‘తారక్‌ భయ్యా.. మీకు తోడుగా ఉన్నాం’ | Devi Sri Prasad Condolences To Nandamuri Harikrishna | Sakshi
Sakshi News home page

డల్లాస్‌ కన్సర్ట్‌.. ఆయనకు అంకితం ఇస్తున్నా

Published Thu, Aug 30 2018 7:31 PM | Last Updated on Thu, Aug 30 2018 7:43 PM

Devi Sri Prasad Condolences To Nandamuri Harikrishna - Sakshi

‘డల్లాస్‌ కన్సర్ట్‌ను నందమూరి హరికృష్ణ  గారికి అంకితం ఇస్తున్నానంటూ’ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌.. హరికృష్ణకు నివాళులు అర్పించారు. హరికృష్ణ ఆకస్మిక మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన డీఎస్‌పీ... ఆయనతో గతంలో తాను దిగిన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘కొన్ని నెలల క్రితం ఆయనతో ఫొటో తీసుకున్నాను. ఎంతో ఆత్మీయత కలిగిన వ్యక్తి ఆయన. మీ ఆత్మకు శాంతి చేకూరాలి సర్‌. తారక్‌ భయ్యా, కల్యాణ్‌రామ్‌ గారు మేమంతా మీకు తోడుగా ఉన్నాం. స్వర్గం నుంచి హరికృష్ణ గారు మనల్ని దీవిస్తూనే ఉంటారు. డల్లాస్‌ కన్సర్ట్‌ను ఆయనకు అంకితం చేస్తున్నానంటూ’ దేవిశ్రీ ట్వీట్‌ చేశారు.

కాగా నల్గొండ జిల్లాలో అన్నేపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. కుమారులు నందమూరి కల్యాణ్‌రాం, జూనియర్‌ ఎన్టీఆర్‌లు హరికృష్ణకు అంతిమ సంస్కారాలు నిర్వర్తించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement