పర్యటన, బహిరంగ సభను విజయవంతం చేయడం కిషన్రెడ్డి ముందున్న ప్రథమ లక్ష్యమని అంటున్నాయి. పార్టీని చక్కదిద్దడమే ప్రధాన ఎజెండాగా.. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడిన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీలో అయోమయ, గందరగోళ పరిస్థితులను చక్కదిద్దడం ప్రధాన ఎజెండాగా మారిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బండి సంజయ్ స్థానంలో అధ్యక్షుడిగా నియమితుడైన కిషన్రెడ్డి ఈ దిశగా అవసరమైన చర్యలు చేపట్టి పార్టీ నాయకులు, కేడర్లో విశ్వాసాన్ని నింపే చర్యలు చేపట్టాల్సి ఉంటుందని అంటున్నాయి. దాదాపు నాలుగేళ్లుగా (ఎంపీగా ఎన్నిక, కేంద్ర మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి) రాష్ట్ర పార్టీ వ్యవహారాలు, నిర్ణయాల్లో పెద్దగా జోక్యం చేసుకోకుండా ఉన్న కిషన్రెడ్డి.. ఇప్పుడు పార్టీని గాడిలో పెట్టేందుకు పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రకరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొంటున్నాయి. పార్టీలో సంస్థాగత మార్పులతో.. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గం, పదాధికారులు, జిల్లా అధ్యక్షుల మార్పు వంటి సంస్థాగత చర్యలు కిషన్రెడ్డికి తలకు మించిన భారంగా మారే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు. అధ్యక్ష మార్పు, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా ఈటల రాజేందర్కు కీలక పదవి ఇవ్వడంపై పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించడం, పార్టీ మారకుండా చూడటంపైనా కిషన్రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అధికార బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడం, రాష్ట్ర ప్రభుత్వంపై, కేసీఆర్పై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను బీజేపీకి అనుకూలంగా మార్చుకోవడం కూడా కీలకమని అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రాధాన్యత తగ్గించి.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేననే భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనేలా ప్రజల్లో అభిప్రాయం కలిగించేందుకు చర్యలు చేపట్టాల్సి ఉందని పేర్కొంటున్నారు. నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరిగే నేపథ్యంలో ఆలోగా వీటన్నింటినీ ఏ మేరకు చక్కదిద్దగలరనే చర్చ జరుగుతోంది. అయిష్టత.. అసంతృప్తి మధ్య.. తనకు అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టడంపై కిషన్రెడ్డి ఒకింత అసంతృప్తిగా ఉన్నారని.. అయిష్టంగానే బాధ్యతల స్వీకరణకు సిద్ధమవుతున్నారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. బుధవారం ఢిల్లీలో జరిగిన కేబినెట్ భేటీకి ఆయన హాజరుకాకపోవడంతో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారనే ప్రచారం జరిగింది. తర్వాత ఆయన పొడిపొడిగానే మీడియాతో మాట్లాడారు. అనారోగ్య కారణాలతోనే కేబినెట్ భేటీకి వెళ్లలేదన్నారు. అధిష్టానం నిర్ణయం శిరోధార్యమని, పార్టీ ఏది ఆదేశిస్తే దానిని సైనికుడిగా పాటిస్తానని సాయంత్రం మీడియాతో పేర్కొన్నారు. ఢిల్లీలోనే బండి సంజయ్.. పెద్దలతో చర్చలు అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో తనను అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించడంపై బండి సంజయ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ఈ క్రమంలో కేంద్ర మంత్రి పదవి ఇస్తామన్నా స్వీకరించేందుకు అయిష్టత చూపుతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ విషయాన్ని ఆయన పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డాతోపాటు ఇతర పెద్దలకు వివరించినట్టు ప్రచారం జరుగుతోంది. సంజయ్తో సునీల్ బన్సల్ భేటీ అయి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గలేదని అంటున్నారు. అయితే తనకు వ్యతిరేకంగా పనిచేసిన కొందరు నేతల అంశాన్ని బన్సల్ వద్ద ప్రస్తావించారని.. తనతోపాటు అధిష్టానం పెద్దలపై ఎమ్మెల్యే రఘునందన్రావు చేసిన వ్యాఖ్యల విషయాన్ని వివరించారని చెప్తున్నారు. ఈ క్రమంలో రఘునందన్రావుపై చర్యలు తీసుకునే విషయంపై అధిష్టానం సమాలోచనలు చేస్తున్నట్టు పేర్కొంటున్నారు. మరోవైపు పార్టీ తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని సంజయ్ ఢిల్లీలో మీడియాకు చెప్పారు. రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్తో అపాయింట్మెంట్ ఉన్న కారణంగా బుధవారం ఢిల్లీలోనే ఆగి.. గురువారం హైదరాబాద్ వెళుతున్నట్టు వివరించారు. -
త్వరలో కేంద్ర కేబినెట్లోకి ఎంపీ బండి సంజయ్?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో పార్టీలో కొంతకాలంగా సాగుతున్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. కరీంనగర్ ఎంపీగా పార్టీ అధ్యక్షుడిగా ఇంతకాలం బీజేపీకి తిరుగులేని విజయాలు అందించిన బండి సంజయ్ స్థానంలో కిషన్రెడ్డిని నియమిస్తూ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీచేసింది. జిల్లా నుంచి పెద్దలీడర్ను కీలక బాధ్యతల నుంచి తప్పించినా.. మరో కీలక పదవి కూడా ఇదే జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను వరించింది. ఇంతకాలం చేరికల కమిటీ చైర్మన్గా ఉన్న ఈటలను రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా పదోన్నతి కల్పించింది. బండిని తప్పించడం, ఈటలకు పదోన్నతి కల్పించడం వంటి పరిణామాలతో పార్టీ, ‘బండి’ వర్గంలో తీవ్ర నిస్తేజం నెలకొనగా.. ఈటల వర్గంలో కొత్త ఉత్సాహం మొదలైంది. మొత్తానికి పార్టీలో జిల్లా నేతలకు పదవులు మారినా.. అధిష్టానం వద్ద పట్టునిలుపుకోవడంలో కరీంనగర్ నాయకులు మరోసారి సత్తా చాటుకున్నట్లయింది. ఫలించిన ఈటల మంత్రాంగం..! జిల్లాలో సీనియర్ మంత్రిగా, ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ది సుదీర్ఘ రాజకీయ అనుభవం. టీఆర్ఎస్లో చేరి అనతికాలంలో కేసీఆర్కు కుడిభుజంలా మారారు. తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్ పాత్ర ప్రజలందరికీ తెలిసిందే. 2004లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానంప్రారంభించిన ఈటల రాజేందర్ ఆపై వెనుదిరిగి చూసుకోలేదు. 2004, 2008, 2009, 2010, 2014, 2018, 2021లో రాష్ట్రంలో మొత్తం ఏడుసార్లు అసెంబ్లీకి ఎన్నికై న ఏకై క ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ది తిరుగులేని రికార్డు. ఇందులో 2008, 2009, 2010లో ఏడాదికి ఒకసారి చొప్పున అసెంబ్లీకి గెలుస్తూ హ్యాట్రిక్ సాధించారు. 2021లో మరో ఉపఎన్నికలో విజయం సాధించి అత్యధిక ఉప ఎన్నికలు గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు సొంతంచేసుకున్నారు. ► 2021లో అనూహ్య పరిస్థితుల మధ్య టీఆర్ఎస్ను వీడిన రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం జరిగిన ఉపఎన్నికలో బీజేపీ నుంచి విజయం సాధించారు. బీజేపీలో చేరికల కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. వాస్తవానికి రాజేందర్ను పార్టీ అధ్యక్షపదవి వరిస్తుందనుకున్నా.. జరగలేదు. ఈ క్రమంలో ఆయన అధిష్టానంపై ఒత్తిడి ప్రారంభించారు. బండికి వ్యతిరేకంగా సీనియర్లను కూడగట్టేందుకు యత్నించారు. ఒకదశలో పార్టీని వీడుతారని ప్రచారం జరిగింది. మొత్తానికి రాజేందర్ వ్యూహం ఫలించింది. పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా నియమించడంతో ఈటల వర్గీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బండిని తప్పించడంపై నిరాశ.. బీజేపీకి కొత్త ఊపు తీసుకువచ్చిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఒ క సంచలనం. సంఘ్ పరివార్ నేపథ్యమున్న బండి 2019 ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా అనూహ్య విజయం సాధించారు. 2020లో రాష్ట్ర అధ్యక్ష ప దవి చేపట్టిన బండి సంజయ్ పార్టీకి కొత్త జోష్ నింపారు. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో తొలి ఉపఎ న్నిక దుబ్బాకలో బండి సంజయ్ నేతృత్వంలో పా ర్టీ ఎలాంటి పొత్తులు లేకుండా విజయం సాధించి రికార్డు సృష్టించింది. అనంతరం బండి తన దూ కుడును జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అదేస్థాయిలో కొ నసాగించారు. ఏకంగా 46 కార్పొరేటర్ స్థానాల్లో కాషాయజెండా ఎగరేసి అధికార పార్టీకి చెమటలు పట్టించారు. 2021 హుజూరాబాద్ ఎన్నికలోనూ ఈటల రాజేందర్ గెలుపుతో బండి గ్రాఫ్ మరింత పెరిగింది. 2022 జనవరిలో 317 జీవోకి వ్యతిరేకంగా బండి చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేయడం జాతీయస్థాయిలో చర్చ జరిగింది. ఇటీవల పదో తరగతి పేపర్ లీకేజీలు, భైంసా సభ సమయంలోనూ బండిని పోలీసులు అరెస్టు చేయడం రాష్ట్రవ్యాప్తంగా కేడర్ను ఏకంచేశాయి. 2022 మునుగోడు ఉపఎన్నికల్లోనూ బీజేపీ చివరి వరకు పోరాడింది. ప్రజాసంగ్రామ యాత్రలతో కేవలం తన పార్లమెంటు సెగ్మెంటుకే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించారు. అప్పటిదాకా 10 శాతంగా ఉన్న బీజేపీ ఓటు షేర్ను 34.5 శాతానికి పెంచారు. త్వరలో కేంద్ర కేబినెట్లోకి.. అదే సమయంలో బండి జిల్లాలో సీనియర్లను కలుపుకొనిపోవడంలో విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్లో ఫ్లోర్ లీడర్ని నేటికీ నియమించకపోవడంపైనా పలు ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో పార్టీలో నగర అధ్యక్షుడిని నియమించకుండా ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, సెంట్రల్ అంటూ జోన్లు విభజించి ఎవరికీ పట్టు దక్కనీయలేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో బండి నిర్ణయాలను సమర్థించే ఫాలోవర్లకు కొదవలేదు. బండిని అధ్యక్ష పదవి నుంచి తప్పించడాన్ని వ్యతిరేకిస్తూ.. సోషల్ మీడియా హోరెత్తి పోతోంది. నగర పశ్చిమ డివిజన్ కార్యవర్గం రాజీనామా చేయడం గమనార్హం. రెండుమూడురోజుల్లో బండి సంజయ్ని కీలక పదవి వరించనుందని సమాచారం. కేంద్ర కేబినెట్లో బండికి చోటుదక్కనుందని పార్టీ వర్గాల సమాచారం. -
తెలంగాణ ప్రజల అంతరంగం నాకు తెలుసు: ఈటల
-
తెలంగాణ బీజేపీ: టికెట్ల కేటాయింపులో ఇక ఈటలే కీలకం..
సాక్షిప్రతినిధి, వరంగల్: భారతీయ జనతా పార్టీ సంస్థాగత మార్పులు ఆ పార్టీ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. రాష్ట్ర పార్టీలో మారిన పరిణామాలు ఉమ్మడి వరంగల్లో ఆ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిని ఉలికిపాటుకు గురిచేశాయి. నిన్నటిదాకా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పొరుగు జిల్లాకు చెందిన బండి సంజయ్కుమార్ వ్యవహరించగా... ఆయనతో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఆశావహులు సత్సంబంధాలు కొనసాగించారు. ప్రజాసంగ్రామ యాత్ర సక్సెస్లో పాలు పంచుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టికెట్ ఖాయమనుకుంటుండగా.. బండి సంజయ్ మార్పు ఆశావహులను ఉలికిపాటుకు గురిచేసింది. ఈఅనూహ్య పరిణామాలను ఊహించని పలువురు ‘బండి’ ముద్రను చెరిపేసుకునే ప్రయత్నంలో పడగా.. కిషన్రెడ్డి వర్గీయుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. (చదవండి: బండి సంజయ్ ను ఎందుకు తప్పించారు?) రాష్ట్ర కమిటీలో పలువురు సీనియర్లు.. మార్పులేని జిల్లా కమిటీలు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా 2020 మార్చిలో పదవీ బాధ్యతలు తీసుకున్న సమయంలో ఏర్పాటుచేసిన రాష్ట్ర కమిటీలో ఉమ్మడి వరంగల్కు చెందిన సీనియర్లు ఉన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా డాక్టర్ జి.విజయరామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, అధికార ప్రతినిధిగా ఏనుగుల రాకేశ్రెడ్డికి అవకాశం దక్కింది. ప్రేమేందర్రెడ్డి ప్రధాన కార్యదర్శిగా మూడోసారి నియమితులు కాగా.. రాకేశ్రెడ్డికి రెండోసారి చాన్స్ వచ్చింది. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన హుస్సేన్ నాయక్ను బీజేపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. వీరు మూడేళ్లపాటు ఈ పదవుల్లో కొనసాగనున్నారు. ఇదే సమయంలో హనుమకొండ జిల్లా అధ్యక్షురాలిగా రావు పద్మ, వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా సుమారు మూడేళ్లుగా మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు యుగందీశ్వర్, ములుగుకు చింతలపూడి భాస్కర్రెడ్డి ఉండగా, జనగామ జిల్లా అధ్యక్షుడిగా ఆరుట్ల దశమంతరెడ్డి, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వి.రాంచందర్రావు వ్యవహరిస్తున్నారు. ఏడాదిగా కొత్త జిల్లా కమిటీలు వేస్తారని ప్రచారం జరిగినా... వారినే బండి సంజయ్ కొనసాగిస్తూ వచ్చారు. ప్రస్తుత సమయంలో రాష్ట్ర అధ్యక్షుడి మార్పు జరగ్గా.. జిల్లా రాష్ట్ర, జిల్లా కమిటీల్లోనూ మార్పులు ఉండవచ్చన్న చర్చ కూడా పార్టీలో సాగుతోంది. టికెట్ల కేటాయింపులో ఇక ఈటలే కీలకం.. బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా నియమితులైన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇక ఉమ్మడి వరంగల్లో పార్టీ టికెట్ల కేటాయింపులో కీలకం కానున్నారు. ఈయన బీజేపీ రాష్ట్ర చేరికల కమిటీ చైర్మన్గా కూడా ఉన్నారు. ఇదే సమయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ సీనియర్ కన్నెబోయిన రాజయ్య, మాజీ ఎమ్మెల్యే ఎం.భిక్షపతి కాషాయం కండువా కప్పుకున్నారు. మరికొందరు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలతో మంతనాలు జరిపిన ఆయన ఇప్పుడు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు. ఇంతకాలం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య ఉన్న విభేదాల కారణంగా ఉమ్మడి వరంగల్లో రెండు గ్రూపులు పని చేశాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ 12 నియోజకవర్గాల నుంచి ఆశావహులుగా ఉన్న వారికి భరోసా ఇస్తూ వచ్చారు. ఇదే సమయంలో ఆ పార్టీ అధిష్టానం రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి బండి సంజయ్ను తప్పించడంతో ఉమ్మడి వరంగల్ నుంచి టికెట్లు ఆశిస్తున్న పలువురిని ఆందోళనలో పడేసింది. దీంతో కొందరు ‘బండి’ ముద్రను తొలగించుకునే ప్రయత్నంలో పడ్డారు. ఎక్కడినుంచి ఎవరు.. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎర్రబెల్లి ప్రదీప్రావు, కుసుమ సతీశ్, గంట రవికుమార్ తదితరులు ప్రయత్నం చేస్తుండగా, వరంగల్ పశ్చిమ నుంచి రావు పద్మ, ఏనుగుల రాకేశ్రెడ్డి, మార్తినేని ధర్మారావు ఉన్నారు. పరకాల నుంచి మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి, డాక్టర్ విజయ్చందర్ రెడ్డి, జి.ప్రేమేందర్రెడ్డి పేర్లు వినిపిస్తుండగా.. ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున పేరు కూడా ప్రచారంలో ఉంది. వర్ధన్నపేట నుంచి కొండేటి శ్రీధర్, మహబూబాబాద్ నుంచి జాటోతు హుస్సేన్నాయక్ పేర్లుండగా.. నర్సంపేట నుంచి రేవూరి ప్రకాశ్రెడ్డి, ఎడ్ల అశోక్రెడ్డి, జనగామ నుంచి దశమంతరెడ్డి, ముక్కెర తిరుపతిరెడ్డి, కేవీఎల్ఎన్ రెడ్డి తదితరుల పేర్లున్నాయి. భూపాలపల్లి కన్నం యుగందీశ్వర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎరుకల గణపతి, నిశిధర్రెడ్డి, చదువు రాంచంద్రారెడ్డి, చాడ రఘునాథరెడ్డి, ములుగు నుంచి భూక్య రాజునాయక్, ఆజ్మీరా కృష్ణవేణి నాయక్ తదితరులున్నారు. పాలకుర్తి, డోర్నకల్, స్టేషన్ఘన్పూర్ నుంచి కూడా పలువురు ఆశావహులుగా మారిన పరిణామాల నేపథ్యంలో టికెట్ల వేటలో కొత్తదారులు వెతకడంలో పడ్డారు. (చదవండి: ముచ్చటగా మూడోసారి.. మరోసారి పగ్గాలు అప్పగించింది అందుకేనా?) -
కమల దళపతి కిషన్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలు, ప్రచారానికి ఫుల్స్టాప్ పెడుతూ బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. బండి సంజయ్ స్థానంలో.. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న గంగాపురం కిషన్రెడ్డిని రాష్ట్ర పార్టీ చీఫ్గా నియమించింది. ఇదే సమయంలో పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలు అప్పగించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ మంగళవారం మధ్యాహ్నం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన బండిని త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతుండగా, దీనిపై మరో రెండు, మూడురోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అనుభవం, అణుకువ ప్రామాణికంగా.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడి మార్పు సహా పలు కమిటీల నియామకంపై బీజేపీ అధిష్టానం గడిచిన నెల రోజులుగా చర్చోపచర్చలు కొనసాగించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్షా, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్లు ఈ అంశాలపై దృష్టి పెట్టారు. రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార బీఆర్ఎస్ను ఢీ కొట్టాలంటే మార్పు చేర్పులు అవసరమని కొందరు పార్టీ నేతలు అధిష్టానానికి సూచించారు. రాష్ట్ర నాయకత్వంపై తమ అసంతృప్తిని కొందరు అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో నేతల మధ్య సమన్వయ లేమిని జాతీయ నాయకత్వం పరిగణనలోకి తీసుకుందని, సంజయ్ను తప్పించాలనే నిర్ణయానికి వచ్చిందని సమాచారం. కాగా ఈటల రాజేందర్, డీకే అరుణ సహా మరొకొందరి పేర్లు పరిశీలించిన బీజేపీ అధిష్టానం చివరికి పార్టీలో సుదీర్ఘ అనుభవం, అణుకువ, విధేయతలు ప్రామాణికంగా తీసుకుని కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. యువ మోర్చా రాష్ట్ర, జాతీయ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించడం, మూడుసార్లు ఎమ్మెల్యే ఉండటం, గతంలోనూ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయడం, ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా ఉండటం, అన్నింటికన్నా ముఖ్యంగా తెలంగాణలో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో కిషన్రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపింది. అయితే కిషన్రెడ్డిని కేంద్ర మంత్రిగా కొనసాగిస్తారా? లేక తొలగిస్తారా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. బీజేపీలో జోడు పదవుల వ్యవహారం లేనందున ఆయన్ను కేంద్ర కేబినెట్ నుంచి తొలగిస్తారని ప్రచారం జరుగుతున్నా దీన్ని ఎవరూ ధ్రువీకరించడం లేదు. దీనిపైనా రెండు, మూడురోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. చదవండి: బండి సంజయ్ ను ఎందుకు తప్పించారు? అన్నీ పరిగణనలోకి తీసుకుని ఈటలకు బాధ్యతలు రాష్ట్ర అధ్యక్ష పదవికి తొలినుంచి బలమైన పోటీదారుగా ఉన్న ఈటల రాజేందర్ను అత్యంత కీలకమైన ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా బీజేపీ నియమించింది. రాష్ట్రంలో అధికంగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, అందులోనూ అత్యంత కీలకమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారవడం, సీఎం కేసీఆర్ను ఎదిరించి పార్టీలోంచి బయటకు వచ్చి పోరాడుతున్న నేతగా పేరుండటం, అన్ని పార్టీలు, వర్గాలు, తెలంగాణ ఉద్యమ సంఘాలతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం ఈటల ఎంపికకు కలిసొచ్చిందని చెబుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకునే ఎన్నికల ప్రచార బాధ్యతలు, వ్యూహాల ఖరారు, అభ్యర్థుల ఎంపిక అంశాలపై పట్టు ఉండే ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలు ఆయనకు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. నడ్డాతో సంజయ్ భేటీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు సహా పలు ఇతర అంశాలపై చర్చించేందుకు అధిష్టానం పెద్దల పిలుపు మేరకు ఢిల్లీకి వచ్చిన బండి సంజయ్ మంగళవారం మధ్యాహ్నం పార్టీ జాతీయ కార్యాలయంలో జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే అధ్యక్ష పదవికి సంజయ్ రాజీనామాను తీసుకున్నారు. కొత్త అధ్యక్షుడిగా కిషన్రెడ్డి ఎంపికకు గల కారణాలు, మున్ముందు పార్టీలో, కేంద్ర పదవుల్లో కల్పించే ప్రాధాన్యం, ఇతర అంశాలను సంజయ్కు నడ్డా వివరించారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నా దీనిపై స్పష్టత రాలేదు. భేటీ అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడకుండానే అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇక అదే సమయంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు సైతం నడ్డాతో భేటీ అయినట్లు తెలిసింది. ఎస్టీ సామాజికవర్గం నుంచి ఆయనకు కేబినెట్లో చోటు దక్కుతుందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్న సమయంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. -
‘ఈటల, రేవంత్ రెడ్డి రహస్యంగా భేటీ అయ్యారు.. ఫొటోలు బయటపెట్టాలా?’
హైదరాబాద్: ఖమ్మంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కేసీఆర్, బీజేపీ ఒక్కటే అని చెప్పే క్రమంలో బీఆర్ఎస్.. బీజేపీ బీ టీం అంటూ ఎద్దేవా చేశారు. దీనిపై స్పందించిన రోడ్డు రవాణా శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు. రాహుల్ని చాలా మంది పప్పు అని పిలుస్తుంటారు.. కానీ అందుకు తగిన వ్యక్తేనని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలే ఏ టీం, బీ టీం అంటూ వ్యాఖ్యానించారు. ఈటెల రాజేందర్, రేవంత్ రెడ్డి రహస్య మంతనాలు జరిపిన మాట వాస్తవం కాదా?అని ప్రశ్నించారు. అందుకు సంబంధించిన ఫొటోలు చూపించాలా? అని అన్నారు. భేటీ జరిగిందా? టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. జాతీయ పార్టీలో చేరిన ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించి.. బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు. అయితే.. సాధారణంగా బీజేపీ లాంటి జాతీయ పార్టీల్లో ముందు నుంచి ఉన్న నాయకులకే ప్రాధాన్యత ఎక్కువ. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారికి ప్రధాన బాధ్యతలను అప్పగిస్తారు. పార్టీలో తనకు సరైన ప్రధాన్యత లభించట్లేదని ఈటల రాజేందర్ కొన్ని రోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో వార్తలు వచ్చాయి. ఖమ్మం సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా ఈటల ప్రస్తావన మరోసారి తెరమీదకు వచ్చింది. నిజానికి ఈటల, రేవంత్ రెడ్డి టచ్లోనే ఉన్నారనే రాజకీయ వర్గాల్లో వినికిడి ఉన్న నేపథ్యంలో వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రధాన్యత సంతరించుకున్నాయి. రాహుల్ గాంధీ.. ఓ రిమోట్ గాంధీ.. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలపై అవగాహన లేకుండా రాహుల్ గాంధీ మాట్లాడారని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలు ఏంటో గుర్తెరిగి మాట్లాడాలని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రాసిచ్చిని స్ర్కప్టిను చదివి వెళ్లాడని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఓ రిమోట్ గాంధీ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ హోదా ఏంటో తెలియదని అన్నారు. గతంలో తెలంగాణ కంటే ముందు పదేళ్లు కాంగ్రెస్ పాలించింది.. మరి అప్పుడు పెన్షన్లు, కల్యాణలక్ష్మి, 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో అమలవుతున్న పథకాలను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: ‘వాపును చూసి.. బలుపు అనుకుంటున్న కాంగ్రెస్’ మంత్రి ప్రశాంత్రెడ్డి -
జితేందర్ రెడ్డి ట్వీట్ పై ఈటల కౌంటర్
-
తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల మార్పు...?
-
తెలంగాణ బీజేపీకి దెబ్బ ఖాయమేనా?
-
ఈ పరిస్థితి మనకు అనుకూలం కావాలి ‘చేతి’కి చిక్కొద్దు!
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అంతా సమష్టిగా కృషి చేసి పార్టీ గెలుపునకు బాటలు వేయాలని తెలంగాణ బీజేపీ నేతలకు పార్టీ అధిష్టానం మార్గనిర్దేశం చేసింది. ముఖ్య నేతల మధ్య గ్రూపులు, వర్గాల తగాదాలు, పాత–కొత్త పంచాయతీలు, సమన్వయ లోపం, పదవుల పంపకాల ప్రచారం వంటివాటిని పక్కనపెట్టాలని ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ఎదుగుదలకు గండికొట్టేలా ఎవరూ వ్యవహరించరాదని, కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వవద్దని స్పష్టం చేసింది. ఈ పరిస్థితిని చెడగొట్టుకోవద్దని.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకతను బీజేపీకి అనుకూలంగా మలుచుకుని పార్టీని విజయతీరాలకు చేర్చే వ్యూహాలకు పదునుపెట్టాలని సూచించింది. నేతలను ఢిల్లీకి పిలిపించుకుని.. రాష్ట్రంలో బీజేపీ నేతల మధ్య గ్రూపు తగాదాలు పెరుగుతుండటం, పార్టీ కార్యక్రమాలకు కొందరు నేతలు దూరంగా ఉంటుండటం నేపథ్యంలో వాటి ని చక్కదిద్దడంపై అధిష్టానం దృష్టిపెట్టింది. ఈ క్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిలను శనివారం సాయంత్రం ఢిల్లీకి రప్పించుకుంది. తెలంగాణ రాజకీయ అంశాలపై చర్చించేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డిని కూడా పిలిపించింది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తో ముగ్గురు నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీలో కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేసేందుకు నాయకులకు సంయమనం, సమన్వయం, సర్దుబాట్లు తప్పనిసరని రాష్ట్ర నేతలకు జాతీయ నాయకత్వం తేల్చి చెప్పినట్టు సమాచారం. ఇదే సమయంలో ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీ, మేనిఫెస్టో కమిటీల కూర్పుపై చర్చించారని.. ఎన్నికల వ్యూహాలు, ప్రచార అ్రస్తాలు, నేతల పర్యటనలపై దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. పార్టీ అవసరాలకు తగినట్టుగా, అర్హత, పనితీరు ఆధారంగా పదవులు అవే వస్తాయని భేటీ సందర్భంగా బీజేపీ జాతీయ నేతలు స్పష్టం చేసినట్టు సమాచారం. ఆ అపోహలు తొలగేలా చూడాలి! తమ అసంతృప్తికి గల కారణాలను ఈటల, రాజగోపాల్రెడ్డి అధిష్టానం పెద్దల ముందు ఉంచారని సమాచారం. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేయకపోవడంతో.. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయన్న ప్రచారం జరుగుతోందని వివరించినట్టు తెలిసింది. దీనికితోడు మంత్రి కేటీఆర్ ఢిల్లీలో వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతుండటాన్ని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మల్చుకుంటోందని చెప్పినట్టు సమాచారం. తెలంగాణలో పథకాలు, పనుల్లో అవినీతిపై కేంద్రం చర్యలు తీసుకోవడం లేదేమని ప్రజలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నట్టు తెలిసింది. ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు పలువురు నేతల వ్యవహారశైలి, సమన్వయ లేమి, తామే ఫోకస్లో ఉండేలా కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీనిపై స్పందించిన జాతీయ నేతలు.. అన్ని అంశాలపై తమకు అవగాహన ఉందని, వాటిని సరిదిద్దే బాధ్యతను తమకు వదిలేయాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇక రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్గా ఈటల నియామకం అంశంపైనా చర్చ జరిగిందని, రాష్ట్ర బీజేపీలో ఏవైనా సంస్థాగత మార్పులు చేపట్టే అంశంపై త్వరలోనే స్పష్టత ఇస్తామని హైకమాండ్ పెద్దలు సంకేతాలు ఇచ్చినట్టు పార్టీవర్గాలు చెప్తున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకోవాలి అధిష్టానానికి చెప్పామని ఈటల, రాజగోపాల్రెడ్డి వెల్లడి తెలంగాణలో కేసీఆర్ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే తక్షణమే పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని పార్టీ జాతీయ నేతలకు స్పష్టం చేసినట్టు బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చెప్పారు. భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘‘మా ఏకైక ఆశయం రాష్ట్రంలో బీఆర్ఎస్ను గద్దె దింపడమే. మేం పదవుల కోసమో, లావాదేవీల కోసమో ఢిల్లీకి రాలేదు. బీజేపీ ద్వారానే కేసీఆర్ కుటుంబ పాలనకు అంతం ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా, సంకోచం లేకుండా జాతీయ నేతలకు వివరించాం. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొన్ని కీలక నిర్ణయాలు చేయాలని కోరాం. తక్షణ కర్తవ్యాలపై మా అభిప్రాయాలను వివరించాం’’ అని వెల్లడించారు. కేంద్ర నాయకత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని అమిత్షా, నడ్డా హామీ ఇచ్చారని తెలిపారు. -
వలస నేతల ‘ఉక్కపోత’!
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విషయంలో బీజేపీ తాజా వైఖరి ఆ పార్టీ నేతలను ఒకింత అసంతృప్తి, ఆందోళనకు గురిచేస్తోంది. తెలంగాణలో పాలన తీరు.. కేసీఆర్, ఆయన కుటుంబంపై అవినీతి ఆరోపణల విషయంలో మెతకగా వ్యవహరించాలన్న సంకేతాల అంశం బీజేపీలో రాజకీయ ప్రకంపనలకు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్లో కీలక నేతగా ఎదిగి, హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన ఈటల రాజేందర్, కాంగ్రెస్కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపు అంచుల వరకు వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిల సేవలను బీజేపీ విస్తృత స్థాయిలో వినియోగించుకోలేక పోతోందన్న ఆవేదనను వారి అనుచరులు వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ విషయంలో మారిన పార్టీ వైఖరితో పాటు సమర్థులైన నాయకులను సరైన పద్ధతిలో వాడుకోలేక పోతోందన్న విషయంలో ఈ ఇద్దరి నాయకులపై క్యాడర్ నుండి తీవ్ర ఒత్తిడి వస్తోందని సమాచారం. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత కేసీఆర్, ఆయన ప్రభుత్వం, ఇప్పటికే వెలుగులోకి వచ్చిన కేసుల విషయంలో వేగం తగ్గిందని, ఇది బీజేపీ క్యాడర్ను నిరుత్సాహానికి గురి చేయడంతో పాటు వారిలో అనుమానాలకు కారణమవుతోందని అంటున్నారు. ఇన్నాళ్లు కేసీఆర్, ఆయన కుటుంబంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన తాము ఇప్పుడెలా ప్రజల్లోకి వెళతామని, కేసీఆర్పై పోరాడే పార్టీలోనే మనం ఉండాలని హుజూరాబాద్, మునుగోడు నియోజకవర్గాల క్యాడర్ అంటున్నట్లు సమాచారం. కార్యకర్తలు, ముఖ్య అనుచరుల నుండి పెరుగుతోన్న వత్తిడి నేపథ్యంలో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిలు గత కొన్ని రోజులుగా దాదాపు ప్రతిరోజూ భేటీ అవుతున్నారు. తాము కేసీఆర్, ఆయన కుటుంబ పాలనకు వ్యతిరేకంగానే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఎన్నికల యుద్ధంలో పాల్గొన్నామని, ప్రస్తుత కీలక దశలో బీఆర్ఎస్ విషయంలో బీజేపీ రాజకీయ వైఖరిని మార్చుకునే పరిస్థితి ఉంటే తాము.. మెజారిటీ కార్యకర్తలు, నాయకుల అభీష్టం మేరకు పోరాట పంథాను రూపొందిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడి బీఆర్ఎస్కు పరోక్ష మద్దతిచ్చే బీజేపీలో కొనసాగే పరిస్థితి ఉండదంటూ కార్యకర్తలకు భరోసా ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతా ఉమ్మడి వేదికపైకి.. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిలపై కింది స్థాయి నుంచి వత్తిడి వస్తోన్న నేపథ్యంలో త్వరలో రాజగోపాల్ ఆధ్వర్యంలో ఓ కీలక సమావేశం నిర్వహించే దిశగా అడుగులు పడుతున్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తమ అనుచరులతో పాటు సబ్బండ వర్గాలు, ఉద్యోగ, కార్మిక, విద్యార్థి, యువజన ప్రతినిధులతో ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో వచ్చే ప్రతిపాదన దిశగా తమ రాజకీయ కార్యాచరణను ప్రకటించనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. తెలంగాణ రాష్ట్ర అవిర్భావానికి ముందు ఇక్కడి ప్రజలు ఏం కోరుకున్నారు?, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది?, ఇందులో బీఆర్ఎస్ నేతల అవినీతి, బంధుప్రీతి ఎలా రాజ్యం చేసింది? తదితర అంశాలపై చర్చించి, అందులో వచ్చే ఏకాభిప్రాయం ద్వారా తమ రాజకీయ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ దిశగానే గడిచిన వారం రోజులుగా రాజగోపాల్రెడ్డి పలువురు కీలక నాయకులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. -
వేడి రాజుకుంది.. తెలంగాణ బీజేపీలో ఆసక్తికర పరిణామాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. త్వరలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతో పాటు ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ నియామకం, ఇతర మార్పులు జరగనున్నాయనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం సమావేశమైన సీనియర్ నేతలు కొందరు ప్రచార కమిటీ చైర్మన్గా ఈటల నియామకంతో పాటు రాష్ట్ర అధ్యక్షుడి మార్పు వంటి అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు తమ అభిప్రాయాన్ని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. వారం క్రితం ‘అసంతృప్తి’ సెగ దాదాపు వారం రోజుల క్రితం కొందరు అసంతృప్త నేతలు సమావేశమై, సీనియర్లమైన తమకు పార్టీలో తగిన ప్రాధాన్యత, గుర్తింపు లభించడం లేదని, పార్టీ ముఖ్యనేత ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తూ పార్టీకి నష్టం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నేతల మధ్య సమన్వయం కొరవడటం లాంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాతీయ నాయకత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ కమిటీల్లో మార్పులు, బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్గా ఈటల నియామకం అనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శనివారం రాత్రి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పార్టీలో మార్పులపై జరుగుతున్నది ప్రచారం మాత్రమేనని అన్నారు. తాను పార్టీ కోసం కమిట్మెంట్తో కష్టపడి పనిచేస్తానని, బీజేపీలో ఏ పదవీ శాశ్వతం కాదని, నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా పాటించేందుకు బిస్తర్ రెడీగా పెట్టుకున్నానంటూ వ్యాఖ్యానించారు. తాజాగా అనుకూల వర్గం భేటీ.. ఆదివారం పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో జాతీయ కార్యవర్గసభ్యులు జి.వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, మాజీ ఎంపీలు రవీంద్రనాయక్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, డా.బూర నర్సయ్యగౌడ్, డా.విజయ రామారావు, సుద్దాల దేవయ్య, సీహెచ్ విఠల్, రచనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్కు అనుకూల వర్గంగా భావిస్తున్న ఈ నేతలు.. ఇతర అంశాలతో పాటు రాష్ట్ర నాయకత్వ మార్పు, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ను రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్గా నియమించడంపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బండి సంజయ్ను మార్చొద్దని, ఈటలకు కీలక పదవి ఇవ్వొద్దంటూ అధిష్టానాన్ని గట్టిగా కోరాలని నిర్ణయించినట్లు సమాచారం. తాము కూడా ఉద్యమకారులమేనని, జాతీయ కార్యవర్గసభ్యులుగా ఉన్నామని, సీనియర్ నేతలైన తమకు తెలియకుండానే కీలక నిర్ణయాలు ఎలా తీసుకుంటారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈటలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని వ్యతిరేకించడంతో పాటు, ఆయనకు కీలక పదవి ఇవ్వొద్దని, తాము ఆయన కంటే సీనియర్లమని, తమకు కూడా తగిన గుర్తింపునిచ్చే పదవులు ఇవ్వాలని అభిప్రాయ పడినట్లు సమాచారం. జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్న తమకు పార్టీలో జరుగుతున్న పరిణామాలు తెలియడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ అంశాలన్నీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. తమతో కలిసి భోజనం చేసేందుకు రావాలనే ఆహ్వానంతో ఒక మాజీ ఎంపీ అక్కడకు వెళ్లగా, కొంతకాలంగా అంతగా చురుగ్గా లేని ఒకరిద్దరు నేతలు కూడా ఇదే విధమైన ఆహ్వానంతో అక్కడకు వెళ్లారని తెలుస్తోంది. అసలు ఆ పోస్టే ఉండదు.. బీజేపీలో ప్రచార కమిటీ చైర్మన్ అనే పదవి లేదని సమావేశానంతరం జితేందర్రెడ్డి మీడియాతో అన్నారు. ‘రాష్ట్ర నేతలతో చర్చించకుండా అధ్యక్షుడి మార్పుపై జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. పదవులు ఇచ్చే ముందు లీకులు ఇచ్చే సంస్కృతి బీజేపీలో ఉండదు. దీనిపై సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో వస్తున్న లీకులను పార్టీ క్యాడర్ నమ్మొద్దు. బీజేపీ స్టేట్ చీఫ్ను మారుస్తున్నారని కేసీఆర్ లీకులు ఇప్పిస్తున్నారు. బీజేపీ బలం తగ్గిందని చెప్పడానికే కాంగ్రెస్పై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు. క్యాడర్ను కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. మాకు ఎలాంటి రహస్య అజెండా లేదు. బీజేపీ బలోపేతమే మాకు ముఖ్యం. పొంగులేటి, జూపల్లి కూడా బీజేపీలో చేరాలని కోరుతున్నా. శత్రువుకు శత్రువు.. మిత్రుడు అన్నట్టు కేసీఆర్ను కొట్టాలంటే పొంగులేటి, జూపల్లి బీజేపీ వైపు రావాలి..’ అని వ్యాఖ్యానించారు. భేటీపై స్పందించేందుకు ఈటల నిరాకరణ.. బీజేపీ సీనియర్ నేతలు ప్రత్యేకంగా భేటీ కావడంపై స్పందించేందుకు ఈటల రాజేందర్ నిరాకరించారు. ఇలాంటి వాటిపై తాను మాట్లాడనని, ఎలాంటి చిట్చాట్ చేయనని తన నివాసం వద్ద ఆయన మీడియాతో చెప్పారు. అధిష్టానం ఎలా స్పందిస్తుందో? సీనియర్ల భేటీ బీజేపీలో చర్చకు దారితీసింది. ఇది దేనికి సంకేతం? దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుంది? సీనియర్ల అభ్యంతరాలను ఎలా తీసుకుంటుంది? ప్రచార కమిటీ చైర్మన్గా ఈటల నియామకంపై ఈ సమావేశం ఎఫెక్ట్ పడుతుందా? అనే దానిపై పార్టీ నేతల్లో ఆసక్తి నెలకొంది. మీడియా ద్వారా లీకులు సరికాదు: విజయశాంతి బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి మార్పుపై మీడియా ద్వారా లీకులు సరికాదని విజయశాంతి అన్నారు. బీజేపీలో వార్తలు లీక్ చేసే పద్ధతి ఉండదని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యేవరకూ బండి సంజయ్ కొనసాగుతారని రాష్ట్రపార్టీ ఇన్చార్జి తరుణ్ చుగ్ గతంలో చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఇదే అధికారిక ప్రకటన అని, ఊహాగానాలతో మీడియాలో వచ్చే కథనాలు అధికారిక ప్రకటనలు కావని స్పష్టం చేశారు. -
గెలుపే టార్గెట్ గా కమలదళంలో అంతర్గత మార్పులు
-
బీజేపీ మాస్టర్ ప్లాన్.. ప్రచార ‘సారథి’ ఈటెల!.. ప్రకటన ఎప్పుడంటే?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తంలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని కీలక పదవుల భర్తీపై బీజేపీ కసరత్తు ఓ కొలిక్కి వచి్చనట్లు తెలుస్తోంది. నాలుగైదు రోజులుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్షా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్లు ఈ విషయమై చర్చలు జరిపారు. అత్యంత కీలకమైన పార్టీ ప్రచార కమిటీ బాధ్యతలను సీనియర్ నేత ఈటల రాజేందర్కు కట్టబెట్టాలని దాదాపుగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లోనే అధికారిక ప్రకటన ఉండొచ్చని ఢిల్లీ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో ఈటలకున్న గుర్తింపు, రాజకీయ అనుభవం, కుల సమీకరణల ఆధారంగా..ప్రచార బాధ్యతలు ఆయనకు అప్పగిస్తేనే అధికార బీఆర్ఎస్ను ఎదుర్కోగల మని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు చెబుతు న్నారు. ఈటలకు కీలక బాధ్యతలు ఇస్తే బీఆర్ఎస్ నుంచి మరింత మంది అసంతృప్త నేతలు బీజేపీలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయ ని అంచనా వేస్తున్నట్టు సమాచారం. నిజానికి తనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని ఈటల కోరుతున్నప్పటికీ, వివిధ సమీకరణలు, పార్టీలో కొంతమంది నుంచి వ్యక్తమైన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు తెలిసింది. దీనిపై ఇప్పటికే ఈటలకు పెద్దలు సమాచారమిచ్చారని, దీనికి ఆయన కూడా అంగీకారం తెలిపినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈటలను శుక్రవారం ఢిల్లీకి పిలిపించారని ప్రచారం జరిగినా, ఆయన గౌహతి వెళ్లినట్లుగా ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అధ్యక్షుడి మార్పుపై ఎడతెగని చర్చలు.. అత్యంత కీలకమైన పార్టీ అధ్యక్ష బాధ్యతల మార్పుపైనా బీజేపీ పెద్దలు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. బండి సంజయ్నే కొనసాగించాలని పారీ్టలోని ఓ వర్గం కోరుతుంటే.. ఎన్నికలను, అధికార బీఆర్ఎస్ను సమర్థంగా ఎదుర్కోవాలంటే మార్చడమే ఉత్తమమని మరికొంతమంది నేతలు చెబుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఒకవేళ సంజయ్ను పక్కన పెడితే ఎవరిని అధ్యక్షుడిగా నియమించాలన్న దానిపైనా బీజేపీ జాతీయ నాయకత్వం సమాలోచన చేస్తోంది. ఈ క్రమంలో మొన్నటివరకు ఈటల పేరును పరిశీలించినా, చివరకు ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించాలని పెద్దలు నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేరు ముందుకు వచ్చినట్లు సమాచారం. వివాదాలకు దూరంగా ఉండటం, అందరినీ కలుపుకొనే తత్వం, పార్టీ అప్పగించే బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తించడం, సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆమెను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆమెకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టే అంశంపై ఇప్పటికే రాష్ట్ర ఇన్చార్జిల నుంచి అభిప్రాయ సేకరణ జరిపినట్లు చెబుతున్నారు. అన్నీ ఓకే అయితే అధ్యక్షుడి మార్పుపై సైతం రెండు, మూడ్రోజుల్లోనే ప్రకటన ఉండొచ్చని అంటున్నారు. అదే జరిగితే ఇప్పటివరకు రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన సంజయ్కు కేంద్రమంత్రి పదవి ఇవ్వడం ద్వారా సముచిత గౌరవం కలి్పంచవచ్చని తెలుస్తోంది. చదవండి: ‘బీ’టెక్ బేరం షురూ! -
ఈటలకు కీలక పదవి!..ఢిల్లీకి పయనం
-
వీరి సంగతేంటి?.. బీజేపీకి పెద్ద దెబ్బే పడుతుందా?
ఇద్దరూ ఒకే పార్టీలో వున్నారు. ఇద్దరివీ కీలక బాధ్యతలే.. ఇతర నాయకులకు మార్గదర్శకంగా వుండాల్సిన ఆ నేతలిద్దరూ నోరు జారుతున్నారు. నోటి దూలతో విమర్శలపాలవుతున్నారు. తమ మధ్యనున్న విభేదాలను అనుకోకుండానే బయట పెట్టుకుంటున్నారు. ఒకరేమో బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్.. మరొకరేమో సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుతం బీజేపీలో కీలకనాయకునిగా గుర్తింపు పొందిన హుజారాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఈ ఇద్దరు కమలదళం నేతల చిట్ చాట్లు, మీడియా మీట్లు బీజేపీకి లేనిపోని తలనొప్పులు తెస్తున్నాయి. పార్టీ రథసారథిగా తెలంగాణ రాష్ట్ర బీజేపీకి ఒక ఊపు తీసుకొచ్చిన సంజయ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే అధికార బిఆర్ ఎస్ ఎన్ని ఎత్తుగడలు వేసినా సరే వాటిన్నిటినీ తిప్పికొట్టి ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటిన ఈటెల రాజేందర్ రాష్ట్ర కమలదళంలో జోష్ నింపారు. అటు హైకమాండ్ దగ్గర ఇటు జనాల్లో తమదైన స్టయిల్లో పేరు సంపాదించుకున్న ఈ ఇద్దరు నేతలు తాము సాధించిన గుర్తింపును నిలుపుకోవడంలో విఫలమవుతున్నారనే విశ్లేషణలు రాజకీయ విశ్లేషకులనుంచే కాదు.. సొంతపార్టీ నుంచే వెలువడుతున్నట్టు సమాచారం. ఈ ఇద్దరు నేతలూ బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక వ్యవహారంలో నోరు జారి ఆ తర్వాత నాలుక్కర్చుకోవడం తాజాగా చర్చనీయాంశమవుతోంది. చేరికల కమిటీ అధ్యక్షుడి హోదాలో ఈటెల రాజేందర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారట కదా అని విలేకర్లు బండి సంజయ్ ని అడిగితే.. ఓ రాష్ట్ర పార్టీ చీఫ్ గా ఔననో, తనకింకా పూర్తి సమాచారం అందాల్సి ఉందనో ఆ సమయానికి ఆయన లౌక్యంగా సమాధానం ఇవ్వాలి. కనీసం నెగటివ్ కామెంట్లకు, అనుమానాలకు ఆస్కారం లేకుండా చూసుకోవాలి . కానీ ఆయన ఆ పని చేయలేదు. తనకు ఆ విషయంపై అంటే పొంగులేటితో ఈటల చర్చలపై అసలు సమాచారమే లేదంటూ బండి సంజయ్ బ్లంట్గా చేసిన వ్యాఖ్యలు.. ఇంటా, బయటా చర్చనీయాంశమయ్యాయి. పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన తరుణంలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయనకు ఈటెల రాజేందర్తో గ్యాప్ ఉందనే ప్రచారాన్ని బలపర్చేలాగా వున్నాయి. గతంలో ఎమ్మెల్సీ కవితపైనా అలాగే మాట తూలిన బండి సంజయ్ .. తన సొంత పార్టీ ఎంపీ అరవింద్ నుంచి విమర్శలెదుర్కొన్నారు. మంచి మాటకారిగా.. ఆచితూచి మాట్లాడే నేతగా పేరున్న ఈటెల రాజేందర్ కూడా చేరికల కమిటీ అధ్యక్షుడి హోదాలో చేస్తున్న వ్యాఖ్యలూ బండి సంజయ్ తరహాలోనే ఉండటం చర్చనీయాంశమవుతున్నాయి. బిజెపిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు.. పొంగులేటి శ్రీనివాసరెడ్డే తనకు కౌన్సిలింగ్ ఇచ్చారని ఖమ్మంలో కాంగ్రెస్సే బలంగా ఉందంటూ ఈటెల రాజేందర్ చిట్ చాట్గా చేసిన వ్యాఖ్యలు తెలంగాణా రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. చేరికల కమిటీ అధ్యక్షుడు రాజేందరే అలా వ్యాఖ్యలు చేయడం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి ఉపయోగపడకపోగా.. ప్రత్యర్థి పార్టీల విమర్శలకు అవకాశం కల్పించేలా వున్నాయి. తన చిట్ చాట్ వ్యాఖ్యలు సంచలనం సృష్టించడంతో నాలుక్కర్చుకున్న ఈటెల రాజేందర్.. ఆ తర్వాత తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారంటూ తానే ఖండన ఇచ్చారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అవకాశం దొరికితే ఇరుకున పెట్టే హరీష్రావు లాంటి వాళ్లు అదే అదనుగా రెచ్చిపోయి బీజేపీ నేతలపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ అంటే సహించలేని సొంత పార్టీ నేత విజయశాంతి లాంటివారు కూడా ఈటలపై కౌంటర్స్ వేసే పరిస్థితి వచ్చింది. ఇలా బండి సంజయ్, ఈటెల రాజేందర్ మాటలు తూలుతుండటంతో బీజేపీ నేతల్లో, కార్యకర్తల్లో అసహనం పెల్లుబుకుతోంది. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని భావించి ఆ పార్టీలో చేరాలనుకుంటున్నవారు పునరాలోచించుకునేలా బండి సంజయ్, ఈటల రాజేందర్ వ్యవహార శైలి వుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఇద్దరు కీలక నేతల మధ్యన ఏర్పడిన గ్యాప్, అభిప్రాయ భేదాలు ఆ ఇద్దరికి ఎంత నష్టం తెస్తాయో ఏమోగానీ...కాషాయ పార్టీకి మాత్రం పెద్ద దెబ్బే పడుతుందని వారు అంటున్నారు. చదవండి: టీడీపీలో అరాచక నేతలు -
బండి, ఈటల మాటలతో కాషాయ పార్టీలో మంటలు..!
-
ట్విట్టర్ వేదికగా బయటపడ్డ విజయశాంతి, ఈటల విబేధాలు
-
కాంగ్రెస్ ని పొగిడిన ఈటల
-
అన్ని పార్టీల్లో అడుగడుగునా కేసీఆర్ కోవర్టులు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అమలు చేసే ‘పొలిటికల్ ట్రిక్స్’ అన్నీ తనకు తెలుసని.. ఎన్నికలు వచ్చినప్పుడు ఎలా వ్యవహరిస్తారో దగ్గరుండి చూశానని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. అన్ని పార్టీల్లోనూ కేసీఆర్ అడుగడుగునా కోవర్టులను పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని.. ఇటీవల వివిధ పార్టీల్లో చోటుచేసుకున్న పరిణామాలు దీనిని రుజువు చేస్తున్నాయని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలనపై కేంద్ర మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ సోమవారం హైదరాబాద్లో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంగా ఈటల మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ప్రజలే ఓడించబోతున్నారన్నారు. కాంగ్రెస్ను అమాంతం మింగేస్తారు కాంగ్రెస్ పార్టీని ఎలా డీల్ చేయాలో కేసీఆర్కు బాగా తెలుసని, గత ఎన్నికల్లోనూ అదే జరిగిందని ఈటల చెప్పారు. 2018 ఎన్నికలకు ముందు కేసీఆర్ సర్కార్పై, అధికార బీఆర్ఎస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై కాంగ్రెస్ పుంజుకుంటున్నదన్న దశలో.. ఆ పార్టీని ఎటూకాకుండా చేసిన తీరును తాను దగ్గరి నుంచి గమనించానని చెప్పారు. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ నాలుకకు కూడా తగలకుండా అమాంతం మింగేస్తారని వ్యాఖ్యానించారు. నాకే రివర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను కాంగ్రెస్, మరే ఇతర పార్టీలో చేరకుండా ఇప్పటిదాకా జరిపిన చర్చల ద్వారా ఆపగలిగానని ఈటల చెప్పారు. తమ చర్చల్లో వారు అనేక అంశాలను ప్రస్తావించడంతోపాటు తనకే రివర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని నవ్వుతూ చెప్పారు. వారితో బీజేపీ హైకమాండ్ చర్చలు జరుపుతోందన్నారు. ఖమ్మం జిల్లా సంప్రదాయకంగా కమ్యూనిస్టులకు, కాంగ్రెస్కు పట్టున్న జిల్లా అన్న విషయం అందరికీ తెలిసిందేనని.. అయితే బీజేపీలో పొంగులేటి, జూపల్లి చేరడం కష్టమేనని తాను అనని మాటలను అన్నట్టుగా కొందరు ప్రచారం చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. ప్రభుత్వం, అధికార పార్టీ రాజకీయాలు, అధికారుల ఒత్తిళ్లను ఎదుర్కొని మరీ ప్రజల అండదండలతో హుజూరాబాద్లో గెలవగలిగానన్నారు. కేసీఆర్పై గజ్వేల్లో పోటీచేస్తానని తాను ప్రకటించగానే.. అక్కడా తనకు ప్రజల మద్దతు పెరిగిందని, సోషల్మీడియాలో 72 శాతానికిపైగా పోలింగ్ నమోదైందని చెప్పారు. -
బీఆర్ఎస్ను దించే ప్లాన్ ఏంటి?
సాక్షి, హైదరాబాద్: బీజేపీలోకి ఇతర పార్టీల నేతలను చేర్పించే కసరత్తును ఆ పార్టీ చేరికల కమిటీ కన్వీనర్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ వేగవంతం చేశారు. పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో ఈటల భేటీ అయ్యారు. ఉదయమే జూబ్లీహిల్స్ ప్రాంతంలో తమ సొంత వాహనాలను విడిచిపెట్టి.. గన్మన్లు, వ్యక్తిగత సహాయకులు కూడా లేకుండానే వారితో నాలుగైదు గంటల పాటు చర్చించినట్టు తెలిసింది. ఐదారు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో వెంటనే బీజేపీలో చేరికపై నిర్ణయం తీసుకోవాలని, చేరికపై జాతీయ నాయకత్వం నుంచి సానుకూలత వ్యక్తమైందని వారికి ఈటల చెప్పినట్టు తెలిసింది. ఇటీవల ఢిల్లీలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ సందర్భంగా కూడా ఈ అంశం చర్చకు వచి్చందని తెలిపినట్టు సమాచారం. జాతీయ నాయకత్వం తరఫున పొంగులేటి, జూపల్లిలకు ఈటల హామీ ఇచ్చారని, పారీ్టలోకి వస్తే కలిగే ప్రయోజనాలను వివరించారని తెలిసింది. మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి? భేటీ సందర్భంగా బీఆర్ఎస్ను ఓడించేందుకు బీజేపీ వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటని, ఇందుకోసం ఎలాంటి కార్యాచరణ ప్రణాళికను అమలు చేయబోతున్నారని ఈటలను పొంగులేటి, జూపల్లి ప్రశ్నించినట్టు తెలిసింది. బీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు జాతీయ, రాష్ట్ర నాయకత్వాల వద్ద స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయని, ఏ రకమైన వ్యూహాలను అనుసరిస్తారన్నది ఈటల వివరించినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమే తమ ప్రధాన లక్ష్యమని, దాన్ని సాధించగలిగే పార్టీ, నాయకత్వం వెంటే వెళ్లేందుకు తాము సిద్ధమని వారు ఈటలకు చెప్పినట్టు తెలిసింది. ఈ దిశగా బీజేపీ ఏమేరకు సంసిద్ధమై ఉంది? బీఆర్ఎస్ను గద్దె దించేందుకు ఎలాంటి కార్యాచరణ అమలు చేయబోతున్నదనే దానిపై మరింత స్పష్టత కావాలని వారు కోరినట్టు సమాచారం. ఈటల సమాధానాలతో సంతృప్తి చెందని పొంగులేటి, జూపల్లి.. బీజేపీలో చేరికపై నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం కావాలని కోరినట్టు తెలిసింది. శుక్రవారం కూడా వారితోపాటు మరికొందరితో ఈటల సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ప్రత్యామ్నాయాలపై చర్చ? వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించేందుకు అన్ని రాజకీయ ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని ఈటలకు పొంగులేటి, జూపల్లి సూచించినట్టు సమాచారం. అంతా బలమైన పార్టీలోకి వెళ్లడం లేదా వివిధ పారీ్టల్లోంచి ముఖ్య నేతలంతా కలిసి ఓ ప్రాంతీయ పార్టీని స్థాపించి.. ఇతర భావ సారూప్యశక్తులతో పొత్తు కుదుర్చుకుంటే ఎలా ఉంటుందనే అంశాలపైనా వారి మధ్య చర్చ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఇద్దరు నేతలూ బీజేపీలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. -
బీజేపీకి కొత్త టెన్షన్.. వచ్చే వారంలో ఏం జరుగనుంది?
కర్ణాటక ఎన్నికల్లో ఎదురుదెబ్బతో బీజేపీ అగ్రనాయకత్వం వెంటనే అప్రమత్తమైంది. కేసీఆర్ సర్కార్ను, బీఆర్ఎస్ పార్టీని బలంగా ఎదుర్కొని ఢీ అంటే ఢీ అనేలా తెలంగాణలో పార్టీని సంసిద్ధం చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకోసం పారీ్టలో అవసరమైన మార్పుల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర రాజకీయాల్లో విస్తృత అనుభవమున్న, బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలను పసిగట్టి తిప్పికొట్టగలిగిన సీనియర్ నేత ఈటల రాజేందర్కు కీలక బాధ్యతలు అప్పగించాలని.. మరికొందరు నేతలకూ చేతినిండా ‘పని’ అప్పగించాలని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే అగ్రనేత,కేంద్ర హోంమంత్రి అమిత్షా.. ఈటలను ఢిల్లీకి పిలిపించి మాట్లాడారని, మరికొందరు నేతలతోనూ మాట్లాడనున్నారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: కర్ణాటకలో ఓటమి నేపథ్యంలో.. దక్షిణాదిలో ఆశలు పెట్టుకున్న మరో రాష్ట్రం తెలంగాణలోనైనా గెలవాలన్న దిశగా బీజేపీ అగ్ర నాయకత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోంది. కొన్ని నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రాష్ట్ర పారీ్టలో పలు కీలక మార్పులకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా పలు కొత్త నియామకాలు చేపట్టడంతోపాటు ముఖ్య నేతలకు కీలక బాధ్యతలు అప్పగించే పనిలో పడింది. సామాజిక సమీకరణాలు, రాజకీయ అనుభవం ఆధారంగా.. ప్రస్తుతం పార్టీ చేరికల కమిటీ చైర్మన్గా ఉన్న ఈటల రాజేందర్కు కీలక బాధ్యతలు కట్టబెట్టాలని భావిస్తున్నట్టు బీజేపీలోని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి వారం, పది రోజుల్లోనే జాతీయ నాయకత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నాయి. అమిత్షాతో ఈటల భేటీ.. కీలక బాధ్యతపై సంకేతాలు.. పార్టీ పెద్దల పిలుపు మేరకు సోమవారం ఢిల్లీకి చేరుకున్న ఈటల రాజేందర్.. మంగళవారం బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, చేరికలు, పార్టీ కార్యక్రమాలు, రానున్న ఎన్నికలకు వ్యూహ రచన, నేతలకు బాధ్యతలు వంటి అంశాలపై చర్చించినట్టు తెలిసింది. వాస్తవానికి తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ను, బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా, ఇతర అంశాల్లో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో రాష్ట్ర పార్టీని సంసిద్ధం చేయాలని.. ప్రస్తుతమున్న స్పీడ్, అనుసరిస్తున్న పద్ధతులు ఇందుకు సరిపోవని కొంతకాలంగా పలువురు సీనియర్లు అధిష్టానం వద్ద ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీని పూర్తిస్థాయిలో సమాయత్తం చేయడం, పార్టీ అజెండాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం కోసం.. కొందరిని బాధ్యతల నుంచి తప్పించడంతోపాటు మరికొందరు నేతలకు కీలక బాధ్యతలు అప్పగించాలన్న అంశంపైనే అమిత్షాతో ఈటల భేటీలో ఎక్కువగా చర్చలు సాగినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీ చైర్మన్ వరకు కీలక నియామకాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలను అమిత్షా ఇచి్చనట్టు ప్రచారం జరుగుతోంది. వీటిలో ఏదో ఒక బాధ్యతను ఈటలకు అప్పగిస్తామని అమిత్షా హామీ ఇచి్చనట్టు తెలుస్తోంది. మరికొందరు ముఖ్యనేతలతో సంప్రదింపులు? రాష్ట్ర పారీ్టలో చేపట్టబోయే కీలక మార్పులు, ముఖ్యమైన బాధ్యతలను అప్పగింతకు సంబంధించి మరికొందరు ముఖ్య నేతలను ఢిల్లీకి పిలిపించి సంప్రదింపులు జరిపే అవకాశాలు ఉన్నాయని బీజేపీ ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. ఆయా నేతల అభిప్రాయాలు కూడా తీసుకున్నాక.. వారం, పది రోజుల్లోనే నియామకాలపై అధికారిక ప్రకటన ఉండొచ్చనే అభిప్రాయం పారీ్టలో వ్యక్తమవుతోంది. ఇతర పారీ్టల నుంచి ముఖ్య నేతల చేరికలకు సంబంధించి సైతం ఈ భేటీలో కొంత స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఈటల హైదరాబాద్కు వచ్చాక మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతోపాటు బీఆర్ఎస్ అసంతృప్త నేతలతో భేటీ అయి చేరికల ప్రక్రియను వేగవంతం చేయాలని అమిత్షా సూచించినట్టు సమాచారం. తాను ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదట్లో తెలంగాణ పర్యటనకు వస్తానని చెప్పినట్టు తెలిసింది. ఆ పర్యటన సందర్భంగా ఎన్నికల వ్యూహాలు, పార్టీ మేనిఫెస్టో, పార్టీ బలోపేతం, రాష్ట్రస్థాయి నుంచి నియోజకవర్గాల వరకు ముఖ్య నేతల బహిరంగ సభలు, ఇతర అంశాలపై అమిత్షా దిశానిర్దేశం చేస్తారని పారీ్టవర్గాలు చెప్తున్నాయి. నేడు ఢిల్లీకి సంజయ్? పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు కూడా జాతీయ నేతల నుంచి పిలుపు వచ్చిందని, ఆయన బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే తాను ఆరోగ్యపరమైన అంశంపై ఢిల్లీ వెళ్లాలని ముందుగానే నిర్ణయించుకున్నానని.. దీనికి రాజకీయాలతో సంబంధం లేదని సంజయ్ తన సన్నిహితుల వద్ద పేర్కొన్నట్టు తెలిసింది. అసంతృప్తిని చక్కదిద్దేందుకే? బీజేపీలో చేరినప్పటి నుంచీ తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని జాతీయ నాయకత్వం వద్ద ఈటల రాజేందర్ పలుమార్లు అసంతృప్తి వెలిబుచ్చినట్టు తెలిసింది. ఇదే సమయంలో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల మధ్య సత్సంబంధాలు కొరవడటం, పాత–కొత్త నేతల మధ్య సమన్వయ లేమి, బీఆర్ఎస్ వైఫల్యాలపై ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్లలేకపోవడం, ఇతర పారీ్టల నుంచి చేరికలు ఆగిపోవడం, ముఖ్య నేతలు వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునేందుకే ప్రాధాన్యత నివ్వడం వంటి అంశాలను జాతీయ నాయకత్వం గుర్తించినట్టు సమాచారం. దీనికితోడు తాజాగా కర్ణాటకలో అధికారాన్ని కోల్పోవడంతో.. అసంతృప్తులను చక్కదిద్దడం, సమన్వయాన్ని నెలకొల్పడం కీలకమని నిర్ణయానికి వచి్చనట్టు తెలిసింది. తద్వారా పార్టీ కేడర్లో విశ్వాసాన్ని నింపవచ్చని భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కొన్ని మార్పుచేర్పులకు సిద్ధమైనట్టు తెలిసింది. ఇది కూడా చదవండి: ఢిల్లీలో ఈటల.. బండి సంజయ్కు అధిష్టానం నుంచి పిలుపు -
నేతలంతా కలిసి వెళ్లాలన్న పార్టీ హైకమాండ్
-
కొత్త సచివాలయం వారి ప్రేమకు చిహ్నం: బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయంపై మరోసారి విమర్శలు గుప్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఎంఐఎం, బీఆర్ఎస్ ప్రేమకు చిహ్నమే ఈ కొత్త సచివాలయ డిజైన్ అని సెటైర్లు వేశారు. వీరి ప్రేమకు కాంగ్రెస్, కమ్యూనిస్టులు రాయబారులు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొత్త సచివాలయాన్ని కూలగొడతానని తానెప్పుడూ అనలేదని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలో మరో ఐదు నెలల్లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని వ్యాఖ్యానించారు. కేసీఆర్కు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. రోజూ కేసీఆర్ ఆఫీస్కు వస్తారా?: ఈటల రాజేందర్ కరీంనగర్: నూతన సచివాలయం ప్రారంభంపై బీజేపీ నేత ఈటల రాజేందర్ మాట్లాడుతూ, కొత్త సచివాలయం కట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మూడు, నాలుగు నెలలపాటు రోజు ఆఫీస్కు వస్తారా? అని ప్రశ్నించారు. ఇతర నాయకుల ఆనవాళ్లు లేకుండా చేయడానికి, కేసీఆర్ ప్రతిష్ట కోసమే కొత్త సచివాలయాన్ని నిర్మించారని విమర్శించారు.తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణలో పాలన అస్తవ్యస్థమైందని ధ్వజమెత్తారు. కొత్త సచివాలయంలో అయినా పాలన బాగుపడాలని ఆశిస్తున్నాన్నట్లు తెలిపారు. చదవండి: కొంతమంది పిచ్చి కూతలు కూశారు: సీఎం కేసీఆర్ -
చిల్లర రాజకీయాలు సరికాదు.. భావోద్వేగంతో కంటతడి పెట్టిన రేవంత్
అప్డేట్స్ 18:32 PM భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు ఈటల రాజేందర్ రాకపోవడంతో రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ.. నేను అమ్మవారిని నమ్ముతాను. మునుగోడులో ఏం జరిగిందో అందరికీ తెలుసు. మునుగోడులో రూ.3వందల కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. మునుగోడులో మద్యం పంపిణీ లేకుండా మేం ఓట్లు అడిగాం. ఒక్క రూపాయి పంచకున్నా పాల్వాయి స్రవంతికి పాతికవేల ఓట్లు వచ్చాయి. నిజాయితీగా 20వేల మంది కాంగ్రెస్ వెంట నిలిచారు. అమ్మవారి సాక్షిగా చెబుతున్నా. అమ్మవారి కండువా వేసుకుని ప్రమాణం చేస్తున్నా. ఆధారాలు చూపించాలని ఈటలకు సవాల్ విసురుతున్నా. కేసీఆర్ నుంచి సాయం పొంది ఉంటే మేమే సర్వనాశనమవుతాం. నేను చెప్పింది అబద్ధమైతే.. సర్వనాశనమైపోతాను. ఆధారాలు లేనప్పుడు దేవుడిపై ఆధారపడతాం. గర్భగుడిలో నిలబడి ఒట్టేసి చెప్పా కేసీఆర్తో ఎలాంటి లాలూచీ లేదు. ఆధారాలు లేకుండా ఈటల నాపై ఆరోపణలు చేశారు. చివరి బొట్టు వరకు కేసీఆర్తో పోరాడతా. ఈటల.. నీలాగా లొంగిపోయిన వ్యక్తిని కాదు. ఈటల రాజేందర్ ఆలోచించి మాట్లాడాలి అంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో రేవంత్ భావోద్వేగానికి గురై.. కంటతడి పెట్టుకున్నారు. 05:55PM భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్న రేవంత్రెడ్డి ఇంట్లోనే ఈటల రాజేందర్ 05:00PM బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై సవాల్ విసిరిన టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి భాగ్యలక్ష్మీ ఆలయానికి బయల్దేరారు. చార్మినార్ పరిసరాల్లో భారీగా పోలీసుల మోహరింపు మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు బీఆర్ఎస్ రూ. 25 కోట్లు ఇచ్చిందని ఈటల ఆరోపించగా, దానికి రేవంత్ సవాల్ విసిరారు.ఈటల చేసిన ఆరోపణలపై భాగ్యలక్ష్మీ ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే రేవంత్రెడ్డి భాగ్యలక్ష్యి ఆలయానికి బయల్దేరారు. తనపై ఆరోపణలు చేసేవారు భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలని సవాల్ చేశారు. దీనిపై ఈటల నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. కాగా, ఈటల చేసిన వ్యాఖ్యల అనంతరం కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్కు దిగింది. ఈ క్రమంలోనే బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. -
ఈటలను మళ్లీ టార్గెట్ చేసిన కేసీఆర్.. హుజూరాబాద్లో ఏం జరుగుతోంది?
ఈటల రాజేందర్. ఒకప్పుడు గులాబీ పార్టీలో సంచలనం. బాస్ మీదే తిరుగుబాటు చేసిన ఈటల కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. సవాల్ చేసి హుజూరాబాద్లో కమలం గుర్తు మీద గెలిచారు. బీఆర్ఎస్ ఎన్ని ఎత్తులు వేసినా తుత్తునియలు చేశారు. కానీ ఇప్పుడు మరోసారి గులాబీ బాస్కు టార్గెట్ అయ్యారు. అసలు హుజూరాబాద్లో ఏం జరుగుతోంది? తెలంగాణ ఉద్యమంలో తొలినుంచీ కేసీఆర్ వెంట ఉన్న ఈటల రాజేందర్.. అనేక రాజకీయ పరిణామాల తర్వాత కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారు. కాషాయ కండువా కప్పుకుని ఉప ఎన్నికలలో తన సీటును కాపాడుకున్నారు. హుజూరాబాద్లో ఈటలను ఓడించడానికి గులాబీ బాస్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆ ఉప ఎన్నికలోనే దళిత బంధు వంటి ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్. బీజేపీలో కూడా అంతర్గత కలహాలతో ఈటల ఇబ్బంది పడుతున్నారన్న ప్రచారం ఇటీవల జరుగుతోంది. ఈటల తిరిగి బీఆర్ఎస్ బాట పడతారా అన్న చర్చకు దారితీసింది. ఈటల మాత్రం కాషాయ పార్టీలోనే ఉండేందుకు సిద్ధమయ్యారు. బీజేపీలో తనకు దక్కాల్సిన స్థాయిలో ప్రాధాన్యత దక్కడంలేదనే ఓ భావన ఉన్నప్పటికీ.. ఇప్పటికిప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకోవడం బాగుండదనుకున్నారో... ఏమో మొత్తానికి ఈటల బీఆర్ఎస్ కవ్వింపులకైతే పడిపోలేదు. పైగా బీజేపీ నెక్స్ట్ రాష్ట్రాధ్యక్షుల లిస్ట్లో ఈటల పేరు కూడా వినిపిస్తుండటంతో.. మరోసారి గులాబీ బాస్ ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గంపైనా.. మరీ ముఖ్యంగా ఈటల రాజేందర్పైనా ఫోకస్ చేసినట్టుగా చర్చ జరుగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో డబ్బును మంచినీళ్లలా ఖర్చు పెట్టడంతో పాటు.. దళితబంధు వంటి పథకాలతో బీఆర్ఎస్ అక్కడి జనం మనసుని.. ముఖ్యంగా దళితుల ఓట్లనీ తనవైపు తిప్పుకునేలా ప్లాన్ చేసింది. ఎన్నికల్లో విజయం రాజేందర్నే వరించింది. కొంతకాలం పాటు అటువైపు పెద్దగా దృష్టి పెట్టని గులాబీ బాస్ ఇప్పుడీ నియోజకవర్గంపై మళ్లీ ప్రధానంగా ఫోకస్ పెట్టడం చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి కారెక్కిన కౌషిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి ప్రోత్సహించడంతో పాటు.. ఉప ఎన్నికలో ఈటలపై పోటచేసి ఓటమిపాలైన గెల్లు శ్రీనివాస్ యాదవ్కు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ చైర్మన్ పదవిచ్చారు. హైదరాబాద్లో అంబేడ్కర్ అతి పెద్ద విగ్రహావిష్కరణ కార్యక్రమం పెట్టుకుని.. దానికి ముందు హుజూరాబాద్కి అంబేడ్కర్ ముని మనవడైన ప్రకాష్ యశ్వంత్ అంబేడ్కర్ ను ప్రత్యేక చాపర్ లో పంపించారు. హుజూరాబాద్లో అమలవుతున్న దళితబంధు పథకాన్ని.. లబ్దిదారులు ఆయనకు వివరించేలా ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ని కూడా అరేంజ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే.. ఈటల పైనా.. ఆయన నియోజకవర్గంపైనా గులాబీ బాస్ ఎప్పుడూ ఓ కన్నేసే ఉంచుతున్నారనిపిస్తోంది. ఈటల రాజేందర్పైన ఎప్పుడూ విరుచుకుపడే కౌషిక్ రెడ్డి.. తన నియోజకవర్గానికి సంబంధం లేకున్నా తన చిరకాల ప్రత్యర్థిలా ఈటలను భావించే మంత్రి గంగుల కమలాకర్ కే ఈ బాధ్యతలను అప్పజెప్పడం వెనుకా గులాబీబాస్ ఆలోచనలు ఏంటన్నది ఇప్పుడో పెద్ద చర్చ. మరి ఇంతగా ఫోకస్ అవుతూ.. ఓ ముఖ్యమంత్రి చూపునే తనవైపు తిప్పుకునేలా చేయడం ఒకవైపు ఈటెలకున్న స్టామినాను చెబుతుంటే... ఇంకోవైపు ఇంతగా ఫోకస్ అవుతూ తానే లక్ష్యంగా జరుగుతున్న ఒత్తిడిని ఈటెల ఏవిధంగా ఎదుర్కొంటారోనన్న ఆసక్తీ ఇప్పుడు ఈ నియోజకవర్గంలో కనిపిస్తోంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్ డెస్క్ చదవండి: రేవంత్, ఈటల సవాళ్లపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు.. -
రేవంత్, ఈటల సవాళ్లపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు..
సాక్షి, హైదరాబాద్: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సవాళ్లు విసురుకోవడంపై విజయశాంతి స్పందించారు. విపక్ష నేతల ఛాలెంజ్లు బీఆర్ఎస్కు వేడుకలు అవుతున్నాయని ఆమె అన్నారు. దుర్మార్గ వ్యవస్థపై పోరాడటం మన కర్తవ్యమని పిలుపునిచ్చారు. రేవంత్, ఈటల ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకోవద్దని విజయశాంతి సూచించారు. కాగా.. మునుగోడు ఉపఎన్నిక సమయంలో కేసీఆర్ నుంచి రేవంత్ రెడ్డి రూ.25కోట్లు తీసుకున్నారని ఈటల ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై రేవంత్ తీవ్రంగా స్పందించారు. తనకు డబ్బులు తీసుకునే ఖర్మ పట్టలేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్కు వ్యతిరేకంగా తానే పోరాడుతున్నట్లు పేర్కొన్నారు. రూ.25 కోట్లు తీసుకోలేదని దేవుడిపై ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని, ఈటల సిద్ధమా అని సవాల్ విసిరారు. శనివారం సాయంత్రం 6 గంటలకు తాను భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేస్తానని, ఈటల కూడా రావాలన్నారు. లేదా ఈటల ఏ గుడికి రమ్మంటే తాను అక్కడకు వెళ్లేందుకు సిద్ధమన్నారు. ఈ సవాళ్ల నేపథ్యంలో విజయశాంతి స్పందించారు. విపక్ష నేతలు ఒకరిపైఒకరు ఇలా ఆరోపణలు చేసుకుంటే అధికార బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నారు. తెలంగాణ ప్రస్తుత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న ఇద్దరికీ.. నిరంతర తెలంగాణ ఉద్యమకారిణిగా ప్రజల అభిప్రాయం చెప్పడం ఈ సందర్భంలో నా బాధ్యత అనిపించిందని ఆమె వరుస ట్వీట్లు చేశారు. చదవండి: కేసీఆర్ నుంచి పైసలు తీస్కునే ఖర్మ నాకేందీ? -
దళితుల కళ్లలో మట్టికొట్టిన కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అంబేడ్కర్ జపం చేయకపోతే పుట్టగతులు ఉండవని గ్రహించడం వల్లే కేసీఆర్ కొత్తగా అంబేడ్కర్ నామ స్మరణ మొదలుపెట్టారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. సచివాలయానికి అంబేడ్కర్ పేరు, విగ్రహం ఏర్పాటు సంతోషమేనని.. కానీ దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చి వారికి న్యాయం చేసేది ఎప్పుడని ప్రశ్నించారు. శుక్రవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణభవన్లోని ఈటల, ఏలేటి మహేశ్వర్రెడ్డి తదితరులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అరి్పంచారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, రిజర్వేషన్లు ఇలా ఏ ఒక్కహామీ అమలు కాలేదని.. దళితుల కళ్లలో కేసీఆర్ మట్టి కొట్టారని మండిపడ్డారు. దళితుల భూములను లాక్కుంటున్నారు.. కేసీఆర్ పాలనలో దళితులకు అడుగడుగునా అవమానాలే ఎదురవున్నాయని ఈటల వ్యాఖ్యానించారు. దళిత సీఎం హామీ ఇచ్చి మాట తప్పడం తెలంగాణ రాష్ట్రంలో తొలి ఉల్లంఘన అని.. కేబినెట్లో ఉన్న దళిత ఉప ముఖ్యమంత్రిని సాకులు చెప్పి తీసేసిన ఘనత కేసీఆర్కే దక్కిందని మండిపడ్డారు.గత ప్రభుత్వాలు దళితులకు ఇచి్చన భూములను కేసీఆర్ ప్రభుత్వం లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. మహనీయుడి విగ్రహం పెట్టినంత మాత్రాన ఎవరూ కేసీఆర్కు జేజేలు కొట్టబోరని వ్యాఖ్యానించారు. -
‘తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారు’
సాక్షి, కామారెడ్డి రూరల్/రామారెడ్డి: దేశంలో అత్యధికంగా మద్యం తాగే రాష్ట్రం తెలంగాణ అని.. గ్రామగ్రామాన బెల్టు షాపులు ఏర్పాటు చేసి తాగుబోతుల తెలంగాణగా మార్చారని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. గురువారం కామారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాసనసభలో ప్రజా సమస్యలను చర్చిద్దామంటే ప్రభుత్వం మైకును కట్ చేసి తమ గొంతు నొక్కుతోందన్నారు. తెలంగాణ వస్తే విదేశాలకు వలసలు ఆగుతాయని ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పారని, అయితే అధికారంలోకి వచ్చాక గల్ఫ్ వలసలను అపలేకపోయారన్నారు. -
మహారాష్ట్రకు గోదావరిపై స్పష్టత ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రకు గోదావరి నీటినిచ్చే విషయంపై సీఎం కేసీఆర్ చెప్పిన మాటలతో ఉత్తర తెలంగాణ రైతాంగం ఆందోళనలో ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వేరే రాష్ట్రాల వారు మాట్లాడితే కేసీఆర్ సహించేవారు కాదని, కానీ బీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత ఆయన వైఖరి మారిందన్నారు. కేసీఆర్ మహారాష్ట్రలో మాట్లాడినప్పుడు అవసరమైతే ఎస్సారెస్పీ నుంచి, ఆ పైనుంచి నది నుంచి నీటిని ఎత్తిపోసుకునే వెసులుబాటు కనిపిస్తామని అన్నట్టు విన్నానని, వాస్తవంగా కేసీఆర్ చెప్పిందేమిటో ఆయనే స్పష్టత ఇస్తే బాగుంటుందని పేర్కొన్నారు. ఆదివారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై ఈటల ప్రసంగించారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత కేసీఆర్ సమక్షంలో మాట్లాడటం ఈటలకు ఇదే మొదటిసారి కావడం విశేషం. కేంద్రం నుంచి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు ఒక్క రూపాయి కూడా వచ్చే అవకాశం లేదని, అక్కడి నుంచి నిధులు వస్తాయని అంచనా వేసుకోవటం సరికాదని ఈట ల చెప్పారు. చాలా గ్రామాలకు ఆర్టీసీ బస్సులు రావట్లేదని, లాభాల కోణంలో చూడకుండా ఆర్టీసీ బస్సులు పెంచి అన్ని గ్రామాలకు వచ్చేలా చూడా లని కోరారు. ఈటల చెప్పిన విషయాలను నోట్ చేసుకోవాలని సీఎం ఈ సందర్భంగా మంత్రులకు సూచించారు. కాగా, ఈటల మాట్లాడుతుండగానే సమయం మించి పోయిందంటూ స్పీకర్ మైక్ కట్ చేసి సీఎం మాట్లాడాల్సిందిగా సూచించారు. -
Etela Rajender: రియల్ ఎస్టేట్ బ్రోకర్ కేసీఆర్.. ఈటల ఫైర్..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘నాటి ప్రభుత్వాలు పేదల కు ఉచితంగా భూములను పంచితే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారింది. పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పన పేరుతో ఆయా రైతుల నుంచి బలవంతంగా భూములను లాగేసుకుంటోంది. ప్రభుత్వ అధినేత సీఎం కేసీఆర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మారారు. బహిరంగ మార్కెట్లో ఎకరం ధర రూ.ఐదు కోట్లకు పైగా పలుకుతుంటే..ప్రభుత్వం మాత్రం రైతుల సమ్మతి, సంబంధం లేకుండా రూ.10 లక్షలు చెల్లించి, బలవంతంగా భూములను స్వాధీనం చేసుకుంటోంది. ఆయా భూములను ఐటీ సంస్థలకు, బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టి బ్యాక్డోర్ నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. ఇలా వచ్చిన డబ్బులనే ఎన్నికల్లో వెదజల్లుతున్నారు’ అని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. శుక్రవారం మహేశ్వరం మండలం అమీర్పేట్లో నిర్వహించిన ‘భారతీయ జనతా యువమోర్చా– రంగారెడ్డి జిల్లా’ శిక్షణ తరగతుల్లో మాట్లాడారు. కంపెనీలకు, ప్రభుత్వానికి, ఫాంహౌస్లకు భూములు ఇచ్చిన రైతులు నేడు అదే కంపెనీలు, ఫౌంహౌస్ల్లో వాచ్మన్లుగా పని చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భూసేకరణ అంశాన్నే ప్రధాన ఎజెండాగా తీసుకుని పని చేయడం ద్వారా ప్రజల మద్దతు పొందొచ్చని సూచించారు. ఇందుకు ప్రతి ఒక్క బీజేవైఎం కార్యకర్త సిద్ధంంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఫార్మాసిటీ పేరుతో అమాయక రైతుల నుంచి 19వేలకుపైగా ఎకరాల భూమి సేకరిస్తోందని, ఈ ఫార్మాకంపెనీల వల్ల ఆయా గ్రామాల రైతులంతా తమ భూమిని కోల్పోవడమే కాకుండా భవిష్యత్తులో తీవ్రమైన కాలుష్యం బారి నపడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవడబ్బ సొమ్మని పంచుతున్నారు? అభివృద్ధి కార్యక్రమాలకు, పేదల సంక్షేమానికి ఉపయోగపడాల్సిన ప్రభుత్వ డబ్బును వేల కోట్లున్న రియల్టర్లకు, ఫౌంహౌస్ యజమానులకు, వ్యవసాయేతర భూములకు రైతుబంధు పేరుతో పంచిపెడుతుండటాన్ని ఎలా సమర్థిస్తామని, నెలకు రూ.1.40 లక్షల జీతం పొందే ఉద్యోగులకు దళిత బంధు పేరుతో కార్లు ఇవ్వడం ఎంత వరకు సమంజసమన్నారు. చదవండి: తెలంగాణ ప్రజలు విముక్తిని కోరుకుంటున్నారు: తరుణ్ చుగ్ -
మునుగోడులో రణరంగం: ఈటల కాన్వాయ్పై రాళ్ల దాడి.. కార్యకర్తల ఘర్షణ
సాక్షి, నల్లగొండ: మునుగోడు రణరంగంగా మారింది. ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మునుగోడు మండలం పలివెలలో బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్ల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈటల వ్యక్తిగత సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ సందర్భంగా రాళ్ల దాడి జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు ఈటల రాజేందర్. ఏం జరిగినా పోలీసులదే బాధ్యత అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ మునుగోడు ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్పై దాడి జరిగిన క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తి.. పరస్పరం దాడి చేసుకున్నారు. ఇరు వర్గాలు కర్రలతో కొట్టుకున్నారు. పోలీసులు వారిని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బీజేపీ ప్రచార రథానికి ఉన్న బ్యానర్లను చించేశారు టీఆర్ఎస్ కార్యకర్తలు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మునుగోడుకు అదనపు బలగాలను తరలించాలని అధికారులను ఆదేశించింది ఎన్నికల సంఘం. ఇదీ చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిందితులు -
ఈటలపై సస్పెన్షన్ వేటు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమా వేశాల సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావే శానికి బీజేపీకి ఆహ్వానం లేకపోవడం క్రమంగా రాజకీయ వేడిని పెంచుతోంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పీకర్ మరమ నిషి అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఈ వ్యాఖ్యలను ఖండించడంతో పాటు ఈటల బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన విష యం తెలిసిందే. ఈటల క్షమాపణ చెప్పకుంటే నిబంధనల మేరకు వ్యవహరిస్తామని వేముల ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈట లను అసెంబ్లీ నిబంధనలను అనుసరించి సస్పెండ్ చేసేందుకు ఉన్న అవకాశాల పరిశీ లన జరుగుతున్నట్లు తెలిసింది. మంగళవా రం వాయిదా పడిన వానాకాల సమావేశాలు తిరిగి వచ్చే సోమవారం ప్రారంభం కానుండగా, ఈటల చేసిన వ్యాఖ్యలు ఆరోజు సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. ఈటలపై చర్యలకు డిమాండ్ చేసే చాన్స్ ‘కేసీఆర్ చెప్తే చేసే మర మనిషిలా కాకుండా గతంలో ఉన్న సభా సంప్రదాయాలను స్పీకర్ కొనసాగించాలి’ అంటూ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అయితే బుధవారం మీడియాతో మాట్లాడిన ఈటల.. స్పీకర్ తమ హక్కులు కాపాడాలని కోరారు. మరమనిషి అనే పదం నిషిద్ధమైనది ఏమీ కాదని ఎమ్మెల్యే రఘునందన్రావు, స్పీకర్ పదవికి కళంకం తెస్తున్న పోచారం శ్రీనివాస్రెడ్డిపై చర్యలు తీసుకోవా లని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ వేర్వేరు చోట్ల వ్యాఖ్యానించారు. బీజేపీ వైఖరి నేప థ్యంలో ఈటలపై అసెంబ్లీ వేదికగా చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసే అవ కాశముంది. సభ, సభా కమిటీలు, సభ్యుల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించకుండా అనుసరించాల్సిన సభా సంప్రదాయాలను టీఆర్ఎస్ ఉటంకిస్తోంది. సభ గౌరవం కాపా డేందుకు పలు కమిటీలు, నియమాలు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈటల వ్యాఖ్యల ఎపిసోడ్ను స్పీకర్ ద్వారా అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ ముందుకు తీసుకువెళ్లాలని టీఆర్ఎస్ భావిస్తోంది. తీర్మానం ద్వారా ఎథిక్స్ కమిటీకి.. నిబంధనల ప్రకారం.. మంత్రులు సహా శాససనసభ్యులు ఎవరైనా సభ బయట అనైతికంగా ప్రవర్తించినా, మాట్లాడినా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లవచ్చు. ఈ మేరకు ఫిర్యాదును స్పీకర్ ఒక తీర్మా నం ద్వారా ఎథిక్స్ కమిటీ (నైతిక విలు వల కమిటీ)కి అప్పగించి విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరతారు. ప్రస్తు తం ఈ నిబంధన మేరకు స్పీకర్ విషయమై ఈటల చేసిన వ్యాఖ్యలను సభ దృష్టికి టీఆర్ఎస్ తీసుకెళ్లే అవకాశం ఉంది. నిబంధనల మేరకు ఈటలను అవస రమైతే సభ నుంచి సస్పెండ్ చేసే అవకా శముంటుందని టీఆర్ఎస్ శాసనసభా పక్షం వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన ఈటల రాజేందర్, రఘునందన్రావు, రాజాసింగ్లను సమావేశాలు ముగిసేంత వరకు సభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు.. ఈటల రాజేందర్కు నోటీసులు? -
ధైర్యముంటే బహిరంగ చర్చకు రా..! ఈటలకు కౌశిక్ రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూపించేందుకు తాను సిద్ధమని.. ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ చేసిందేమిటో చూపించాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి సవాల్ చేశారు. హుజూరాబాద్లోని అంబేడ్కర్ చౌరస్తాలో ఈ నెల 5న బహిరంగ చర్చకు వేచి చూస్తానని ఆయన ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్లో ఏమీ సాధించని ఈటల రాజేందర్ గజ్వేల్లో సీఎం కేసీఆర్పై పోటీ చేస్తానని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. స్వగ్రామం కమలాపూర్లో కనీసం బస్టాండ్ కూడా ఈటల నిర్మించలేకపోయారని, సిద్దిపేట, సిరిసిల్ల తరహాలో హుజూరాబాద్లో అభివృద్ధి ఎందుకు సాధించలేక పోయారో ఈటల రాజేందర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈటల రాజేందర్ను జోకర్లా చూస్తున్నారని, బీజేపీలో చేరిన తర్వాత ఆయన పరిస్థితి దిగజారిపోయిందని ఎద్దేవా చేశారు. అధికారిక కార్యక్రమాలకు ఈటల రాజేందర్ను నియోజకవర్గ అధికారులు ఆహ్వానిస్తున్నా రావడం లేదని, శిలాఫలకాలపై తనతో పాటు ఈటల పేరు లేకుంటే ముక్కు నేలకు రాస్తానని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. చదవండి: టీఆర్ఎస్కు షాక్.. బీజేపీలోకి మంత్రి సోదరుడు! -
టీఆర్ఎస్ నేతలు టచ్లో ఉన్నారు: ఈటల రాజేందర్
బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్పై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తనకు బండి సంజయ్కు మధ్య విభేదాలు లేవని, తనెప్పుడూ గ్రూపులు కట్టలేదని స్పష్టం చేశారు. పార్టీలు మారే సంస్కృతి తనది కాదని ఈటల స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నుంచి తాను బయటకు రాలేదని, వాళ్లే పంపించేశారని గుర్తు చేశారు. అన్నీ ఆలోచించుకున్న తరువాతే బీజేపీలో చేరానని వెల్లడించిన ఈటల.. తాను కాంగ్రెస్లోకి వెళ్తాననే ప్రచారం సీఎం కేసీఆర్ చేయిస్తున్నాడని మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయనేది ఊహజనితమని ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్తో దోస్తీ లేదని, ఇక కొట్లాటనే ఉందన్నారు. తెలంగాణలో అధికారం బీజేపీదేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్ దిగిపోయి కేటీఆర్ను తెలంగాణకు ముఖ్యమంత్రిని చేసే అంశం టీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఉందని అన్నారు. మెజారిటీ టీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్లో ఉన్నారని, టీఆర్ఎస్ భవిష్యత్తు లేదని నేతలే చెప్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఖజానాకు కాపలదారులే తప్ప వారసులు కాదని కేసీఆర్ కుటుంబం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. థర్డ్ ఫ్రంట్ సంగతి అటుంచి.. మెదట సొంత రాష్ట్రాన్ని కేసీఆర్ చక్కదిద్దుకోవాలని ఎద్దేవా చేశారు. చదవండి: KCR: పాలన పరుగు.. పార్టీకి మెరుగు ‘ఏడున్నరేళ్ళుగా కేసీఆర్ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ముఖ్యమంత్రికి ముందు చూపు లేకపోవడం వలన రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ మాటలపై ప్రజలు నమ్మకం కోల్పోయారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించి.. తర్వాత సమర్థించిన చరిత్ర కేసీఆర్ది. కలసికట్టుగా పోరాడాల్సిన సమయం వచ్చింది. వ్యక్తిగత అవసరాల కోసం లొంగిపోవద్దు. హుజురాబాద్ ఓట్ల కోసమే కేసీఆర్ దళితబంధు తీసుకొచ్చాడన్న నా మాటకు కట్టుబడి ఉన్నాను. పేదలపై నిజమైన ప్రేమ ఉంటే దళితబంధు ఇప్పటికీ ఎందుకు ఇవ్వటం లేదు? నా చర్మం వలిచి చెప్పులు కుట్టించినా హుజురాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేను. సంబంధిత మంత్రులు లేకుండా శాఖలపై రివ్యూ చేసిన నీచ చరిత్ర సీఎం కేసీఆర్ది’ అని తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. చదవండి: ఉన్నవి నిలుపుకొని.. కొన్ని కలుపుకొని.. -
నల్లగొండ ఘటనపై గవర్నర్కి బీజేపీ నేతల ఫిర్యాదు
-
నల్లగొండ ఘటనపై గవర్నర్కి బీజేపీ నేతల ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ వాహనంపై, పలువురు నేతలపై దాడికి సంబంధించి బీజేపీ నేతలు గవర్నర్ తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ మంగళవారం రాజ్భవన్లో కలిశారు. బీజేపీ నేతలు రాజాసింగ్, డీకే అరుణ, రఘునందన్రావు, ఈటల రాజేందర్ తదితరులు గవర్నర్కు వినతి పత్రం ఇచ్చారు. నల్లగొండ ఘటనలో పోలీసుల వైఫల్యంపై గవర్నర్కి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం బీజేపీ నేత డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. వరి దాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో వరి ధాన్యాలు కొనుగోలు విషయంలో పర్యటించిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దాడి చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే బండి సంజయ్పై దాడి జరిగిందని ఆరోపించారు. రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేశారని మండిపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమీ జీర్ణించుకోలేక కేసీఆర్ బీజేపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ఇదే విషయంపై గవర్నర్కు వినతిపత్రం అందించామని తెలిపారు. కేంద్ర కొనుగోలు చేయడం లేదని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతుందని మండిపడ్డారు. సివిల్ సప్లై కార్పోరేషన్కు డబ్బులు ఇవ్వకుండా ధాన్యం కొనుగోలు చేయకుండా ముఖ్యమంత్రి ఆపుతున్నారని అనుమనం ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీజీపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీద జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచుకోవడానికి రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగేవరకు బీజేపీ పోరాడుతుందని అన్నారు. -
ఈటల సంస్థకు నోటీసులు.. ఎమ్మెల్యే రఘునందన్రావు స్పందన
సాక్షి, మెదక్ జిల్లా: ఈటల రాజేందర్ కుటుంబానికి సంబంధించిన జమున హేచరీస్కు నోటీసుల జారీపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు స్పందించారు. ఈటలకు ప్రజాతీర్పు అనుకూలంగా రావడంతో మళ్లీ కేసులను తిరగతోడే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఈ సర్వే చేయిస్తోందని రఘునందన్రావు ఆరోపించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం తీసుకునే ఎటువంటి ఏ చర్య కైనా తాము సిద్ధమన్నారు. చదవండి: ఫామ్హౌజ్లో అడుగుపెడితే ఆరు ముక్కలైతవ్: సీఎం కేసీఆర్ హుజూరాబాద్లో ప్రజల తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చింది కాబట్టే.. కక్షపూరితంగా రీ సర్వే చేస్తున్నారన్నారు. నిష్పక్షపాతంగా సర్వే చేస్తే సహకరిస్తాం.. వేధించే ఉద్దేశంతో చేస్తే మరోసారి కేసీఆర్కు ప్రజలు బుద్ధిచెబుతారన్నారు. ప్రజాక్షేత్రంలో గెలిచిన ఈటల.. న్యాయస్థానంలోను పోరాడటానికి సిద్ధంగా ఉన్నారని రఘునందన్రావు అన్నారు. కాగా, ఈటల రాజేందర్ కుటుంబానికి సంబంధించిన జమున హేచరీస్ సంస్థకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే సోమవారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాలలో అసైన్డ్ భూములు ఆక్రమణపై సర్వే నోటీసులు గతంలో ఇవ్వడం జరిగిందని తూప్రాన్ ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్ మీడియాతో అన్నారు. చదవండి: నిరుద్యోగులకు కేసీఆర్ గుడ్న్యూస్.. ఇక ప్రతియేటా జాబ్ క్యాలెండర్ -
కుట్రలు, ప్రలోభాలను హుజురాబాద్ ప్రజలు తిప్పికొట్టారు
-
కేసీఆర్ కు హుజురాబాద్ ప్రజలు బుద్ధి చెప్పారు
-
మూగబోనున్న మేకులు..నేటితో ప్రచారనికి తెర