కారు బాంబు దాడి: 29 మంది మృతి | Istanbul Besiktas: Stadium blasts kill 15 people | Sakshi
Sakshi News home page

కారు బాంబు దాడి: 29 మంది మృతి

Published Sun, Dec 11 2016 6:39 AM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM

కారు బాంబు దాడి: 29 మంది మృతి

కారు బాంబు దాడి: 29 మంది మృతి

ఇస్తాంబుల్(టర్కీ): ఇస్తాంబుల్లోని ఓ ఫుట్ బాల్ స్టేడియం సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనలో 29 మంది మృతిచెందగా, 160 మందికిపైగా గాయాలైనట్టు అధికారులు వెల్లడించారు. పోలీసులను లక్ష్యంగా చేసుకొని కారుబాంబు దాడితో పాటూ అదే ప్రాంతానికి సమీపలో ఓ ఆత్మాహుతి దాడి జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు.

బెసిక్‌టాస్ స్టేడియంలో అభిమానులు ఫుట్ బాల్ మ్యాచ్‌ను తిలకించి వెళ్లిన రెండు గంటలకే ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే కుర్దిష్ తీవ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య గతకొంతకాలంగా హింసాత్మక ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కారుబాంబు, ఆత్మాహుతి దాడి వెనుక కర్దిష్ తీవ్రవాదుల హస్తం ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement