
అప్పటి కుర్రాడి కథ..!
1992 నుంచి 1996 వరకు ఆ నాలుగేళ్లలో ఇద్దరు యువకుల జీవితాల్లో...
1992 నుంచి 1996 వరకు ఆ నాలుగేళ్లలో ఇద్దరు యువకుల జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం ‘అప్పట్లో ఒకడుండేవాడు’. నారా రోహిత్, ‘ప్రేమ.. ఇష్క్..కాదల్ ’ ఫేం శ్రీ విష్ణు కథానాయకులుగా వశిష్ట మూవీస్ పతాకంపై హరి, సన్నీరాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘అయ్యారే’ ఫేం సాగర్ కె.చంద్ర దర్శకుడు. ‘‘యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించనున్నాం. ఈ భారీ యాక్షన్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ను జూన్ మొదటి వారంలో మొదలుపెడతాం’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు.