
‘మాయామహల్’లో ఏం జరిగింది?
అదొక మాయామహల్. ఆ మహల్లోకి అడుగుపెట్టినవారు ఎలాంటి అనుభూతులకు గురవుతారు? ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు? అనే కథాంశంతో మోక్షగుండం జయలక్ష్మి సమర్పణలో మోక్షగుండం అంకయ్య నిర్మించిన చిత్రం ‘మాయామహల్’. టీయస్ రాజు, గ్రీష్మ జంటగా నటించిన ఈ చిత్రానికి సింగం సుధాకరరెడ్డి దర్శకుడు. ఈ నెల 25న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇది హారర్ థ్రిల్లర్ మూవీ. ప్రేమ, వినోదం సెంటిమెంట్.. ఇలా అన్ని అంశాలూ ఉంటాయి. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే సినిమా. నిర్మాతగా మా ఈ తొలి ప్రయత్నం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.