Devisri Prasad
-
అవే నాకు వెయ్యి ఏనుగుల బలం ఇస్తాయి: దేవిశ్రీ ప్రసాద్
ఆరు పాటలూ లవ్ సాంగ్స్ ఉండే ఓ ప్రేమకథ చేయాలనే కోరిక బన్నీకి (అల్లు అర్జున్) ఎప్పట్నుంచో ఉంది. ‘గుర్తుపెట్టుకో.. మనం అలాంటి సినిమా చేద్దాం’ అంటూ మొన్న ఓ పేపర్ మీద రాసిచ్చారు (నవ్వుతూ). ‘తండేల్’ మూవీ మ్యూజిక్కి దేవిని ఫిక్స్ అయిపోమని అరవింద్ అంకుల్తో బన్నీ ముందే చెప్పారు. ‘‘చాలా రోజుల తర్వాత వస్తున్న అందమైన ప్రేమకథా చిత్రం ‘తండేల్’. ఈ సినిమాలోని ‘బుజ్జి తల్లి...’ పాట విన్న సుకుమార్గారు.. ‘నీ ఆల్ టైమ్ టాప్ ఫైవ్లో ఉంటుంది’ అన్నారు. ఆ సాంగ్ రిలీజైన వెంటనే ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే శివుని పాట, హైలెస్సో... పాటలు గొప్పగా జనాల్లోకి వెళ్లాయి. ఈ సినిమాలోని పాటలన్నీ పెద్ద హిట్ అవడం సంతోషంగా ఉంది’’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు.అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వం వహించిన చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విలేకరులతో పంచుకున్న విశేషాలు. ⇒ నా కెరీర్ ఆరంభంలో నేను చేసిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, ఆర్య, 100% లవ్’ వంటి ప్రేమకథలతో పాటు ‘శంకర్దాదా ఎంబీబీఎస్, మాస్’ లాంటి కమర్షియల్ సినిమాలకు కూడా మ్యూజిక్ పరంగా ప్రేక్షకుల నుంచి అంతే అద్భుతమైన స్పందన వచ్చింది. ఎలాంటి సినిమా అయినా చేయగలననే పేరు రావడం, అందులోనూ ప్రేమకథలకి మంచి సంగీతం ఇస్తానని అందరూ అనుకోవడం దేవుడి ఆశీస్సులుగా భావిస్తాను⇒ ‘తండేల్’ స్వచ్ఛమైన ప్రేమకథ. వాస్తవ ఘటనల ఆధారంగా రాసుకున్న కథ. చందు మొండేటి గ్రేట్ విజన్తో ఈ సినిమా తీశాడు. చైతన్యగారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. కొత్త నాగచైతన్యని చూడబోతున్నారు. సాయిపల్లవి నటన కూడా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది⇒ యంగ్ ఏజ్లో మ్యూజిక్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేశా. నేనే నా మ్యూజిక్ వింటూ పెరిగాను (నవ్వుతూ). అన్ని జానర్ సినిమాలు చేసే అవకాశం రావడం, అన్ని వయసుల వారికి నచ్చే మ్యూజిక్ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. లైవ్ షోస్ చేయడం నాకు వెయ్యి ఏనుగుల బలం ఇస్తుంది. ప్రేక్షకులు అభిమానం, ఆదరణ నాకు గొప్ప ఎనర్జీతో పాటు ఇంకా గొప్ప మ్యూజిక్ చేయాలనే స్ఫూర్తినిస్తాయి. ప్రస్తుతం ‘కుబేర’ సినిమాకి సంగీతం అందిస్తున్నాను. -
'పుష్ప 3' ఐటెమ్ సాంగ్.. ఆ హీరోయిన్ అయితే సూపర్ హిట్టే: దేవిశ్రీ ప్రసాద్
పుష్ప సిరీస్ గురించి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కీలక వ్యాఖ్యలు చేశారు. పుష్ప2 భారీ కలెక్షన్స్ సాధించి ఎన్నో రికార్డ్స్ను దాటేసింది. పుష్ప రెండు భాగాలకు దేవిశ్రీ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ క్రమంలో ఆయన తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో 'పుష్ప 3' (Pushpa 3) ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. పుష్ప చిత్రాలకు ఐటెమ్ సాంగ్స్ మంచి గుర్తింపును ఇచ్చాయి. ఇప్పుడు పుష్ప3లో ఐటెమ్ సాంగ్లో ఎవరు కనిపిస్తే బాగుంటుందో దేవిశ్రీ ప్రసాద్ తాజాగా చెప్పారు. (ఇదీ చదవండి: విజయ్తో చేయి కలిపేందుకు అడుగులేస్తున్న త్రిష)పుష్పలో సమంత 'ఊ అంటావా మామ.. ఉఊ అంటావా మామా' అంటూ తన గ్లామర్తో దుమ్మురేపింది. పుష్ప2లో శ్రీలీల కిస్సిక్ సాంగ్లో నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఈ ప్రత్యేకమైన సాంగ్స్ గురించి దేవిశ్రీ ప్రసాద్ ఇలా పంచుకున్నారు. పుష్ప 2 కిస్సిక్ పాటలో ఎవరు నటించినా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటారని తాము ముందే ఊహించామని అయన అన్నారు. అయితే, ఈ సాంగ్కు శ్రీలీల మంచి ఆప్షన్ అని తాను మేకర్స్కు ముందే చెప్పానని ఆయన అన్నారు. దానికి ప్రధాన కారణం ఆమె చాలా బెటర్గా డ్యాన్స్ చేయడమేనని దేవిశ్రీ అన్నారు. ఇప్పటికే చాలామంది టాప్ హీరోయిన్లు తన మ్యూజిక్లో వచ్చిన ఐటెమ్ సాంగ్స్లో మెప్పించిన విషయాన్ని గుర్తుచేశారు. అందులో కాజల్ అగర్వాల్ (జనతా గ్యారేజ్), పూజా హెగ్డే( రంగస్థలం), సమంత (పుష్ప), శ్రీలీల (పుష్ప2)ఉన్నారన్నారు. వారందరూ కూడా కెరీర్లో మంచి పీక్లో ఉన్నప్పుడే ఐటెమ్ సాంగ్స్లలో కనిపించారన్నారు.'పుష్ప 3' ఐటెమ్ సాంగ్లో జాన్వీ ఎంపిక ఎందుకంటే..?పుష్ప 3 సినిమాలో ఐటెమ్ సాంగ్లో కనిపించేది ఎవరని ఇప్పటి నుంచే ఊహాగానాలు మొదలయ్యాయని ఆయన అన్నారు. ఈ అంశంపై దీనిపై దర్శక నిర్మాతలు తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. పాట ఆధారంగా హీరోయిన్ను ఎంపిక చేస్తారని దేవి తెలిపారు. ఇండస్ట్రీలో సాయి పల్లవి డ్యాన్స్కు తాను అభిమానినని చెప్పిన ఆయన.. జాన్వీ కపూర్(Janhvi Kapoor) కూడా మంచి డ్యాన్సర్ అని ఆయన తెలిపారు. ఇప్పటికే బాలీవుడ్లో నటించిన ఆమె పాటలు చూశానని అన్నారు. ఆమె అమ్మగారు అయిన శ్రీదేవిలో ఉన్న గ్రేస్ జాన్వీలో కూడా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే, పుష్ప-3 ఐటెమ్ సాంగ్కు జాన్వీ అయితే సరైన ఎంపిక అని తాను అనుకుంటున్నట్లు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు.‘పుష్ప 2’ ఘన విజయం అందుకున్న తర్వాత దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ పార్ట్ 3కి సంబంధించి నిరంతరం పని చేస్తున్నారని దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే చెప్పారు. ఆ స్టోరీపై రీవర్క్ కూడా చేస్తున్నారని ఆయన తెలిపారు. సుకుమార్ ఇచ్చిన మంచి స్క్రిప్టుకు అల్లు అర్జున్ అద్భుతంగా నటించడం వల్లే సినిమా భారీ హిట్ అయిందని ఆయన అన్నారు. పుష్ప 1, పుష్ప 2కి ఎలా పనిచేశామో ‘పుష్ప 3’కి అదే స్థాయిలో కష్టపడతామని తెలిపారు. -
పుష్ప 'జాతర'తో పూనకాలు.. ఈ వీడియోలో చూసేయండి
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ తన బ్రాండ్ ఏంటో చూపిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప2 నాలుగు వారాల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. ఇప్పటివరకూ రూ.1799 కోట్లకు (గ్రాస్) పైగా ఈ చిత్రం రాబట్టిందని అధికారికంగా ప్రకటించారు. అయితే, తాజాగా ఈ చిత్రానికి ఎంతో బలాన్ని చేకూర్చిన 'గంగమ్మతల్లి జాతర' సాంగ్ వీడియోను మేకర్స్ యూబ్యూబ్లో విడుదల చేశారు.పుష్ప2 చిత్రంలో గంగమ్మ జాతర ఎపిసోడ్ ప్రధాన హైలైట్గా నిలిచింది. ఈ సీన్ ప్రారంభంలో అల్లు అర్జున్ చీర కట్టుకున్నప్పుడు థియేటర్ దద్దరిల్లిపోయింది. జాతర ఎపిసోడ్లో వచ్చే సాంగ్లో ఆయన హీరోయిజం, భావోద్వేగాలు పతాక స్థాయికి చేరుతాయి. దీంతో అందరూ ఆ పాటకు అభిమానులు అయిపోయారు. ఈ పాటకు చంద్రబోస్ అద్భుతమైన లిరిక్స్ అందించగా మహాలింగం ఆలపించారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అదరిపోయే రేంజ్లో ఉంటుంది. ఇలా అన్ని అంశాల్లో మెప్పించిన ఈ సాంగ్ వీడియో వర్షన్ను తాజాగా విడుదల చేశారు. -
'పుష్ప' రాజ్ యూనిక్ సాంగ్ విడుదల
అల్లు అర్జున్- సుకుమార్ కాంబో హిట్ సినిమా ‘పుష్ప 2 ది రూల్’. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. అయితే, తాజాగా ఈ చిత్రం నుంచి బన్నీ యూనిక్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫీలింగ్స్ వీడియో సాంగ్ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో వీడియో సాంగ్ను విడుదల చేయడంతో ఆయన అభిమానులు వైరల్ చేస్తున్నారు.'పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్' అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ పలు భాషల్లో 250+ మిలియన్ వ్యూస్ సాధించింది. ఇప్పుడు ఇదే సాంగ్ వీడియో రూపంలో తాజాగా విడుదలైంది. తెలుగులో నకాశ్ అజీజ్, దీపక్ బ్లూ ఆలపించగా దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ను అందించారు. -
పుష్ప2 'పీలింగ్స్' సాంగ్ వీడియో విడుదల
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 'పుష్ప2'. ఈ చిత్రం సాంగ్స్, ట్రైలర్, కలెక్షన్స్ ఇలా అన్నింటిలోనూ పలు రికార్డ్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి పీలింగ్స్ వీడియో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. సోషల్మీడియాలో ఈ పాట సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఇప్పటికే మిలియన్ల కొద్ది రీల్స్ కూడా ఇన్స్టాలో వైరల్ అవుతున్నాయి.పుష్ప2 విజయంలో పాటలు కూడా ప్రధాన బలమని చెప్పవచ్చు. అల్లు అర్జున్, రష్మిక మందన్న స్టెప్పులకు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. పుష్ప2లో భారీ క్రేజ్ను అందుకున్న పీలింగ్స్ సాంగ్ వీడియో అన్ని భాషలలో రిలీజ్ కావడంతో యూట్యూబ్లో వైరల్ అవుతుంది.విడుదలైన రోజు నుంచే 'పీలింగ్స్' సాంగ్ దూసుకుపోతోంది. ఈ పాటను చంద్రబోస్ రచించగా తెలుగులో (శంకర్ బాబు, లక్ష్మీ దాసా), హిందీలో (జావేద్ అలీ, మధుబంతీ) , తమిళంలో (సెంథిల్ గణేశ్, రాజలక్ష్మి) మలయాళంలో (ప్రణవమ్ శశి, సితార కృష్ణకుమార్) కన్నడలో (సంతోశ్ వెంకీ, అమల) ఆలపించారు. -
పుష్ప, శ్రీవల్లీల డ్యాన్స్.. ఫ్యాన్స్లో 'పీలింగ్స్' జోష్
అల్లు అర్జున్- సుకుమార్ హిట్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'పుష్ప2'. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, కిస్సిక్ సాంగ్ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. అయితే, తాజాగా పీలింగ్స్ అనే పాటతో అభిమానులను మరోసారి ఫిదా చేశారు. అన్ని భాషల్లో రానున్న ఈ సాంగ్లో వచ్చే పల్లవి లిరిక్స్ మలయాళంలోనే ఉండనున్నాయి. ఈ సాంగ్లో కూడా దేవీశ్రీ ప్రసాద్ తనదైన మార్క్ను చూపించారని చెప్పవచ్చు.పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ను భారీగానే ప్లాన్ చేసింది. పాన్ ఇండియా రేంజ్లో ఇప్పటికే పట్నా,చెన్నై,కేరళ, కర్ణాటకలో పుష్ప ఈవెంట్స్ జరిగాయి. ఫైనల్గా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి డిసెంబర్ 2వ తేదీన హైదరాబాద్లోని యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో బన్నీ అభిమానులు భారీగానే పాల్గొననున్నారు. -
'పుష్ప2' నుంచి మరో సాంగ్ ప్రోమో.. అంతా మలయాళంలోనే
అల్లు అర్జున్- సుకుమార్ హిట్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'పుష్ప2'. పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా పీలింగ్స్ అనే పాట ప్రోమోను మూవీ టీమ్ విడుదల చేసింది. ఫుల్ సాంగ్ను డిసెంబర్ 1న రిలీజ్ చేస్తామని కూడా ప్రకటన చేసింది. అయితే, అన్ని భాషల్లో రానున్న ఈ సాంగ్లో వచ్చే పల్లవి లిరిక్స్ మలయాళంలోనే ఉండనున్నాయి. ఈ సాంగ్లో కూడా దేవీశ్రీ ప్రసాద్ తనదైన మార్క్ను చూపించారని చెప్పవచ్చు. 'పుష్ప2: ది రూల్' ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుంది. సుమారు 5 కట్స్ చెప్పి యూ/ఏ సర్టిఫికెట్ను సెన్సార్ బోర్డ్ ఇచ్చింది. సినిమా రన్ టైమ్ 3 గంటలా 20 నిమిషాల 38 సెకన్ల నిడివితో ఉండనుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. డిసెంబర్ 5న పుష్ప2 విడుదల కానుంది. -
'పుష్ప2' ప్రతి సీన్ ఇంటర్వెల్లా ఉంటుంది: దేవిశ్రీ ప్రసాద్
అల్లు అర్జున్- సుకుమార్ల హిట్ కాంబోలో తెరకెక్కుతోన్న 'పుష్ప2' కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ గురించి ఏ వార్త కనిపించినా అది క్షణాల్లో వైరలవుతోంది. 'పుష్ప: ది రైజ్'కి కొనసాగింపుగా తెరకెక్కుతున్నదే 'పుష్ప: ది రూల్' (పుష్ప 2). ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 19న దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కాన్సర్ట్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 'పుష్ప 2' సినిమా ఎలా ఉందో చెప్పారు.పుష్ప2 అదిరిపోతుంది: దేవిశ్రీ ప్రసాద్పుష్ప పార్ట్ 2 'అస్సలు తగ్గేదే లే' అనేలా ఉండబోతుందని దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. 'నేను పుష్ప 2 ఫస్ట్ హాఫ్ చూశాను. సినిమా అదిరిపోయేలా వచ్చింది. ఇందులోని సీన్స్ అన్నీ చూశాక నా దిమ్మ తిరిగిపోయింది. పుష్ప వరల్డ్ ప్రారంభమయ్యాక ప్రతి సన్నివేశం ఇంటర్వెల్లా ఉంటుంది. ప్రేక్షకులను ఏమాత్రం నిరాశ పరిచేలా సీన్లు ఉండవు. దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ చెప్పినప్పుడే తెగ నచ్చేసింది. అంతే స్థాయిలో దానిని తెరకెక్కించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన స్టైల్లొ అదరగొట్టేశాడు.' అని మూవీపై భారీ అంచనాలు పెంచేశాడు. పుష్ప2 చిత్రాన్ని భారీ బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.హైదరాబాద్లో తొలిసారి మ్యూజికల్ కాన్సర్ట్ను దేవిశ్రీ ప్రసాద్ నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 19న గచ్చిబౌలి స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే విదేశాల్లో ఇలాంటి ఎన్నో ప్రదర్శనలిచ్చిన దేవిశ్రీ ప్రసాద్.. తొలిసారి హైదరాబాద్లో నిర్వహిస్తుండటంతో ఫ్యాన్స్ సంబర పడుతున్నారు. ఈ కార్యక్రమంలో చాలామంది ప్రముఖులు పాల్గొననున్నారు. -
పనైపోయిందన్నారు.. కానీ వీళ్లిద్దరూ మాత్రం వేరే లెవల్!
ఏ సినిమా తీసుకున్నా.. హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఇలా అందరూ కీలకమే. కానీ యాక్టర్స్ ఎంత ఫెర్ఫార్మ్ చేసినా సరే దానికి సరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ లేకపోతే అసలు ఆ సినిమాలో జీవమే ఉండదు. అలా గత కొన్ని దశాబ్దాల నుంచి ఎన్నో తెలుగు సినిమాలకు ప్రాణం పోసిన వాళ్ల లిస్ట్ తీస్తే అందులో కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్ కచ్చితంగా ఉంటారు. ఇప్పుడు వాళ్లకు జాతీయ అవార్డులు రావడం మరింత ప్రత్యేకంగా నిలిచింది. (ఇదీ చదవండి: 'పుష్ప'కి జాతీయ అవార్డులు.. ఆ అంశాలే కలిసొచ్చాయా?) ఆస్కార్ ప్లస్ ఈ అవార్డ్ కీరవాణి పేరు చెప్పగానే అద్భుతమైన పాటలు, గూస్బంప్స్ తెప్పించే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గుర్తొస్తుంది. అప్పట్లో అందరూ హీరోల సినిమాలకు పనిచేసిన ఈయన.. కొన్నాళ్ల నుంచి మాత్రం ఎందుకో బయట సినిమాలు బాగా తగ్గించేశారు. ఒకవేళ చేసినా పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. కానీ బాహుబలి రెండు పార్ట్స్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ఈయన.. 'ఆర్ఆర్ఆర్'లోని నాటు నాటు పాటతో ఆస్కార్ గెలిచారు. ఇప్పుడు అదే సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో జాతీయ అవార్డు సాధించారు. (ఇదీ చదవండి: 69వ జాతీయ సినిమా అవార్డులు ఫుల్ లిస్ట్) మాస్ కమ్బ్యాక్ మాస్, క్లాస్, రొమాంటిక్.. ఇలా ఏ పాటలకు ట్యూన్స్ కట్టాలన్నా అప్పట్లో దేవిశ్రీ ప్రసాద్ పేరు వినిపించేది. కానీ తమన్తోపాటు మిగతా సంగీత దర్శకుల హవా ఎక్కువ కావడంతో దేవిశ్రీ ప్రసాద్ క్రేజ్ పడిపోయింది. దీంతో చాలామంది డీఎస్పీ పనైపోయిందనుకున్నారు. కానీ 'పుష్ప' పాటలతో వరల్డ్ వైడ్ సెన్సేషన్ సృష్టించాడు. ఆ సాంగ్స్ వల్లే ఇప్పుడు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. సీనియర్ల అనుభవం అయితే పైన ఇద్దరికీ జాతీయ అవార్డులు రావడం విశేషమే. కానీ వీళ్ల గురించి జనాలు మెల్లమెల్లగా మరిచిపోతున్న టైంలో అవార్డులు గెలిచి చూపించారు. సీనియర్ల అనుభవం.. ఇలాంటప్పుడు ఎలా పనికొస్తుందనేది ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసి చూపించారు. ఇప్పటి జనరేషన్ మాటల్లో చెప్పాలంటే.. ఇది కదా అసలైన కమ్బ్యాక్ అంటే అని అనొచ్చు. ఇక ఈ అవార్డులు ఇచ్చిన ఊపుతో రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు చేస్తూ మంచి మ్యూజిక్ ఇవ్వాలని.. తెలుగు సంగీత ప్రియులు కోరుకుంటున్నారు. (ఇదీ చదవండి: సిక్స్ కొట్టిన ఆర్ఆర్ఆర్.. ప్చ్.. ఆ ముగ్గురికి రాలేదే!) -
'అమెరికాలో పూనకాలు లోడింగ్'.. మెగాస్టార్ ట్వీట్ వైరల్!
డీఎస్పీ అనగానే ఠక్కున గుర్తొచ్చేది పేరు దేవిశ్రీ ప్రసాద్. ఎందుకంటే తన మ్యూజిక్తో ఆడియన్స్ను ఊర్రూతలూగించడం ఆయన టాలెంట్. టాలీవుడ్లో మెగాస్టార్ నుంచి యంగ్ హీరోల సినిమాల దాకా తన మ్యూజిక్తో అభిమానులను అలరించాడు. అందుకే టాలీవుడ్లో అతన్ని ముద్దుగా డీఎస్పీ అని పిలుస్తారు. అయితే తాజాగా తన టాలెంట్ను అమెరికాలో ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు డీఎస్పీ. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి డీఎస్పీ బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. 'అమెరికాలో పూనకాలు లోడింగ్' అంటూ ఓ వీడియోనూ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: ప్రేమికుల రోజున సీనియర్ హీరోకి అదితి ప్రపోజ్! సిద్ధార్థ్ రియాక్షన్ ఇదే..) అమెరికాలోని నాసా ఆధ్వర్యంలో నిర్వహించే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజికల్ కన్సర్ట్కు సంబంధించిన మోషన్ పోస్టర్ను కూడా మెగాస్టార్ చేతుల మీదుగా లాంఛ్ చేశారు. నాసా అధ్వర్యంలో దేవి శ్రీ ప్రసాద్తో మ్యూజిక్ కన్సర్ట్స్ నిర్వహించనున్నారు. జులై 2న డల్లాస్, జులై 8న ఫిలడెల్ఫియా, జులై 15న సియాటెల్, జులై 22న సాన్ జొస్ , జులై 29న చికాగోలో ఈవెంట్స్ జరగనున్నట్లు తెలిపారు. ఈ ఈవెంట్స్లో సింగర్ ఇంద్రవతి , సాగర్, గీతా మాధురి , హేమ చంద్ర , రీటా , పృథ్వి , మౌనిక అలరించనున్నారు. ప్రముఖ యాంకర్ నటి అనసూయ ఈ షోస్ను హోస్ట్ చేయనున్నారు. గతంలో నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ ఆర్ఆర్ఆర్ సినిమా ‘నాటు నాటు’ పాటకు 150 టెస్లా కార్లతో లైట్ షో నిర్వహించడం వంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. టీజీ విశ్వప్రసాద్ గారి అధ్వర్యంలో నాసా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్వహించారు. ఇటీవలే సింగర్ రామ్ మిరియాలతో పలు చోట్ల మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించారు. ఈ షోస్ కి ఊహించని రీతిలో అనూహ్య స్పందన లభించింది. (ఇది చదవండి: సిద్ధార్థ్- ఆదితి డేటింగ్.. అసలు విషయం చెప్పేసిన హీరో!) ℒℴ𝓋ℯ 𝓎ℴ𝓊 𝓂𝓎 𝒷ℴ𝓎 𝐑𝐎𝐂𝐊 𝐓𝐇𝐄 𝐒𝐇𝐎𝐖𝐖𝐖𝐖 Just do KUMMUDU..🎶🕺 Wishing ROCKSTAR @ThisIsDSP & his TEAM All The Very Best for DSP-USA TOUR 2023 *#DSPOoAntavaTourUSA*https://t.co/c6jea4ILUe@sagar_singer @itsvedhem @PrudhviChandrap @geethasinger… pic.twitter.com/8AvvNUZKQi — Chiranjeevi Konidela (@KChiruTweets) June 10, 2023 -
పెళ్లిపీటలు ఎక్కబోతున్న దేవీశ్రీ ప్రసాద్? వధువు ఎవరో తెలుసా?
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్లలో దేవీశ్రీ ప్రసాద్ ఒకరు. దేవి సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఆయన మొన్నటి వాల్తేరు వీరయ్య వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు దేవీశ్రీ ప్రసాద్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. నాలుగు పదుల వయసు దాటినా దేవీశ్రీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయితే త్వరలోనే ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నాడట. ఇక అమ్మాయి ఎవరో కాదు దేవిశ్రీప్రసాద్ దూరపు బంధువుల అమ్మాయట. ఆమె వరసకి మరదలు అవుతుందట. వీరిద్దరికి సుమారు 17ఏళ్ల గ్యాప్ ఉందని తెలుస్తుంది. కుటుంబసభ్యుల సమక్షంలో త్వరలోనే వీరి వివాహం జరగనుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి నెట్టింట వైరల్ అవుతున్నట్లుగా ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచిచూడాల్సిందే. గతంలోనూ దేవీ ఓ హీరోయిన్తో పీకలదాకా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పెళ్లి వరకు వెళ్లిన వాళ్ల రిలేషన్ మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. -
దేవిశ్రీ ప్రసాద్పై కరాటే కల్యాణి ఫిర్యాదు
-
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
పాటలు నచ్చలేదు.. దేవిశ్రీకి షాకిచ్చిన సల్మాన్!
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ కంపోజర్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ట్యూన్స్ అంటే సల్మాన్ ఖాన్కు చాలా ఇష్టం. అందుకే గతంలో దేవి కంపోజ్ చేసిన కొన్ని ట్రాక్స్ ను బాలీవుడ్ కు తీసుకెళ్లాడు. ఆర్య 2లోని రింగా రింగా, అలాగే డీజేలోని సీటీమార్ మ్యూజిక్ ను బాలీవుడ్ లో రిపీట్ చేశాడు. అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా చిత్రం పుష్పకు దేవి అందించిన ట్రాక్స్ సల్మాన్ కు ఇంకా బాగా నచ్చాయి. దీంతో ప్రస్తుతం తాను నటిస్తున్న కొత్త సినిమా కభీ ఈద్ కభీ దివాళీకి దేవిశ్రీ ప్రసాద్ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసుకున్నాడు భాయ్ జాన్. కాని ఇప్పుడు ఈ చిత్రం నుంచి రాక్ స్టార్ తప్పుకున్నాడని బాలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ట్రాక్స్ సల్మాన్కు నచ్చకపోవడమే అట. ఇక దేవిశ్రీని తప్పించి ఆ అవకాశం కేజీయఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్కు ఇచ్చాడట. (చదవండి: ఆస్కార్ నుంచి సూర్యకు ఆహ్వానం.. తొలి సౌత్ ఇండియా హీరోగా రికార్డు) భాయ్ జాన్ నుంచి బిగ్ ఫిల్మ్ ఆఫర్ రావడంతో వెంటనే ఒకే అనేసాడు రవిబస్రూర్. అంతే కాదు కభీ ఈద్ కభీ దివాళి టైటిల్ కంపోజ్ చేసి సల్మాన్ ను ఇంప్రెస్ చేశాడట. ఈ చిత్రంలో సల్మాన్, వెంకీ, రామ్ చరణ్ తేజ్, పూజా హెగ్డే కలసి స్టెప్పులేసే స్పెషల్ సాంగ్ కోసం కూడా రవినే సెన్సేషనల్ ట్రాక్ అందించబోతున్నాడట. -
సుకుమార్కి దేవీశ్రీ స్పెషల్ బర్త్డే విషేస్.. సాంగ్ విన్నారా?
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్లు ఎంత మంచి స్నేహితులో అందరికి తెలిసిందే. సుక్కు నుంచి ఒక సినిమా వస్తే..దానికి కచ్చితం దేవినే సంగీతం అందించాలి. పాటలు కూడా సూపర్ హిట్ అవ్వాల్సిందే. ఆర్య నుంచి మొదలు మొన్నటి పుష్ప వరకు.. సుక్కు ప్రతి సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించాడు దేవీశ్రీ ప్రసాద్. నేడు(జనవరి 11)సుకుమార్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన స్నేహితుడికి పాట రూపంలో బర్త్డే విషెస్ తెలియజేశాడు డీఎస్పీ. పుష్ప మూవీలోని ‘శ్రీవల్లీ’పాటకుపేరడీగా ఈ బర్త్డే సాంగ్ సాగుతుంది. -
పుష్ప టీమ్ భారీ ప్లాన్.. ‘దాక్కో దాక్కో మేక’ కు మించేలా సెకండ్ సింగిల్!
అల్లు అర్జున్ సంగతి తెలిసిందే. ఒక కొత్త సినిమా స్టార్ట్ అయితే చాలు ఆ వెంటనే ప్రమోషన్ స్టార్ట్ చేస్తాడు. తన మూవీ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే విధంగా ప్లాన్ చేస్తాడు. అల.. వైకుంఠపురములో పాటలతో బన్ని చేసిన ప్రమోషన్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు సేమ్ స్ట్రాటజీ పుష్పకు అప్లై చేస్తున్నాడు. పుష్ప మూవీ నుంచి రిలీజై ఫస్ట్ ప్యాన్ ఇండియా సింగిల్ ‘దాక్కో దాక్కో మేక’ ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో తెల్సిందే. ఇప్పటికిప్పుడు యూట్యూబ్ చూసినా, ఏదో ఒక రికార్డ్ బద్దలవుతూ కనిపిస్తుంది. అందుకే వేడి తగ్గకుండా, మరో సింగిల్ ను రిలీజ్ చేసేందుకు యూనిట్ రెడీ అవుతోంది. ఆగస్ట్ లో దాక్కో దాక్కో దుమ్మురేపడంతో, సెప్టెంబర్ లో మరో న్యూ సింగిల్ ను రిలీజ్ చేయాలనుకుంటున్నాడు బన్ని. అందుకు సంబంధించి ఇప్పటికే ప్లానింగ్ జరిగిపోయింది. ఈసారి డ్యూయెట్ సాంగ్ ను సింగిల్ రూపంలో విడుదల చేస్తారట. క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి, ఇకపై ప్రతీ నెల ఒక సింగిల్ రిలీజ్ కానుందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లోనే బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. సుకుమార్ మేకింగ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ అనే విషయం తెలిసిందే. దాక్కో దాక్కో ట్యూన్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న దేవి త్వరలో విడుదల కానున్న కొత్త డ్యూయెట్ తో ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. అసలే బన్ని ప్రాజెక్ట్ అంటే ఇంకా రెచ్చిపోతాడు రాక్ స్టార్. -
‘పుష్ప’ అప్డేట్: దాక్కొ దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’.అటవీ బ్యాక్డ్రాప్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీని దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే పుష్ప నుంచి విడుదలై టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. దేవిశ్రీప్రసాద్ పుట్టిన రోజు (ఆగస్ట్ 2)సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ని ప్రటకించింది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సింగిల్ ట్యూన్ ఆగస్ట్ 13న విడుదల కానున్నట్టు తెలియజేశారు. ఐదు భాషల్లో ఐదుమంది సింగర్స్తో ఈ పాటను పాడించారు. హిందీలో ఈ పాటను విశాల్ దడ్లాని, కన్నడలో విజయ్ ప్రకాశ్, మలయాళంలో రాహుల్ నంబియార్,తెలుగులో శివం,తమిళంలో బెన్నీ దయాల్ పాటని ఆలపించారు. తెలుగులో దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొడుతుంది పీక పేరుతో ఈ పాట రూపొందింది. 5 Languages, 5 singers & One Rocking Tune by @ThisIsDSP 🎵 Icon Staar @alluarjun's #PushpaFirstSingle on AUG 13th🔥#HBDRockStarDSP#DaakkoDaakkoMeka #OduOduAadu #OduOduAade #JokkeJokkeMeke #JaagoJaagoBakre#Shivam @benny_dayal @RahulNOfficial @rvijayprakash @VishalDadlani pic.twitter.com/aqzKCrcg62 — Pushpa (@PushpaMovie) August 2, 2021 -
దేవిశ్రీ ప్రసాద్ పేరు వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా?
సాక్షి, వెబ్డెస్క్: ఆయన మ్యూజిక్ వింటే ఎవరికైనా స్టెప్పులేయాలనిపిస్తుంది. రొమాంటిక్, సెంటిమెంటల్, దుమ్మురేపే మాస్ బీట్స్, హుషారెత్తించే ఐటమ్స్ సాంగ్స్.. ఏదైనా తనదైన సంగీతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాడు. ఆయన మరెవరోకాదు.. అభిమానులచే ముద్దుగా డీఎస్పీ అని పిలవబడే దేవిశ్రీ ప్రసాద్. స్వచ్ఛమైన సంగీతానికి కేరాఫ్గా నిలిచే పేరు అది. ఎనర్జీ అనే పదానికి నిర్వచనం ఆయన. తన మ్యూజికల్ మ్యాజిక్తో ఎన్నో చిత్రాలకు బ్లాక్బస్టర్ హిట్స్ అందించిన రాక్స్టార్ దేవీశ్రీ ప్రసాద్ పుట్టిన రోజు నేడు(ఆగస్ట్ 2). ఈ సందర్భంగా ‘డీఎస్పీ’గురించి.. దేవీశ్రీ ప్రసాద్.. 1979, ఆగస్ట్ 2న గొర్తి సత్యమూర్తి, శిరోమణి దంపతులకు జన్మించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని రాయవరం మండలంలోని వెదురుపాక వీరి స్వగ్రామం.దేవీకి ఒక తమ్ముడు సాగర్, చెల్లి పద్మిణి ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ చిన్ననాటి నుండి సంగీత ప్రపంచంలోనే పెరిగారు. ఆయన తండ్రి గొర్తి సత్యమూర్తి గొప్ప కథా రచయిత. దేవత’‘ఖైదీ నంబర్ 786’, ‘అభిలాష’, ‘పోలీస్ లాకప్’, ‘ఛాలెంజ్’ వంటి విజయవంవతమైన చిత్రాలకి ఆయన కథలు అందించారు. ఒక రకంగా దేవీ సినిమాల్లోకి రావడానికి కారణం ఆయనే. అసలు దేవిశ్రీప్రసాద్ అనే పేరు ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. దేవిశ్రీ ప్రసాద్ అమ్మమ్మ పేరులోని దేవి.. తాతయ్య పేరులోని ప్రసాద్ ను తీసుకొని దేవిశ్రీ ప్రసాద్ గా కూర్చి ఆ పేరు పెట్టారు.చెన్నైలో ఇంటర్ వరకు చదువుకున్న దేవిశ్రీ ప్రసాద్ చిన్న వయసులోనే మాండొలిన్ నేర్చుకున్నాడు. మాండొలిన్ శ్రీనివాస్ ఈ సంగీత దర్శకుడి గురువు. టీనేజ్ లోనే మ్యూజిక్ దర్శకుడిగా దేవిశ్రీకి చిన్నప్పటి నుంచే సంగీత దర్శకుణ్ణి కావాలని కోరికట. ఆరో తరగతిలో ఉండగానే, పెద్దయ్యాక ఏమవుతావని స్కూల్లో అడిగితే, ‘మ్యూజిక్ డెరైక్టర్ని అవుతా’చెప్పాడట. ఇంట్లో కూడా అతని ఇష్టాలను గౌరవించేవాళ్లు. ఒక రోజు ఎంఎస్ రాజు దేవీశ్రీ ప్రసాద్ ఇంటికి వచ్చారట. ఆ సమయంలో దేవీశ్రీ గదిలో నుంచి సంగీత వాద్యాల శబ్దాలు విని, ఒక సందర్భానికి ట్యూన్ ఇవ్వమని అడిగారు. రెండు రోజుల్లోనే ట్యూన్ ఇచ్చి ఎంఎస్ రాజు ఫిదా అయ్యాడట. వెంటనే ‘దేవి’సినిమాకు సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చాడట. అప్పుడు దేవిశ్రీ ప్లస్ 2 చదువుతున్నాడు. అలా టీనేజ్లో మ్యూజిక్ డైరెక్టరై రికార్డును సృష్టించాడు. మెగా ఫ్యామిలీతో మ్యూజికల్ బాండ్ డీఎస్పీ కెరీర్ ను గమనిస్తే మెగా కాంపౌండ్ తో అవినాభావ సంబంధం ఉందని చెప్పొచ్చు. చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ - ఇలా ఫ్యామిలీలోని అందరికీ మ్యూజికల్ హిట్స్ అందించాడు. చిరంజీవి ‘శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్, అందరివాడు, ఖైదీ150 చిత్రాలకు సంగీతం అందించిన దేవీ... పవన్ కల్యాణ్కు 'జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది మూడు బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందించాడు. అలాగే అల్లు అర్జున్ ఆర్య, ఆర్య-2, బన్ని, జులాయి, ఇద్దరమ్మాయిలతో, సన్నాఫ్ సత్యమూర్తి, రామ్ చరణ్ ‘ఎవడు’, మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’చిత్రాలను స్వరకల్పన చేసి విజయంలో పాలుపంచుకున్నాడు. ఒక మెగా హీరోలకే కాదు.. టాలీవుడ్ టాప్ హీరోలందరితో పనిచేశాడు దేవిశ్రీ. అక్కినేని నాగార్జున ‘మన్మథుడు, మాస్' ఢమరుకం, కింగ్ , భాయ్ చిత్రాలకు, మహేశ్బాబు ‘వన్-నేనొక్కడి,శ్రీమంతుడు, భరత్ అనే నేను, సరిలేరు మీకెవ్వరు సినిమాలతో పాటు, ప్రభాస్ వర్షం,పౌర్ణమి, మిస్టర్ పర్ ఫెక్ట్, మిర్చి, జూనియర్ ఎన్టీఆర్ "నా అల్లుడు, రాఖీ, అదుర్స్, ఊసరవెల్లి, జనతా గ్యారేజ్మూవీస్కు కూడా దేవిశ్రీ పసందైన బాణీలు అందించాడు. రెండు దశాబ్దాలుగా సంగీత ప్రియులకు అలరిస్తున్న దేవీ.. మున్ముందు కూడా తనదైన బాణీలలో ప్రేక్షలకు వీనులవిందు అందించాలని ఆశిస్తూ.. ‘సాక్షి’తరపున దేవీశ్రీ ప్రసాద్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. -
శర్వానంద్ చిత్రానికి దేవీశ్రీ సంగీతం
శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎస్ ఎల్ వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న సహా ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కిషోర్ తిరుమల. ఈ సినిమాలో శర్వానంద్, రష్మిక మందన్న క్యారెక్టర్లు ఆసక్తికరంగా ఉండనున్నాయని, కిశోర్ తిరుమల మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిన్నారని. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మంచి అసెట్ కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది. -
థియేటర్స్లోనే మాస్ మహరాజా ‘’ఖిలాడి‘’
క్రాక్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన మాస్ మహరాజా రవితేజ ప్రస్తుతం ఖిలాడి ' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే . రమేష్ వర్మ దర్శకత్వంలో హవీష్ ప్రొడక్షన్స్ , పెన్ స్టూడియోస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా .. యాక్షన్ కింగ్ అర్జుతో పాటు జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు .షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28 న విడుదల కు సిద్దం చేశారు .ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ కారణంగా వాయిదా వేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ' ఖిలాడి ' సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ కానుందనే న్యూస్ సినీ వర్గాల్లో వినిపిస్తుండగా , ఈ విషయంపై మూవీ మేకర్స్ స్పష్టతనిచ్చారు . రవితేజ సినిమా ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం పూర్తిగా అవాస్తమని , ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లో చూసి ఆస్వాదించేలా రూపొందిస్తున్నామని నిర్మాత కోనేరు సత్యనారాయణ వెల్లడించారు . ఇటలీలో తీసిన యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా నిలుస్తాయని పేర్కొన్నారు . కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు . కాగా ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి , డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు . (చదవండి:టైసన్, అది నువ్వేనా? షాక్లో ఫ్యాన్స్!) -
ఆకట్టుకుంటున్న ‘రౌడి బాయ్స్’ మోషన్ పోస్టర్
హుషారు దర్శకుడు హర్ష కొనుగంటి రూపొందిస్తున్న తాజా చిత్రం ‘రౌడీ బాయ్స్’. ఈ మూవీతో ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇందులో ఆశిష్కు జోడిగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశ్లో ఉన్న ఈ మూవీ మెషన్ పోస్టర్ను తాజా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇంజనీరింగ్, మేడికల్ కాలేజీ విద్యార్థుల మధ్య సాగే కథే ఈ రౌడీ బాయ్స్. ‘మా బాయ్స్తోటి ఎంట్రీ ఇస్తే అల్లకల్లోలం.. జర ముట్టుకుంటే అంటుకుంటాం అగ్గిపుల్లలం..’ అంటూ సాగే పాటతో విడుదలైన ఈ మోషన్ పోస్టర్ యువతను వీపరితంగా ఆకట్టుకుంటుంది. యాక్షన్, డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని దిల్ రాజు ప్రొడక్షన్లో నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కాగా జూన్ 25న ఈ మూవీ విడుదల కానుంది. -
సినిమాని పాటలు డామినేట్ చేస్తున్నట్లుగా చూడొద్దు
‘‘ఒకే ఆల్బమ్లో ఒకదానికొకటి భిన్నంగా అనిపించే పాటలు ఉండటం అరుదు. దేవిశ్రీ ప్రసాద్ తన ఆల్బమ్లోని పాటలన్నీ డిఫరెంట్ వేరియేషన్స్తో ఉండేందుకు ప్రయత్నిస్తారు. ‘రంగ్ దే’ ఆల్బమ్ అలాంటిదే’’ అని పాటల రచయిత శ్రీమణి అన్నారు. నితిన్, కీర్తీ సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగ్ దే’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ చిత్రంలోని నాలుగు పాటలు రాసిన శ్రీమణి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘100% లవ్’ సినిమాతో దేవిశ్రీతో నా ప్రయాణం మొదలైంది. ఈ ఏప్రిల్తో మా ప్రయాణానికి పదేళ్లు పూర్తవుతాయి. ‘తొలిప్రేమ’ చిత్రం నుంచే వెంకీ అట్లూరితో కలిసి పనిచేస్తున్నాను. సాధారణంగా మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చే ట్యూన్స్కే మేం లిరిక్స్ రాస్తుంటాం. ఒక్కోసారి కాన్సెప్ట్కు తగ్గ లిరిక్స్ రాసుకొని, ఆ తర్వాత ట్యూన్స్ కట్టడం జరుగుతుంది. ప్రతి పాటనూ ఓ ఛాలెంజ్గానే తీసుకుంటాను. నేను రాసే పాటని మొదట నా భార్యకు లేదంటే నా ఫ్రెండ్ మురళికి, రైటర్ తోట శ్రీనివాస్కు వినిపిస్తుంటాను. ఫిలాసఫికల్ సాంగ్స్ని మాత్రం సీతారామశాస్త్రిగారికి వినిపించి, సలహాలు తీసుకుంటుంటాను. ‘జులాయి’ నుంచే సితార ఎంటర్టైన్మెంట్స్ చిత్రాలకు పాటలు రాస్తున్నాను. సినిమా విడుదలకు ముందే పాటలు హిట్టయితే, సినిమాని పాటలు డామినేట్ చేస్తున్నట్లుగా చూడకూడదు. లవ్ స్టోరీకి పాటలు పాపులర్ అయితే కమర్షియల్గా అది సినిమాకు ఎంతో ఉపయోగపడుతుంది’’ అన్నారు. -
జల జల జల జలపాతం నువ్వు.. లిరికల్ సాంగ్
జల జల జల జలపాతం నువ్వు సెల సెల సెలయేరుని నేను సల సల నువు తాకితే నన్ను పొంగే వరదై పోతాను చలి చలి చలి గాలివి నువ్వు చిరు చిరు చిరు అలనే నేను చెర చెర నువు అల్లితే నన్ను ఎగసే కెరటాన్నవుతాను హే... మన జంటవైపు జాబిలమ్మ తొంగి చూసెనే హే... ఇటు చూడకంటూ మబ్బు రెమ్మ దాన్ని మూసెనే ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసెనే ‘‘జల జల‘‘ సముద్రమంత ప్రేమ ముత్యమంత మనసు ఎలాగ దాగి ఉంటుందీ లోపలా ఆకాశమంత ప్రణయం చుక్కలాంటి హృదయం ఎలాగ బైటపడుతోంది ఈవేళా నడి ఎడారి లాంటి ప్రాణం తడి మేఘానితో ప్రయాణం ఇక నా నుంచి నిన్ను నీ నుంచి నన్నూ తెంచలేదు లోకం ‘‘జల జల‘‘ ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజూ ఎలాగ వెళ్లిపోకుండా ఆపడం ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్లు ఎలాగ దీన్ని గుండెల్లో దా^è డం ఎప్పుడూ లేనిదీ ఏకాంతం ఏక్కడా లేని ఏదో ప్రశాంతం మరి నాలోన నువ్వు నీలోన నేను మనకు మనమే సొంతం ‘‘చలి చలి‘‘ చిత్రం : ఉప్పెన రచన : శ్రీమణి గానం : జస్ప్రీత్ జాజ్, శ్రేయా ఘోషల్ సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ -
‘ఉప్పెన’ మరో సాంగ్.. ఆకట్టుకుంటున్న మెలోడీ
మెగా మేనల్లుడు, సాయిధరమ్తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఉప్పెన'. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 12న ప్రేక్షకుల మందుకు రానుంది. రాక్స్టార్ దేవిశ్రీపసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదల కాగా, తాజాగా నాలుగో పాటను రిలీజ్ అయింది. జల జల జలపాతం అంటూ సాగే పాటను హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. శ్రీమణి సాహిత్యం అందించగా జస్ప్రీత్ జస్, శ్రేయా ఘోషల్ ఆలపించారు.కాగా, ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘నీ కన్ను నీలి సముద్రం’, ‘ధక్ ధక్ ధక్’, ‘రంగులద్దుకున్న’ పాటలకు విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా ‘నీ కళ్లు నీలి సముద్రం’ పాట మ్యూజిక్ లవర్స్ను ఎంతగానే ఆకట్టుకుంది. | -
దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ విషెస్
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ న్యూ ఇయర్ సందర్భంగా మ్యూజికల్ న్యూఇయర్ శుభాకాంక్షలతో ఒక వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా తనకెంతో ఇష్టమైన వాయిద్యం సితార్ అని వ్యాఖ్యానించారు. ప్రముఖ సితార్ ప్లేయర్ కిషోర్ను పరిచయం చేశారు. అప్ కమింగ్ మూవీ రంగ్దే లోని సాంగ్ను కిషోర్ ప్లే చేసిన వీడియోను షేర్ చేస్తూ అభిమానులకు మ్యూజికల్ విషెస్ అందించారు. అందమైన సంగీత నూతన సంవత్సరంలో అద్భుతమైన ఆశలు, పప్రేమతో రంగులమయం కావాలంటూ ఆకాంక్షించారు. అలాగే ఈ సాంగ్ను రేపు(జనవరి 1, శుక్రవారం) విడుదల చేయనున్నట్టు డీఎస్పీ తెలిపారు. కాగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, కీర్తీ సురేష్ జంటగా నటిస్తున్న రంగ్దే సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఒక రొమాంటిక్ మ్యాజికల్ మెలోడీ సాంగ్ను ఇప్పటికే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. A small MUSICAL VIDEO for all of you.. To Step into a BEAUTIFUL MUSICAL NEW YEAR filled with AMAZING HOPE🙏🏻.. LOVE❤️& COLOURS..🌈#RangDe#RangDeRecordingSession#HappyNewYear2021 https://t.co/sBBEtdjEFs — DEVI SRI PRASAD (@ThisIsDSP) December 31, 2020 -
భాష లేని ఊసులాట!
‘‘ఏమిటో ఇది వివరించలేనిది.. మది ఆగమన్నది తనువాగనన్నది.. భాష లేని ఊసులాట సాగుతున్నది.. అందుకే ఈ మౌనమే ఓ భాష అయినది.. కోరుకోని కోరికేదో తీరుతున్నది...’’ అంటూ ప్రేయసికి తన ప్రేమను తెలియజేస్తున్నారు నితిన్. ఈ ప్రేమ పాట ‘రంగ్ దే’ చిత్రం కోసమే. నితిన్, కీర్తీ సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ‘ఏమిటో ఇది వివరించలేనిది..’ అంటూ సాగే ఈ చిత్రంలోని తొలి పాట వీడియోను విడుదల చేశారు. ఈ పాటకి శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. హరిప్రియ, కపిల్ కపిలన్ పాడారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు. ‘‘ఈ రొమాంటిక్ మెలోడీని వీక్షకులకు కనువిందు కలిగేలా చిత్రీకరించారు వెంకీ అట్లూరి. ఈ నెల చివరి వారం నుంచి చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. దుబాయ్లో పాటల చిత్రీకరణతో త్వరలోనే షూటింగ్ పూర్తవుతుంది. 2021 సంక్రాంతికి సినిమా విడుదల చేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సమర్పణ: పీడీవీ.ప్రసాద్, కెమెరా: పీసీ శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం (వెంకట్). -
ఏమిటో ఇది వివరించలేనిది.. మాయ చేసిన దేవిశ్రీ
యంగ్ హీరో నితిన్, ‘మహానటి’ కిర్తి సురేష్ జంటగానటిస్తున్న చిత్రం ‘రంగ్దే’.. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నితిన్ వెడ్డింగ్ సందర్భంగా ‘రంగ్ దే` నుంచి విడుదల చేసిన చిన్న వీడియోకి విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా తొలి పాటను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. `ఏమిటో ఇది వివరించలేనిది.. మది ఆగమన్నది తనువాగనన్నది.. భాష లేని ఊసూలాట సాగుతున్నది. అందుకే ఈ మౌనమే భాష ఐనది’ అంటూ సాగే ఈ మెలోడీ గీతానికి శ్రీమణి సాహిత్యం అందించగా.. హరిప్రియ, కపిల్ కపిలన్ ఆలపించారు. రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. చాలా నెమ్మదిగా సాగే ఈ మెలోడీ సాంగ్ని వెండితెరపై ప్రేక్షకులకు కనువిందు కలిగించేలా చిత్రీకరించనట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల కాలంలో డీఎస్పీ నుంచి ఇలాంటి మెలోడీ సాంగ్ రాలేదనే చెప్పాలి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. (చదండి : ఫ్రెండ్స్తో స్టెప్పులేసిన స్టార్ హీరో కూతురు) -
‘ఉప్పెన’ మరో సాంగ్.. మెస్మరైస్ చేసిన దేవిశ్రీ
మెగా మేనల్లుడు, సాయిధరమ్తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఉప్పెన'. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. రాక్స్టార్ దేవిశ్రీపసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా, తాజాగా మూడో పాటను సూపర్ స్టార్ మహేశ్బాబు విడుదల చేశాడు. ‘ఉప్పెన సినిమా నుంచి అందమైన మెలోడి ‘రంగులద్దుకున్న’ను విడుదల చేస్తున్నాను. నా ఫేవరేట్ రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్కి, సుకుమార్ గారికి, వెండితెరకు పరిచయమవుతోన్న పంజా వైష్ణవ్ తేజ్కి, కృతి శెట్టికి, బుచ్చిబాబు సానాకు, మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు’ అని మహేశ్బాబు ట్వీట్ చేశారు. ఇక పాట విషయానికొస్తే.. ఇదొక మెలోడీ సాంగ్. ‘రంగులద్దుకున్నా తెల్లరంగులవుదాం. పూలు కప్పుకున్నా కొమ్మలల్లె ఉందాం..’ అంటూ ప్రకృతి అందాల మధ్య సాగుతున్న ఈ పాట సినిమాపై అంచనాలు మరింత పెంచేలా ఉంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందిచగా,యాజిన్ నిజర్, హరిప్రియ ఆలపించారు. ఈ పాటను దివంగత గానగంధర్వుడు ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు అంకితమిచ్చారు. కాగా, ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘నీ కన్ను నీలి సముద్రం’, ‘ధక్ ధక్ ధక్’ పాటలకు విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా ‘నీ కళ్లు నీలి సముద్రం’ పాట మ్యూజిక్ లవర్స్ను ఎంతగానే ఆకట్టుకుంది. యూట్యూబ్లో ఈ పాట ఏకంగా140 మిలియన్ వ్యూస్ దాటింది. ఇప్పుడు ఈ మూడో పాట ఎన్ని వ్యూస్ తెచ్చిపెడుతుందో చూడాలి. -
అందుకే దేవిశ్రీని రాక్స్టార్ అనేది!
హైదరాబాద్: అంతర్జాతీయ సంగీత దినోత్సవం సందర్భంగా సంగీత అభిమానులకు రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. అంతేకాకుండా ఈ వీడియోను ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి సత్యమూర్తికి, సంగీత పాఠాలు నేర్పిన తన గురువుకు అంకితమిస్తున్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సంగీత ప్రియుల్ని, ముఖ్యంగా మాస్ అండ్ ఫాస్ట్ బీట్ సాంగ్స్ను అభిమానించే వారికి బాగా నచ్చుతోంది. (‘హేయ్..సత్తి నా పాట విన్నావా?') ఎలాంటి సంగీత వాయిద్య పరికరాలు ఉపయోగించకుండా తన బృందంతో కలసి ప్లాస్టిక్ కుర్చీలు, ట్రంకు పెట్టెలనే డ్రమ్స్గా ఉపయోగించుకొని అందరినీ ఉర్రూతలూగించే సూపర్బ్ ప్రదర్శన చేశారు. అయితే ఈ ప్రదర్శన తాజాగా చేసింది కాదు. గతంలో యూఎస్ఏలో జరిగిన ఓ మ్యూజికల్ షోలో చేసిన పర్ఫార్మెన్స్కు సంబంధించిన వీడియోను తాజాగా తన ట్విటర్లో షేర్ చేశారు. ఇక ఈ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ప్రతిభకు, క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. (‘మా నాన్న నవ్వు.. మా బిడ్డ చిరునవ్వు’) రాళ్లు రప్పలతో కూడా సంగీతాన్ని అందించొచ్చని దేవిశ్రీ మరోసారి నిరూపించాడని అందుకే అతడిని రాక్స్టార్ అంటారని ఓ అభిమాని కామెంట్ చేశాడు. ఇక లాక్డౌన్ సమయంలో తన పాత షోలకు సంబంధించిన వీడియోలను ఒక్కొక్కటి విడుదల చేస్తూ ఆడియన్స్ను ఎంటర్టైన్ చేస్తున్నాడు దేవిశ్రీ. గతంలో తన తండ్రి సత్యమూర్తి జయంతి సందర్బంగా మ్యూజికల్ విషెస్ తెలుపుతూ విడుదల చేసిన వీడియో అందరినీ తెగ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. (సీతు పాప సింపుల్ యోగాసనాలు) On #WorldMusicDay2020 tomorrow, Since MUSIC HAS NO LANGUAGE, Hope U all wud like 2 watch this FULL PERFORMANCE, When I, along wit my RHYTHM PLAYERS, turned these LIFELESS OBJECTS into DRUMS filled wit LIFE 💟🥁🎶 FULL VIDEO-9AM..21ST JUNE Subscribe to https://t.co/zuPJJrmU6I pic.twitter.com/D855136wpU — DEVI SRI PRASAD (@ThisIsDSP) June 20, 2020 -
పవన్ కల్యాణ్.. ‘ఇప్పుడే మొదలైంది’?
రీఎంట్రీ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’ చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక ఈ చిత్రం తర్వాత మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవర్ స్టార్. ఏఎమ్ రత్నం నిర్మాణంలో క్రిష్ డైరెక్షన్లో ‘విరూపాక్ష’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చేస్తున్నారు.పీరియాడిక జానర్లో తెరకెక్కుత్ను ఈ చ్రితంలో పవన్ క్యారక్టరైజేషన్ రాబిన్ హుడ్ తరహాలో ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. క్రిష్ చిత్రం తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ నటించనున్నారు. గబ్బర్సింగ్ వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత పవన్-హరీష్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. పవన్ ఇమేజ్ను దృష్టిలో ఉంచుకొని ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ను డైరెక్టర్ సిద్దం చేసి పెట్టుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో మలయాళ నటి మానసా రాధాకృష్ణన్ హీరోయిన్గా నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. పవన్-హరీష్ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రానికి ‘ఇప్పుడే.. మొదలైంది’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు లీకువీరులు పేర్కొంటున్నారు. గబ్బర్ సింగ్ విడుదలై 8 ఏళ్లు అయిన సందర్భంగా హరీష్ శంకర్ చేసిన ట్వీట్తో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఈ ట్వీట్లో ‘ఇప్పుడే మొదలైంది.. మేము మళ్లీ వస్తున్నాం' అని పేర్కొన్నారు. అలాగే, ఆ తర్వాత చేసిన ట్వీట్లలో కూడా ఆ టైటిల్ను హైలైట్ చేయడంతో సినిమా పేరు అదే అని అందరూ ఫిక్సయ్యారు. అయితే చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పూర్తి కమర్షియల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీమేకర్స్ నిర్మిస్తుండగా.. దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. చదవండి: ‘జాన్వీ కపూర్’ వెనక ఇంత కథ ఉందా? శ్రీమతితో తొలి సెల్ఫీ.. వైరల్ Thanks again for the overwhelming appreciations and celebrations.... 🙏🙏🙏 thanks to all the fans who made this 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/ZVyHrdGASg — Harish Shankar .S (@harish2you) May 11, 2020 -
15 ఏళ్లు : జనాల గుండెల్లో ‘భద్ర’
కొన్ని సినిమాలు టీవీల్లో ఎన్ని సార్లు వచ్చినా చూస్తాం.. ఎన్నేళ్లయినా చూస్తాం. అలాంటి సినిమాల జాబితాలోకి చేరే చిత్రం ‘భద్ర’. రవితేజ హీరోగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ తొలి చిత్రం ఓ ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన తర్వాత బోయపాటి రూపంలో టాలీవుడ్కు మరో మాస్ డైరెక్టర్ దొరికాడని అందరూ భావించిన ఈ చిత్రం విడుదలై నేటికి పదిహేనేళ్లవుతోంది. మాస్ మహారాజ్ రవితేజలోని ఓ విభిన్న ప్రేమికుడిని బోయపాటి తనదైన స్టైల్లో వైవిధ్యంగా చూపించాడు. ప్రేమ, త్యాగం, యాక్షన్, ఎమోషన్ ఇలా డిఫరెంట్ యాంగిల్స్లో కనిపించిన రవితేజ తన నటనతో ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేశాడు. ఇక పాటలకు మరో ప్రధాన బలం సంగీతం. రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన ప్రతీ పాట ఓ ఆణిముత్యమే. ‘తిరుమల వాసా తిరుమల వాస సుమధుర హాస ఈ హారతి గొనవయ్యా’, ‘ఏమైంది సారు ఏంటా హుషారు’, ‘ఓ మనసా’ ఇలా ఈ చిత్రంలోని అన్ని పాటలు ఇప్పటికీ సంగీత ప్రియుల గుండెల్లో నిలిచిపోయాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన మీరాజాస్మిన్ మన పక్కింటి అమ్మాయిగా కనిపించి తన నటనతో యువత డ్రీమ్ గర్ల్గా మారిపోయింది. ఇక రవితేజ, అర్జున్ బజ్వాల మధ్య సీన్స్ స్నేహితులను కట్టిపడేసేలా ఉంటాయి. ఇక ప్రకాష్ రాజ్, మురళీమోషన్, ఈశ్వరీ రావు తదితరులు తమ నటనతో సినిమాకు మరింత జీవం పోశారు. దిల్ రాజ్ నిర్మాత వ్యహరించిన ఈ చిత్రాన్ని తొలుత అల్లు అర్జున్తో తీయాలని దర్శకనిర్మాతలు భావించారు. అయితే కథ నచ్చినా కొత్త దర్శకుడు అనే కారణంతో బన్ని వెనకడుగు వేశాడు. దిల్ రాజ్ సూచనతో రవితేజను హీరో ఈ సినిమా పట్టాలెక్కించి ఘన విజయాన్ని అందుకున్నాడు బోయపాటి. చదవండి: దేవిశ్రీ ఫిక్స్.. ప్రకటించిన క్రేజీ డైరెక్టర్ శుభశ్రీ జీ.. మీరు ఎంతో మందికి స్పూర్తి: చిరు -
‘నీ కన్ను నీలి సముద్రం’.. మరో రికార్డు
సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతమందించాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్ పోస్టర్తో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. కాగా ఈ చిత్రంలోని తొలి ప్రేమ పాట ‘నీ కన్ను నీలి సముద్రం నా మనసేమే అందుట్లో పడవ ప్రయాణం’ సోషల్ మీడియాలో సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రతీ ఒక్క ప్రేమజంటను మైమపరిపిస్తున్న ఈ సాంగ్ మరో రికార్డును అందుకుంది. తాజాగా ఈ వీడియో యూట్యూబ్లో 50 మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకుంది. అతితక్కువ సమయంలో 50 మిలియన్ వ్యూస్ సాధించిన పాటగా ‘నీ కన్ను నీలి సముద్రం’ రికార్డు సృష్టించింది. ఇక ప్రస్తుతం ఈ పాటకు ఉన్న క్రేజ్ బట్టి మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పాటకు శ్రీమణి అందించిన సాహిత్యం ఆకట్టుకోగా.. రక్వీబ్ ఆలమ్ హిందీ లిరిక్స్ మైమరిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉండగా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. చదవండి: శుభశ్రీ జీ.. మీరు ఎంతో మందికి స్పూర్తి: చిరు చైతూతో కలిసి సాహసయాత్రకు సమంత! -
దేవిశ్రీ ఫిక్స్.. పవన్ ఫ్యాన్స్కు పండగే
పవర్ స్టార్ పవన్ కల్యాణ్- రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన 'జల్సా, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాలు మ్యూజికల్గా ఎంత హిట్ సాదించాయే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంగీత అభిమానులతో పాటు టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా వీరి కాంబినేషన్లో మరో సినిమా రావాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన గబ్బర్ సింగ్ విడుదలై నిన్నటికి ఎనిమిదేళ్లు పూర్తయింది. ఈ సందర్బంగా ఆనాటి మధురస్మ్రుతులను గుర్తు చేసుకుంటూ డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ ఆసక్తకిరమైన ట్వీట్ చేశాడు. అంతేకాకుండా తన తరువాతి సినిమాకు సంబంధించిన అప్డేట్ను కూడా అభిమానులతో పంచుకున్నాడు. గద్దలకొండ గణేష్తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న హరీష్ శంకర్.. పవర్స్టార్తో ఓ చిత్రం చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిచనున్నాడు. ఈ విషయాన్ని డైరెక్టర్ హరీష్ స్వయంగా ప్రకటించాడు. తను దర్శకత్వం వహించబోతున్న పవన్ 28వ చిత్రానికి దేవిశ్రీనే మ్యూజిక్ అందించనున్నాడని ఈ క్రేజీ డైరెక్టర్ ప్రకటించాడు. దీంతో హరీష్-పవన్-దేవిశ్రీ కాంబినేషన్లో రాబోయే చిత్రం గబ్బర్ సింగ్కు మించి ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ప్రస్తుతం పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రం తర్వాత క్రిష్ డైరెక్షన్లో విరూపాక్ష (ప్రచారంలో ఉన్న టైటిల్) చేయనున్న విషయం తెలిసిందే. ఇక దర్శకుడు హరీష్ ప్రస్తుతం పవన్ సినిమా కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ను సిద్దం చేస్తున్నాడు. It is a wonderful day. As enrgetic as the release day 8 years ago. What better day to announce that we are coming back together to recreate the same musical energy again. @ThisisDSP will be scoring music for #PSPK28. We are coming again Ippude modalaindi.... pic.twitter.com/hXTA0cPDXW — Harish Shankar .S (@harish2you) May 11, 2020 చదవండి: దిల్ వాకిట్లో తేజస్విని కాబోయే తల్లికి శుభాకాంక్షలు! -
అమ్మకి అమ్లెట్ వేసిన డీఎస్పీ..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం టాలీవుడ్లో ‘బి ది రియల్ మ్యాన్’ చాలెంజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఇంటి పనుల్లో ఆడవాళ్లకు సాయం చేయడం ద్వారా ఈ చాలెంజ్ను విజయవంతంగా పూర్తిచేశారు. తాజాగా దర్శకుడు సుకుమార్ నుంచి ఈ చాలెంజ్ను స్వీకరించిన.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇంటి పనుల్లో తన తల్లికి సాయం అందించాడు. ఇంటిని శుభ్రం చేయడంతో పాటుగా తన తల్లికి అమ్లెట్ వేసి పెట్టాడు. అంతేకాకుండా ప్లేట్ కూడా శుభ్రం చేశాడు. చివరిగా తన తండ్రి ఫొటో వద్ద నివాళులర్పించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన డీఎస్పీ.. మనల్ని రియల్ మ్యాన్గా తయారు చేస్తున్న ప్రతి ఒక్క తల్లికి దీనిని అంకితం ఇస్తున్నట్టుగా చెప్పారు. అలాగే ఈ చాలెంజ్ను ముందకు తీసుకెళ్లాల్సిందిగా హీరోలు అల్లు అర్జున్, యష్, కార్తి, దర్శకుడు హరీష్ శంకర్, మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ను డీఎస్పీ కోరారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి, దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, సందీప్రెడ్డి వంగల మాదిరి వినోదాన్ని జోడించే ప్రయత్నం చేశానని చెప్పారు. ఈ వీడియోలో తొలుత బి ది రియల్ మ్యాన్ చాలెంజ్ చేసిన సినీ ప్రముఖల క్లిప్స్ చూపించారు. చదవండి : జ్యోతిక వ్యాఖ్యలను సమర్థించిన సూర్య.. -
‘ఈ పాటను ప్రేమతో నింపేయండి సర్’
మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. దర్శకుడు సుకుమార్ దగ్గర అసోసియేట్గా పని చేసిన బుచ్చిబాబు సానా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కథానాయికగా కృతీ శెట్టి నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లను చిత్ర బృందం అప్పుడే ప్రారంభించింది. ఇందులో భాగంగా సినిమాలోని తొలి పాటను సోమవారం సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ చిన్న వీడియోను కూడా రిలీజ్ చేసింది. 60 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో సముద్రపు ఒడ్డును సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్తో దర్శకుడు బుచ్చిబాబు మ్యూజిక్ సిట్టింగ్ చేశారు. ‘హీరో దర్గా దగ్గర ఫస్ట్ టైమ్ హీరోయిన్ను చూస్తాడు. చూసి ఆ దేవుడికి పెట్టే దండం.. అదే దండం ఈ అమ్మాయికి పెడతాడు. అప్పుడు దర్గానుంచి వచ్చే కవాలి మ్యూజిక్తో మంచి సాంగ్ ఇవ్వండి. ఈ పాటను ప్రేమతో నింపేయండి సర్’అంటూ డైరెక్టర్ రాక్స్టార్ను కోరతాడు. ‘ప్రేమ ఒక సముద్రం.. అందులో వాడిదొ పడవ ప్రయాణం అనే చిన్న ఐడియా వచ్చింది సర్’ అంటూ ‘నీ కన్ను నీలి సముద్రం’ అనే సాంగ్ను దేవి అందుకుంటాడు. లిరిక్స్, ట్యూన్ నచ్చడంతో ఈ పాటకు డైరెక్టర్ ఓకే చెప్పేస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో ఆసక్తికరంగా ఉండటంతో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇక అలా.. అలల మధ్య పుట్టిన ప్రేమ పాటను దేవి ఏ రేంజ్లో కంపోజ్ చేశాడో తెలియాలంటే రేపటివరకు వేచిచూడాలి. చదవండి: ఈ వారం మాకెంతో స్పెషల్ మరో మర్చిపోలేని సంక్రాంతి.. అందరికీ థ్యాంక్స్ -
ట్రెండింగ్లోకి రాగానే వాళ్లే సారీ చెబుతారు
‘‘మనం చేస్తున్న ప్రతి పనికీ అవార్డు వస్తుందన్న గ్యారంటీ లేదు. అలా అని వస్తేనే గొప్ప అనడం లేదు. అవార్డుల విషయంలో నా దృష్టిలో రెండు కోణాలు ఉన్నాయి. మన పని బయటకు వచ్చి ప్రేక్షకులందరికీ నచ్చినప్పుడు దాన్ని మించిన అవార్డు లేదు. అలాగే మన పనిని ఒకరు గుర్తించి పిలిచి అవార్డు ఇస్తున్నప్పడు దాన్నొక గొప్ప గౌరవంగా నేను భావిస్తాను. ఈ గౌరవం నా బాధ్యతను పెంచుతుంది’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయిక. ‘దిల్’ రాజు సమర్పణలో అనిల్ సుంకర, మహేశ్బాబు నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ చెప్పిన విశేషాలు.. ► మహేశ్బాబుగారితో నేను ఐదు (1: నేనొక్కడినే (2014), శ్రీమంతుడు (2015), భరత్ అనే నేను (2018), మహర్షి (2019), సరిలేరు నీకెవ్వరు (2020)) సినిమాలు చేశాను. చాలా సంతోషంగా ఉంది. నేనే కాదు...మహేశ్గారితో పని చేసిన ఎవరైనా ఆయనతో మళ్లీ మళ్లీ చేయాలనుకుంటారు. మహేశ్గారితో సినిమాలు చేసిన దర్శకులందరితో నేను పని చేయడం వల్ల ఈ విషయం నాకు తెలిసింది. ఆయన డైరెక్టర్స్ యాక్టర్. ఒక్కసారి కథ విని, ఆయన ఓకే అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా అండగా ఉంటారు. అంతపెద్ద స్టార్ మనపై నమ్మకం ఉంచినప్పుడు మనకు తెలియకుండానే మన పనిపై మనకు గౌరవం పెరుగుతుంది. మహేశ్ గారిది చిన్నపిల్లల మనస్తత్వం. ఏదైనా పాట లేదా సన్నివేశం నచ్చినప్పడు చాలా ఎగై్జటింగ్గా ఉంటారు. ఆ ఎగై్జట్మెంట్ వచ్చినప్పుడు ఆయన్ను పట్టుకో వడం కష్టం. ఆ లక్షణం చిరంజీవిగారిలోనూ చూశాను. ► ఇదివరకు మహేశ్గారికి నేను సంగీతం అందించిన సినిమాల్లో ఎక్కువగా ఆయన సందేశంతో కూడుకున్న బాధ్యతాయుతమైన పాత్రలు చేశారు. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో వాణిజ్య అంశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో మంచి మాస్ సాంగ్స్ ఇస్తానని ఈ సినిమా ప్రారంభోత్సవం రోజున మహేశ్ అభిమానులకు ప్రామిస్ చేశాను. అన్నట్లుగానే మంచి పాటలు కుదిరాయి. ఈ సినిమాకే కాదు..దాదాపు నేను చేసిన అన్ని సినిమాలకు మొదటి సిట్టింగ్స్లోనే ట్యూన్స్ ఫైనలైజ్ అయ్యాయి. ఈ విషయంలో నేను కాస్త లక్కీ. ► అనిల్ రావిపూడిగారి ‘ఎఫ్ 2’ సినిమాకు నేను సంగీతం అందించాను. చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. భవిష్యత్లో మంచి స్థాయికి వెళతాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ కథను మొదట నాకు అనిల్ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. కథ విన్నప్పుడే ఈ సినిమా పాటల గురించి ఆలోచించుకున్నాను. ఎందుకంటే కథ ప్రకారం నేను పాటలు ఇవ్వడానికి ఇష్టపడతాను. అలాగే ఇస్తూ వస్తున్నాను. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కూడా సందర్భానుసారంగానే పాటలు వస్తాయి. ఈ సినిమాలోని సైనికుల యాంథమ్ సాంగ్కు నేను లిరిక్స్ రాశాను. సైనికులంటే నాకు విపరీతమైన అభిమానం. వారికి నివాళిగా ఉండాలని ఈ సాంగ్ చేశాం. మహేశ్గారు కూడా మెచ్చుకున్నారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ‘సూర్యుడివో..చంద్రుడివో’, ‘డాంగ్ డాంగ్’ పాటలకు కూడా మంచి స్పందన లభించింది. అందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్. ఇక ‘మైండ్బ్లాక్’ సాంగ్లో మహేశ్గారి డ్యాన్స్ సూపర్బ్. ఆయన డ్యాన్స్ చూసి మేమందరం షాకయ్యాం. మహేశ్గారి కామెడీ టైమింగ్ బాగుంటుంది. అప్పుడప్పుడు ఆయన సరదాగా వెటకారంగా మాట్లాడుతుంటారు. ‘మైండ్ బ్లాక్’ సాంగ్లో అలా మహేశ్ వాయిస్ పెట్టాం. ► విజయశాంతిగారితో మా నాన్నగారు (రచయిత సత్యమూర్తి) పనిచేశారు. ఇప్పుడు నేను ఆమెతో ఈ సినిమాకు పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో మహేశ్, విజయశాంతిగార్ల మధ్య సన్నివేశాలు భలేగా ఉంటాయి. అలాగే మహేశ్, ప్రకాష్రాజ్గార్ల సన్నివేశాలు కూడా ప్రేక్షకులను అలరిస్తాయి. ► నా పాటలు బాగున్నాయో లేదో నా టీమ్ని నిర్మొహమాటంగా చెప్పమంటాను. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటోంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే నా పాటలపై నిజాయతీగా చెప్పేవారి అభిప్రాయాలను గౌరవిస్తాను. ఏవైనా పొరపాట్లు ఉంటే మళ్లీ జరగకుండా జాగ్రత్తపడతా. ఈ సందర్భంగా ఓ విషయం చెబుతాను.‘బాహుబలి’ సినిమా నా అంచనాల తగ్గట్లు లేదు’ అని నాతో ఎవరో అన్నారు. ఆ తర్వాత ‘బాహుబలి’ ఎక్కడికి వెళ్లింది? అంటే కొందరు భారీ అంచనాలు పెట్టుకుంటారు. మొదట్లో కాస్త నిరుత్సాహపడతారు. కాస్త ట్రెండింగ్లోకి రాగానే ఆ తర్వాత వాళ్లే సారీ చెబుతారు. ► సంగీతంపై నాకున్న ప్రేమవల్ల హీరోగా చేయలేకపోతున్నానేమో. తమిళ, తెలుగు భాషల్లో ఓ ద్విభాషా చిత్రం చేద్దామనుకుంటున్నా. ∙‘ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్, నా కాంబినేషన్లో మరో సినిమా వస్తుంది. ఈ చిత్రానికి 3 పాటలు కంపోజ్ చేశా. ‘గుడ్లుక్ సఖి’, ‘రంగ్ దే’, ‘ఉప్పెన’ చిత్రాలకు మ్యూజిక్ అందించబోతున్నాను. ఓ హిందీ సినిమా చేయబోతున్నా. -
‘డీజే దించుతాం.. సౌండ్ పెంచుతాం’
దేవిశ్రీ ప్రసాద్ అదిరే బీట్ ఇవ్వగా.. రామజోగయ్యశాస్త్రి పార్టీ సాంగ్కు కావాల్సిన లిరిక్స్ అందించగా.. నకాష్ అజీజ్, లవిత లోబో సూపర్ ఎనర్జీతో పాటను ఆలపించగా.. శేఖర్ మాస్టర్ కొత్త స్టెప్పులు కంపోజ్ చేయగా.. మహేశ్-తమన్నాలు అదిరిపోయే డ్యాన్స్లతో పిచ్చెక్కించారు. ఇది కదా అసలు సిసలు మహేశ్ బాబు ఫ్యాన్స్ కోరుకునేది. న్యూఇయర్ కానుకగా మహేశ్ ఫ్యాన్స్కు కావాల్సిన ఫుల్ ధూంధాం సాంగ్ వచ్చేసింది. ఇక డాంగ్ డాంగ్ పార్టీ సాంగ్తో బ్యాంగ్ బ్యాంగ్ అంటూ న్యూఇయర్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి రెడీ అవుతున్నారు సరిలేరు నీకెవ్వరు టీం. మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈచిత్రాన్ని రామబ్రహ్మం సుంకర, ‘దిల్’ రాజు, మహేశ్బాబులు నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలవుతున్న ఈ చిత్రంపై హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే విడుదలైన సినిమా పాటలు, టీజర్తో అంచనాలు పీక్స్కు తీసుకెళ్లాయి. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి చివరి లిరికల్ సాంగ్ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా.. తాజాగా ఫుల్ లిరికల్ సాంగ్ను కొద్దిసేపటి క్రితమే చిత్ర బృందం విడుదల చేసింది. ‘డీజే దించుతాం.. సౌండ్ పెంచుతాం’, ‘లెట్స్ పార్టీ విత్ దిస్ సాంగ్.. గుర్తుండిపోవాలి లైఫ్ లాంగ్’, ‘వాటే స్కిన్ టోను.. నచ్చావే గ్లామర్ క్వీన్.. నిన్ను చూసి దిల్ మె గిర్రుమంది రొమాంటిక్ టోను’, ‘నువ్వు పక్కనున్న కిక్కు చాలు అదే చంద్రయాను’ అంటూ పాటలో వచ్చే లిరిక్స్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పాటతో సంగీత అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. ఇక దాదాపు దశాబ్దం తర్వాత ఈ సినిమాతో లేడీ సూపర్స్టార్ విజయశాంతి రీఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. రాజేంద్రప్రసాద్, ప్రకాష్రాజ్, సంగీత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటోంది. మహేశ్ కూడా తన పాత్రకు డబ్బింగ్ చెప్పేశాడు. -
నెట్టింట్లో రచ్చరచ్చ.. దేవిశ్రీనా మజాకా!
దేవిశ్రీప్రసాద్ మరోసారి తన మ్యాజిక్ చూపించాడు. పార్టీ సాంగ్లకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే ఈ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తాజాగా మరోసారి తన మార్క్ పార్టీ సాంగ్తో దుమ్ములేపాడు. ఇప్పటివరకు ఎన్నో ఐటమ్, పార్టీ సాంగ్లను అందించిన దేవి తాజాగా ‘డాంగ్ డాంగ్’ సాంగ్తో ముఖ్యంగా యూత్ను ఉర్రూతలూగిస్తున్నాడు. టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. డిసెంబర్లో ప్రతి సోమవారం ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ ఇప్పటివరకు నాలుగు పాటలను రిలీజ్ చేసింది. చివరి పాటను రేపు(సోమవారం) విడుదల చేయనున్నారు. అయితే ఈ పాటకు సంబంధించిన చిన్న వీడియో ప్రోమోను శనివారం సాయంత్రం విడుదల చేశారు. ఈ వీడియోలో మహేశ్, తమన్నాల డ్యాన్స్ హైలెట్గా నిలిచింది. పాట ఎంత బాగుందో అంతకుమించి డ్యాన్స్ ఫార్మెషన్స్, మహేశ్-తమన్నాల స్టెప్పులు అదిరిపోయాయి. దీంతో ప్రస్తుతం ఆ చిన్న వీడియో ప్రోమో నెట్టింట్లో రచ్చరచ్చ చేస్తోంది. దేవిశ్రీ ఈజ్ బ్యాక్ అని కొందరు కామెంట్ చేస్తుండగా.. మహేశ్-తమన్నాలు స్టెప్పులు సూపర్బ్ అంటూ మరికొందరు పేర్కొంటున్నారు. ఈ ప్రోమో విడుదల సందర్భంగా అనిల్ రావిపూడి ఓ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సరిలేరు నీకెవ్వరు పాటలను ఇంత బాగా ఆదరించిన ప్రేక్షకులందరికీ మా కృతజ్ఞతలు. అలాగే దేవిశ్రీప్రసాద్కు నా స్పెషల్ థ్యాంక్స్. చాలా మంచి పాటలు ఇచ్చారు. ఈ నెలలో ప్రతీ సోమవారం ఒక్కొపాటతో మీ ముందుకు వచ్చాం. ప్రతీ పాటను మీరు అద్భుతంగా రిసీవ్ చేసుకుని, టిక్టాక్లలో వీడియోలు చేస్తూ ట్రెండ్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే గత సోమవారం వచ్చిన డిఫరెంట్ ఆంథమ్ సాంగ్ను కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ సోమవారం ఆల్బమ్లో చివరి పాటగా ఓ పార్టీ సాంగ్ రాబోతుంది. కొంతమంది సినీ స్టార్స్ను తీసుకెళ్లి, ఆర్మీతో ఇంట్రాక్ట్ చేయిస్తుంటారు. దానిని స్పూర్థిగా తీసుకుని ఈ సినిమాలో తమన్నా కూడా ఓ సినీ స్టార్గా వచ్చి ఆర్మీతో కలిసి సందడి చేస్తారు. ఇది కేవలం సరదా పాట మాత్రమే. ఐటమ్ సాంగ్ కాదు. ఈ పాట కూడా మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నా. ఈ ఏడాది సంక్రాంతికి ‘ఎఫ్2’ తో మంచి విజయాన్ని అందించారు. రాబోయే సంక్రాంతికి అంతే వినోదంతో మహేశ్బాబు సరికొత్త పాత్రతో అలరించబోతున్నారు’అంటూ అనిల్ రావిపూడి ఆ వీడియోలో పేర్కొన్నాడు. Director @AnilRavipudi about the blockbuster #MassMBMonday's and the power packed party song #DaangDaang 🤙🏼 Daang Daang Song Promo will be launched today at Visakha Utsav 🔥 Super⭐@urstrulyMahesh @AnilSunkara1 @ThisIsDSP @tamannaahspeaks @RathnaveluDop @ramjowrites pic.twitter.com/0ZR085gGbR — AK Entertainments (@AKentsOfficial) December 28, 2019 మహేశ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈచిత్రాన్ని రామబ్రహ్మం సుంకర, ‘దిల్’ రాజు, మహేశ్బాబులు నిర్మించారు. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్ పోస్టర్, టీజర్, పాటలతో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. దాదాపు దశాబ్దం తర్వాత ఈ సినిమాతో లేడీ సూపర్స్టార్ విజయశాంతి రీఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. రాజేంద్రప్రసాద్, ప్రకాష్రాజ్, సంగీత తదితరలు నటిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ పొడక్షన్స్ పనులు జరుపుకుంటోంది. మహేశ్ కూడా తన పాత్రకు డబ్బింగ్ చెప్పేశాడు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురాబోతుంది. చదవండి: జనవరి 5న కలుస్తానంటున్న రష్మిక సూపర్స్టార్ ఈవెంట్కు మెగాస్టార్ -
తమన్నా వచ్చేది ‘మైండ్ బ్లాక్’లో కాదు
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు హీరోగా క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుపుకుటుంది ఈ చిత్రం. అయితే మహేశ్ బాబు ఫ్యాన్స్కు న్యూఇయర్ కానుకగా ఓ సూపర్ గిప్ట్ ఇచ్చేందుకు చిత్ర బృందం భారీ ప్లాన్ చేస్తోంది. డిసెంబర్ 30(సోమవారం)న డాంగ్ డాంగ్ అంటూ సాగే పార్టీ సాంగ్ను విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా ఈ పార్టీ సాంగ్కు సంబంధించిన ప్రోమోను శనివారం సాయంత్రం 07:02 గంటలకు విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. కాగా, ఈ పాటలో మహేశ్తో కలిసి మిల్కీ బ్యూటీ తమన్నా డ్యాన్స్ చేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఇటీవలే ఈ పాట షూటింగ్ కూడా పూర్తయిందని టాక్. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’లో తమన్నా ఓ ఐటమ్ సాంగ్ చేయనుందని షూటింగ్ ప్రారంభంనుంచి వార్తలు వస్తున్నాయి. అయితే తొలుత విడుదలైన ‘మైండ్బ్లాక్’పాటనే తమన్నా నటించిన ఐటమ్ సాంగ్ అని అందరూ భావించారు. కానీ తాజాగా విడుదల చేసిన పోస్టర్ ప్రకారం తమన్నా నర్తించింది ఈ పాటలోనే అని స్పష్టమైంది. ఇక ‘పర్ఫెక్ట్ పెయిర్..పర్ఫెక్ట్ మూవీ..బ్లాస్ట్ మ్యూజిక్.. కంప్లీట్ విజువల్ ట్రీట్.. పండగ మూడ్రోజుల ముందే వస్తోంది’అంటూ రామజోగయ్య శాస్త్రి ట్వీట్ చేశారు. ఇప్పటికే విడుదలైన పాటలతో దేవిశ్రీ ప్రసాద్ తన మార్క్ చూపించుకోగా.. తాజాగా పార్టీ సాంగ్తో సంగీత శ్రోతలను ఉర్రూతలూగించేందుకు సిద్దమయ్యాడు. గత సోమవారం విడుదలైన ‘హీ ఈజ్ సో క్యూట్’నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలోని 5 పాటలను వారానికి ఒకటి చొప్పున 5 సోమవారాలు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. రామబ్రహ్మం సుంకర, ‘దిల్’ రాజు, మహేశ్బాబు నిర్మించిన ఈ చిత్రంలో విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. చదవండి: అమితాబ్ ఫస్ట్.. టాప్-10లో మహేష్ మన దగ్గర బేరాల్లేవమ్మా...: మహేశ్ THE.....PARTY SONG DAANG DAANG ...promo Today 7:02pm 🔥🔥🔥🔥 The perfect pair..perfect moves..blast music..complete visual treat👍 పండగ మూడ్రోజులు ముందే వస్తాంది 💕 Super⭐@urstrulyMahesh @AnilRavipudi @AnilSunkara1 @SVC_official @ThisIsDSP @tamannaahspeaks @RathnaveluDop pic.twitter.com/BalmFuBrhi — Ramajogaiah Sastry (@ramjowrites) December 28, 2019 -
సైనికుడు గర్వపడేలా ‘సరిలేరు నీకెవ్వరు’ ఆంథమ్
-
సైనికుడు గర్వపడేలా ‘సరిలేరు నీకెవ్వరు’ ఆంథమ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్ సాంగ్ను సోమవారం సాయంత్రం విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలోని 5 పాటలను వారానికి ఒకటి చొప్పున 5 సోమవారాలు రిలీజ్ చేస్తామని ప్రకటించిన చిత్ర యూనిట్.. గత మూడు సోమవారాలు మూడు పాటలను విడుదల చేసింది. ఇప్పుడు అదే బాటలో మళ్ళీ ఈ సోమవారం (డిసెంబర్ 23) మరో పాటను ప్రేక్షకుల ముందుంచారు. సరిలేరు నీకెవ్వరు ఆంథమ్గా విడుదలైన ఈ పాట ఆర్మీ జవానుల గొప్పతనాన్ని చాటిచెప్పే విధంగా ఉంది. సైనికుల విలువలను గుర్తు చేస్తూ రూపొందించిన ఈ పాట ప్రతి ఒక్కరి మనసును కదిలించేదిగా ఉంది. ‘భగభగ మండే నిప్పుల వర్షం వచ్చినా.. జనగణమన అంటునే దూకేవాడె సైనికుడు’ అంటు సాగే ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ లిరిక్స్ అందించగా, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఆలపించారు. ఈ పాట కోసం దేవిశ్రీ ప్రసాద్ యూరప్ వెళ్లి అక్కడి కళాకారులతో కంపోజ్ చేశాడు. ఎంతో అత్యద్భుతంగా సాగిన ఈ పాట యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిత్రంలో రష్మిక మండన్నకథానాయికగా నటించగా, లేడీ సూపర్స్టార్ విజయశాంతి, ప్రకాష్ రాజ్,రాజేంద్ర ప్రసాద్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. దేవీ శ్రీ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది. -
‘సరిలేరు నీకెవ్వరు’మూడో పాట వచ్చేసింది
-
దేవిశ్రీని వెంటాడుతున్న సామజవరగమన..
హైదరాబాద్: సంక్రాంతికి భారీ సినిమాలుగా ధియేటర్లపైకి దండెత్తనున్న అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరూ దాదాపు ఒకే సమయంలో విడుదలవుతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. బన్నీ, ప్రిన్స్లు సంక్రాంతి సమరంలో తలపడటంతో రెండు సినిమాలు ప్రేక్షకాభిమానులను అలరించేందుకు మేకర్లు శ్రమిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నిర్ధేశకత్వంలో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సామజవరగమన, రాములో రాములా అభిమానులు, ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. అల వైకుంఠపురములోకు ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా సెప్టెంబర్ 27న తొలి పాటగా సామజవరగమనను విడుదల చేయగా 7.7 కోట్ల వ్యూస్ రాబట్టి బెస్ట్ మెలడీగా నిలిచింది. ఇక మరో నెల రోజుల తర్వాత దీపావళి కానుకగా అక్టోబర్ 27న రాములో రాములా పాటను చిత్ర బృందం విడుదల చేయగా యూట్యూబ్లో ఇప్పటికే 4.3 కోట్ల వ్యూస్ వచ్చాయి. రెండు పాటలు ప్రేక్షకాదరణను పొందడం సరిలేరు నీకెవ్వరు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్పై ఒత్తిడి పెంచుతోంది. అల వైకుంఠపురములో పాటలను మించి క్యాచీ ట్యూన్స్ను ఇచ్చేందుకు దేవి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని చెబుతున్నారు. కనీసం రెండు హిట్ పాటలైనా ఇవ్వాలని చిత్ర బృందం దేవిశ్రీని కోరుతున్నట్టు తెలిసింది. ఇక దేవిశ్రీ ఇప్పటికే సామజవరగమనకకు దీటైన మెలొడీని కంపోజ్ చేశారని సరిలేరు..బృందం త్వరలోనే దీన్ని ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. మరి ఈ పాట సామజవరగమన, రాములో రాములా సృష్టించిన మేనియాను తిరగరాస్తుందా అన్నది వేచిచూడాలి. -
అమ్మడు..కాపీ కొట్టుడు!
‘చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది..’అని ‘హౌస్ఫుల్ 4’ చిత్రం ట్రైలర్ మొదలవుతుంది. అక్షయ్ కుమార్, పూజా హెగ్డే, రితేశ్ దేశ్ముఖ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘హౌస్ఫుల్ 4’. పునర్జన్మల ఆధారంగా ఈ చిత్రకథ నడుస్తుంది. ట్రైలర్లో పునర్జన్మలను గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి లీడ్ క్యారెక్టర్స్. కానీ ఈ ట్రైలర్ చూసే సమయంలో తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది మాత్రం దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు..’ ట్యూన్. ‘హౌస్ఫుల్ 4’ ట్రైలర్లో వాడిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ‘ఖైదీ నంబర్ 150’లో పాపులర్ అయిన మాస్ సాంగ్ ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు..’కు దగ్గర పోలిక ఉందని విన్నవారు అంటున్నారు. మరి పర్మిషన్ లేకుండా ట్యూన్ని పునరావృతం చేయడం ఏంటి? ‘అమ్మడు.. కాపీ కొట్టుడు’ అంటూ నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు. -
మాటంటే పడడురా
విజయ్ ఆంటోనీ నటిస్తూ, సంగీతం అందిస్తున్న చిత్రం ‘రోషగాడు’. ఇందులో ఆయన పవర్ఫుల్ పోలీసాఫీసర్గా కనిపించనున్నారు. నివేథా పేతురాజ్ కథానాయిక. ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు గణేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘రోషగాడు రా.. వీడు మాటంటే పడడురా’ అంటూ సాగే థీమ్ సాంగ్ను ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ రిలీజ్ చేశారు. ‘‘కంటెంట్కు ప్రాధాన్యం ఇస్తూ పక్కా కమర్షియల్ చిత్రం తెరకెక్కిస్తున్నాం. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి మాటలు–పాటలు: భాష్యశ్రీ. -
‘తారక్ భయ్యా.. మీకు తోడుగా ఉన్నాం’
‘డల్లాస్ కన్సర్ట్ను నందమూరి హరికృష్ణ గారికి అంకితం ఇస్తున్నానంటూ’ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.. హరికృష్ణకు నివాళులు అర్పించారు. హరికృష్ణ ఆకస్మిక మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన డీఎస్పీ... ఆయనతో గతంలో తాను దిగిన ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు. ‘కొన్ని నెలల క్రితం ఆయనతో ఫొటో తీసుకున్నాను. ఎంతో ఆత్మీయత కలిగిన వ్యక్తి ఆయన. మీ ఆత్మకు శాంతి చేకూరాలి సర్. తారక్ భయ్యా, కల్యాణ్రామ్ గారు మేమంతా మీకు తోడుగా ఉన్నాం. స్వర్గం నుంచి హరికృష్ణ గారు మనల్ని దీవిస్తూనే ఉంటారు. డల్లాస్ కన్సర్ట్ను ఆయనకు అంకితం చేస్తున్నానంటూ’ దేవిశ్రీ ట్వీట్ చేశారు. కాగా నల్గొండ జిల్లాలో అన్నేపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. కుమారులు నందమూరి కల్యాణ్రాం, జూనియర్ ఎన్టీఆర్లు హరికృష్ణకు అంతిమ సంస్కారాలు నిర్వర్తించారు. Took dis pic a few months bak..Such a loving & warm Human.. We wl miss U sir❤️ May ur soul R.I.P🙏🏻💐 Dear @tarak9999 brother and @NANDAMURIKALYAN garu,we r always with U and HE wil always be watching over you Dedicating DALLAS CONCERT to Sri NANDAMURI HARIKRISHNA garu🙏🏻 pic.twitter.com/L8KyP3KNJN — DEVI SRI PRASAD (@ThisIsDSP) August 29, 2018 Jst cant believe d news of Sri HariKrishna Garu..Heart Breaking.. Such a Dear person 2 my Father and Me🙏🏻🙏🏻 And d Sweetest & Most Humble Soul..May God bless his soul & give strength 2 d family of my Dear brother @tarak9999 @NANDAMURIKALYAN garu.. May his soul R.I.P🙏🏻💐❤️ — DEVI SRI PRASAD (@ThisIsDSP) August 29, 2018 -
‘భరత్ అనే నేను’ ట్రైలర్ వచ్చేసింది
-
ఎట్టకేలకు ఒకడొచ్చాడబ్బా..
ఎల్బీ స్టేడియంలో ‘భరత్’ బహిరంగ సభ శనివారం సాయంత్రం గ్రాండ్గా జరిగింది. అభిమానుల ఎంతగానో ఎదురుచూస్తున్నా ‘భరత్ అనే నేను’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్లో హీరో మహేశ్ బాబు చాలా స్టైలిస్గా కనిపించారు. ‘తప్పు జరిగితే కొంచెం కఠినంగా ఉండి కరెక్టు చేయడానికి ట్రై చేస్తే మీకు రాచరికం, రాజులు గుర్తు వచ్చారు.. కానీ నాకు మాత్రం చిన్నప్పుడు తప్పు చేస్తే దండించే మా అమ్మా, నాన్న గుర్తు వచ్చారని’ మహేశ్ వాయిస్తో ట్రైలర్ ప్రారంభమౌతుంది. భరత్ అనే నేను అనే థీమ్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్లో ఎంతగానో ఆకట్టుకుంది. ఎట్టకేలకు ఒక్కడొచ్చాడబ్బా అని రావు రమేశ్ చెప్పే డైలాగ్ చాలా పవర్ ఫుల్గా ఉంది. రాజకీయ నాయకుడు అనుకున్నా.. నాయకుడు అనే డైలాగ్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. అంతేకాక దేవరాజ్ చెప్పిన.. మీరు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని.. మేము అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్నీ అదుకోవడం అగ్రిమెంట్ అని చెప్పడం చాలా పవర్ ఫుల్గా అనిపించింది. త్వరలోనే మీ అందర్ని మాట మీద నిలబడే మొగాల్ని చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే డైలాగ్ మహేశ్ అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 20వ తేదీన విడుదల అవుతోంది. -
వినగానే నచ్చేసింది – దేవిశ్రీ
ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ వద్ద అసిస్టెంట్గా పనిచేసిన కొవెర దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘యు’. ‘కథే హీరో’ అన్నది ఉపశీర్షిక. కొవెర, హిమాన్షి కాంట్రగడ్డ జంటగా విజయలక్ష్మి కొండా నిర్మించిన ఈ చిత్రంలోని తొలి పాటను మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేశారు. అనంతరం దేవిశ్రీ మాట్లాడుతూ– ‘‘ఈ పాట చాలా ఆహ్లాదంగా ఉంది. వినగానే నచ్చేసింది. ఈ సినిమాలోని అన్ని పాటలు మంచి హిట్ అయి మ్యూజిక్ డైరెక్టర్ సత్య మహావీర్కి మంచి పేరు రావాలి. సినిమా కూడా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. దర్శకుడు కొవెర మాట్లాడుతూ– ‘‘ సత్య మహావీర్ మంచి సంగీతం అందించి, సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. మిగిలిన పాటలని, సినిమా త్వరలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. సంగీత దర్శకుడు సత్య మహావీర్, స్క్రీన్ ప్లే రచయిత మధు పాల్గొన్నారు. ఈ సినిమాకి కెమెరా: రాకేశ్ గౌడ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: శివ నాగశివ గణపర్తి, మూర్తినాయుడు పాదం, సమర్పణ: నాగానిక. ∙కొవెర, దేవిశ్రీ ప్రసాద్ -
పదం పలికింది – పాట నిలిచింది
ప్రియురాలి గురించి ఎందరు ఎన్నిసార్లు వర్ణించినా అది తియ్యగానే ఉంటుంది. ఒక మామూలు మగవాడిని సైతం కవిగా మలుస్తుంది కదా ప్రేయసి! మరి ఆమెను వర్ణించే ప్రయత్నంలో అతడు కవిత్వం రాయకా తప్పదు; అతిశయాలకు పోకా తప్పదు. 2006లో వచ్చిన ‘బొమ్మరిల్లు’ చిత్రంలోని ‘అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి’ పాటలోని ఈ పాదాలు దీనికి సాక్ష్యమిస్తాయి. ‘తీపి కన్నా ఇంకా తీయనైన తేనె ఏది అంటే/ వెంటనే నీ పేరని అంటానే హాయి కన్నా ఎంతో హాయిదైన చోటే ఏమిటంటే/ నువ్వు వెళ్లే దారని అంటానే నీలాల ఆకాశం ఆ నీలం ఏదంటే/ నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే’ ఈ పాటకు క్రెడిట్ కులశేఖర్/ అనంత శ్రీరామ్ అని ఇద్దరి పేర్లూ వున్నప్పటికీ, ఈ వెర్షన్ రాసింది మాత్రం తానేనని అనంత శ్రీరామ్ స్వయంగా వెల్లడించారు. అప్పటికి ఆయన పరిశ్రమకు కొత్త కావడం, అప్పటికే కులశేఖర్కు నిర్మాత దిల్ రాజు డబ్బులు చెల్లించి ఉండటంతో మార్కెట్ దృష్ట్యా ఇద్దరి పేర్లూ వేశారట. ‘అది దిల్ రాజు గారి విశాల హృదయానికి చిహ్నం’ అంటారు అనంత శ్రీరామ్. ‘అపుడో ఇపుడో ఎపుడో’ లైన్ ఇచ్చింది మాత్రం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. పాడింది సినిమాలో నాయకుడు కూడా అయిన సిద్ధార్థ. -
ముఖ్యమంత్రి ఎవరు?
వాయుతనయ్, శశి, దేవి ప్రసాద్ ముఖ్య తారలుగా పొలిటికల్ నేపథ్యంలో రూపొందనున్న చిత్రం ‘నేనే ముఖ్యమంత్రి’. మోహన్ రావిపాటి దర్శకత్వంలో ఆలూరి సాంబశివరావు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరా బాద్లో ప్రారంభమైంది. దర్శకుడు ఎన్.శంకర్ కెమెరా స్విచాన్ చేయగా, నటి జీవితారాజశేఖర్ క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి ‘తమ్ముడు’ సత్యం గౌరవ దర్శకత్వం వహించారు. మోహన్ రావిపాటి మాట్లాడుతూ–‘‘సమకాలీన అంశాలతో పొలిటికల్ డ్రామాగా రూపొందనున్న చిత్రమిది. మొత్తం 40 రోజుల్లో సినిమా పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘ప్రస్తుత రాజకీయ పరిస్థితులను మా సినిమా ద్వారా చూపిస్తున్నాం. ఎవరినీ కించపరిచేలా సినిమా ఉండదు. పబ్లిక్ పాయింటాఫ్ వ్యూని కూడా సినిమాలో చర్చిస్తున్నాం. వరుసగా సామాజిక, కుటుంబ కథా చిత్రాలు చేయాలన్న సంకల్పంతో ఉన్నాం’’ అన్నారు ఆలూరి సాంబశివరావు. వాయు తనయ్, దేవి ప్రసాద్, శశి, సంగీత దర్శకుడు ఫణి కల్యాణ్, నటి సుచిత్ర పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కమలాకర్. -
ఈ సినిమాను 13 మంది హీరోయిన్లు రిజెక్ట్ చేశారు!
‘‘మా సినిమా టీజర్, ట్రైలర్ చూసినోళ్లు... ‘శవాన్ని రేప్ చేయడం ఏంటి? ఇదొక వల్గర్ సిన్మా’ అన్నారు. సినిమా చూస్తే... ఎక్కడా వల్గారిటీ కనపడదు. మాది యూత్ సినిమానే... బూతు సినిమా కాదు’’ అన్నారు ధనరాజ్. శ్రీ కిశోర్ దర్శకత్వంలో డి. వెంకటేశ్, ఆర్వీ రాజు, ఆక్రోశ్ నిర్మించిన సినిమా ‘దేవిశ్రీ ప్రసాద్’. పూజా రామచంద్రన్, భూపాల్, ధనరాజ్, మనోజ్ నందం ముఖ్య తారలు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా గురించి ధనరాజ్ మాట్లాడుతూ– ‘‘ఇందులో మార్చురీ వ్యాన్ డ్రైవర్ ‘శ్రీ’ పాత్రలో నటించాను. ధనరాజ్ ఏ పాత్ర అయినా చేయగలడనే మంచి పేరొస్తుంది. ఈ సినిమా కథంతా ఆరు పాత్రల చుట్టూ తిరుగుతుంది. నటి లీలా రామచంద్రన్ పాత్రలో పూజారామచంద్రన్, దేవిగా భూపాల్, ప్రసాద్గా మనోజ్ నందం, ప్రధాన పాత్రలు చేశారు. పూజ కంటే ముందు 13 మంది హీరోయిన్లకు ఈ కథ చెబితే... రిజెక్ట్ చేశారు. మీ సినిమాలో నటించం అని చెప్పారు. పర్ఫెక్ట్ ప్లానింగ్తో, తక్కువ బడ్జెట్తో 20 రోజుల్లో సినిమా తీశాం. ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నా. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్గారి పేరుని టైటిల్గా పెట్టినప్పటికీ... ఆ పేరుని మిస్ యూజ్ చేయలేదు’’ అన్నారు. -
ఇది గిటార్ థెరపీ!
ఫిజియోథెరపీ, సెల్ థెరపీ, హార్మోన్ థెరపీ... ఇలా రకరకాల థెరపీలు విన్నాం కానీ.. ఈ గిటార్ థెరపీ ఏంటి? అని ఆలోచిస్తున్నారా? ఇది పూజా హెగ్డే కనిపెట్టిన కొత్త థెరపీ. విషయం ఏంటంటే... ఈ బ్యూటీకి ఈ మధ్య గిటార్ నేర్చుకోవాలనిపించిందట. అనిపించాలే కానీ, నేర్చుకోవడం ఎంతసేపు. ఓ గిటార్ కొనుక్కున్నారు. తనతో పాటే షూటింగ్ లొకేషన్కి తీసుకెళుతున్నారు. షాట్ గ్యాప్లో గిటార్ నేర్చుకుంటున్నారు. ‘‘మ్యూజిక్ ఈజ్ నాట్ మ్యూజిక్.. ఇట్స్ ఎ థెరపీ’’ అని కూడా అన్నారు. కరెక్టే.. సంగీతం మనసుకు స్వాంతన చేకూర్చుతుంది. మైండ్ని రిలాక్స్ చేస్తుంది. అందుకే పూజా హెగ్డే ‘గిటార్ థెరపీ’ అని అన్నారు. తాను ప్లే చేస్తున్న మ్యూజిక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారామె. ‘‘మీరు ట్రై చేస్తున్న మ్యూజిక్ వినడానికి బాగుంది. మ్యూజిక్ మీ లైఫ్ని మోర్ బ్యూటిఫుల్గా ఛేంజ్ చేస్తుంది. త్వరలోనే గిటార్ను ఫుల్గా ప్లే చేస్తావని ఆశిస్తున్నాను’’ అని దేవీశ్రీ ప్రసాద్ రెస్పాండ్ అయ్యారు. ‘‘నేను గిటారు నేర్చుకోవాలని ట్రై చేస్తున్నప్పటి నుంచి మ్యూజిక్ డైరెక్టర్ల పట్ల గౌరవం మరింత పెరిగింది. చాలెంజింగ్గా స్టార్ట్ చేశాను. గిటారు నేర్చుకోవడం చాలా ఫన్గా ఉంది’’ అని ఆమె బుదులిచ్చారు. -
శవంతో సరసాలా?
బతికున్నవారితో సరదాలు.. సరసాలు సహజం. శవంతో సరసాలేంటి? కొందరు ప్రబుద్ధులంతే. శవమైనా తమ సరదాలు తీర్చుకోవడానికి వెనకాడరు. లీల అనే ఓ సినిమా ఆర్టిస్టు డెడ్బాడీని ఓసారి శవాలగదికి తీసుకొస్తారు. అక్కడ పనిచేసే ఒకడు తన ఇద్దరు స్నేహితులను ఆ గదికి తీసుకొచ్చి లీల శవాన్ని చూపిస్తాడు. వారిలో ఒకడు ఆమె శవంతో సరసాలు ఆడదామని మిగిలిన స్నేహితులనూ ఒప్పిస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అసలు లీల ఎలా చనిపోయింది? హత్య చేశారా? ఆత్మహత్య చేసుకుందా? ఈ విషయాలతో తెరకెక్కిన చిత్రం ‘దేవిశ్రీ ప్రసాద్’. పూజా రామచంద్రన్, భూపాల్ రాజు, ధనరాజ్, మనోజ్ నందం ప్రధాన పాత్రల్లో శ్రీకిషోర్ దర్శకత్వంలో డి.వెంకటేష్, ఆర్.వి.రాజు, ఆక్రోష్ నిర్మించారు. కమ్రాన్ స్వరపరచిన ఈ సినిమా పాటలను నటుడు శివ బాలాజీ, నిర్మాత మల్కాపురం శివకుమార్ విడుదల చేశారు. ‘‘ఈ సినిమా ఇంత బాగా రావడానికి ధనరాజ్ కారణం. ఈ కథ చాలామందికి చెప్పినా నచ్చలేదు. పూజా రామచంద్రన్కి నచ్చి, చేశారు’’ అన్నారు శ్రీకిషోర్. ‘‘మంచి సినిమా చేయాలనే ప్రయత్నంతో చేసిన చిత్రమిది. అభ్యంతరకర సన్నివేశాలుండవు’’ అన్నారు నిర్మాతలు. -
డి ఫర్ డెవిల్!
దేవిశ్రీ ప్రసాద్ అంటే తెలుగు ప్రేక్షకులకు సంగీత దర్శకుడు డీయస్పీ గుర్తొస్తారు. కానీ, ఇప్పుడాయన పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. అలాగని, ఇదేదో మ్యూజికల్ బేస్డ్ సిన్మా కాదు. డి ఫర్ డెవిల్, ఎస్ ఫర్ సస్పెన్స్లతో తెరకెక్కిన పి ఫర్ పక్కా హారర్ థ్రిల్లర్. పూజా రామచంద్రన్, మనోజ్ నందన్, భూపాల్ ముఖ్య తారలుగా శ్రీ కిశోర్ దర్శకత్వంలో ఆర్వీ రాజు, ఆక్రోశ్ నిర్మించిన థ్రిల్లర్ ‘దేవిశ్రీ ప్రసాద్’. ధనరాజ్ కీలక పాత్రధారి. అక్టోబర్లో సిన్మాను విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘వినోదంతో పాటు సందేశంతో రూపొందిన చిత్రమిది. దేవి, శ్రీ, ప్రసాద్... అనే ముగ్గురు నటులు, లీలా రామచంద్రన్ అనే నటి చుట్టూ కథ నడుస్తుంది. సిన్మాలో ప్రతి సీన్ ప్రేక్షకుల్ని థ్రిల్కు గురి చేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ రేకెత్తిస్తుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
కనువిందుగా వైశాఖం పాటలు – దేవిశ్రీ ప్రసాద్
హరీష్, అవంతిక జంటగా సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వైశాఖం’. జయ బి. దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై బి.ఎ. రాజు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. డీజే వసంత్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం దేవిశ్రీ మాట్లాడుతూ– ‘‘వైశాఖం’ పాటలు బాగా నచ్చాయి. కంగ్రాట్స్ టు వసంత్. ముఖ్యంగా పాటల పిక్చరైజేషన్ చాలా బాగా నచ్చింది.జయగారి టేకింగ్ బాగుంది. ఆడియో, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. రాజుగారు అందరికీ కావాల్సిన మనిషి. జయగారు మాకెంతో ఆత్మీయులు. ‘వైశాఖం’ ఆమె కెరీర్లో చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఏ భారతీయ చిత్రం షూట్ చెయ్యని కజకిస్తాన్లోని అరుదైన లొకేషన్స్లో పాటలు తీశారు. అలాంటి రేర్ లొకేషన్స్ని స్క్రీన్పై చూడడం చాలా సంతోషంగా అనిపించింది’’ అన్నారు. ‘‘ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ‘వైశాఖం’ పాటలు చూసి, మమ్మల్ని అభినందించిన దేవిశ్రీగారికి కృతజ్ఞతలు. ఈ వేసవిలోనే సినిమాను విడుదల చేయనున్నాం. దేవిశ్రీ చెప్పినట్టుగానే పాటలు, సినిమా పెద్ద హిట్ అవుతాయని ఆశిస్తున్నాం’’ అని బి.ఎ.రాజు అన్నారు. -
దేవిశ్రీ మ్యూజిషియన్ కాదు... మెజీషియన్!
‘‘డి.ఎస్.పి. (దేవిశ్రీ ప్రసాద్) అంటే... డెడికేషన్, స్ట్రాటజీ, పాపులారిటీ. ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేయాలనేది దేవిశ్రీకి బాగా తెలుసు. అతనో మ్యూజిషియన్ కాదు, మెజీషియన్’’ అన్నారు ప్రముఖ హీరో చిరంజీవి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ చేయనున్న మ్యూజిక్ టూర్ ప్రోమోను ఆదివారం చిరంజీవి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ – ‘‘ఈ టూర్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని దివ్యాంగుల కోసం తన తండ్రి సత్యమూర్తిగారి పేరిట స్థాపించిన ఫౌండేషన్కు ఇవ్వబోతున్నాడు. అందుకు దేవిశ్రీని అభినందిస్తున్నా’’ అన్నారు. ఈ టూర్లో టాప్ మ్యూజిషియన్స్, టాప్ డ్యాన్సర్స్ పాల్గొంటారని డి.ఎస్.పి. తెలిపారు. మే 27న సిడ్నీ, జూన్ 3న మెల్బోర్న్ (ఆస్ట్రేలియా), జూన్ 10న బ్రిస్బేన్, జూన్ 17న ఆక్లాండ్ (న్యూజిలాండ్) నగరాల్లో జరగనున్న ఈ టూర్ను కేకే ప్రొడక్షన్స్ ఆర్గనైజ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ‘జెమిని’ కిరణ్, ‘స్రవంతి’ రవికిశోర్, ‘దిల్’ రాజు, దర్శకుడు కల్యాణ్కృష్ణ, పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి తదితరులు పాల్గొన్నారు. -
‘సుందరి’ అంటూ వచ్చేసిన మెగాస్టార్
-
‘సుందరి’ అంటూ వచ్చేసిన మెగాస్టార్
హైదరాబాద్ : మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. క్రిస్మస్ కానుకగా మెగా అభిమానులు ఒకరోజు ముందే గిప్ట్ అందుకున్నారు. వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఖైదీ నంబర్ 150' మూవీలోని 'సుందరి' అంటూ సాగే మరో పాటను చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం విడుదల చేసింది. ఇప్పటికే ఆ పాటకు సంబంధించిన చిరు లుక్ను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నిన్న తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. పాట విడుదల చేసిన కొద్ది క్షణాల్లోనే లక్షకు పైగా వీక్షించారు. ఈ సినిమాలోని ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’ పాటకు అత్యథిక హిట్స్ వచ్చిన విషయం తెలిసిందే. యూ ట్యూబ్లో అప్ లోడ్ చేసిన ఈ ఆడియో సాంగ్ను మెగా అభిమానులు రికార్డు స్థాయిలో వీక్షించారు. ఈ పాటను రిలీజ్ చేసిన 24 గంటల్లోనే 20 లక్షల మందికి పైగా వీక్షించారని, ఇంత తక్కువ సమయంలో ఓ ఆడియో సాంగ్కు ఇన్ని లక్షల వ్యూస్ రావడం అరుదని లహరి మ్యూజిక్ ట్వీట్ చేయగా, దాన్ని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ రీ ట్వీట్ చేశాడు. తొమ్మిదేళ్లు విరామం తర్వాత అయినప్పటికీ అమ్మడు పాట ద్వారా బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్న చిరు తాజాగా సుందరీ అంటూ మళ్లీ దుమ్మరేపనున్నారని అభిమానులు సంబరపడుతున్నారు. మరి ‘సుందరి’ ‘అమ్మడు లెట్స్ కుమ్ముడు’ రికార్డులను బ్రేక్ చేసి సునామీ సృష్టిస్తుందేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి సంబంధించి మిగతా పాటలు ఆదివారం డైరెక్ట్గా మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. -
ఖైదీ నెంబర్ 150 పాట మేకింగ్ వీడియో
-
కుమ్మేస్తున్న చిరు ఖైదీ నెంబర్ 150 పాట
తొమ్మిదేళ్ల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైదీ నెంబర్ 150 సినిమాలోని పాట ఆన్లైన్లో దుమ్మురేపుతోంది. ఈ సినిమాలో అమ్మడూ.. లెట్స్ డు కుమ్ముడు అనే సాంగ్ టీజర్ను మూవీ యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. యూ ట్యూబ్లో అప్ లోడ్ చేసిన ఈ ఆడియో సాంగ్ను మెగా అభిమానులు రికార్డు స్థాయిలో వీక్షిస్తున్నారు. ఈ పాటను రిలీజ్ చేసిన 24 గంటల్లోనే 20 లక్షల మందికి పైగా వీక్షించారని, ఇంత తక్కువ సమయంలో ఓ ఆడియో సాంగ్కు ఇన్ని లక్షల వ్యూస్ రావడం అరుదని లహరి మ్యూజిక్ ట్వీట్ చేయగా, దాన్ని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ రీ ట్వీట్ చేశాడు. ఈ పాటను వీక్షించిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశాడు. ఆడియో సాంగ్తో పాటు మూవీ స్టిల్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవి రెడ్ షర్టు వేసుకుని, ఫ్యాంటుపై లుంగీ కట్టుకుని, కళ్లజోడు పెట్టుకుని మాస్ లుక్లో యంగ్గా కనిపించాడు. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించింది. మెగా పవర్ స్టార్ రామ్చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. Thank U everyone.. for loving #AMMADUletsdoKUMMUDU !! -
దుమ్మురేపుతున్న చిరు లేటెస్ట్ మూవీ సాంగ్
-
దుమ్మురేపుతున్న చిరు లేటెస్ట్ మూవీ సాంగ్
హైదరాబాద్: దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘ఖైదీ నంబర్ 150’. ఈ మూవీకి సంబంధించిన ఓ పాట ‘అమ్మడూ.. లెట్స్ డు కుమ్ముడు’ అనే సాంగ్ టీజర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. యూట్యూబ్లో అప్ లోడ్ ఇలా చేశారో లేదో అంతే.. మెగా అభిమానులు ఈ టీజర్ ను ఓ రేంజ్ లో వీక్షిస్తున్నారు. అందులోనూ మెగాస్టార్ మూవీ అంటే ఉన్న క్రేజ్ చెప్పనక్కర్లేదు. నిమిషానికి వేల వ్యూస్ తో రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఈ మూవీ దర్శకుడు వీవీ వినాయక్ చెప్పినట్లుగానే 'అమ్మడూ.. లెట్స్ డు కుమ్ముడు.. ఎర్రచీర ఈరోజే కొన్నాను' అనే సాంగ్ లిరిక్స్ టీజర్ విడుదలైంది. వీడియోలో లిరిక్స్ తో పాటు మూవీ స్టిల్స్ అభిమానులను ఉత్సాహ పరుస్తాయనడంలో సందేహమే లేదు. సాంగ్ కంపోజింగ్ పై మూవీ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశాడు. చిరంజీవిగారి మూవీకి మ్యూజిక్ ఇవ్వడం గౌరవంగా భావిస్తాను. కింగ్ ఆఫ్ మాస్ ఈజ్ బ్యాక్ టు రాక్ అని తన ట్వీట్ లో దేవీశ్రీ పేర్కొన్నాడు. ఈ ఏడాది మెగా ఫ్యామిలీ హీరోలు నటించిన ‘సరైనోడు’, ‘ధృవ’ సినిమాల పాటలను నేరుగా మార్కెట్లోకి విడుదల చేసి, తర్వాత ప్రీ–రిలీజ్ ఫంక్షన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 25న పాటలను నేరుగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. జనవరి మొదటి వారంలో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ చేయనున్నారు. చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్చరణ్ నిర్మిస్తున్నాడు. -
జ్యోత్స్నకు రూ.25 వేలు సాయం
రామచంద్రపురం : ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, దేవీశ్రీప్రసాద్ తండ్రి, రచయిత సత్యమూర్తి ఆశయసాధనలో ఏర్పాటు చేయబడిందే డోనర్స్ క్లబ్ అని క్లబ్ ప్రతినిధులు తాడాల సత్యనారాయణ, తొగరు మూర్తి అబ్బాయిరెడ్డి వెల్లడించారు. డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక కృత్తివెంటి పేర్రాజు పంతులు జాతీయోన్నత పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్, గాయకుడు సాగర్లు ముఖ్య అతిథులుగా విచ్ఛేశారు. ఈ సందర్భంగా మండలంలోని హస¯ŒSబాదకు చెందిన ఎముకల వ్యాధితో బాధపడుతున్న కొప్పిశెట్టి జ్యోత్స్నకు డోనర్స్ క్లబ్ ద్వారా రూ.25వేల నగదును వారు ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు చేతుల మీదుగా క్లబ్ ప్రతినిధులు అందించారు. జ్యోత్స్న సమస్యపై ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి క్లబ్ నిర్వాహకులు స్పందించారు. ఈ సందర్భంగా దేవీ శ్రీప్రసాద్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే తోట మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సత్యమూర్తిగా ఎదగాలన్నారు. అనంతరం కృత్తివెంటి పాఠశాల విద్యార్దులకు పెద్ద బాల శిక్ష పుస్తకాలను, బేతస్థ అంద వికలాంగులకు దుప్పట్లను వారు పంపిణీ చేశారు. యువత కోరిక మేరకు శంకర్దాదా జిందాబాద్ పాటపాడి ఉర్రూతలూగించారు. త్వరలో రాబోయే చిరంజీవి ఖైదీనంబర్ 150లోని రత్తమ్మ.... రత్తమ్మ అనే పాట అందరినీ అలరిస్తుందన్నారు. విస్సు మాస్టారు వ్యాఖ్యానంతో సాగిన ఈ కార్యక్రమంలో డోనర్స్ క్లబ్ సభ్యులు చందమామవాసు, రంజిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నాన్నకు థాంక్స్: దేవీ శ్రీ ప్రసాద్
'నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు మా నాన్న సత్యమూర్తి గారికి థాంక్స్' అని మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ అన్నారు. 'ప్రతి ఫంక్షన్కి మా నాన్నని తీసుకు వచ్చే వాడిని. మా సక్సెస్ని మా నాన్నగారు చూసేలా చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా థాంక్స్. సామాజిక మాధ్య మాల్లో నాన్న మరణించిన సమయంలో(ఫేస్ బుక్, ట్విట్టర్) సపోర్ట్ చేసి వారికి కృతజ్ఞతలు' అని నాన్నకు ప్రేమతో ఆడియో ఫంక్షన్లో దేవి శ్రీ ప్రసాద్ అన్నారు. నీ తోటి టెక్నిషియన్ వర్క్ను మనస్పూర్తిగా అప్రిషియేట్ చేయాలని మా నాన్న నాకు చెప్పిన మాటలే.. నన్ను ఈ రోజు ఈ స్థానంలో నిలిపేలా చేసిందన్నారు. ఈ చిత్రానికి 'నాన్నకు ప్రేమతో' టైటిల్ రావడం నా అదృష్టం. మైండ్ క్లియర్గా ఉంటేనే సక్సెస్ వస్తుంది. మా నాన్న హార్ట్ ప్రాబలమ్ ఉన్నా ఎప్పుడూ నవ్వుతూనే ఉండే వారు. నాన్న ఆస్పత్రిలో ఉన్నప్పుడూ, ఒక్క రోజు కూడా నన్ను ఆస్పత్రికి రానివ్వకుండా తమ్ముడు సాగర్, అమ్మ నాన్నను జాగ్రత్తగా చూసుకున్నారు. నా పాటలకు మీరు కొట్టే క్లాప్స్ విని మా నాన్న గారి కళ్లలో నీళ్లు వచ్చేవి. ఈ ఆడియో ఫంక్షన్ ని మానాన్నకి అంకితం చేయడం చాలా ఆనందంగా ఉంది అని దేవి అన్నారు. మొదటి సారి దేవి కళ్లలో నీళ్లు చూశా.. ఎప్పుడూ నవ్వుతూ అందరిని నవ్వించే దేవీ కళ్లలో నీళ్లని మొదటిసారి సత్యమూర్తిగారు మృతి చెందిన తర్వతే చూశాను అని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. ఈ సంఘటన తర్వాత మూడో రోజే తిరిగి తన పనిలో దేవీ నిమగ్నమయ్యారన్నారు. -
బాక్సాఫీస్ అంబరంలో... భావుక సుమగంధం
మూడుదశాబ్దాల కాలంలో 90 చిత్రాలకు కథ, స్క్రీన్ప్లే, మాటలందించిన భావుక రచనామూర్తి పెన్ను మూసింది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తండ్రి - ప్రముఖ సినీ రచయిత గొర్తి సత్యమూర్తి ఇక లేరు. శోభన్బాబు ‘దేవత’ నుంచి చిరంజీవి ‘అభిలాష’, ‘ఛాలెంజ్’, వెంకటేశ్ ‘చంటి’ దాకా ఎన్నో హిట్లిచ్చిన సత్యమూర్తి సోమవారం తెల్లవారుజామున చెన్నైలో అనారోగ్యంతో మరణించారు. ఇవాళ అంత్యక్రియలు రచయిత సత్యమూర్తి మృతికి సినీ ప్రము ఖులు పలువురు సంతాపం వ్యక్తం చేశారు. నటుడు, రాజకీయ నేత చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్ హైదరాబాద్ నుంచి చెన్నై ప్రత్యేకంగా వెళ్ళి, భౌతికకాయానికి నివాళు లర్పించారు. గాయకులు ఎస్పీ బాలు, చరణ్, నిర్మాత ‘ఎడిటర్’ మోహన్, దర్శకుడు రాజా, నటి ఛార్మి తదితరులు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంగళవారం సాయంత్రం సత్యమూర్తి భౌతిక కాయానికి చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తొలి సినిమా కథ (‘దేవత’)తోనే ఒక రచయిత జూబ్లీహిట్ అందుకోవడం అరుదే. ఇక, డైలాగ్ రైటర్గా తొలి చిత్రమే (‘బావామరదళ్ళు’) శతదినోత్సవ చిత్రమై, హాలులో డైలాగులకు ఈలలు పడడం మరీ అరుదు. ఆ రెండు ఘనతలూ సాధించి, తక్కువ రాసి, ఎక్కువ మెప్పు పొందిన స్క్రీన్రైటర్గా గుర్తుంటారు జి. సత్యమూర్తి. సినిమాలకు నవలల పాస్పోర్ట... సత్యమూర్తి చదివింది సైన్స. చేసింది టీచర్ ఉద్యోగం. స్థిరపడింది మాత్రం రచనా రంగంలో. అందులోనూ - తన ముక్కు సూటితనానికీ, ముక్కోపితనానికీ సరిపడని కృత్రిమమైన సినీ రంగంలో. ఒక్క మాటలో రచన ఆయనకొక తీరని దాహం. భావా వేశం ఆయన ఇంధనం.\ టీచర్గా పని చేస్తూ, ఆయన రాసిన కథలు, నవలలు ‘ఆంధ్రప్రభ’ వీక్లీ పోటీల్లో బహుమతులు తెచ్చాయి. సత్యమూర్తి శైలి, ఆయన రాసే పాత్రల మానసిక స్థితి, అంతర్వేదన, అద్భుతమైన వర్ణన చదివితే ఒక కొడవటి గంటి, ఒక గోపీచంద్, ఒక వడ్డెర చండీ దాస్ స్ఫురిస్తారు. కావాలంటే, ఆయన పిల్లలు ఆ మధ్య మళ్ళీ ముద్రించిన ‘చైత న్యం’ నుంచి ‘పవిత్రులు’, ‘పునరంకితం’, ‘ఎదలోయల నిదురించే’, ‘దిగంబర అంబరం’, ‘అధర గరళం’ లాంటి నవలలు చదవండి. ఆ నవలలే మద్రాస్ లోని దర్శకుల నుంచి, నిర్మాత ‘యువచిత్ర’ మురారి నుంచి ఫోన్ వచ్చేలా చేశాయి. సూపర్హిట్ సినిమాల స్టార్ రైటర్... అలా సత్యమూర్తి రాసిన తొలి సినీకథ - బాక్సా ఫీస్ ‘వెల్లువొచ్చి (తెలుగు సినీ) గోదారమ్మ వెల్లాకిల్లా పడిన’ రామానాయుడు ‘దేవత’. అక్కడ నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసు కున్నది లేదు. శోభన్బాబు (బావా మరదళ్ళు), కృష్ణ (కిరాయి కోటిగాడు), చిరం జీవి (అభిలాష, ఛాలెంజ్, జ్వాల, ఖైదీ నంబర్ 786), బాలకృష్ణ (బంగారు బుల్లోడు, భలే దొంగ, నారీ నారీ నడుమ మురారి), మోహన్బాబు (పెదరాయుడు), వెంకటేశ్ (శ్రీనివాస కల్యాణం, చంటి) - ఇలా హీరోలందరికీ ఆయన కలం కాసులు కురిపించింది. అలా దర్శకులు కోదండ రామిరెడ్డి, రవిరాజా, నిర్మాతలు కె.ఎస్. రామారావు, ‘విజయ’బాపినీడు, అర వింద్, ఎమ్మెస్ రాజు, రచయితలు యండ మూరి, పరుచూరి లాంటి వారెందరికో ఆత్మీయుడు, ఆస్థాన మిత్రుడూ అయ్యారు. పాటలు రాశారు...డెరైక్షన్ చేశారు... మాస్ హిట్స్తో పాటు నిన్నటి తరానికి ‘మాతృ దేవోభవ’, ‘పుణ్యస్త్రీ’, ‘ముత్యమంత ముద్దు’ లాంటి మనసు కదిలించే కథలకూ అక్షరాలు పొదిగిన ఈ భావుకుడు - ఈ తరానికి మ్యూజిక్ డెరైక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తండ్రిగా ఒదిగిపోయాడు. కానీ, ఇవాళ దేవిశ్రీ బాణీలతో పాటు, మాటలూ కూరుస్తున్నారంటే- అది తండ్రి రచనా వారసత్వమే. కావాలంటే, కృష్ణ నటించిన ‘కంచు కాగడా’లో రాళ్ళపల్లి వేసిన పాత్ర పలికే విప్లవ గీతఖండికలు (రచన సత్య మూర్తి) చూడండి. తమిళ డబ్బింగ్ ‘సింధుభైరవి’లో సుహాసిని పాడే ‘పాడలేను పల్లవైనా...’ పాట వినండి. ప్రభాస్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’లో వచ్చే భక్తిగీతం ‘మొరవినరా ఓ గోపీకృష్ణా...’ గుర్తు తెచ్చుకోండి. సినిమా మత్తు, ఒత్తిడిలో ఆరోగ్యం చెడినప్పుడు మృత్యువు ముంగిట దాకా వెళ్ళి, వెనక్కి తిరిగొచ్చిన ఈ రచనా చిరంజీవి దర్శకుడిగానూ 3 సినిమాలు అందిం చారు. రైల్లో రేప్ నిజజీవిత ఘటన ఆధారంగా ‘దాదర్ ఎక్స్ప్రెస్’, మద్యపాన నిషేధంపై భానుచందర్ ‘చైతన్యం’, ఫ్యామిలీ డ్రామాగా సుమన్ ‘బావగారు’ అలా వచ్చినవే. మూలాలు మరవని మనిషి... సత్యమూర్తి అంటే- చెన్నై వడపళనిలో ధనలక్ష్మీ కాలనీ గుర్తొస్తుంది. ఎక్కడో తూర్పు గోదావరి జిల్లా వెదురుపాకలో పుట్టి, రామచంద్రా పురం, మచిలీ పట్నాల్లో చదువుకున్న ఈ పల్లెటూరి పెద్ద మనిషి మహా నగరానికి వెళ్ళినా మూలాలు మాత్రం మర్చిపోలేదు. స్వగ్రామంలో వెదురుపాకలో ఇల్లు వదులు కోలేదు. పండగ ఉత్సవాలకు కుటుంబంతో వెళ్ళడం మానుకోలేదు. పిల్లలకెంత పేరొ చ్చినా, అక్కడ ప్రదర్శన ఇప్పించడం మర్చి పోలేదు. అత్తవారి ఊరు అమలాపురం వదల్లేదు. తల్లి గోదారి ఒడ్డున ఉన్నట్లే, పెరట్లో కొబ్బరిచెట్ల కింద మంచం వేసుక్కూర్చొని, వచ్చినవాళ్ళతో కథలు, సాహిత్యం గురించే మధ్యాహ్నవేళ సత్యమూర్తి ముచ్చట్లాడిన ఆ దృశ్యాలు మిత్రులెందరికో ఇక ఎప్పటికీ జ్ఞాపకాలే. - రెంటాల జయదేవ ‘‘మాకు ముగ్గురు పిల్లలు. మా ఆవిడకు మాత్రం నలుగురు (నాతో కలిపి). ఆమె న్యూక్లియస్. నేను, నా పిల్లలు ఆమె చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు. ఆమె లేకపోతే ఓ యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ లేడు. ఓ మధుర గాయకుడు సాగర్ లేడు. ఓ ఎమ్మార్క (టౌన్ ప్లానింగ్) పద్మినీ ప్రియదర్శిని లేదు. అంతెందుకు సత్యమూర్తి అనేవాడే లేడు. ఆవిడ నాలో సగం కాదు... కాదు... ముప్పావువంతు... ఆమె - నా శ్రీమతి శిరోమణి’’. - శ్రీమతి గురించి స్వర్గీయ జి. సత్యమూర్తి -
'ప్రిన్స్'కు నచ్చిన కుమారి
'ప్రిన్స్' మహేష్ బాబు రూటు మార్చాడు. తన సినిమాల విషయంలోనే కాదు ఇతర హీరోలు, దర్శకుల సినిమాలను ప్రశంసిస్తూ తన పెద్ద మనసు చాటుకుంటున్నాడు. బాహుబలి రిలీజ్ సమయంలో తన సినిమాను వాయిదా వేసుకున్న మహేష్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల మనసు కూడా గెలుచుకున్నాడు. అంతేకాదు ఇటీవల చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని చిత్రయూనిట్లకు అభినందనలు తెలియజేస్తున్నాడు. సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న కుమారి 21ఎఫ్ సినిమా విషయంలో ఇలాగే స్పందించాడు మహేష్. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ పై ప్రశంసల జల్లు కురింపించాడు. 'కుమారి 21ఎఫ్ టీజర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. రత్నవేలు ఛాయాగ్రహణం, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం చాలా బాగున్నాయి. సుకుమార్ టీమ్ కు నా అభినందనలు' అంటూ ట్విట్టర్ లో తన శుభాకాంక్షలు తెలియజేశాడు. The teaser of kumari 21F is http://t.co/C06E9JIBhP notch work by Rathnavelu sir and DSP. — Mahesh Babu (@urstrulyMahesh) October 3, 2015 Wishing Sukumar garu & the entire team all the very best :) — Mahesh Babu (@urstrulyMahesh) October 3, 2015 -
అక్టోబర్30న రానున్న 'కుమారి 21F'
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్- దేవిశ్రీ ప్రసాద్
-
'శ్రీమంతుడు' సెల్ఫీ తీశాడు
ప్రిన్స్ మహేష్ బాబుతో సెల్ఫీ దిగే చాన్స్ రావాలనే కానీ లక్షలాది అభిమానులు క్యూలో ఉంటారు. ఈ అవకాశం వస్తే అభిమానులకు పండగే. మహేష్ బాబుతో కలసి సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ సెల్ఫీ దిగారు. ఈ విషయాన్ని దేవీశ్రీ ప్రసాదే వెల్లడించారు. మహేష్తో కలసి తాను సెల్ఫీ దిగానని, దీన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు క్లిక్ చేశాడని...ఆయనకు ధన్యవాదాలంటూ దేవీశ్రీ ట్విట్ చేశారు. మహేష్ తాజా చిత్రం శ్రీమంతుడుకు దేవీశ్రీ స్వరాలు అందించారు. ఈ చిత్రం ఆడియో శనివారం విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. A selfie wit the Superstar @urstrulyMahesh!! Speciality : Clicked by d Superstar himself !! Thaank U so much sirr!! -
యూఎస్ లో డీఎస్ పీ అదుర్స్..!!
-
ఆ పాట విన్న ప్రతిసారీ నా మనసు కన్నీరు పెడుతుంది!
దేవిశ్రీ ప్రసాద్ ప్రేమలో పడేసిన పాట విన్న తొలిసారే ఆ పాటతో ప్రేమలో పడిపోయాను. విన్న ప్రతిసారీ నా మనసు కన్నీరు పెట్టుకుంటూనే ఉంటుంది. కమలహాసన్ - మణిరత్నం - ఇళయరాజా వంటి హేమాహేమీలు చేసిన సినిమా ‘నాయగన్’. అందులో ‘తెన్పాండి సీమయిలే.. తేరోడుమ్ వీధియిలే..’ అనే పాట చాలా హాంటింగ్గానూ, హార్ట్ టచింగ్గానూ ఉంటుంది. కన్నీళ్లు ఆపుకోవడం కష్టం. విన్న ప్రతిసారీ అదే తంతు నాకు. ఈ పాట ఒక వెర్షన్ ఇళయరాజానే స్వయంగా ఆలపించారు. రెండో చరణంలో ఓ చోట ఫ్లూట్ బిట్ వస్తుంది. అసలప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం కష్టం. ఈసారి కన్నీళ్లు పెట్టుకోకూడదని ప్రతిసారీ అనుకుని విఫలమవుతుంటాను. నాకు తెలిసి అది గ్రేటెస్ట్ కంపోజిషన్. ఫేవరెట్ సింగర్స్ మైకేల్ జాక్సన్, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి, చిత్ర అభిమాన సంగీత దర్శకుడు: ఇళయరాజా ఇష్టమైన ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ ఇంకెవరుంటారు... మా గురువుగారు ‘మ్యాండలిన్’ శ్రీనివాస్ ప్రియమైన రాగం ఒక్కటని చెప్పడం చాలా కష్టం. ఒక్కో రాగంలో ఒక్కో అర్థం ఉంటుంది. ఒక్కో అందం ఉంటుంది. దేని గొప్పతనం దానిదే. అయితే నాకు తెలియకుండానే నేను ఎక్కువగా అభేరి రాగంలో పాటలు చేస్తుంటాను. ఎందుకో నాకు అభేరితో ఎక్కువ అటాచ్మెంట్ ఉన్నట్టుంది. హ్యాపీగా ఏం చెప్పాలన్నా అభేరితో బాగా చెప్పొచ్చనిపిస్తుంది. సంగీతం గురించి... నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పమంటే నేను సంగీతం అనే చెబుతాను. సంగీతం సమక్షంలో ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదిస్తాను. ఆనందిస్తాను. ఈ ప్రపంచంలో మ్యూజిక్తో దేన్ని కంపేర్ చేయలేం. అదో గొప్ప ప్రపంచం... అంతే! -
కాంట్రాక్ట్ ఉద్యోగులపై నెలాఖరులోగా నిర్ణయం
టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్రావు హైదరాబాద్: సమైక్యాంధ్ర పాలనలో విచ్చలవిడిగా చేపట్టిన ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య ఈ నెలాఖరులోగా పరిష్కారమవుతుందని, ఈ విషయంలో ఉద్యోగులు భయాందోళనకు గురికావద్దని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్రావు పేర్కొన్నారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మంత్రిమండలి త్వరలో సబ్ కమిటీని వేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ టీచర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆదివారం ఇక్కడి టీఎన్జీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో దేవీప్రసాద్ పాల్గొన్నారు. -
ఉద్యోగులపై స్పష్టత ఇవ్వాలి
ఆదిలాబాద్ రూరల్/నిర్మల్ అర్బన్, న్యూస్లైన్ : జూన్ 2న ఏర్పాటయ్యే తెలంగాణ రాష్ట్రం కంటే ముందే రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులపై స్పష్టత ఇవ్వాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ కన్వీనర్ దేవీప్రసాద్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్లోని సెంట్రల్ గార్డెన్లో నిర్వహించిన ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఉద్యోగుల విభజన, పరిణామాలు, కింకర్తవ్యం’పై ఉద్యోగుల సమావేశానికి హాజరయ్యారు. ఆదిలాబాద్కు వస్తూ నిర్మల్లోని టీఎన్జీవో సంఘ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఉద్యోగుల విభజనపై స్పష్టత ఇవ్వకుండా తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. ఏమాత్రం అన్యాయం జరిగినా, సచివాలయంలో మళ్లీ ఆంధ్ర పాలన వచ్చినా మలి దశ ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. ఉద్యోగుల విభజనలో పారదర్శకత లోపిస్తోందని, స్థానికత ఆధారంగానే విభజించాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ ఉద్యోగులు అదనంగా రెండు గంటలు పనిచేస్తారని తెలిపారు. అమరుల కోసం రూ.200కోట్లతో ప్రొఫెసర్ జయశంకర్ ట్రస్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం వాచ్డాగ్లా పనిచేస్తామని చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం 22 అంశాలతో కూడిన ఎజెండాను రాజకీయ పార్టీ ముందుంచామని తెలిపారు. జూన్ 2న తెలంగాణ ఏర్పాటు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ఉద్యోగ సంఘ నాయకులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశాల్లో టీఎన్జీవో మహిళా చైర్పర్సన్ రేచల్, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్, వనజారెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు జైరాం, విలాస్, వేణుమాధవ్, భాగ్యలక్ష్మీ, మొయినొద్దీన్, వి ద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, జేఏసీ కన్వీనర్గా ఎన్నికైన తర్వాత తొలిసారిగా నిర్మల్కు వచ్చిన దేవీప్రసాద్ను టీఎన్జీవో నాయకులు పూలమాల, శాలువాతో సన్మానించారు. వేణుమూరి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. -
సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లాల్సిందే: దేవీప్రసాద్
హైదరాబాద్: రెండు రాష్ట్రాలు ఏర్పడిన వెంటనే అన్ని ప్రభుత్వ శాఖల్లోని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు, అధికారులు తమ ప్రాంతానికి వెళ్లి పోవాల్సిందేనని టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆ అధికారులు, ఉద్యోగులు వెళ్లకపోతే మరోసారి సకల జనుల సమ్మెను చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. బుధవారమిక్కడి ప్రభుత్వ ఛాతీ వైద్యశాలలో జరిగిన టీఎన్జీవో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రెండు రాష్ట్రాలు ఏర్పడిన వెంటనే సీమాంధ్ర ఉద్యోగులు, అధికారులు తమ ప్రాంతానికి వెళ్లిపోవాలని సూచించారు. ఈ విషయంలో ఎలాంటి ఆప్షన్లు ఉండవని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవోల ప్రధాన కార్యదర్శి కె.రవీందర్రెడ్డి, ఉపాధ్యక్షులు డి.రేచల్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : కన బడలేదా గోదారి తల్లి కడుపుకోత వినబడలేదా గోదారి నీళ్ల రక్తఘోష ॥ గుండెనిండ పాలున్నా బిడ్డలకందించలేని తల్లిబతుకు దేనికనీ బీళ్లు నింపె నీళ్లున్నా సముద్రాన పడిపోయే శాపం తనకెందుకనీ బలువై దయకరువై తను వెలియై ఇక బలియై బృందం: బలువై దయకరువై తను వెలియై ఇక బలియై ఉప్పు సాగరాలలోకి వెళ్లలేక వెళ్లలేక వెక్కివెక్కి పడుతున్నది వృథా కథలు మోయలేక... ఆ అలల అలజడి ఆ తడి ఆరని కంటతడి ఆ అలల అలజడి తడి ఆరని కంటతడి కనబడలేదా వినబడడం లేదా ॥ చరణం : శిలాపలకలేసి మీరు ఎలా మరచిపోయారని బాసరలో సరస్వతి పీఠమెక్కి అడిగినది దుర్మదాంధులార తెలుగు బిడ్డలకీ కర్మేందని ధర్మపురిలో నారసింహ నాదం చేస్తున్నది ఎడారులుగ మారుతున్న పొలాలను చూడలేక కాళేశ్వర శివలింగం కాళ్లు కడిగి ఏడ్చినది బతుకు మోయలేని రైతు ఆత్మహత్యలకు చలించి భద్రాచల రాముడి కి సాగిలపడి మొక్కినది పాపికొండల గుండె ధారై ప్రవహించినది ధవళేశ్వర కాటన్ మహాశయుని తలచినది సిగ్గుపడండని కుటిల నాయకులను తిట్టినది గుండె పగిలి సరసాపూర్ సముద్రాన దూకినది చిత్రం : బన్ని (2005) రచన : సుద్దాల అశోక్తేజ, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ గానం : ఎస్.పి.బాలు, బృందం -
గడువు పొడిగించవద్దని రాస్తారోకో
నల్లగొండ రూరల్, న్యూస్లైన్: తెలంగాణ బిల్లు గడువును పొడిగించవద్దని టీఎన్జీఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు దేవీప్రసాద్, టీజేఎఫ్ జిల్లా కన్వీనర్ దూసరి కిరణ్కుమార్గౌడ్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీ-బిల్లు గడువును పొడిగించవద్దని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో నల్లగొండలోని క్లాక్టవర్ వద్ద మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బిల్లు గడువును పొడిగించి సీమాంధ్రులు రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బిల్లు గడువును పొడిగిస్తే మరో ఉద్యమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డాక్టర్స్ జేఏసీ నాయకుడు బూర నర్సయ్యగౌడ్, దుశ్చర్ల సత్యనారాయణ, రవీందర్రెడ్డి, వెంకటేశ్వరమూర్తి, జి.వెంకటేశ్వర్లు, గోలి విజయ్, సైదులు, వెంకన్న, రామకృష్ణ, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
గీత స్మరణం
పల్లవి : చెలి చెలి చెలియా చెదిరిన కలయా నువు పలకని మాటలాగ నను మార్చమాకె సఖియా చెలి చెలి చెలియా చెదిరిన కలయా నువు చూడని చోటులాగ నను చేయమాకె సఖియా అలై నువ్వే నను వీడినా వెనకే సంద్రం నేనై ఇలా రానా నీ చుట్టూ నిలవనా ప్రాణాలా వలై ఓ సయొనరా సయొనరా సయొనరా సెలవంటు నా చె లిమికే విసరకే చీకటి తెర ॥చెలి॥ చరణం : 1 నీతో ఎన్నడూ వచ్చే నీడనై నిఘా నేనేగా నువ్వు ఎప్పుడూ శ్వాసించే గాలినై నిఘా నేనేగా ఓ... పువ్వులాగ నిన్ను చూడాలంటూ ముళ్లైపోతా ముత్యంలాగ నిను దాచే ఉప్పునీరైపోతా ఆపదొచ్చి నిను గుచ్చుకుంటే ఆపే మొదటి గాయం నేనే ఔతా ॥సయొనరా॥ చరణం : 2 నిశ్శబ్దంలోన నీ గుండుచప్పుడై ఉంటా తోడుంటా శబ్దాలెన్నున్నా నీ రెప్పలచప్పుడే వింటా నే వింటా ఓ... చేదు క లలకు మేలకువలాగ వస్తా బాధ మేలుకుంటే నిదరై కాపుకాస్తా వేదనలికింకా వీడుకోలు పలికే చివరి కన్నీటి చుక్కైపోతా ॥సయొనరా॥ చిత్రం : ‘1’ నేనొక్కడినే (2014) రచన : చంద్రబోస్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ గానం : సూరజ్ సంతోష్, ఎం.ఎం.మానసి -
గీత స్మరణం
సాకీ: ఆమె: ఆలిండియాకే మంటపెట్టే ఐటం నేనురా నాయాంటెన్నాకే అంటుకోని సిగ్నల్లేదురా రయ్య ర య్య రయ్యా రయ్యా రయ్య రయ్య రయ్యా రయ్య ర య్య రయ్యా రయ్యా రయ్యా రయ్యా ॥ర య్య॥ పల్లవి : ఆ: మోస్టు వాంటెడు అందగత్తె నేను కంచు కత్తి నేను నా కంటిచూపుతో సునామీ పుట్టిస్తాను ॥ర య్య॥ మోస్టు వాంటెడు ఫేసుబుక్కు నేను మాసు లుక్కు నేను నా పైట చెంగులో దునియానే చుట్టేస్తాను ॥ర య్య॥ స్వీటు స్వీటుగున్న హాటు కేకు నేను చీమల్ని కోరే బెల్లం ముక్క నేను కోట్ల ఫ్యాన్సుకే డ్రీమ్ గర్ల్నయ్యాను తాడులేని ఆడ బొంగరం నేను మీసకట్టు చూసి నీకు పడ్డాను యాడికైన నన్ను ఎత్తుకెళ్లమంటాను ॥ర య్య॥ అతడు: మోస్టు వాంటెడూ ఈ అందగాడు నీకు అందనోడు నీనైసు గోకుడూ ఇష్టంలే వాట్ టూ డూ నీ కోక జారుడు ఎక్కినాది రోడ్డు అది వెరీ బ్యాడ్డూ నా ఫొటోఫ్రెములో నీ బొమ్మకు చోటేలేదు ॥ర య్య॥ చరణం : 1 ఆ: హే... మిడ్డీనా మెరిసే శారీనా ఏది నీకు ఇష్టమైన డ్రెస్సు అది కట్టుకొచ్చి ఇచ్చుకుంట కిస్సూ హే... ఇండోరా అదిరే ఔట్ డోరా ఏది నీకు ఇష్టమైన ప్లేసు చలో ఆడికెళ్లి చేసుకో రొమాన్సు అ: గ్లామరే మన బ్యాంకు బాలెన్సు ఇవ్వలేనె పోరి నీకు బ్లాంకు చెక్సూ టైము లాసు టాక్సుమాని పిండ్రాపు సెలైన్సుగుంటే బెస్టు ॥ర య్య॥॥వాంటెడు॥ చరణం : 2 ఆ: నే ఫుల్ మూను నువ్వే సన్షైను ఎంత బాగా మ్యాచయ్యిందో పెయిరు నాతో పెట్టుకోర ముద్దుగా ఎఫైరు నే ఐఫోను నువ్వే రింగుటోను ట్రింగు ట్రింగు మంది లవ్వు సీను ఎప్పుడెప్పుడెప్పుడంది హనీమూను అ: చాకొలెట్టు ఏజు చంటగాణ్ణి కాను ఐసుపెట్టి నాకు ఎయ్యమాకె లైను నాకు నేను సోలో మేను మీ ట్రిక్సు వర్కౌటు కానివ్వను ॥ర య్య॥॥వాంటెడు॥ చిత్రం : భాయ్ (2013), రచన : రామజోగయ్యశాస్త్రి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ గానం : నరేంద్ర, మమతా మోహన్దాస్ - నిర్వహణ: నాగేశ్ -
గీత స్మరణం
పల్లవి : B...H...A...I... భాయ్... చీకటి పడితే Playboy వీడు మాసు వీడు క్లాసు దొరబాబు of Dubai అటు గన్సూ ఇటు గర్ల్సూ మన కింగ్ డం డం మనదే వయొలెన్సూ రొమాన్సూ టూ ఇన్ వన్ ఫన్ మనదే ైెహ ఫైగా గాల్లో తేలే సొమ్ముందే వైఫైలో ప్రాణం తీసే దమ్ముందే సూర్యుళ్లా డేటైం బ్యూటీ షూటౌటే చంద్రుళ్లా నైట్ టైం పక్కా ఛిల్ ఛిల్ ఛిల్ ఛిల్ ఛిల్లౌటే ॥B...H...A...I...॥ చరణం : 1 చీకటి పడితే చాలు నా బుల్లెట్లన్నీ పూలు ఇది భాయీ స్టైల్ నట్టింట్లో స్విమ్మింగ్ పూలు ఫుల్ వెన్నెల్లో జలకాలు విత్ కన్నెందాలు ఎవ్రీడే ధంధా ఆఫ్ కోర్స్ మామ్మూలే నౌ ఎండ్ దెన్ కొంచెం రీఛార్జ్ క క్క క్క క్క కావాల్లే ॥B...H...A...I...॥ చరణం : 2 గాడ్ బ్లెస్ యు మై ఎనిమీసూ నాకెదురొస్తే నో చాన్సూ మీ టిక్కెట్ కన్ఫర్మ్ గురిపెట్టానో నా లెన్సూ ఇక కౌంట్ డౌనే మీ డేసూ మీ బతుకే భస్మం రివాల్వర్ మేరా ప్యారా ట్విన్ బ్రదర్ వాటెవర్ నాలో సత్తా నా నా నా నా గాడ్ ఫాదర్ ॥B...H...A...I...॥ చిత్రం: భాయ్ (2013) రచన: రామజోగయ్యశాస్త్రి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ గానం: సుచిత్ సురేశన్ నిర్వహణ: నాగేశ్