![jandhyala rasina premakatha released this month last week - Sakshi](/styles/webp/s3/article_images/2017/10/7/jandh.jpg.webp?itok=_ogHyDSU)
శేఖర్, దిలీప్, శ్రీలక్ష్మీ, గాయత్రి ముఖ్యతారలుగా కృష్ణవర్మ దర్శకత్వంలో కీర్తి క్రియేషన్పై కార్తీక్ రెడ్డి, అశోక్ సిరియాల నిర్మించిన చిత్రం ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’. గోపీ సంగీత దర్శకుడు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమయ్యింది. కృష్ణవర్మ మాట్లాడుతూ– ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప దర్శకులైన జంధ్యాలగారు రూపొందించిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రజెంట్ ట్రెండ్కు అనుగుణంగా కమర్షియల్ హంగులు జోడించి అందరికి నచ్చేలా చిత్రాన్ని తీర్చిదిద్దాం. ఈ నెలాఖరుకు సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్.
Comments
Please login to add a commentAdd a comment