ఆ టెక్‌ కంపెనీ ఉద్యోగులకు బోనస్‌ బొనాంజా | Huawei announce Bonanza for its employees | Sakshi
Sakshi News home page

ఆ టెక్‌ కంపెనీ ఉద్యోగులకు బోనస్‌ బొనాంజా

Published Wed, Nov 13 2019 8:56 AM | Last Updated on Wed, Nov 13 2019 8:58 AM

Huawei announce Bonanza for its employees - Sakshi

బీజింగ్‌: చైనా టెలికాం దిగ్గజం హువావే టెక్నాలజీస్‌ కంపెనీ ఉద్యోగులు భారీ ఆఫర్‌ ప్రకటించింది. అమెరికా హువావే కంపెనీల ఉత్పత్తులు, చైనా వాణిజ్య బ్లాక్‌లిస్టింగ్‌ను దీటుగా ఎదుర్కొనేలా సహాయపడిన సిబ్బందికి 2 బిలియన్ యువాన్ల (286 మిలియన్ డాలర్లు) నగదు రివార్డులను అందజేస్తామని మంగళవారం తెలిపింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌(పరిశోధన, అభివృద్ధి) టీమ్‌లకు  ఈ నగదు బహుమతులను అందించనుంది. 

ప్రపంచంలోని అతిపెద్ద టెలికాం పరికరాల ప్రొవైడర్, అమెరికాలో హార్డ్‌వేర్‌ ఉత్పత్తుల వ్యాపారంలో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది మే నెలలో అమెరికన్ సంస్థలతో వ్యాపారం చేయకుండా నిషేధించిన  అనంతరం  చైనా కంపెనీ  ఉద్యోగులకు ఈ నగదు  బోనస్‌లను ఇచ్చేందుకనిర్ణయించింది.  యుఎస్ ఒత్తిడి నేపథ్యంలో ఉద్యోగులు చేసిన పనికి గుర్తింపుగా ఇది వుంటుందని  హువావే మానవ వనరుల విభాగం  కంపెనీ సిబ్బందికి ఇచ్చిన నోటీసులో తెలిపింది.  తద్వారా దాదాపు 1,90,000 మంది కార్మికులకు ఈ నెలలో ఇది రెట్టింపు వేతనం ఇస్తుందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. 

కాగా అమెరికా  నిషేధం విధించడంతో ప్రత్నామ్నాయ మార్కెట్లపై దృష్టి సారించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది  కంపెనీకి చెందిన 5జీ నెట్‌వర్కింగ్‌కు సంబంధించి పరికరాలు భద్రత ప్రమాణాలకు తగ్గట్టుగా లేవని ఆరోపిస్తూ  డొనాల్డ్‌ ట్రంప్‌ హువావే ఉత్పత్తులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement