
మాలయాళంలో ప్రేమమ్ చిత్రంలో మలర్ పాత్రలో హీరోయిన్ సాయిపల్లవి తన నటనతో అందర్నీ అకట్టుకుంది. టాలీవుడ్లో కూడా ఫిదా, ఎంసీఏ చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ అమ్మడు. ప్రస్తుతం ఆమె కోలీవుడ్లో నటిస్తోంది. అయితే మలయాళం, తెలుగులో మాదిరిగా తన మ్యాజిక్ కంటిన్యూ కాలేదు. ఆరంభంలోనే మణిరత్నం లాంటి దర్శకుడి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. తాజాగా ఆమె ఆటో నేర్చుకుంటోందనే రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ బ్యూటీ తన అభిమాన హీరో సూర్యతో జతకట్టనున్నారు.
అంతేకాక కోలీవుడ్లో మొదటి సినిమా ‘దియా’ కాస్తా నిరాశ పరిచింది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన దియా తెలుగులోనూ సక్సెస్ కాలేదు. కానీ తన నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. కోలీవుడ్లో మరో రెండు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అందులో ఒకటి తన అభిమనా హీరో సూర్యతో నటిస్తోంది. ‘ఎన్జీకే’ పేరుతో సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ చిత్రం దీపావళికి తెరపైకి వచ్చే అవకాశం ఉంది.
సాయిపల్లవి ధనుష్కు జంటగా ‘మారి-2’లో నటించనుంది. ఇందులో సాయిపల్లవి ఆటో డ్రైవర్ పాత్రలో నటిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ అమ్మడిప్పుడు ఆటో నేర్చుకోవటంలో శిక్షణ పొందుంతోందని సమాచారం. ‘ఫిదా’ చిత్రంలో ఈ బ్యూటీ ట్రాక్టర్ నడిపిన విషయం తెలిసిందే. బాలాజీమోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment