జగన్నాటకం
శ్రీధర్, ప్రదీప్ నందన్, అభినవ్ గోమటం, ఖెనిశ చంద్రన్ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘జగన్నాటకం’. ప్రదీప్ నందన్ దర్శకుడు. ఆది శేషారెడ్డి ఇందుపూరు నిర్మాత. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ హైదరాబాద్లో జరిగింది. పేషన్తో దర్శక, నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించారని, తప్పకుండా సక్సెస్ సాధించే సినిమా అవుతుందని ప్రత్యేక పాత్ర పోషించిన శివాజీరాజా చెప్పారు. అందరి సహకారంతో అనుకున్నదానికంటే సినిమాను బాగా తీయగలిగానని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, సంగీతం: అజయ్ అరసాడ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పవర్ శ్రీను.