వెండితెరకు యంజీఆర్‌ జీవితం | Making in the MGR biopic | Sakshi
Sakshi News home page

వెండితెరకు యంజీఆర్‌ జీవితం

Published Thu, Sep 6 2018 12:29 AM | Last Updated on Thu, Sep 6 2018 10:04 AM

Making in the MGR biopic - Sakshi

యంజీఆర్‌

తమిళనాట సినిమాల్లో అయినా.. రాజకీయాల్లో అయినా యంజీర్‌ది స్ఫూర్తి కలిగించే ప్రయాణం. ఈ ప్రయాణాన్ని ఇప్పుడు సిల్వర్‌ స్క్రీన్‌పై చూపించనున్నారు దర్శకుడు ఎ.బాలకృష్ణన్‌. నటుడిగా, దర్శకుడిగా ఉన్నత స్థాన్నాన్ని అధిరోహించిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు యంజీఆర్‌. ఓ నటుడు ముఖ్యమంత్రి కావడం భారతదేశంలోనే తొలిసారి. భారతరత్న అవార్డు అందుకున్నారాయన.

ఇలా ప్రస్థావించడానికి బోలెడు చరిత్ర ఉన్న బయోపిక్‌ ఇది. పాపులర్‌ టీవీ నటుడు సతీశ్‌ కుమార్‌ యంజీఆర్‌గా కనిపించనున్నారు. రైత్విక, వైయపురి హీరోయిన్లుగా కనిపించనున్నారు. బాల్యం, సినీ ప్రయాణం, రాజకీయాలను ఈ సినిమాలో చూపించనున్నారు దర్శకుడు. ‘మక్కల్‌ తిళగం’(జన నాయకుడు) అని ఆయన అభిమానులు పిలుచుకుంటారు. యంజీఆర్, కరుణానిధి జీవితాల ఆధారంగా మణిరత్నం ‘ఇద్దరు’ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement