Sri Vishnu
-
'ఫస్ట్ లవ్' టీజర్ బాగుంది: శ్రీవిష్ణు
దీపు జాను, వైశాలిరాజ్ లీడ్ రోల్స్ లో బాలరాజు ఎం డైరెక్ట్ చేసి బ్యూటీఫుల్ మ్యాజికల్ ఆల్బం 'ఫస్ట్ లవ్'. వైశాలిరాజ్ నిర్మించిన ఈ ఆల్బం టీజర్ ని సక్సెస్ ఫుల్ హీరో శ్రీవిష్ణు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ఫస్ట్ లవ్ సాంగ్ చూశాను. చాలా తక్కువ టైంలో చాలా బ్యూటీఫుల్ లవ్ స్టొరీ చెప్పారు. చాలా బాగా షూట్ చేశారు. కెమరా వర్క్ చాలా బావుంది. సిద్ శ్రీరామ్ గారి వాయిస్ అద్భుతంగా వుంది. వినగానే ఒక నోస్టాల్జియ ఫీలింగ్ వచ్చింది. భూమి ఆకాష్ గా దీపు , వైశాలి చాలా పర్ఫెక్ట్ గా కనిపించారు. డైరెక్టర్ గారు చాలా మంచి కాన్సెప్ట్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. తప్పకుండా ఈ సాంగ్ అందరికీ నచ్చుతుంది’ అన్నారు. సాంగ్ టీజర్ విషయానికొస్తే..'ఫస్ట్ లవ్వా.. అతను నీతో చెప్పిన ఫస్ట్ మాట ఏంటి?' అనే డైలాగ్ తో మొదలైన సాంగ్ టీజర్ మెస్మరైజ్ చేసింది. కంపోజర్ సంజీవ్.టి ఈ సాంగ్ ని అందరూ మళ్ళీ మళ్ళీ పాడుకునే చార్ట్ బస్టర్ నెంబర్ గా ట్యూన్ చేశారు. 'మనస్సే చేజారే నీ వల్లే పతంగై పోయిందే నీ వెంటే ఇదంతా కల కాదా'' అంటూ కిట్టు విస్సాప్రగడ రాసిన బ్యూటీఫుల్ లిరిక్స్ ని సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరాం పాడిన తీరు హార్ట్ వార్మింగ్ గా ఉంది. -
3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు కామెడీ సినిమా
ఓటీటీలోకి మరో క్రేజీ సినిమా రాబోతుంది. మొన్నీమధ్యే థియేటర్లలో రిలీజ్ కాగా, ఇప్పుడు వారాల వ్యవధిలోనే ఓటీటీలోకి రానుంది. ఈ మూవీ మరీ ఇంత తర్వగా వస్తుండటంపై మూవీ లవర్స్ తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. ఇంతకీ ఏంటా సినిమా? దీని సంగతేంటి? (ఇదీ చదవండి: Allu Arjun: అల్లు అర్జున్ గురించి ఈ విషయాలు తెలిస్తే.. ఎత్తిన ప్రతి వేలూ ముడుచుకోవాల్సిందే) లాజిక్స్ లేని కామెడీ సినిమాలు ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు వస్తున్నాయి. అయితే ఇవేవి కూడా 'జాతిరత్నాలు'లా సక్సెస్ కాలేకపోయాయి. ఇలా లాజిక్స్ లేని కథతో వచ్చిన మూవీనే 'ఓం భీమ్ బుష్'. ఇప్పుడు ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మంచి అంచనాలతో రిలీజైంది. కానీ థియేటర్లలో మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఇది వచ్చిన వారంలో 'టిల్లు స్క్వేర్' రావడంతో ఈ మూవీ కాస్త డౌన్ అయిపోయింది. దీంతో ఇప్పుడు మూడు వారాల్లోనే ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసేశారు. (ఇదీ చదవండి: Pushpa 2 Teaser: పుష్పరాజ్ మాస్ జాతర చూస్తారా?) #OmBheemBush premieres on @PrimeVideoIN on 12th April! pic.twitter.com/v6YaCo6IAk — Movie Mahal (@moviemahaloffl) April 8, 2024 -
విద్యార్థులే కానీ... వేసవి సెలవులు లేవు
వేసవి వస్తే విద్యార్థులు రిలాక్స్ అవుతారు. వేసవి సెలవులను ఆస్వాదిస్తారు. కానీ.. ఈ విద్యార్థులకు మాత్రం వేసవి సెలవులు లేవు. కాలేజీలకు వెళుతున్నారు. ఎందుకంటే వీళ్లు రియల్ స్టూడెంట్స్ కాదు.. రీల్ స్టూడెంట్స్. కొందరు స్టార్స్ ప్రస్తుతం స్టూడెంట్స్గా నటిస్తున్నారు. షూటింగ్ సెట్స్లో క్లాసులకు హాజరు అవుతున్నవారు కొందరైతే.. ప్రిపరేషన్ స్టూడెంట్స్ మరికొందరు. ఈ విద్యార్థుల గురించి తెలుసుకుందాం. ► కెరీర్లో పలు చిత్రాల్లో కాలేజ్ స్టూడెంట్గా నటించారు హీరో సూర్య. కానీ ఐదు పదుల వయసుకి చేరువ అవుతున్న టైమ్లో కూడా కాలేజ్కి వెళ్లెందుకు రెడీ అవుతున్నారు. ‘సూరరై ΄ోట్రు’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధ కొంగర కాంబినేషన్లో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. స్టూడెంట్ నుంచి గ్యాంగ్స్టర్గా మారే ఓ వ్యక్తి జీవితం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందట. స్టూడెంట్ రోల్ కోసం ప్రస్తుతం సూర్య బరువు తగ్గుతున్నారని సమాచారం. 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. ►కాలేజీ స్టూడెంట్ రోల్ హీరోయిన్ రష్మికా మందన్నాకు బాగా కలిసి వస్తుందని చె΄÷్పచ్చు. ఆ మాటకొస్తే... నటిగా రష్మికా మందన్నా కెరీర్ మొదలైంది కన్నడ హిట్ క్యాంపస్ డ్రామా ‘కిర్రిక్ పార్టీ’ సినిమాతోనే. అంతేకాదు...రష్మికా మందన్నా తెలుగు ఎంట్రీ మూవీ ‘ఛలో’లోనూ, రెండో మూవీ ‘గీత గోవిందం’లోనూ ఆమెది కాలేజీ స్టూడెంట్ రోల్. ఇలా కాలేజీ స్టూడెంట్గా రష్మికా మందన్నా చేసిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్. తాజాగా ఈ కోవలో రష్మికా మందన్నా చేస్తున్న చిత్రం ‘ది గాళ్ఫ్రెండ్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా పీజీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ రోల్లో కనిపిస్తారని తెలిసింది. ఆమె బాయ్ ఫ్రెండ్గా దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. ఓ కాలేజీ స్టూడెంట్ తన ప్రేమను నెగ్గించుకునే క్రమంలో పడిన సంఘర్షణ నేపథ్యంతో ఈ సినిమా ఉంటుందట. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ‘చి..ల..సౌ’తో దర్శకుడిగా తొలి సినిమాతోనే హిట్ కొట్టిన రాహుల్ రవీంద్రన్ ‘ది గాళ్ ఫ్రెండ్’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజయ్యే చాన్స్ ఉంది. ► కాలేజీలో ఓ ఫెయిల్యూర్ స్టూడెంట్గా తెరపై శ్రీ విష్ణు కనిపించిన ప్రతిసారీ ఆయనకు మంచి పేరు వచ్చింది. ‘నీదీ నాది ఒకే కథ’, ‘బ్రోచేవారెవరురా’ వంటి సినిమాల్లో శ్రీ విష్ణు స్టూడెంట్గా నటించారు. మళ్లీ ఈ తరహా పాత్రలో శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. శ్రీవిష్ణుతో పాటు ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్, ప్రియదర్శి ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఓ యూనివర్సిటీలోని ముగ్గురు పీహెచ్డీ స్కాలర్స్ జీవితాలు ఓ ఘటనతో సడన్గా ఏ విధంగా మలుపు తిరిగాయి? అనే కోణంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమా ఫస్టాఫ్లో కాలేజీ సీన్స్ ఉంటాయి. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో వి సెల్యూలాయిడ్, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. స్టూడెంట్గా ఇన్నాళ్లూ సెట్లో బిజీగా ఉన్న శ్రీవిష్ణు ఇప్పుడు ఈ చిత్రం ప్రమోషన్స్తో బిజీగా ఉంటున్నారు. ► ‘ఏవండీ.. (మృణాల్ ఠాకూర్).. రామచంద్రా.. (చిన్న వాయిస్తో విజయ్ దేవరకొండ).. నేను కాలేజ్కి వెళ్లాలి.. కొంచెం దించేస్తారా? (మృణాల్ ఠాకూర్),.. ఒక లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా..’ (విజయ్ దేవరకొండ)...‘ఫ్యామిలీస్టార్’ సినిమాలోని డైలాగ్ ఇది. సో.. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కొన్ని సన్నివేశాల్లో కాలేజ్కి వెళతారని కన్ఫార్మ్ చేసుకోవచ్చు. ‘గీత గోవిందం’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో రూ΄÷ందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది. బాలీలో ఓ పాట చిత్రీకరిస్తే ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ► ‘ఇగై’ సినిమా కోసం లా పాయింట్స్ చెబుతున్నారు అంజలి. ఎందుకంటే ఈ సినిమాలో అంజలి లా స్టూడెంట్. అశోక్ వేలాయుదం దర్శకత్వంలో రూ΄÷ందుతున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు అంజలి. చిత్రీకరణ ్రపారంభమైంది. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ నటీనటులే కాక.. మరికొందరు కూడా కాలేజీ స్టూడెంట్ రోల్స్ చేస్తున్నారు. -
డబుల్ ట్రీట్
బర్త్ డేకి శ్రీ విష్ణు డబుల్ ట్రీట్ అందుకున్నారు. గురువారం (ఫిబ్రవరి 29) శ్రీవిష్ణు బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన నటించనున్న రెండు కొత్త చిత్రాలను అధికారికంగా ప్రకటించారు ఆయా మేకర్స్. ‘నిను వీడని నీడను నేనే’ ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్పై విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి ఈ సినిమాను నిర్మిస్తారు. ప్రేమకథతో కూడిన ఫన్ రోలర్ కోస్టర్ మూవీ ఇది. మరోవైపు ‘రాజ రాజ చోర’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత శ్రీవిష్ణు, హసిత్ గోలి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాకు ‘శ్వాగ్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ స్వరకర్త. -
Om Bhim Bush: పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం గ్యారెంటీ
‘‘గుప్త నిధుల కోసం ముగ్గురు శాస్త్రవేత్తలు ఏం చేశారు? అనే నేపథ్యంలో ‘ఓం భీమ్ బుష్’ ఆసక్తిగా ఉంటుంది. మా పాత్రలకు (శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి) ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. రెండు గంటల పాటు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు.. ఆ విషయంలో అనుమానం అక్కర్లేదు’’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్లో యూవీ క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు నిర్మించిన ఈ సినిమా మార్చి 22న రిలీజ్ కానుంది. ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్లో ప్రియదర్శి మాట్లాడుతూ– ‘‘టీజర్ అందరికీ నచ్చడం హ్యాపీగా ఉంది. సినిమా ఇంకా అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం ఏడాదిన్నర కష్టపడ్డాం. మా కష్టానికి తగ్గ ఫలితం దక్కాలంటే ప్రేక్షకులు చూడాలి’’ అన్నారు రాహుల్ రామకృష్ణ. ‘‘మా సినిమాని అందరూ చూడాలి’’ అన్నారు శ్రీహర్ష కొనుగంటి. -
ఆమెను చూస్తే గర్వంగా ఉంది
‘‘అంజలిగారి కెరీర్లో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ 50వ సినిమా. ఓ తెలుగమ్మాయి ఇన్ని సినిమాలు చేసి, విజయం సాధించడం గర్వంగా ఉంది. అంజలిగారు వందకుపైగా సినిమాలు చేయాలి. మార్చి 22న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాతో పాటు నా మూవీ ‘ఓం భీం బుష్’ కూడా విడుదలవుతోంది. ఈ రెండు చిత్రాలు విజయం సాధించాలి’’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు. హీరోయిన్ అంజలి టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్. శివ తుర్లపాటి దర్శకత్వంలో కోన ఫిల్మ్స్ కార్పొరేషన్ , ఎంవీవీ సినిమాస్పై కోన వెంకట్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 22న విడుదలకానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్కు హీరో శ్రీ విష్ణు, దర్శకులు గోపీచంద్ మలినేని, బాబీ, బుచ్చిబాబు సన అతిథులుగా హాజరయ్యారు. అంజలి మాట్లాడుతూ – ‘‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ నా కెరీర్లో ఓ ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుంది. యాభై సినిమాలు చేయడం నాకు సంతోషాన్నిస్తోంది’’ అన్నారు అంజలి. ‘‘ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది’’ అన్నారు కోన వెంకట్. ‘‘ఓ మంచి చిత్రానికి దర్శకత్వం వహించాననే సంతృప్తి కలిగింది’’ అన్నారు శివ తుర్లపాటి. నటులు అలీ, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. -
ఓం భీమ్ బుష్!
‘సామజవరగమన’(2023) వంటి హిట్ మూవీ తర్వాత శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. ‘నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్’ అన్నది ఉపశీర్షిక. ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ కథానాయికలుగా నటించారు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు చేశారు. యువీ క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్స్పై సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమాకి ‘ఓం భీమ్ బుష్’ అనే టైటిల్ ఖరారు చేసి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వ్యోమగామి దుస్తులు ధరించి, తమ చేతుల్లో కరపత్రాలతో నడుచుకుంటూ వస్తున్న ఫస్ట్ లుక్ ఆసక్తిగా ఉంది. ‘‘పూర్తి వినోదాత్మకంగా రూ΄÷ందిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. మార్చి 22న సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: సన్నీ ఎం.ఆర్. -
మంత్రాన్ని తలపించేలా సినిమా టైటిల్.. ఆసక్తిగా పోస్టర్!
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు సరికొత్త మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. గతేడాది సామజవరగమన మూవీతో సూపర్ హిట్ కొట్టిన హీరో తాజాగా మరో హిలారియస్ కామెడీ ఎంటర్టైనర్తో రాబోతున్నారు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాకు టైటిల్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టైటిల్ చూడగానే ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి ఓం భీమ్ బుష్ అనే ఆసక్తికర టైటిల్ ఖరారు చేశారు. అంతే కాకుండా నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్, టైటిల్ కొత్తగా ఉండడం చూస్తే థియేటర్లలో ఫుల్ కామెడీ ఖాయంగా కనిపిస్తోంది. ఓం భీమ్ బుష్ అనే పేరు వినగానే ఏదో మంత్రం చదివినట్లు అనిపిస్తోంది. పోస్టర్ చూస్తే శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వ్యోమగాముల పాత్రలు పోషించినట్లు తెలుస్తోంది. కాగా.. గతంలో వీరి ముగ్గురి కాంబోలో బ్రోచేవారెవరురా అనే సినిమాతో హిట్ కొట్టారు. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులని నవ్వించడానికి రాబోతున్నారు. కాగా.. ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. The hilarious trio of @sreevishnuoffl, @PriyadarshiPN & @eyrahul are back 👨🏻🚀👨🏻🚀👨🏻🚀 And they are bringing the 𝐍𝐄𝐖 𝐌𝐀𝐍𝐓𝐑𝐀 𝐎𝐅 𝐄𝐍𝐓𝐄𝐑𝐓𝐀𝐈𝐍𝐌𝐄𝐍𝐓 - #OmBheemBush - No Logic Only Magic 🪄 Directed by @HarshaKonuganti ❤️🔥 Grand Release Worldwide on March 22nd 💫… pic.twitter.com/8x6wMICA3R — UV Creations (@UV_Creations) February 22, 2024 -
షూటింగ్లో గొడవ.. తెలుగు యంగ్ హీరో కారుని అడ్డుకున్న కూలీలు
తెలుగు యంగ్ హీరో శ్రీవిష్ణుకు కొందరు కూలీలు షాకిచ్చారు. కొత్త సినిమా షూటింగ్లో భాగంగా అనుకోని సంఘటన ఎదురైంది. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలోని బనగానెపల్లె మండలం యాగంటి క్షేత్రంలో సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనేందుకు కోసం కొందరు కూలీలని చిత్రబృందం తీసుకొచ్చింది. అయితే పూర్తయిన తర్వాత వాళ్లకు వేతనం ఇచ్చే విషయం కాస్త ఆలస్యమైంది. (ఇదీ చదవండి: టాలీవుడ్ లక్కీ హీరోయిన్ పెళ్లి చేసుకోనుందా? అందుకే ఇలా!) ఈ క్రమంలోనే తమకు రావాల్సిన డబ్బు ఇంకా రాలేదని దాదాపు 400 మంది కూలీలు.. షూటింగ్ లొకేషన్లో ఆందోళన చేశారు. అటుగా వెళ్తున్న హీరో కారుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీన్లోకి ఎంటరైన పోలీసులు.. కూలీలకు సర్దిచెప్పారు. హీరోకు ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అతడు కారుని పోనిచ్చారు. ఆ తర్వాత వివాదం కూడా సద్దుమణిగింది. గతేడాది 'సామజవరగమన' సినిమాతో హిట్ కొట్టిన శ్రీవిష్ణు.. ప్రస్తుతం పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు తెలుగమ్మాయి రీతూవర్మ కూడా గతేడాది 'మార్క్ ఆంటోని', 'ధృవ నక్షత్రం' లాంటి మూవీస్తో ప్రేక్షకుల్ని పలకరించింది. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న మూవీకే తాజాగా సమస్య ఎదురైంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'యానిమల్'.. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్?) -
కోటబొమ్మాళి పీఎస్ ట్విటర్ రివ్యూ.. టాక్ ఏంటంటే?
ఎస్ఐ రామకృష్ణగా శ్రీకాంత్, కానిస్టేబుల్ కుమారిగా శివానీ రాజశేఖర్, కానిస్టేబుల్ రవిగా రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘నాయట్టు’కు ఇది రీమేక్గా తెరకెక్కింది. వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్రలో కనిపించింది. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడు నిర్మించిన ఈ చిత్రం నేడు (నవంబర్ 24న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమాకు రివ్యూ ఇచ్చిన శ్రీవిష్ణు దీంతో సినిమా చూసిన జనాలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. చివరి 20 నిమిషాలు చాలా ఎమోషనల్గా ఉందంటున్నారు. శ్రీకాంత్ కెరీర్లోనే ఇది బెస్ట్ చిత్రంగా నిలుస్తుందంటున్నారు. డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవల్లో ఉన్నాయంటున్నారు. హీరో శ్రీవిష్ణు సైతం సినిమాపై రివ్యూ ఇచ్చాడు. 'పోలీసుల్ని పోలీసులే ఛేదించడం.. శ్రీకాంత్, వరలక్ష్మి మధ్య వచ్చే సన్నివేశాలు టెర్రిఫిక్గా ఉన్నాయి' అని ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చాడు. ఆ సన్నివేశాలు గూస్బంప్స్.. డైరెక్టర్ హరీశ్ శంకర్ సైతం ఈసినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. 'శ్రీకాంత్, వరలక్ష్మి మధ్య వచ్చే సన్నివేశాలు పిల్లి- ఎలుకల కొట్లాటలా అనిపిస్తుంది. ఈ సన్నివేశాలే ప్రేక్షకుడిని సీట్లకు అతుక్కుపోయేలా చేస్తాయి. చాలాకాలం తర్వాత శ్రీకాంత్గారు గుర్తుండిపోయే పాత్ర చేశారు. అతడి పర్ఫామెన్స్ అందరికీ గూస్బంప్స్ తెప్పిస్తాయి. ఈ థ్రిల్లర్ మూవీలో ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. అవి అందరికీ కనెక్ట్ అవుతాయి. అలాగే ప్రస్తుతం ఉన్న వ్యవస్థ గురించి పవర్ఫుల్ డైలాగులు కూడా ఉన్నాయి. వాటికి నేను చాలా కనెక్ట్ అయ్యాను. నిర్మాతల గుండెధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే' అని ఎక్స్లో రాసుకొచ్చాడు. Fantastic #KotaBommaliPS Every scene pure Mass 🔥 Must watch everyone pic.twitter.com/tZo484lviq — RC Varagani 🔥 (@VaraganiSaikum2) November 24, 2023 Mental Mass Entertainer#KotaBommaliPS Worth Watching Movie 👌🔥🔥🔥 pic.twitter.com/ZJIK2KsHvA — Cherry 🍒 (@Rammm755) November 24, 2023 Mind Blowing #KotaBommaliPS 🔥🔥🔥🔥 Best Movie Avuthundhi E year Lo Don't Miss It pic.twitter.com/cy6RFY20t1 — Kranthi 🔥 (@iamkranthi99) November 24, 2023 Movie chala bagundhi very interesting and thrilling go and Watch#KotaBommaliPS pic.twitter.com/cTgQvoh6sQ — Sweety 🦚 (@Pravallika7C) November 24, 2023 Gripping Screenplay 💥 Twists kuda next level unayi #KotaBommaliPS pic.twitter.com/pbFUW5oEY7 — Ramcharan tej (@Ramcharan14377) November 24, 2023 USA is reporting positive things about #KotaBommaliPS❤️🔥Applause for the amazing performances, gripping story, and intense drama is universal 👏 — Rainbow 💞 (@_AAnshu_) November 24, 2023 Watched #KotabommaliPS an intruding movie to watch on the big screens done by @DirTejaMarni . The unique plot of police chasing police and the scenes between @actorsrikanth Garu and @varusarath5 Garu are terrific.@Rshivani_1, @ActorRahulVijay & Each of the performances is… — Sree Vishnu (@sreevishnuoffl) November 23, 2023 I just finished watching the film #KotaBommaliPS. The screenplay between #Srikanth and #VaralaxmiSarathkumar, as well as their cat and mouse game, will have everyone glued to their seats in the theatres. After a long time, #Srikanth garu got a remarkable character, and his… — Harish Shankar .S (@harish2you) November 23, 2023 చదవండి: అమర్దీప్కు ఫిట్స్.. తనకు ఆ అనారోగ్య సమస్య ఉందన్న నటుడు -
హత్యా? ఆత్మహత్యా?
స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు ప్రధానపాత్రల్లో నటించిన ఇంటరాగేటివ్ ఫిల్మ్ ‘ది ట్రయల్’. రామ్ గన్ని దర్శకత్వంలో స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ను హీరో శ్రీ విష్ణు విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ది ట్రయల్’ ట్రైలర్ చాలా ఆసక్తిగా ఉంది. రామ్ ఈ సినిమా కథను బాగా డీల్ చేశారనిపిస్తోంది. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘కథ రీత్యా సబ్ఇన్స్పెక్టర్ రూప, ఆమె భర్త అజయ్ ఓ అపార్ట్మెంట్ టెర్రస్పై తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంటారు. అజయ్ కాలుజారి ఆ బిల్డింగ్పై నుంచి పడి చనిపోతాడు. తన భర్తను రూపే చంపిదనే అనుమానం తెరపైకి వస్తుంది. అయితే తన భర్తది ఆత్మహత్య అని రూప చెబుతుంది. అసలు.. అజయ్ది హత్యా? ఆత్మహత్యా? అనేది ఈ సినిమా ప్రధాన కథాంశం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
భయానక చిత్రం
శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ (భయానక చిత్రం) అనేది ఉపశీర్షిక. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ని హీరో శ్రీ విష్ణు ఆవిష్కరించి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. సాయికిరణ్ దైదా మాట్లాడుతూ–‘‘పూర్తి స్థాయి హారర్ నేపథ్యంలో ‘పిండం’ ఉంటుంది. ఈ చిత్ర కథ ప్రస్తుతం, 1990, 1930.. ఇలా మూడు కాలాల్లో జరుగుతుంది. స్క్రీన్ ప్లే హైలైట్గా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా సినిమా టీజర్ను ఈ నెల 30న రిలీజ్ చేస్తాం. నవంబర్లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు యశ్వంత్ దగ్గుమాటి. ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సతీష్ మనోహర్, సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి. -
ముగ్గురి స్నేహితుల అదృష్టం
నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్ ప్రధాన పాత్రధారులుగా నటించిన క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘కిస్మత్’. అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో రియా సుమన్ హీరోయిన్. శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో రాజు నిర్మించిన ఈ చిత్రం నవంబరులో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ను హీరో శ్రీ విష్ణు విడుదల చేశారు. ముగ్గురు స్నేహితులు తమ జీవితంలో ఏదైనా అద్భుతం జరగాలని ఆశిస్తుంటారు. విశ్వదేవ్ నమ్మకం కోల్పోయి ఉంటాడు. అభినవ్ గోమఠంకి సినీ రచయిత అవ్వాలన్నది కల. రియా సుమన్తో నరేశ్ అగస్త్య ప్రేమలో ఉంటాడు. ఓ సంఘటనతో ఈ ముగ్గురి కిస్మత్ (అదృష్టం) ఎలా మారిపోయింది అనేది ఈ చిత్రకథ అని యూనిట్ పేర్కొంది. ఇక టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ అగస్త్య మాట్లాడుతూ– ‘‘కిస్మత్’ లాంటి చిత్రాలు మౌత్ టాక్ వల్లే హిట్టవుతాయి. ప్రేక్షకులు మమ్మల్ని సపోర్ట్ చేయాలి’’ అన్నారు. ‘‘మంచి క్రైమ్ కామెడీ ఫిల్మ్ ఇది’’ అన్నారు అభినవ్ గోమఠం. ‘‘చక్కని ఫన్ ఫిల్మ్ ఇది’’ అన్నారు విశ్వదేవ్. ‘‘రాజు రెండేళ్ల పాటు ఈ సినిమా స్క్రిప్ట్పై వర్క్ చేశారు. నరేశ్, అభినవ్, విశ్వలతో పాటు అందరూ అద్భుతంగా నటించారు’’ అన్నారు శ్రీనాథ్. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె. రాబిన్, కెమెరా: వేదరామన్ శంకర్, సహనిర్మాత: భాను ప్రసాద్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భరత్ రెడ్డి. -
అలా చేయాలంటే చాలా ధైర్యం కావాలి – శర్వానంద్
‘‘మేం ఒక్క పాత్ర చేయడానికి చాలా కష్టపడుతున్నాం. అలాంటిది ‘మామా మశ్చీంద్ర’లో సుధీర్ ఏకంగా మూడు పాత్రలు చేశారు.. ఇలా చేయాలంటే చాలా ధైర్యం కావాలి’’ అన్నారు శర్వానంద్. సుధీర్బాబు హీరోగా హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ఈషా రెబ్బా, మృణాళినీ రవి హీరోయిన్లు. సోనాలి నారంగ్, సృష్టి సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి హీరోలు శర్వానంద్, విశ్వక్ సేన్, శ్రీ విష్ణు, డైరెక్టర్ శేఖర్ కమ్ముల అతిథులుగా హాజరయ్యారు. ‘‘సుధీర్ మూడు పాత్రలు చేశారంటే కథ ఎంత విలక్షణంగా ఉండి ఉంటుందో అర్థమవుతోంది’’ అన్నారు విశ్వక్ సేన్. ‘‘సుధీర్ కొత్త రకం కథలు ప్రయత్నిస్తుంటారు’’ అన్నారు శ్రీ విష్ణు. ‘‘మామా మశ్చీంద్ర’లో మంచి కథ, పాటలు, వినోదం.. అన్నీ ఉంటాయి’’ అన్నారు సుధీర్బాబు. ‘‘ఇది ఒక అమ్మ, తండ్రీకూతుళ్ల కథ’’ అన్నారు హర్షవర్ధన్. ‘‘రచయితల నుంచి డైరెక్టర్స్గా మారిన త్రివిక్రమ్, కొరటాల శివల్లా హర్షవర్ధన్ కూడా పెద్ద డైరెక్టర్ కావాలి’’ అన్నారు పుస్కూర్ రామ్మోహన్ రావు. -
‘జోరుగా హుషారుగా’ విరాజ్ అశ్విన్
‘ఒక కలలా నువ్వలా నిజమయ్యావే నా బంగారు బొమ్మ’ అంటూ ‘జోరుగా హుషారుగా..’ చిత్రంలోని ‘యువరాణి’ పాట సాగుతుంది. విరాజ్ అశ్విన్, పూజితా పొన్నాడ జంటగా అనుప్రసాద్ దర్శకత్వంలో నిరీష్ తిరువీధుల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలోని ‘యువరాణి యువరాణి నువ్వు..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను హీరో శ్రీ విష్ణు రిలీజ్ చేసి, ‘‘ఈ సినిమా ఓ జెన్యూన్ లవ్స్టోరీలా అనిపిస్తోంది’’ అన్నారు. సంగీత దర్శకుడు ప్రణీత్ స్వరపరచిన ‘యువరాణి’ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా అమ్రాన్ మాలిక్, నవ్య సమీర పాడారు. ‘‘త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత. -
సక్సెస్ మీట్లో మాట్లాడి ఐదేళ్లయింది
‘‘క్లాక్స్ నాకు 2009 నుంచి పరిచయం. అప్పట్నుంచి నాకు కథలు చెబుతుంటాడు. డిఫరెంట్ కాన్సెప్టుల్లో నటించడం, చేయడం కాస్త కష్టం.. నిర్మాతలు ముందుకు రారు, కమర్షియల్ ఫార్మాట్లో సినిమా చేయమని తనతో చెప్పాను. కానీ బెన్నీలాంటి నిర్మాతలు ఇప్పుడు కొత్త కథలను ప్రోత్సహిస్తున్నారు. ఇక కొత్త కొత్త పాత్రలు చేస్తున్న కార్తికేయకు పెద్ద హిట్ పడాలని అనుకున్నాను. ఇప్పుడు ‘బెదురులంక’తో హిట్ కొట్టేశాడు’’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు. కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ’బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం గత వారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన విజయోత్సవంలో హీరో శ్రీ విష్ణు, దర్శకుడు అజయ్ భూపతి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ‘‘కార్తికేయకు హిట్ వస్తే నాకూ హిట్ వచ్చినట్టే’’ అని అజయ్ భూపతి అన్నారు. కార్తికేయ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి బాగుందని అందరూ చెప్పిన తర్వాత పెద్ద రిలీఫ్ అనిపించింది. ఇలా సక్సెస్ మీట్లో మాట్లాడి ఐదేళ్లయింది. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత నేను చేసిన సినిమాలు అనుకున్న రేంజ్కు వెళ్లలేదు. ఒక్క హిట్ వస్తే చాలనుకున్న టైమ్లోనే ‘బెదురులంక’ వచ్చింది’’ అన్నారు. ‘‘సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని. ఇంకా బీవీఎస్ రవి, నేహా శెట్టి తదితరులు మాట్లాడారు. ∙బెన్నీ, శ్రీ విష్ణు, కార్తికేయ, నేహాశెట్టి -
కొత్తవాళ్లు సక్సెస్ అవ్వాలి
విజయ్ రాజ్కుమార్, నేహా పఠాని జంటగా భరత్ మిత్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్?’. నవీన్ కురవ, కిరణ్ కురవ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ విష్ణు మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీలో కొత్తవాళ్లు విజయం సాధిస్తే నాకు సంతోషంగా ఉంటుంది. దర్శకుడు భరత్కు మంచి విజన్ ఉంది. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘18–30 వయసు మధ్య ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది’’ అన్నారు భరత్ మిత్ర. ‘‘ఈ సినిమా ఫస్ట్ హాఫ్ డీసెంట్గా, సెకండాఫ్లో ఆడియన్స్ తల తిప్పుకోలేని సీన్స్ ఉంటాయి’’ అన్నారు విజయ్ రాజ్కుమార్. -
చిన్న సినిమాలకు మీడియా సపోర్ట్ చేయాలి: శ్రీవిష్ణు
‘చిన్న సినిమాలకు ప్రమోషన్స్ కొంచెం కష్టం. కానీ మీడియా సపోర్ట్ చేస్తే అదేమంత కష్టం కాదు. కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయాలి. నాకు సపోర్ట్ చేసినట్లే ‘ఏం చేస్తున్నావ్’ చిత్రబృందానికి కూడా మీడియా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. విజయ్ రాజ్ కుమార్, నేహా పఠాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం 'ఏం చేస్తున్నావ్’. భరత్ మిత్ర దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రాన్ని NVR ప్రొడక్షన్, SIDS క్రియేటివ్ వరల్డ్ బ్యానర్లపై నవీన్ కురవ, కిరణ్ కురవ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ని హీరో శ్రీవిష్ణు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఏం చేస్తున్నావ్’.. నా జీవితంలో ఎక్కువగా ఉన్న ప్రశ్న ఇదే . ఇందులో చాలా అర్థాలు ఉంటాయి. టైటిల్తో పాటు టీజర్ కూడా చాలా బాగుంది. గోపి సుందర్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుందని సాంగ్స్ చాలా బాగున్నాయి. డైరెక్టర్ భరత్ కు మంచి విజన్ ఉంది. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ‘ఈ చిత్రం 18-30 ఏళ్ల వయసు వారికి బాగా కనెక్ట్ అవుతుంది. థియేటర్కి వచ్చిన ప్రేక్షకుడికి మంచి అనుభూతి అందిస్తుంది’అని దర్శకుడు భరత్ మిశ్రా అన్నారు. సినిమా మస్త్ ఉంటదని, ఫస్ట్ ఆఫ్ డీసెంట్ గా ఉంటుందని, సెకండ్ హాఫ్ తల తిప్పుకొని సన్నివేశాలు ఉంటాయని హీరో విజయ రాజ్ కుమార్ తెలిపారు. -
నమ్మకం నిజమైంది
శ్రీ విష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సామజ వరగమన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమా జూన్ 29న విడుదలైంది. తాజాగా ఈ సినిమా రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను సాధించిందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా రాజేష్ దండా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కథ విన్నప్పుడే చాలా నవ్వుకున్నాం. ఈ కథలో యూనిక్ పాయింట్ ఉంది. అందుకే ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘గీత గోవిందం’ వంటి సినిమాల తరహా స్క్రిప్ట్ ‘సామజ వరగమన’ అని మేం నమ్మాం. మా నమ్మకం నిజమైంది. ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేయడం లాభించింది. ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేసే ఆలోచన ఉంది’’ అన్నారు. -
సామజవరగమన ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది
శ్రీవిష్ణు, నరేశ్ తండ్రీకుమారులుగా నటించి ప్రేక్షకులందరిని కడుపుబ్బా నవ్వించిన కామెడీ ఎంటర్టైనర్ ‘సామజవరగమన’ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఇందులో రామ్ అబ్బరాజు దర్శకుడు. రెబా మోనికా జాన్ కథానాయిక. శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. (ఇదీ చదవండి: సినీ నటిపై రేప్.. ఇంటర్వ్యూ పేరుతో హోటల్కు తీసుకెళ్లి ఆపై) మోస్ట్ ఎంటర్టైనింగ్ మూవీ ఆఫ్ ది ఇయర్గా నిలిచిన సామజవరగమన ఓటీటీ రిలీజ్కు ముహూర్తం ఖరారైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన ఆహాలో జులై 28న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను సొంతం చేసుకున్న ఆహా ఈమేరకు అధికారికంగానే ప్రకటించింది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా జూన్ 29న విడుదలైన ‘సామజవరగమన సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమా విడుదలకు ముందు కేవలం మూడు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే జరిగింది. తర్వాత సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో దాని బిజినెస్ లెక్కలు మారిపోయాయి. కేవలం రూ. 7కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ. 50 కోట్లకు పైగానే రాబట్టింది. ఇంత సూపర్ హిట్ అయిన సినిమాను జులై 28న 'ఆహా' ఓటీటీలో చూసేయండి. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
ఓటీటీలోకి 'సామజవరగమన'.. ఆ రోజే రిలీజ్!
ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందనేది ఎవరూ చెప్పలేరు. ఈ మధ్య కాలంలో అలా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి, సూపర్హిట్ అయిన మూవీ 'సామజవరగమన'. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ చిత్రం.. ఇప్పటికి రెండు వారాలకు అవుతున్నా విజయవంతంగా ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. (ఇదీ చదవండి: తెలుగు హీరోతో ధోనీ కొత్త సినిమా?) సినిమాల్లో మిగతా వాటి సంగతేమో గానీ కామెడీ జానర్ అనేది ఎవర్గ్రీన్. కరెక్ట్ గా వర్కౌట్ అయితే రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇంకా బాగుంటే కలెక్షన్స్ గట్టిగా వస్తాయి. అలానే జస్ట్ రూ.7 కోట్లతో తీసిన సినిమా 'సామజవరగమన'.. పెద్దగా పబ్లిసిటీ లేకుండానే థియేటర్లలో రిలీజ్ చేశారు. తొలి రెండు రోజుల అంతంతమాత్రంగా ఉన్న ఈ సినిమా శనివారం నుంచి రయ్ మని దూసుకెళ్లింది. ప్రస్తుతం మూడు-నాలుగు రెట్ల లాభాలని సొంతం చేసుకుంది. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ఫుల్గా 'సామజవరగమన'.. డిజిటల్ హక్కుల్ని ఆహా సొంతం చేసుకుంది. జూలై 28 నుంచి ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఆల్రెడీ చూసినవాళ్లు కూడా మళ్లీ చూస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. (ఇదీ చదవండి: పెళ్లయిన నటితో తెలుగు యాక్టర్ డేటింగ్?) నవ్వడం ఒక భోగం....😄 నవ్వించడం ఒక యోగం💁🏻♀️ సామజవరగమన దానికి చక్కటి రూపం.😉 ఇక నో ఆలస్యం...ఈ నెల 28 న ఆహాలో కలుద్దాం..!#SamajavaragamanaOnAHA@sreevishnuoffl @Reba_Monica @ItsActorNaresh @RamAbbaraju @AnilSunkara1 @RajeshDanda_ @HasyaMovies @AKentsOfficial pic.twitter.com/P5TcmbR87O — ahavideoin (@ahavideoIN) July 21, 2023 -
శ్రీ విష్ణు కెరీర్లో బిగ్గెస్ట్ కలెక్షన్స్.. ఈ కథ అతని వద్దకు ఎలా వచ్చిందంటే?
శ్రీ విష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన 'సామజవరగమన' మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. మొదట ఎటువంటి బజ్ లేకుండా థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు టాలీవుడ్లో మంచి టాక్ అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కలెక్షన్ల పరంగానూ రోజు రోజుకూ పెంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 30.1 కోట్లు వసూలు చేసి శ్రీవిష్ణు కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. (ఇదీ చదవండి: హీరో విజయ్ నన్ను బెదిరిస్తున్నాడు.. అరెస్ట్ చేయండి: ప్రియ) ఈ విజయం అతని కెరీర్లో టర్నింగ్ పాయింట్గా నిలుస్తుంది. ఇప్పటికే 'సమాజవరగమన' చూసిన అల్లు అర్జున్,రవితేజ వంటి సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. దీంతో ఈ సినిమాకు మరింత పబ్లిసిటీ దక్కింది. క్లాస్ స్టోరీతో పాటు కామెడీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా వైపు ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా క్యూ కట్టేలా చేస్తోంది. 'సామజవరగమన'ను రిజెక్ట్ చేసిన హీరో దర్శకుడు రామ్ అబ్బరాజు 'సామజవరగమన' కథ కోసం హీరోగా శ్రీ విష్ణును అనుకోలేదట. రామ్ అబ్బరాజు గతంలో వివాహభోజనంబు సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ సినిమాకు సందీప్ కిషన్ నిర్మాతగా వ్యవహరించాడు. ఆ పరిచయంతో సందీప్ కోసం కథను రెడీ చేశాడట రామ్. కానీ అప్పటికే మైఖేల్ సినిమాతో సందీప్ బిజీగా ఉండటంతో ఈ సినిమాలోకి శ్రీ విష్ణు ఎంట్రీ ఇచ్చేశాడని టాక్. (ఇదీ చదవండి: ఆలయంలో ప్రేమికులు చేసిన పనిని సమర్థించిన నటి) -
'మెగాస్టార్ చెయ్యి నా గుండెను తాకడంతోనే మా జాతకం మారిపోయింది'
'సామజ వరగమన’ కథని రామ్ చెప్పినప్పుడే ‘నువ్వు నాకు నచ్చావ్’ లాంటి సినిమా అవుతుందని నమ్మాను. నా నమ్మకం నిజమైంది. ‘సామజ వరగమన’ చూసి అందరూ హాయిగా నవ్వుతున్నారు' అని హీరో శ్రీ విష్ణు అన్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా రూపొందిన చిత్రం ‘సామజ వరగమన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమా జూన్ 29న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో చిత్ర యూనిట్ నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్లో శ్రీ విష్ణు మాట్లాడుతూ– 'ఈ సినిమా ట్రైలర్ లాంచ్ టైమ్లో చిరంజీవిగారి చేయి నా గుండె మీద ఎప్పుడైతే ఆటోగ్రాఫ్గా పడిందో అప్పటి నుంచి ఈ సినిమా జాతకం మారిపోయింది’ అన్నారు. ‘‘నవ్వించడం అంత తేలిక కాదు. ఆ విషయంలో వెంకటేశ్గారు సీనియర్ మోస్ట్. ఆ ప్లేస్కి ఇప్పుడు శ్రీవిష్ణు యాప్ట్’’ అన్నారు అనిల్ సుంకర. ‘‘ఐదు రోజులుగా నిద్రపట్టడం లేదు. అంత సంతోషంగా ఉంది’’ అన్నారు రాజేష్ దండా. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులు మా సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు రామ్ అబ్బరాజు. ఈ కార్యక్రమంలో దర్శకులు మెహర్ రమేష్, విజయ్ కనకమేడల, వశిష్ట, నటుడు వీకే నరేష్, రెబా మోనికా జాన్ మాట్లాడారు. -
‘ఏజెంట్’ ఫలితం నన్ను మార్చింది.. మళ్లీ ఆ తప్పు జరగదు: నిర్మాత
'ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. వాటి ద్వారా నిర్మాతలకు అదనపు ఆదాయం వస్తోంది. ఏప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చినా అది ఇండస్ట్రీకి వచ్చినట్లే. రేపు మా సినిమా కూడా రీ రిలీజ్కి రావచ్చు.. అది నిర్మాతలకు మంచిదే' అని నిర్మాత అనిల్ సుంకర అన్నారు. శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సామజ వరగమన’. అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైన్ మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమా జూన్ 29 విడుదలైంది. ఈ సందర్భంగా అనిల్ సుంకర మాట్లాడుతూ... ► ‘సామజ వరగమన’ మా యూనిట్ నమ్మకాన్ని నిలబెట్టింది. ఈ విజయం చాలా తృప్తి ఇచ్చింది. ఈ కథకు శ్రీ విష్ణు కరెక్ట్గా సరిపోయాడు. మహేశ్ బాబు, నాని, శ్రీవిష్ణు... ఇలా ఎవరి మార్కెట్ వాళ్లది. ‘సామజ వరగమన’ని తమిళంలో రీమేక్ చేయాలనే ఆలోచన ఉంది. ఇదే కాంబినేషన్లో మళ్లీ ఓ సినిమా ఉంటుంది. ► ‘ఏజెంట్’ ఫలితం విషయంలో యూనిట్ అందరి తప్పు ఉంది. కొన్ని కారణాల వల్ల బౌండ్ స్క్రిప్ట్తో వెళ్లలేకపోయాం. ఇకపై పూర్తి కథ లేనిదే ఏ సినిమాని సెట్స్పైకి తీసుకెళ్లను. పెద్ద సినిమాలకు కాంబినేషన్ని బట్టి బిజినెస్ ఉంటుంది. కానీ, చిన్న సినిమాలకు కొంచెం రిస్క్ ఉంటుంది. కథ బాగుంటేనే వర్కవుట్ అవుతాయి. ► మా బ్యానర్లో తీసిన ‘హిడింబ’ ట్రైలర్ నచ్చడంతో టేబుల్ ప్రాఫిట్ బిజినెస్ జరిగింది. అలాగే ‘ఊరు పేరు భైరవ కోన’ కంటెంట్ కూడా యూనిక్గా ఉంటుంది. చిరంజీవిగారితో తీస్తున్న ‘భోళా శంకర్’ ఫ్యామిలీ మూవీ. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఆగస్ట్ 11న సినిమా విడుదలవుతుంది. కీర్తి సురేష్, చిరు మధ్య ఉండే సీన్లు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తాయి. -
చిన్న సినిమా.. పెద్ద సక్సెస్.. కోట్లకు కోట్లు!
ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందనేది అస్సలు చెప్పలేం. అలా గతవారం నిఖిల్ పాన్ ఇండియా చిత్రం 'స్పై' రిలీజైంది. కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో తడబడింది. దీనితోపాటే థియేటర్లలోకి వచ్చిన 'సామజవరగమన' అనే చిన్న సినిమా అనుహ్యంగా హిట్ అయిపోయింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా తీసిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కుమ్మేస్తోంది. ఇంతకీ వసూళ్ల సంగతేంటి? లాభాలు ఎంత? 'సామజవరగమన' కథేంటి? బాలు(శ్రీవిష్ణు) ఓ మల్టీప్లెక్స్ లో పనిచేస్తుంటాడు. తండ్రి ఉమా మహేశ్వరరావు(సీనియర్ నరేష్)ని డిగ్రీ పాస్ చేయించేందుకు తిప్పలు పడుతుంటాడు. ఎందుకంటే డిగ్రీ పాస్ అయితేనే తాత వీలునామా ప్రకారం కోట్ల రూపాయల ఆస్తి తండ్రికి దక్కుతుంది. అలా తండ్రితో పరీక్షలు రాయించే క్రమంలో సరయూ(రెబా మోనికా జాన్) పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ తన బావ పెళ్లి వల్ల బాలుకి చిక్కులు వస్తాయి. ఇంతకీ అవేంటి? బాలు-సరయూ ఒక్కటయ్యారా అనేదే స్టోరీ. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు) కలెక్షన్స్ ఎంత? ఈ సినిమా విడుదలకు రెండు మూడు రోజుల ముందే ప్రీమియర్స్ వేశారు. అప్పుడే పాజిటివ్ టాక్ వచ్చింది. అయినాసరే విడుదలైన తొలిరోజు మోస్తరు ఓపెనింగ్స్ వచ్చాయి. కేవలం రూ.2.89 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. రెండో రోజుల్లో రూ.6.31 కోట్ల గ్రాస్ వచ్చింది. మూడోరోజుకి అయితే.. తొలి రెండురోజుల్లో వచ్చిన దానికి రెట్టింపు వసూళ్లు దక్కాయి. అంటే రూ.12.96 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. నాలుగురోజైన ఆదివారం దాదాపు రూ.7 కోట్ల వరకు వచ్చాయి. దీంతో మొత్తం కలిపి రూ.19.80 కోట్ల గ్రాస్ లభించినట్లు చిత్రబృందం ప్రకటించింది. సక్సెస్కి కారణమేంటి? ఓ చిన్న సినిమాకు అదీ కూడా ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన దానికి ఈ తరహా హిట్ టాక్ రావడం చాలా అరుదైన విషయం. 'సామజవరగమన' ఇది చేసి చూపించింది. కుటుంబమంతా కలిసి చూసేలా ఎంటర్ టైన్మెంట్ ఉండటం చాలా కలిసొచ్చింది. ముందు వారాల్లో వచ్చిన సినిమాలు పెద్దగా జనాల్ని అలరించకపోవడం ఈ చిత్రానికి ప్లస్ అయింది. ఓవరాల్గా ఈ సినిమాకు రూ.7 కోట్లు పెట్టుబడి పెట్టారని, ఈ పాటికే ఆ మొత్తం వచ్చేసినట్లు సమాచారం. ఇకపై వచ్చే కలెక్షన్ అంతా లాభామే! BALU gadi family ni intha baga receive chesukunna prathi family ki 🙏🏻🙏🏻 Couldn't have asked for a better reception than this to our #Samajavaragamana ❤️ pic.twitter.com/TIoH87l9ZA — Sree Vishnu (@sreevishnuoffl) July 3, 2023 (ఇదీ చదవండి: ఒక్క సినిమా.. 35 పాటలు.. అదే అసలు సమస్య!) -
‘సామజవరగమన’ మూవీ రివ్యూ
టైటిల్: సామజవరగమన నటీనటులు: శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్, వీకే నరేశ్, శ్రీకాంత్, వెన్నెల కిశోర్, సుదర్శన్ తదితరులు నిర్మాణ సంస్థ:హాస్య మూవీస్ నిర్మాత: రాజేశ్ దండా సమర్పణ: అనిల్ సుంకర్ దర్శకత్వం: రామ్ అబ్బరాజు సంగీతం: గోపీ సుందర్ సినిమాటోగ్రఫీ:రామ్ రెడ్డి ఎడిటర్: ఛోటా కె. ప్రసాద్ విడుదల తేది: జూన్ 29, 2023 వైవిద్యమైన సినిమాలు చేస్తూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకెళ్లిన ఈ యంగ్ హీరోకి ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త వెనకబడ్డాడు. ఆయన నటించిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ‘సామజవరగమన’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్,ట్రైలర్ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడేలా చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సామజవరగమనపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? శ్రీవిష్ణుకి అచ్చొచ్చిన కామెడీ జానర్తో హిట్ ట్రాక్ ఎక్కడా ? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. బాలసుబ్రహ్మణ్యం అలియాస్ బాలు(శ్రీవిష్ణు) థియేటర్ బాక్సాఫీస్లో ఉద్యోగం చేస్తుంటాడు. అతని తండ్రి ఉమామహేశ్వరరావు(నరేశ్)కు వేలకోట్ల ఆస్తి ఉంటుంది కానీ.. కొడుకు డిగ్రీ పాసైతేనే అది అతనికి చెందుతుందని బాలు తాత వీలూనామా రాసి చనిపోతాడు. దీంతో తన తండ్రిని ఎలాగైనా డిగ్రీ పాస్ చేయించాలని నానా ఇబ్బందులు పడుతూ చదివిస్తుంటాడు బాలు. ఉమామహేశ్వరరావు మాత్రం 30 ఏళ్లుగా డిగ్రీ పరీక్షలు రాస్తూనే ఉంటాడు. బాలు ఒక్కడే ఉద్యోగం చేసి ఫ్యామిలీని పోషిస్తుంటాడు. ఓ సారి ఎగ్జామ్ హాల్లో ఉమామహేశ్వరరావుకు డిగ్రీ పరీక్షలు రాసేందుకు వచ్చిన స్టూడెంట్ సరయు(రెబా మౌనికా జాన్) పరిచయం అవుతుంది. ఆమెకు హాస్టల్లో ఉండడం ఇబ్బంది కావడంతో బాలు ఇంట్లోకి పెయింగ్ గెస్ట్గా వస్తుంది. బాలు ప్రవర్తను చూసి అతనితో ప్రేమలో పడుతుంది. బాలుకి మాత్రం ప్రేమ అంటే అస్సలు నచ్చదు. అంతేకాదు ఏ అమ్మాయి అయినా ప్రేమిస్తున్నాను అని చెబితే వెంటనే ఆమెతో రాఖీ కట్టించుకుంటాడు. అలాంటి బాలు సరయుతో ఎలా ప్రేమలో పడ్డాడు? ఐలవ్ యూ చెప్పిన అమ్మాయిలతో బాలు ఎందుకు రాఖీ కట్టించుకుంటాడు? సరయు తండ్రి(శ్రీకాంత్ అయ్యంగార్)కి ప్రేమ పెళ్లిళ్లు అంటే ఎందుకు నచ్చదు? సరయు అక్కకి, బాలు బావకి పెళ్లి సెట్ అయిన తర్వాత వీరి ప్రేమకు ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయి? బాలు తండ్రి డిగ్రీ పాస్ అయ్యాడా? లేదా? చివరకు సరయు, బాలు ఎలా ఒక్కటయ్యారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కొన్ని సినిమాల కథలు చెప్పడానికి చాలా సింపుల్గా ఉంటాయి. కానీ తెరపై చూస్తే మాత్రం వినోదాన్ని పంచుతాయి. ఆ కేటగిరీలోకి ‘సామజవరగమన’ వస్తుంది. కథలో కొత్తదనం లేకున్నా చక్కటి స్క్రీన్ప్లేతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు రామ్. కరెంట్ పంచ్ డైలాగులతో హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో కథను రాసుకున్నాడు. అలా అని పూర్తిగా కామెడీనే నమ్ముకోలేదు. కావాల్సిన చోట ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకునేందుకు ఎమెషనల్ సన్నివేశాలను కూడా యాడ్ చేశాడు. సినిమాలోని ప్రతి పాత్రకు కామెడీ టచ్ ఉంటుంది. తండ్రిని డిగ్రీ పరీక్ష పాస్ చేయించడం కోసం కొడుకు పడే ఇబ్బందులతో సినిమా ప్రారంభం అవుతుంది. ప్రతి సీన్ హిలేరియస్గా ఉంటుంది. ట్యూషన్ సెంటర్లో నరేశ్, హీరోయిన్ చేసే కామెడీ, రఘుబాబు వేసే ప్రశ్నలు నవ్వులు పూయిస్తాయి. ప్రేమ పేరుతో అమ్మాయిలు చేసే మోసాల గురించి హీరో చెప్పే నాన్స్టాప్ డైలాగ్ అయితే ఫస్టాఫ్కే హైలెట్. ఈ డైలాగ్కి యూత్ అంతా కనెక్ట్ అవుతారు. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా సెకండాఫ్పై ఆసక్తికి పెంచుతుంది.ఇక సెకండాఫ్ కూడా కథను పూర్తి వినోదాత్మకంగా మలిచాడు దర్శకుడు. అయితే ఈ క్రమంలో కొన్నిచోట్ల కథను సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ‘కుల’ శేఖర్గా వెన్నెల కిశోర్ కామెడీ బాగా వర్కౌట్ అయింది.అయితే ఈ తరహా పాత్రతో యూట్యూబ్లో చాలా వీడియోలు వచ్చాయి. నాని ‘జర్సీ’లోని ఓ ఎమోషనల్ సీన్ని పేరడీ చేసి బాగా నవ్వించారు. బూతు సీన్లు, డబుల్ మీనింగ్ డైగాల్స్ లేకుండా క్లీన్ కామెడీతో ఇంటిల్లి పాది కలిసి చూసి నవ్వుకునే సినిమా ఇది. ఎవరెలా చేశారంటే.. ఎప్పటి మాదిరే శ్రీవిష్ణు మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు.తన కామెడీ టైమింగ్ సినిమాకు చాలా ప్లస్ అయింది. బాలు పాత్రలో ఒదిగిపోయాడు. కామెడీతో పాటు కావాల్సిన చోట ఎమోషన్ని కూడా చక్కగా పండించాడు. ఇక ఈ సినిమాలో శ్రీవిష్ణు తర్వాత బాగా పండిన పాత్ర నరేశ్ది. తండ్రి పాత్రలు నరేశ్కి కొత్తేమి కాదు కానీ.. ఈ సినిమాలో ఆయన నటించిన తండ్రి పాత్ర మాత్రం చాలా కొత్తది. ఆ పాత్రకు నరేశ్ మాత్రమే న్యాయం చేయగలడు అనేలా అతని నటన ఉంది. ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమాకి నరేశ్ మరో హీరో అనొచ్చు. తనదైన కామెడీతో అందరికి ఆకట్టుకున్నాడు. సరయు పాత్రకి రెబా మౌనికా న్యాయం చేసింది. కుల శేకర్గా వెన్నెల కిశోర్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. ఉన్నంతలో కామెడీ పండించాడు. హీరో ఫ్రెండ్గా సుదర్శన్, హీరోయిన్ తండ్రిగా శ్రీకాంత్ అయ్యంగార్తో పాటు రాజీవ్ కనకాల, రఘుబాబు తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. గోపీసుందర్ సంగీతం పర్వాలేదు. పాటలు అంతగా ఆకట్టుకోలేవు కానీ నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. డైలాగ్స్ ఈ సినిమాకు చాలా ప్లస్. ఎడిటర్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
స్టార్’ లేదా ‘యాక్టర్’ అంటే నా అప్షన్ యాక్టర్కే, ఎందుకంటే..: శ్రీవిష్ణు
‘‘స్టార్ అవ్వడం అనేది మన చేతుల్లో లేదు. అయితే ఎంచుకునే పాత్రలతో మంచి యాక్టర్ అవ్వడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ యాక్టర్ అనిపించుకోవడం అనేది చాలా కష్టం. ‘స్టార్’ లేదా ‘యాక్టర్’ అని ఎవరైనా నాకు అప్షన్ ఇస్తే.. యాక్టర్ అవుతాననే చాలెంజ్నే తీసుకుంటాను’’ అని శ్రీ విష్ణు అన్నారు. శ్రీ విష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సామజ వరగమన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శ్రీ విష్ణు చెప్పిన విశేషాలు.. ►‘సామజవరగమన’లో బాలసుబ్రహ్మణ్యం అనే యువకుడి పాత్రలో నటించాను. థియేటర్ బాక్సాఫీస్లో ఉద్యోగం చేస్తుంటాడు బాలసుబ్రహ్మణ్యం. సో.. కొంతమంది హీరోల డైలాగ్స్ ఈ సినిమాలో ఉంటాయి. నవ్వించడమే పనిగా పెట్టుకుని మేం తీసిన సినిమా ఇది. యూత్కు, ఫ్యామిలీ ఆడియన్స్కు ఈ సినిమా బాగా నచ్చుతుంది. సినిమాలో ఓ సర్ప్రైజింగ్ పాయింట్ కూడా ఉంది. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ ఇలాంటి పాయింట్ రాలేదనే అనుకుంటున్నాం. ►ఇండస్ట్రీలో పెద్ద స్టార్స్ ఎక్కవైపోయారు. పెద్ద దర్శకులు తక్కువైపోయారు. కొన్నిసార్లు స్టార్ డైరెక్టర్స్కే స్టార్ హీరోలు దొరకడం లేదు కూడా. ఇక స్టార్ దర్శకులు మాలాంటి వారితో సినిమాలు చేయాలంటే అది టఫ్ అవుతుంది. దీనికి తోడు మార్కెట్ సమీకరణాలు కూడా ఉంటాయి. అలాగే పెద్ద దర్శకులు కొంతమంది దాదాపు రెండేళ్ల వరకూ సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. నేను సమయం వృథా కాకూడదని కొత్త దర్శకులతో, వీలైతే నేను ఇంట్రడ్యూస్ చేసిన వారితోనే మళ్లీ సినిమాలు చేసుకునేలా ప్లాన్ చేసుకుంటాను. ►విలన్ రోల్స్ చేయడం నాకు ఇష్టమే. అయితే ‘వీరభోగ వసంతరాయలు’, ‘తిప్పరా మీసం’ సినిమాల్లో నెగటివ్ టచ్ ఉండే రోల్స్ చేస్తే ప్రేక్షకులు అంతగా యాక్సెప్ట్ చేయలేదనిపించింది. అందుకే విలన్ రోల్స్ చేయాలనుకోవడం లేదు. ►ప్రస్తుతం హర్ష కొనుగంటి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్లో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే ‘రాజరాజ చోర’కు ప్రీక్వెల్గా హసిత్ గోలి దర్శకత్వంలోనే ఓ సినిమా చేస్తున్నాను. -
కేజీఎఫ్లో బానిసల్లా చూస్తాడు!
‘‘బాక్సాఫీస్ బాలు ఫ్యామిలీ మేము. డబ్బులు అతని దగ్గర తీసుకోండి’ అనే డైలాగ్తో మొదలవుతుంది ‘సామజ వరగమన’ సినిమా ట్రైలర్. శ్రీ విష్ణు హీరోగా ‘వివాహభోజనంబు’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సామజ వరగమన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ను హీరో చిరంజీవి విడుదల చేసి, చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. ‘వాడి దృష్టిలో ఫ్యామిలీ మెంబర్స్ అంటే.. కేజీఎఫ్లో బానిసల్లా చూస్తాడు’ (వీకే నరేశ్), ‘ఎప్పుడైనా ఏదైనా పనికొచ్చే పని చేశావా.. చెత్త నుంచి కూడా కరెంట్ తీస్తున్నారు’ (శ్రీ విష్ణు) అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ‘‘అమ్మాయిల పట్ల విరక్తి పెంచుకునే ఓ మధ్యతరగతి కుర్రాడు బాలు. అయితే రిచ్ లైఫ్స్టైల్ కోరుకునే ఓ అమ్మాయి అతని జీవితంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందనేదే ఈ సినిమా కథ’’ అనిచిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, సహనిర్మాత: బాలాజీ గుత్తా. -
శ్రీ విష్ణు ‘సామజవరగమన’ రిలీజ్ డేట్ ఫిక్స్
శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించిన చిత్రం ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మే 18న రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించి, కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్. -
డిస్ట్రిబ్యూటర్గా ప్రయాణం మొదలుపెట్టి నిర్మాతగా..
‘‘డిస్ట్రిబ్యూటర్గా ప్రయాణం మొదలుపెట్టి, ఆ తర్వాత నిర్మాతగా మారాను. నా వరకు నిర్మాతగానే బావుంది. మనకి నచ్చిన కథతో సినిమా నిర్మించామనే సంతృప్తి ఉంటుంది’’ అన్నారు రాజేష్ దండా. సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘ఊరు పేరు భైరవకోన’, శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ‘సామజవరగమన’ చిత్రాలను అనిల్ సుంకర సమర్పణలో నిర్మించారు రాజేష్ దండా. ఈ రెండు చిత్రాల గురించి రాజేష్ దండా మాట్లాడుతూ– ‘‘స్వామి రారా’తోపాటు దాదాపు 80 చిత్రాలు పంపిణీ చేశాను. ‘కేరాఫ్ సూర్య, ఒక్క క్షణం, నాంది’ చిత్రాలకి కోప్రొడ్యూసర్గా చేశాను. ‘టైగర్’ సినిమా నుంచి సందీప్ కిషన్, వీఐ ఆనంద్లతో ఉన్న పరిచయంతో హాస్య మూవీస్ బ్యానర్ని ప్రారంభించాను. ముందు ‘ఊరు పేరు భైరవకోన’ ప్రారంభించినా, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఫస్ట్ విడుదలైంది. ‘సామజవరగమన’ చిత్రాన్ని ఈ వేసవిలో, ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రాన్ని జులై లేదా ఆగస్ట్లో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నాం. అలాగే సుబ్బు దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్తో నిర్మించనున్న మరో సినిమాను ఆగస్ట్లోప్రారంభిస్తాం. శ్రీవిష్ణుతో మరో సినిమా చర్చల దశలో ఉంది. సాయిధరమ్ తేజ్తో విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనే ప్లాన్ ఉంది’’ అన్నారు. -
ఓ వింత సమస్య
‘ప్రేమించి పెళ్లి చేసుకునేవాళ్లకి క్యాస్ట్ ప్రాబ్లమ్ వస్తుంది లేకపో తే క్యాష్ ప్రాబ్లమ్ వస్తుంది.. ప్రపంచంలో ఎవరికీ రాని వింత ప్రాబ్లమ్ నాకు వచ్చిందేంట్రా’ అని హీరో శ్రీవిష్ణు చెప్పే డైలాగ్లతో ‘సామజవరగమన’ గ్లింప్స్ రిలీజైంది. శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ జంటగా రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘సామజవరగమన’. అనిల్ సుంకర సగర్వ సమర్పణలో రాజేష్ దండా నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణు బర్త్డే (ఫిబ్రవరి 29) సందర్భంగా గ్లింప్స్ని రిలీజ్ చేశారు. ఈ వేసవిలో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సహనిర్మాత: బాలాజీ గుత్తా, సంగీతం: గోపీ సుందర్, కెమెరా: రాంరెడ్డి. -
వేసవిలో సామజవరగమన
శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు డైరెక్టర్. అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘సామజవరగమన’ అనే టైటిల్ ప్రకటించి, ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందు తున్న చిత్రం ఇది. షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ఏడాది వేసవిలో మా సినిమాని విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: బాలాజీ గుత్తా, సంగీతం: గోపీ సుందర్, కెమెరా: రాంరెడ్డి. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న 'అల్లూరి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
శ్రీ విష్ణు, కయదు లోహర్ జంటగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల్లూరి’. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. సెప్టెంబర్ 7న రాత్రి ఎనిమిది గంటల నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ చిత్రం విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీ విష్ణు ఈ సినిమాలో నటించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, రాజా రవింద్ర, పృథ్వీరాజ్, సుమన్, జయవాణి, మధుసుధననరావు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తన్నారు. థియేటర్లలో ఈ సినిమా మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. Alluri. Athaniki oka style undi. Case ni handle chese vidhananiki oka meter undi. Okkasari bari loki digithe, raccha ne🔥#AlluriOnAHA Premieres tomorrow @ 8pm @sreevishnuoffl pic.twitter.com/ju1qu9rEmQ — ahavideoin (@ahavideoIN) October 6, 2022 -
‘అల్లూరి’ ఫిక్షనల్ పాత్ర తీసుకొని వాస్తవ ఘటనలతో రూపొందించాం : శ్రీ విష్ణు
-
ఫస్ట్ పోలీస్ పాత్ర అనగానే లైట్ తీసుకున్న: శ్రీ విష్ణు
‘‘పోలీస్ స్టోరీగా తెరకెక్కిన చిత్రం ‘అల్లూరి’. ఫిక్షనల్ పాత్ర తీసుకొని వాస్తవ ఘటనలతో రూపొందించాం. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది.. చాలామందిలో స్ఫూర్తి నింపుతుంది’’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీ విష్ణు, కయదు లోహర్ జంటగా నటించిన చిత్రం ‘అల్లూరి’. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణు గోపాల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న రిలీజవుతోంది. ఈ సందర్భంగా శ్రీ విష్ణు పంచుకున్న విశేషాలు... ⇔ ‘అల్లూరి’ కథ చెప్పే ముందు ప్రదీప్ ఇందులో నాది పోలీస్ పాత్ర అంటే లైట్ తీసుకున్నాను. కానీ, కథ విన్నాక చేయాలనిపించింది. ఎలాంటి పరిస్థితిలోనైనా నిజాయితీగా ఉంటూ విధిని నిర్వహించే ఓ పోలీస్ కథ ఇది. వ్యవస్థలోని మంచి చెడుల్ని చూపించాం. చెడుకి పరిష్కారం కూడా చెప్పాం. ⇔ కృష్ణగారి సినిమా ‘అల్లూరి సీతారామరాజు’ క్లయిమాక్స్లో ‘ఒక అల్లూరి చనిపోతే వందమంది అల్లూరిలు పుడతారు’ అనే డైలాగ్ ఉంది. ఆ వందమందిలో మా ‘అల్లూరి’ ఒకరు (నవ్వుతూ). ⇔ పక్కింటి అబ్బాయిలా కంఫర్ట్ జోన్లో ఉంటే కొంత కాలానికి బోర్ కొట్టేస్తుంది. అందుకే అలా ఉండిపోదలచుకోలేదు. విభిన్నమైన పాత్రలు చేయాలని కొత్త ప్రయత్నాలు చేస్తుంటాను. అయితే మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలనే ఉద్దేశం లేదు. ⇔ ‘అల్లూరి’కి కొత్త ఆడియన్స్ కావాలి. దీనికి నా ఒక్కడి బలం సరిపోదు. అందుకే అల్లు అర్జున్గారిని మా ప్రీ రిలీజ్ ఈవెంట్కి పిలిచాను. మాకు సపోర్ట్ చేసిన బన్నీ, నాని, రవితేజగార్లకు థ్యాంక్స్. నిజానికి ఏఏ (అల్లు అర్జున్) సెంటిమెంట్ నాకు కలిసొచి్చంది. ‘అల్లూరిలో ‘అల్లు’ రావడం ఇంకా హ్యాపీ (నవ్వుతూ). ⇔ రానున్న రెండేళ్లలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాను. దర్శకుడు మన తెలుగువాడే. స్క్రిప్ట్ వర్క్ జరుగు తోంది. ప్రస్తుతం హాసిత్, సాయి, హర్ష దర్శకత్వాల్లో సినిమాలు చేస్తున్నాను. -
అదే ఇప్పుడున్న ట్రెండ్: అల్లు అర్జున్
‘‘చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అన్నది కాదు. ఇప్పుడున్న ట్రెండ్ ఒక్కటే.. మంచి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే థియేటర్స్కు వస్తున్నారు. ‘అల్లూరి’ సినిమా విజయం సాధించాలి’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. శ్రీ విష్ణు హీరోగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అల్లూరి’. కయదు లోహర్ కథానాయికగా నటించారు. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ ‘నారాయనుడయ్యేను నవ వరుడు..’ అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘నాకు ఇష్టమైన వ్యక్తి శ్రీవిష్ణు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాలో తన నటన నచ్చడంతో పిలిచి మాట్లాడాను. ప్రతి సినిమాకు అంకితభావంతో పనిచేసే శ్రీవిష్ణు అంటే నాకు ఇష్టం.. గౌరవం కూడా. యాక్టర్గా తను ఇంకా పైకి ఎదగాలి’’ అన్నారు. శ్రీ విష్ణు మాట్లాడుతూ– ‘‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమా తర్వాత బన్నీగారు నన్ను పిలిచి, ‘భవిష్యత్లో కంటెంట్ ఉన్న సినిమాలే ఆడతాయి. సో... కంటెంట్ ఉన్న చిత్రాల్లో నటించు.. లేకపోతే ఖాళీగా ఉండు’ అంటూ ఓ ముందు చూపుతో చెప్పారు. అవసరమైతే నా సినిమాని నిర్మిస్తానని భరోసా ఇచ్చారు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో నేను ఓ చిన్న రోల్ చేశాను. ఆ తర్వాత నేను కేరళ వెళ్లినప్పుడు బన్నీగారి ఫ్యాన్స్ నన్ను గుర్తుపట్టి మాట్లాడారు. బన్నీగారు టాలీవుడ్లో చేస్తే చాలు అది ప్యాన్ ఇండియా సినిమా అయిపోతుంది. ‘అల్లూరి’ చిత్రం పోలీస్ స్టోరీ. మా మూవీ చూసిన తర్వాత పోలీసు కనిపిస్తే సెల్యూట్ చేస్తారు’’ అన్నారు. ‘‘పోలీసు అంటే ఒక వ్యక్తి కాదు.. పోలీస్ అంటే ఒక వ్యవస్థ’ అనే డైలాగ్ ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నాను’’ అన్నారు ప్రదీప్ వర్మ. ‘‘ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు బెక్కెం వేణుగోపాల్. ఈ కార్యక్రమంలో బెక్కెం బబిత, సహ నిర్మాతలు నాగార్జున, గంజి రమ్య, విజయలక్ష్షి్మ, మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, దర్శకులు ప్రశాంత్ వర్మ, హర్ష, తేజ మార్ని, నటుడు తనికెళ్ల భరణి పాల్గొన్నారు. -
ఆయనలా శ్రీ విష్ణు పెద్ద స్టార్ అవ్వాలి: నాని
‘‘మహేశ్బాబుగారు బయట చాలా రిజర్వ్డ్గా ఉండి లోపల చాలా సరదాగా ఉంటారని విన్నాను. ఆయన తర్వాత శ్రీ విష్ణు ఆ కోవకి వస్తారు. తను కూడా మహేశ్గారిలా పెద్ద స్టార్ కావాలి’’ అని హీరో నాని అన్నారు. శ్రీ విష్ణు, కయదు లోహర్ జంటగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల్లూరి’. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ను నాని విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘అల్లూరి’ ట్రైలర్ బావుంది.. సినిమా పెద్ద సక్సెస్ కావాలి. సినిమా చేస్తే హీరో కాకుండా పాత్రలు మాత్రమే కనిపించే హీరోలు చాలా తక్కువమంది ఉంటారు.. అలాంటి నటుల్లో ముందు వరుసలో ఉండే శ్రీ విష్ణు అంటే నాకు చాలా ఇష్టం’’ అన్నారు. ‘‘ఎంతోమంది నానీగారిని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీకి వస్తారు.. నాకు కూడా ఆయనే స్ఫూర్తి. గొప్ప కథతో రూపొందిన ‘అల్లూరి’ చిత్రాన్ని ఆదరించాలి’’ అన్నారు శ్రీ విష్ణు. ‘‘అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా ‘అల్లూరి’. ట్రైలర్ అందరికీ నచ్చింది.. సినిమా అంతకంటే పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు బెక్కెం వేణుగోపాల్. గేయ రచయిత రాంబాబు గోసాల పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగార్జున వడ్డే, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, కెమెరా: రాజ్ తోట. -
హీరో నాని చేతుల మీదుగా శ్రీవిష్ణు ‘అల్లూరి’ మూవీ ట్రైలర్
యంగ్ హీరో శ్రీ విష్ణు ఎంచుకునే కథలే కాదు, ఆయన నటించే సినిమాల టైటిల్స్ కూడా విభిన్నంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలుగులో టైటిల్స్ పెట్టేందుకు ఆయన ఎక్కువగా మొగ్గు చూపుతుంటాడు. దానివల్ల ఈ తరం వాళ్లలో కొంతమందికైనా కొన్ని మంచి పదాలు తెలుస్తాయంటాడీ హీరో. ఇప్పుడు ఈ యంగ్ హీరో ‘అల్లూరి’ చిత్రంతో అలరించబోతున్నాడు. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్ను తాజాగా నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాడు. ‘లక్ష్యసాధనకు పడిన శ్రమ గొప్పది’ అంటూ ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి వాయిస్ ఓవర్ వస్తుండగా పోలీసు ఆఫీసర్గా శ్రీవిష్ణు ఎంట్రీ ఇవ్వడం.. ఆ తర్వాత పోలీసులు నిజమైన హీరోలు అంటూ చెప్పే డైలాగ్, యాక్షన్స్ సీన్స్, లవ్ యాంగిల్ వంటి ఆసక్తికర సన్నివేశాలతో ట్రైలర్ అద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక ఊహించిన రితీలో ఉన్న యాక్షన్ సీన్స్ ప్రేక్షకుల చేత ఈళలు వేయించడం ఖాయం అంటున్నారు. సమాజం బాగుపడాలంటే రాజకీయ నాయకులను కూడా మార్చాలని హీరో సవాలు విసరడం, అలాగే, ఎక్కువ మంది పిల్లలు పోలీసు అధికారులుగా మారాలని కోరుకుంటున్నానంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాలో శ్రీవిష్ణు మరోసారి తన మార్క్ చూపించాడని ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్కు హైలెట్ అని చెప్పవచ్చు. ఇలా సాంతంగా ఆసక్తిగా సాగిన ట్రైలర్ ప్యాన్స్ విశేషంగా ఆకట్టుకుంటుంది. కాగా తనికేళ భరణి, రాజా రవింద్ర, పృథ్వీరాజ్, సుమన్, జయవాణి, మధుసుధననరావు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తన్నారు. సెప్టెంబర్ 23న ఈచిత్రం గ్రాండ్గా రిలీజ్ కానుంది. -
పోలీస్ అవ్వాలనుకున్నా...కానీ ఈ సినిమాతో అయ్యాను: నిర్మాత
‘‘అల్లూరి’లో శ్రీ విష్ణు విశ్వరూపం చూస్తారు. తన కెరీర్లో ఇది బెస్ట్ మూవీ అవుతుంది’’ అని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ అన్నారు. శ్రీ విష్ణు పోలీసాఫీసర్గా నటించిన చిత్రం ‘అల్లూరి’. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలకానుంది. బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘నేను చిన్నప్పుడు పోలీస్ అవ్వాలనుకున్నాను.. కానీ కాలేకపోయాను. అందుకే ‘అల్లూరి’ సినిమాలో పోలీస్ పాత్రను చాలా ఇష్టంగా చేశాను. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ‘దిల్’ రాజుగారి సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది. ఈ మధ్య షూటింగ్స్ నిలిపివేసి చర్చించడం వల్ల చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి.. వాటిని త్వరలోనే వెల్లడిస్తాం. వైజాగ్లోని అల్లూరి సీతారామరాజుగారి సమాధి దగ్గర నుంచి ఈ నెల 3 నుండి ‘అల్లూరి’ యూనిట్ యాత్రని ప్రారంభిస్తున్నాం. వైజాగ్లో మొదలైన టూర్ వరంగల్, నిజామాబాద్ వరకూ కొనసాగుతుంది. ప్రస్తుతం ‘బూట్ కట్ బాలరాజు’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ నిర్మిస్తున్నాను’’ అన్నారు. -
ఆ జానర్లో ఉన్న ఒకే ఒక్క తెలుగు హీరో శ్రీ విష్ణు – రాజమౌళి
‘‘పక్కింటి కుర్రాడిలా ఉంటాడు శ్రీ విష్ణు. ఒక చేప నీటిలోకి ఎంత ఈజీగా వెళ్లగలదో శ్రీ విష్ణు ఓ మాస్ హీరో పాత్రలోకి అలా వెళ్లగలడు. అంత ఈజీగా మాస్ క్యారెక్టర్లోకి షిఫ్ట్ అవ్వగలడని మనం ఊహించలేం. ఇంతకుముందు కూడా శ్రీ విష్ణు మాస్ పాత్రలు చేశాడు. కానీ ‘భళా తందనాన’ స్టార్టింగ్లో మామూలుగా కనిపించి ఆ తర్వాత చాలా ఈజీగా మాస్ హీరోలా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఆ కైండ్ ఆఫ్ జానర్లో తెలుగులో ఉన్న ఒకే ఒక్క హీరో శ్రీ విష్ణు’’ అన్నారు దర్శకుడు రాజమౌళి. శ్రీ విష్ణు, కేథరిన్ హీరో హీరోయిన్లుగా చైతన్య దంతులూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భళా తందనాన’. సాయికొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతిథులుగా పాల్గొన్న దర్శకులు రాజమౌళి, శేఖర్ కమ్ముల బిగ్ టికెట్ను లాంచ్ చేశారు. అనంతరం రాజమౌళి మాట్లాడుతూ – ‘‘ఎంచుకుంటున్న సబ్జెక్ట్స్ నుంచే తనకంటూ డిఫరెంట్ జానర్ను క్రియేట్ చేసుకున్న శ్రీ విష్ణుకు మంచి భవిష్యత్ ఉంది. ఎవరైనా చిన్న సినిమాను చిన్న సినిమాగా, పెద్ద సినిమాను పెద్దగా తీస్తారు. కానీ చైతన్య దంతులూరి చిన్న సినిమా చేసినా సరే, పెద్ద సినిమా చేస్తున్నాననే యాటిట్యూడ్ తన సినిమాలో కనిపించేలా చేస్తాడు. ‘బాణం’ చూసినప్పుడు నాకు ఇలా అనిపించింది. ‘భళా తందనాన’ చూశాను. సేమ్ యాటిట్యూడ్. నెక్ట్స్ ఏం జరుగుతుంది? అనే ఓ టెన్షన్ను మెయిన్టైన్ చేస్తూ.. సస్పెన్స్ రివీల్ అయినప్పుడు ఓ హై వచ్చేలా చైతన్య చేసుకుంటూ వెళ్లాడు. ఈ సినిమా పట్ల సాయిగారు కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఓటీటీలో మంచి ఆఫర్ ఉన్నా థియేటర్స్లోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది’’ అని అన్నారు. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ– ‘‘చైతన్య తీసిన ‘బాణం’ నాకు ఇష్టమైన సినిమా. కంటెంట్కు, క్రాఫ్ట్స్కు మంచి వేల్యూ ఇచ్చే వ్యక్తి చైతన్య అని ‘బాణం’ తర్వాత అనుకున్నాను. ‘భళా తందనాన’ ట్రైలర్ బాగుంది. సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. శ్రీ విష్ణు నా దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో స్మాల్ రోల్ చేశాడు. అప్పటిలానే అదే వినయంతో ఉన్నాడు. సాయి కొర్రపాటిగారు ఇలాంటి మరిన్ని మంచి చిన్న సినిమాలు నిర్మించాలి’’ అన్నారు. ‘‘తెలుగు సినిమా అద్భుతంగా ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా బయటకు తీసుకువచ్చిన రాజమౌళిగారికి థ్యాంక్స్. ఇందువల్ల తెలుగు సినిమాలే కాదు.. మా విలువ కూడా పెరిగింది సార్ (రాజమౌళిని ఉద్దేశించి..). శేఖర్ కమ్ములగారితో నాకు వర్క్ చేసిన అనుభవం ఉంది. నాలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఎంతోమంది కొత్తవారు ఆయన ద్వారా సినిమాల్లోకి వచ్చి సక్సెస్ఫుల్గా సెటిలయ్యారు. సాయిగారిలాంటి డేరింగ్ ప్రొడ్యూసర్ను నేనింతవరకు చూడలేదు. మణిశర్మగారు తన ఆర్ఆర్తో సర్ప్రైజ్ చేస్తారు. చైతన్య, నేను 14 ఏళ్లుగా మంచి స్నేహితులం. మంచి సినిమా చేశాం. 6న వస్తున్నాం.. సిక్స్ కొడతాం’’ అన్నారు శ్రీవిష్ణు. ‘‘రాజమౌళిగారి సినిమాల్లోని కమర్షియాలిటీని, శేఖర్ కమ్ములగారి సెన్సిబిలిటీని ఒక శాతం అయినా నా సినిమాలో వినియోగించాననే అనుకుంటున్నాను. తన యాక్టింగ్తో శ్రీ విష్ణు సర్ప్రైజ్ చేస్తారు. కథా రచయిత శ్రీకాంత్ వల్లే ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాను ఏ థియేటర్స్లో అయినా ఎవరైతే ఫస్ట్ చూస్తారో వారికి అంకితం ఇస్తున్నాను. వారే మా టార్చ్ బేరర్స్’’ అన్నారు చైతన్య దంతులూరి. ఈ కార్యక్రమంలో రాజమౌళి సతీమణి, స్టయిలిస్ట్ రమా రాజమౌళి, కాస్ట్యూమ్ డిజైనర్ ప్రియ, రచయిత శ్రీకాంత్ విస్సా, నటుడు గరుడ రామ్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీ విష్ణు మూవీ వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
యంగ్ హీరో శ్రీ విష్ణు ఎంచుకునే కథలే కాదు, ఆయన నటించే సినిమాల టైటిల్స్ కూడా విభిన్నంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలుగులో టైటిల్స్ పెట్టేందుకు ఆయన ఎక్కువగా మొగ్గు చూపుతుంటాడు. దానివల్ల ఈ తరం వాళ్లలో కొంతమందికైనా కొన్ని మంచి పదాలు తెలుస్తాయంటాడీ హీరో. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘భళా తందనాన’. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త రిలీజ్ డేట్ను కూడా వెల్లడించారు. మే 6వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చింది చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన కేథరిన్ థ్రెసా నటించింది. ‘బాణం’ సినిమా ఫేమ్ చైతన్య దంతులూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. -
శ్రీవిష్ణు ‘భళా తందనాన’ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
Sri Vishnu Bhala Thandanana Movie Release Date Lock: శ్రీవిష్ణు, కేథరిన్ థ్రెసా జంటగా నటించిన చిత్రం ‘భళా తందనాన’. ‘బాణం’ సినిమా ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. చదవండి: కార్తీకేయతో జతకట్టిన ‘డిజే టిల్లు’ హీరోయిన్ ‘‘కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘భళా తందనాన’. మా సినిమా టీజర్కి అద్భుతమైన స్పందన వచ్చింది. వేసవి సెలవులు, మే 3న రంజాన్ పండగను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 30న మా చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించాం. మణిశర్మ సంగీతం అందించిన మా సినిమాలోని పాటలకు మంచి స్పందన వస్తోంది. పీటర్ హెయిన్ యాక్షన్ స్టంట్స్ ప్రేక్షకులను అలరిస్తాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. రామచంద్రరాజు, శ్రీనివాస్ రెడ్డి, సత్య తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సురేష్ రగుతు. -
ఆ హీరోని ఏమనాలో తెలియడంలేదు: దిల్రాజు
‘‘శ్రీ విష్ణును హీరో అనాలో, ఆర్టిస్టు అనాలో నాకు తెలియడంలేదు. కానీ సినిమాను లీడ్ చేస్తున్నప్పుడు హీరో అనే అంటాం. జయాపజయాలతో సంబంధం లేకుండా కొత్త దర్శకులకు అవకాశాలను ఇస్తూ నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నాడు శ్రీ విష్ణు. ఏదో ఒక రోజు అతని ప్రయత్నం పెద్దవాడ్ని చేస్తుంది. అయితే తన ప్రయత్నాలను మాత్రం శ్రీ విష్ణు ఆపకూడదు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ జంటగా తేజా మార్ని దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘కొత్త దర్శకులు నాకు కథలు చెప్పినప్పుడు వాటిలో రెండు, మూడు కథలను శ్రీ విష్ణుతో షేర్ చేస్తాను. కొత్తవారికి చాన్స్ ఇస్తూ డిఫరెంట్ సినిమాలు చేస్తున్న నిర్మాతలను అభినందిస్తున్నాను. వీరి ప్రయత్నాలు పెద్ద సక్సెస్లు కావాలని కోరుకుంటున్నాను. ‘అర్జున ఫల్గుణ’ పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఇండస్ట్రీకి ఉత్తి చేతుల్తో వచ్చాను నేను. ఇప్పుడు చాలా ఆస్తి ఉంది నాకు. నేను పరిచయం చేసిన దర్శకులే నా ఆస్తి. స్నేహితులైన ఐదుగురు అమాయకులు ఓ చిన్న సమస్యలో ఇరుక్కుని ఎలా బయటపడ్డారు? అన్నదే ‘అర్జున ఫల్గుణ’ కథ’’ అన్నారు శ్రీ విష్ణు. ‘‘ఓ వేదికపై మైక్ పట్టుకుని నేను మాట్లాడటం ఇదే మొదటిసారి. కొత్త కొత్త దర్శకులకు శ్రీ విష్ణు ఓ ధైర్యం. ఆయన ఇచ్చిన ధైర్యమే నన్ను ఇక్కడివరకు తీసుకువచ్చింది’’ అన్నారు తేజ మార్ని. ‘‘శ్రీ విష్ణు చేసిన 15 చిత్రాల్లో పదిమంది కొత్త దర్శకులే’’ అన్నారు దర్శకుడు కిశోర్ తిరుమల. ‘‘చాలామంది దర్శకులను పరిచయం చేసిన శ్రీ విష్ణును నేను ఇండస్ట్రీకి పరిచయం చేసినందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు నిర్మాత బెక్కం వేణుగోపాల్. ఈ కార్యక్రమంలో దర్శకులు వివేక్ ఆత్రేయ, సాగర్ చంద్ర, వెంకటేశ్ మహా, మ్యూజిక్ డైరెక్టర్ ప్రియదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
ఏ సినిమా చేసినా అది మిస్సవ్వను
‘‘ప్రతి దర్శకుడికీ తన సినిమాని పెద్ద తెర మీద చూసుకోవాలని ఉంటుంది. అయితే నా మొదటి సినిమా (‘జోహార్’) ఓటీటీలో విడుదలైంది. ఆ సినిమాకి నేనే నిర్మాతను కావడంతో ఒత్తిడికి లోనయ్యాను. ఇప్పుడు ‘అర్జున ఘల్గుణ’కి మంచి నిర్మాతలు దొరికారు. ‘దిల్’ రాజుగారు రిలీజ్ చేస్తున్నారు’’ అని తేజ మార్ని అన్నారు. శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ జంటగా తేజ మార్ని దర్శకత్వంలో ఎన్.ఎమ్. పాషా కో ప్రొడ్యూసర్గా నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. ఈ నెల 31న ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా తేజ మార్ని చెప్పిన విశేషాలు. ► ‘అర్జుణ ఫల్గుణ’ని సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నాం. ఇందులో ఎన్టీఆర్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మీద డైలాగ్స్ ఉన్నాయి. పైగా ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ (జనవరి 7) తర్వాత వేరే సినిమాలు కనపడవేమో! ఈ కారణాల వల్ల మా సినిమాని ముందు రిలీజ్ చేస్తున్నాం. ► గోదావరి బ్యాక్డ్రాప్లో జరిగే సినిమా ఇది. ఈస్ట్ గోదావరిలో దొరికే ఓ కూల్ డ్రింక్ని టైటిల్గా అనుకుంటే, అనుమతి దక్కలేదు. ఆ టైటిల్ కాకపోతే కథ మార్చాలి. ఆ విషయం గురించి చర్చించుకుంటున్నప్పుడు అర్జున ఫల్గుణ అంటే ధైర్యం వస్తుందట అని నేను, శ్రీవిష్ణు మాట్లాడుకున్నాం. ఇదే టైటిల్గా పెడితే బాగుంటుందని శ్రీవిష్ణు అన్నారు. సినిమాలో హీరో పేరు అర్జున్. టైటిల్ పెట్టాక కథలో చాలా మార్పులు చేశాం. ఉళ్లో ఉన్నప్పుడు అర్జునుడిగా ఉండే హీరో ఊరు దాటాక ఫల్గుణుడిగా ఎలా మారాడు? అన్నదే కథ. ► సిటీలో ఎంత సంపాదించుకున్నా మిగిలేది కొంతే.. ఒక్కోసారి మిగలకపోవచ్చు కూడా. అందుకే ఊళ్లోనే ఉండి సంపాదించుకుంటే మంచిదేమో అనుకునే ఊరి కుర్రాళ్ల కథ ఇది. నా స్నేహితులు, వాళ్ల స్నేహితుల జీవితాల్లో జరిగిన ఘటనలను ఈ కథలో పొందుపరిచాను. సినిమాలోని మెయిన్ ఐదు పాత్రలూ ఎన్టీఆర్ ఫ్యా¯Œ ్స. నేను కూడా ఎన్టీఆర్ అభిమానినే. ► శ్రీ విష్ణుని అనుకుని ఆయన బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు కథ రాశాను. కథానుగుణంగా గోదావరి యాస పెట్టాం. సినిమాలో శ్రీవిష్ణుని చూస్తే ‘సిందూరం’లో రవితేజగారిని చూసిన ఫీల్ వస్తుంది. యాక్షన్ పరంగా కొత్త విష్ణును చూస్తారు. సినిమా ఫస్టాఫ్ వినోదంగా, సెకం డాఫ్ థ్రిల్లింగ్గా ఉంటాయి. క్లైమాక్స్లో ప్రేక్షకులు ఎమోషనల్ అవుతారు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2, షైన్ స్క్రీన్ బ్యానర్లలో సినిమాలు చేస్తున్నాను. ఇకనుంచి కమర్షియల్ సినిమాలే చేయాలనుకుంటున్నాను. కానీ ఎమోషన్ని మాత్రం మిస్సవ్వను. -
జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమానిగా శ్రీ విష్ణు, ట్రైలర్ చూశారా?
Arjuna Phalguna Trailer: శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ జంటగా తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ క్రమంలో ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ శుక్రవారం అర్జున ఫల్గుణ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో అర్జున పాత్రలో ఒదిగిపోయిన శ్రీ విష్ణు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్కు వీరాభిమానిగా కనిపించాడు. ట్రైలర్లో ఇంకా ఎన్నాళ్లు ఖాళీగా ఉంటావన్న ప్రశ్నకు హీరో రియాక్ట్ అవుతూ 'డిగ్రీదాకా చదివాం.. ఆర్నెళ్లు రెస్ట్ తీసుకుంటే తప్పా?' అని చెప్పిన డైలాగ్ యూత్కు కనెక్ట్ అవుతోంది. ఇక హీరోయిన్ అమృత గ్రామ వాలంటీర్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. 50 శాతం అడవుల్లోనే షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. -
మంచి పాత్రలు వస్తున్నాయి కానీ..!
‘‘ఇప్పటివరకూ నాకు సంప్రదాయమైన పాత్రలే వచ్చాయి. మంచి పాత్రలొస్తున్నాయి కానీ, నేనేంటో నిరూపించుకునే సవాల్తో కూడిన పాత్రలు ఇంకా రాలేదు’’ అని హీరోయిన్ అమృతా అయ్యర్ అన్నారు. శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ జంటగా తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా అమృతా అయ్యర్ మాట్లాడుతూ– ‘‘స్నేహం నేపథ్యంలో ‘అర్జున ఫల్గుణ’ ఉంటుంది. ఆపదలో ఉన్న ఓ స్నేహితురాలికి ఐదుగురు స్నేహితురాళ్లు ఎలా సాయపడ్డారన్నది ఆసక్తిగా ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ 50 శాతం అడవుల్లో జరిగింది. సల్వార్ వేసుకుని అడవుల్లో పరిగెత్తడం కష్టంగా అనిపించింది. కొండలపై షూటింగ్ కోసం రాను పోను మూడు గంటలు నడిచేవాళ్లం. ‘నువ్వు ఏదైనా చేయగలవు’ అంటూ తేజ మార్నిగారు స్పూర్తి నింపారు. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్గారి సంగీతం, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటాయి. ‘రెడ్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమాల్లో నా పాత్రల పరంగా సంతృప్తిగా ఉన్నాను. నాకు గ్లామర్ పాత్రలు సౌకర్యంగా అనిపించవు.. ప్రస్తుతానికి చేయాలనుకోవడం లేదు కూడా. ప్రస్తుతం చేస్తున్న ‘హనుమాన్’ 70 శాతం పూర్తయింది. వెబ్ సిరీస్లు చేసే ఆలోచన లేదు’’ అన్నారు. -
ఓటీటీలో దూసుకుపోతున్న 'రాజ రాజ చోర'
దసరా కానుకగా 'జీ 5'లో 'రాజ రాజ చోర' విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు నచ్చడంతో దీనికి బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా చూసిన నెటిజన్లు సోషల్మీడియాలో హీరో శ్రీవిష్ణు, హీరోయిన్లు సునైనా, మేఘా ఆకాష్ నటనను ప్రశంసిస్తూ... అనేకమంది కామెంట్లు పోస్టులు పెడుతున్నారు. థియెట్రికల్ రిలీజ్ తర్వాత అపూర్వమైన మార్కెటింగ్ క్యాంపెయిన్ చూసిన సినిమా ఇదేనని చెప్పాలి. ఈ సందర్భంగా పబ్లిసిటీ మారథాన్లో పాల్గొన్న శ్రీ విష్ణు, దర్శకుడు హసిత్ గోలీకి 'జీ5' టీం కృతజ్ఞతలు తెలిపింది. రచయిత - దర్శకుడు ప్రసన్న కుమార్ బెజవాడ సైతం సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. 'ఓ బేబీ' దర్శకురాలు నందిని రెడ్డి సినిమా గురించి సోషల్ మీడియాలో "మీరు వెండితెరపై అద్భుతమైన ఈ సినిమాను చూడడం మిస్ అయితే... ఇప్పుడు డిజిటల్ తెరపై చూసే అవకాశం మీకు దగ్గరకు వచ్చింది" అన్నారు. 'రాజ రాజ చోర' బ్లాక్ బస్టర్ సినిమా అని రచయిత - దర్శకుడు బివిఎస్ రవి పేర్కొన్నారు. టీవీ, ప్రింట్ ప్రమోషన్ల నుంచి డిజిటల్ మీడియా వరకు... ఇన్ఫ్లుయెన్సర్ల నుండి మీమ్ పేజీల వరకూ... సినిమాలో ఫన్నీ మూమెంట్స్ షేర్ చేయడం చూస్తుంటే 'రాజ రాజ చోర' ప్రజలు మెచ్చిన ఎంటర్టైనర్ అని స్పష్టమవుతుంది. 'జీ 5'లో తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు అద్భుత స్పందన అందుకున్న ఈ సినిమాను దసరా వీకెండ్ లో మరింత మంది చూసే అవకాశం ఉంది. అక్టోబర్ 22న 'జీ 5'లో 'హెడ్స్ & టేల్స్' విడుదల కానుంది. దీంతో మరింత ఎంటర్టైన్మెంట్ వీక్షకులకు అందించడానికి సిద్ధమవుతోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన 'కలర్ ఫోటో' సినిమా టీమ్ నుంచి వస్తున్న సినిమా ఇది. ముగ్గురు మహిళలు, భగవంతుడు చుట్టూ తిరిగే అందమైన కథతో 'హెడ్స్ అండ్ టేల్స్' రూపొందింది. ఇందులో భగవంతుడిగా సునీల్ నటించగా... 140కి పైగా చిత్రాలకు సంగీతం అందించిన మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు. ప్రస్తుతం తెలుగు ప్రజలు కంటెంట్ బేస్డ్ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. చదవండి: MAA: బాలయ్యను కలిశాను, త్వరలో చిరంజీవిని కలుస్తా: మంచు విష్ణు -
ఆసక్తికరంగా ‘14’ మూవీ టీజర్
రాయల్ పిక్చర్స్ పతాకంపై నోయల్, విశాఖ ధీమాన్, పోసాని కృష్ణ మురళి,శ్రీకాంత్ అయ్యంగార్, రతన్,జబర్దస్త్ మహేష్ నటీ,నటులుగా లక్ష్మి శ్రీనివాస్ దర్శకత్వంలో సుబ్బారావు రాయణ, శివకృష్ణ నిచ్చెనమెట్ల నిర్మిస్తున్న ‘14’.ఈ చిత్రం టీజర్ను తాజాగా యంగ్ హీరో శ్రీవిష్ణు విడుదల చేశాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా కొత్త ప్రొడ్యూసర్లకు, దర్శకుడికి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దర్శకుడు చెప్పినట్లు తన మంచి కథ తీసుకొని వస్తే కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నోయల్ కు ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. 15 సంవత్సరాల క్రితం మేమంతా సినిమాలలో అవకాశం కోసం ట్రై చేసే వాళ్ళం .ఇప్పుడున్నటువంటి వాట్సాప్,ఫేస్ బుక్ లాంటి ఫాస్ట్ జనరేషన్ అప్పుడు లేదు. మేము ప్రతి రోజు సుభాష్ మాస్టర్ అడ్డా దగ్గర అసెంబ్లింగ్ అయ్యేవాళ్ళం. ఫిలింనగర్ కి మేము దూరంగా ఉన్నా.. మేము ఆడిషన్స్ జరుగుతున్నాయి అంటే అందరం కలిసి ఒకే బైక్ మీద ఒకే కారులో ఆఫీస్ లకు వెళ్ళేవాళ్ళం .నవీన్ , నోయల్, సుభాష్ చాలా మంచి వారు వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది ఈ సినిమా నోయల్ కు అద్భుతమైన పేరు వచ్చి ఇంకా పెద్ద స్థాయికి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుతున్నాను సినిమా టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు శ్రీవిష్ణు మా చిత్రానికి వచ్చి టీజర్ రిలీజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.తన ద్వారా మా చిత్రానికి మంచి బూస్టప్ వచ్చింది. ఈ సినిమా స్టోరీ చాలా గ్రిప్పింగ్ గా ఉన్న ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీ కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమా ద్వారా శ్రీ విష్ణు తో చేసే అవకాశం వస్తుందని కచ్చితంగా నమ్ముతున్నాను’అన్నాడు హీరో నోయల్. -
ఓటీటీలో ‘రాజ రాజ చోర.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Raja Roja Chora OTT Release Date Out: యంగ్ హీరో శ్రీవిష్ణు ఇటీవలె నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’.కామెడీ ఎంటర్టైనర్గా విడుదలైన ఈ చితం త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కానుంది. హితేశ్ గోలి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్లు. జిరాక్స్ షాపులో పనిచేసే భాస్కర్ (శ్రీవిష్ణు) అవసరాల కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. పైకి మాత్రం తాను ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని చెప్పుకుంటాడు. చదవండి : 'మా'లో మార్పు తీసుకొస్తా: మంచు విష్ణు అలా చెప్పుకొనే సంజన అలియాస్ సంజు(మేఘ ఆకాశ్)తో ప్రేమాయణం సాగిస్తాడు.అయితే భాస్కర్కు అప్పటికే విద్య( సునైన)తో పెళ్లి జరిగుతుంది. వాళ్లిద్దరికి ఒక బాబు కూడా ఉంటాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో ఓ కేసులో ఇరుక్కున్న భాస్కర్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే సినిమా కథ. ఇప్పటికే థియేటర్స్లో విడుదలైన ఈ చిత్రం అక్టోబర్ 8నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి : గ్రాండ్గా సుకుమార్ భార్య బర్త్డే సెలబ్రేషన్స్ -
‘రాజ రాజ చోర’ మూవీ రివ్యూ
-
‘రాజ రాజ చోర’ మూవీ రివ్యూ
టైటిల్ : రాజ రాజ చోర నటీనటులు : శ్రీవిష్ణు, మేఘా ఆకాష్, సునయన, రవిబాబు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్ తదితరులు నిర్మాణ సంస్థ : అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు : అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ దర్శకత్వం : హసిత్ గోలి సంగీతం : వివేక్ సాగర్ సినిమాటోగ్రఫీ : వేద రమణ్ శంకరన్ ఎడిటింగ్: విప్లవ్ విడుదల తేది : ఆగస్ట్ 19,2021 చిత్ర పరిశ్రమలో ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి.. విలక్షణ నటనతో, వైవిద్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. యావరేజ్ నుంచి మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారాడు. ఇలా వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ యంగ్ హీరో సెక్సెస్కి ‘గాలి సంపత్’ బ్రేక్ వేశాడు. దీంతో కాస్త వెనకడుగు వేసిన శ్రీవిష్ణు.. ఈ సారి ఎలాగైనా మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలనే కసితో ‘రాజ రారజ చోర’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై పాజిటీవ్ బజ్ను క్రియేట్ చేశాయి. దీనికి తోడు మూవీ ప్రమోషన్స్ కూగా గ్రాండ్గా చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘రాజ రాజ చోర’ఏ మేరకు అందుకుంది? ఈ సినిమాతో శ్రీవిష్ణు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడా లేదా? రివ్యూలో చూద్దాం. రాజ రాజ చోర కథేంటంటే భాస్కర్ (శ్రీవిష్ణు) ఓ చిన్న దొంగ. ఓ జిరాక్స్ షాపులో పని చేస్తూ అవసరాల కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. పైకి మాత్రం తాను ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని చెప్పుకుంటాడు. అలా చెప్పుకొనే సంజన అలియాస్ సంజు(మేఘ ఆకాశ్)తో ప్రేమాయణం సాగిస్తాడు. అయితే భాస్కర్కు అప్పటికే విద్య( సునైన)తో పెళ్లి జరిగుతుంది. వాళ్లిద్దరికి ఒక బాబు కూడా ఉంటాడు. అయినప్పటికీ భాస్కర్ సంజనతో ఎందుకు ప్రేమాయణం సాగించాడు? తాను ప్రేమించిన వ్యక్తి సాఫ్టవేర్ ఇంజనీర్ కాదనీ, అతనికి పెళ్లై, బాబు కూడా ఉన్నాడని తెలిసిన తర్వాత సంజన పరిస్థితి ఏంటి? దొంగగా పట్టుబడి పోలీసులకి చిక్కిన భాస్కర్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేదే మిగతా కథ ఎవరెలా చేశారంటే? ఎప్పటి మాదిరే శ్రీవిష్ణు మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. దొంగగా, సాఫ్ట్వేర్ ఇంజినీర్గా రెండు కోణాల్లో అద్భుత నటనను కనబరిచాడు. తనదైన మేనరిజమ్స్తో నవ్విస్తూనే.. ఎమోషనల్ సీన్స్ని కూడా అద్భుతంగా పండించాడు. సినిమా మొత్తం తన భూజాల మీద వేసుకొని కథని నడిపించాడు. హీరో భార్య విద్య పాత్రలో సునైనా ఒదిగిపోయింది. మధ్యతరగతికి చెందిన వివాహితగా ఆకట్టుకుంది. ఇక సంజూగా మేఘా ఆకాశ్ పర్వాలేదనిపించింది. పోలీస్ అధికారి విలియమ్ రెడ్డి పాత్రలో రవిబాబు ఒదిగిపోయిన తీరు బాగుంది. స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ.. అవినీతి పోలీసు అధికారిగా అదరగొట్టేశాడు. అంజమ్మ పాత్రలో గంగవ్వ మెప్పించింది. తనదైన పంచులతో నవ్వులు పూయిచింది. శ్రీకాంత్ అయ్యంగర్, అజయ్ ఘోష్, తనికెళ్ల భరణి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే? అవసరాల కోసం దొంగగా మారిన ఓ వ్యక్తి.. తన తప్పును తెలుసుకొని మంచి వాడిగా ఎలా మారాడనేదే ఈ సినిమా కథ. మనసు మాట వినకుండా.. డబ్బు కోసం ఆశ పడి చేసే ఏ పనైనా తప్పే అనే సందేశాన్ని కామెడీ యాంగిల్లో చూపించాడు దర్శకుడు హసిత్ గోలి. దానికి కొంత ఎమోషనల్ టచ్ ఇచ్చి కథను నడిపించాడు. సాధారణంగా దర్శకులు సేఫ్గా ఉండేందుకు తమ తొలి సినిమాని ప్రేమ కథతో ప్రారంభిస్తారు. కానీ డైరెక్టర్ హిసిత్ మాత్రం తన డెబ్యూ మూవీనే ఇలాంటి కొత్త తరహా కథను చెప్పాలనుకొనే ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. అనుకున్నది తెరపై చూపించడంలో కాస్త తడబడ్డాడు. పాత్రలను పరిచయం చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు. భాస్కర్, విద్యల సంబంధించిన సన్నివేశాలు మొదలయ్యాక కథలో వేగం పెరుతుంది. అయితే కథను సాగదీస్తూ అసలు విషయాన్ని ఇంటర్వెల్ వరకు లాగడం ప్రేక్షకులను కాస్త ఇబ్బంది పెడుతుంది. ఇంటర్వెల్ ముందు పోలీసులకు శ్రీవిష్ణు పట్టుబడినప్పుడు వచ్చే సన్నివేశాలు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. అంతేకాదు సెండాఫ్పై అంచనాలను పెంచుతుంది. కానీ అక్కడ కూడా కథను నెమ్మదిగా సాగడం కాస్త మైనస్. కథను ఎమోషనల్గా డీల్ చేయడానికి స్కోప్ ఉన్నప్పటీ.. డ్రామాపైనే ఎక్కువ దృష్టిపెట్టాడు దర్శకుడు. సెకండాఫ్లో భాస్కర్ దొంగతనం చేసే సీన్స్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే, తనికెళ్ల భరణి చెప్పే ప్రవచనాలతో ముడిపెడుతూ కథని నడిపించిన విధానం బాగుంటుంది. ఇక ఈసినిమాకు ప్రధాన బలం వివేక్ సాగర్ సంగీతం. పాటలు అంతంతమాత్రమే అయినప్పటికీ.. నేపథ్య సంగీతంతో అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సెకండాఫ్లో వచ్చే సిధ్ శ్రీరామ్ ఆకట్టుకోవడంతో పాటు ఆలోచించేవిధంగా ఉంటుంది. వేద రమణ్ శంకరన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ విప్లవ్ తన కత్తెరకు ఇంకా చాలా పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
అప్పటి వరకు వెంకటేశ్ని కలవొద్దని టార్గెట్ పెట్టుకున్నా : శ్రీవిష్ణు
సాక్షి, వెబ్డెస్క్: రాజ శ్రీవిష్ణు హీరోగా మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు శ్రీవిష్ణు. ఆయన చెప్పిన సంగతులేంటో చదివేయండి. అలాంటి వారికి ఇది రైట్ సినిమా ఇది కొత్త స్టోరీ. ఇందులో నేను దొంగ. పెద్ద స్కామ్ చేసే దొంగ కాదు. కొంటె దొంగని. 10 నిమిషాల్లోనే సినిమా క్యారెక్టర్లు అన్ని తెలిసిపోతాయి. ఆ తర్వాత నా క్యారెక్టర్ చుట్టూ కథ తిరుగుంది. మనం ఓటీటీలో ఇతర భాషల సినిమాలను చూసి పొగిడేస్తున్నాం కదా? అలాంటి వారికి ఇది రైట్ సినిమా. మన తెలుగు వాళ్లు ఈ జానర్లో చేసిన తొలి సినిమా ఇది. కచ్చితంగా అందరికి కనెక్ట్ అవుతుంది. కథే అలా మాట్లాడించింది ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంత ఎమోషనల్గా మాట్లాడానికి కారణం ‘రాజ రాజ చోర’కథే. నిజంగా ఈ కథ బాగా కుదిరింది. స్టోరీని ఎక్కువగా రివీల్ చేయడానికి వీల్లేదు. పబ్లీసిటీ కోసం అయితే అలా మాట్లాడలేదు. కథ గురించి చెప్పేసి.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి నిరుత్సాహపరచడం నాకు ఇష్టం ఉండదు. నా కథ, షూటింగ్ ఎక్స్పీరియన్స్ని మాత్రమే ప్రీరిలీజ్ ఈవెంట్లో చెప్తా. ఇందులో సిద్ శ్రీరామ్ ఓ పాట పాడారు. ఆ విషయం ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే థియేటర్లకు వచ్చిన తర్వాత ఆ సాంగ్ వింటేనే ఓ ఫీల్ కలుగుతుంది. అందుకే పబ్లిసిటీ కోసం వాడకుండా.. నిజాయతీగా సినిమాను థియేటర్లోకి తీసుకొస్తున్నాం. సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్స్కు రావడానికి ఆలోచిస్తుంటారు. అలాంటి భయానికి ముందు నా కాన్ఫిడెన్స్ని ప్రెజంట్ చేస్తే బావుంటుందనిపించి స్టేజ్పై అలా మాట్లాడాను. అయితే నేను చెప్పిన మాటలు హృదయంలో నుంచి వచ్చినవే. టార్గెట్ పెట్టుకొని వెంకటేశ్ని కలిశా నేను వెంకటేశ్కు చాలా పెద్ద అభిమానిని. నటుడిగా మారాక ఆయనను కలిసే అవకాశం వచ్చినప్పటికీ కలవలేదు. మంచి సినిమాలు చేసి ఆయన నుంచి పిలుపు వచ్చే వరకు కలవొద్దని చిన్న టార్గెట్ పెట్టుకున్నాను. లక్కీగా ‘నీదీ నాదీ ఒకే కథ’తర్వాత వెంకటేశ్ నుంచి పిలుపు వచ్చింది. వెళ్లి కలిశా.. చాలా బాగా చేస్తున్నావని అభినందించారు. కథలు ఎంచుకునే విషయంలో డౌట్స్ ఉంటే ఆయన సలహాలు తీసుకుంటాను. పర్సనల్గా నాకవి ఎంతో హెల్ప్ అవుతూ వచ్చాయి. ‘రాజా రాజ చోర’ట్రైలర్ విడుదలైన వెంటనే.. ఫోన్ చేసి కామెడీ బాగుందని చెప్పారు. తాజాగా ఆయన ఇచ్చిన సలహా ఏటంటే.. అన్ని జానర్స్లో బాగా చేస్తున్నావు. మాస్ జానర్ కూడా ట్రై చేయమని చెప్పారు. లక్కీగా నేను తర్వాత చేయబోయే సినిమాలన్నీ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలే. అవి మాస్ ఆడియన్స్ని తప్పకుండా అలరిస్తాయి. పాన్ ఇండియా చిత్రమే నా గత సినిమాలన్నీ ఇతర భాషల్లో రిమేక్ చేశారు. కానీ ఎక్కడా చెప్పలేదు. రాజ రాజ చోర కచ్చితంగా ఇతర భాషల్లో రీమేక్ అవుతుంది. పాన్ ఇండియా స్టఫ్ ఉన్న సినిమా ఇది. కొత్త దర్శకులతో ఈజీ హిట్ ఇచ్చిన దర్శకులతో పనిచేస్తే రిలాక్స్ అయిపోతాం. అలా ఉండటం నాకిష్టముండదు. కొత్త దర్శకులతో చేసేటప్పుడు భయం, బాధ్యత ఉంటాయి. హ్యాండిల్ చేస్తారని నమ్మకం వచ్చినప్పుడు వాళ్లు బిడ్డలాగే భావించే సినిమా కరెక్ట్ వస్తుంటే వాళ్లు పడే ఆనందం చూస్తే నాకొక కిక్ వస్తుంది. ఫస్ట్ నుంచి నాకు అలా అలవాటైంది. అంతేకాకుండా కొత్త వాళ్లతో సినిమా చేయడం కిక్. వాళ్లతో సినిమా చేస్తే మన బుర్ర కూడా పదునెక్కుతుంది. నా సినిమాల్లో ఎక్కువగా కొత్తవాళ్లతో చేసినవే హిట్ అయ్యాయి. ఈ సినిమా చూసిన తర్వాత ముందు మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గురించే మాట్లాడుతారు. తొలిసారి ఇద్దరితో తొలిసారి ఇద్దరు హీరోయిన్లు మేఘా ఆకాశ్, సునైనతో సినిమా చేశా. ఇద్దరు తెలుగు వాళ్లే. కానీ తమిళంలో ఎక్కువ సినిమాలు చేశారు. ఈ సినిమా తర్వాత తెలుగులో మంచి ఆఫర్స్ వస్తాయనే నమ్మకముంది. ప్రేక్షకుల మనసును దోచుకుంటా సినిమా జయా, అపజయాలు నా చేతుల్లో ఉండవు. కష్టపడి సినిమాలు చేస్తాం.. కొన్ని కారణాల వల్ల ఫెయిల్ అవుతుంటాయి. ఏ కారణాల వల్ల సినిమా పోయిందో చూసుకొని తదుపరి సినిమాల్లో తప్పిదాలు లేకుండా చూసుకుంటా. ప్రస్తుతం అర్జున పాల్గుణ, భళా తందనాన సినిమాలతో పాటు కాప్ బయోపిక్ చేస్తున్నా. ‘రాజ రాజ చోర’తో ప్రేక్షకుల మనసును కచ్చితంగా దోచుకుంటాను. -
‘నారప్ప’ ఓటీటీలోకి రావడంతో రెండ్రోజులు భోజనం చేయలేదు
హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్ జంటగా నటించిన చిత్రం ‘రాజరాజ చోర’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘నేను వెంకటేశ్గారి వీరాభిమానిని. ‘నారప్ప’ చిత్రం ఓటీటీలోకి రావడంతో బాధ వేసి రెండు రోజులు భోజనం చేయలేదు. పెద్ద సినిమాలు థియేటర్లలోకి రావాలంటే మాలాంటి చిన్న సినిమాలను బాగా ఆదరించాలి.. అప్పుడే మన సూపర్స్టార్ సినిమాలను స్క్రీన్పై చూసుకుంటాం. అందరి హీరోల అభిమానులు మా సినిమాని ఆదరిస్తే అనిల్గారు చెప్పినట్లు ప్యాన్ ఇండియా చిత్రం అవుతుంది. రాజ రాజ చోర సినిమా చూసే మహిళలకు నేను చాలా రోజులు గుర్తిండిపోతాను. నన్ను చాలా అభిమానిస్తారు. ‘రాజరాజ చోర’ సినిమా ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళుతుంది. ఇది మన తెలుగు సినిమా. విడుదల తర్వాత ప్రతి భాషలోనూ ఈ చిత్రాన్ని కచ్చితంగా రీమేక్ చేస్తారు’ అని అన్నాడు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. శ్రీ విష్ణు కథల ఎంపిక బాగుంటుందని, ఈ చిత్రం తన కెరీర్లో ఓ బెస్ట్ మూవీ కావాలని కోరుకుంటున్నానన్నాడు. ‘రాజ రాజ చోర’ సినిమా చూశా.. కచ్చితంగా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది’ అని హీరో నారా రోహిత్ చెప్పుకొచ్చాడు. అలాగే డైరెక్టర్ హసిత్ గోలి మాట్లాడుతూ.. ‘నేను కూడా శ్రీవిష్ణుకు పెద్ద అభిమానిని. ఈ సినిమాలో కొంటె శ్రీవిష్ణును చూస్తారు’అని అన్నాడు. కాగా కార్యక్రమంలో దర్శకుడు వివేక్ ఆత్రేయ, నటుడు తనికెళ్ల భరణి, హీరోయిన్స్ మేఘా ఆకాష్, సునైన పాల్గొన్నారు. -
అందుకే సినిమాలకు గ్యాప్ ఇచ్చా: హీరోయిన్
‘లై, ఛల్ మోహన రంగ’ చిత్రాల తర్వాత తెలుగులో నాకు సరైన కథలు రాలేదు.. అందుకే ఏదీ ఒప్పుకోకపోవడంతో ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో తమిళంలో మంచి స్క్రిప్ట్స్ రావడంతో అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాను. ప్రస్తుతం తెలుగులోనూ మంచి కథా బలం ఉన్న చిత్రాల్లో నటిస్తున్నాను’ అని హీరోయిన్ మేఘా ఆకాశ్ అన్నారు. శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్ జంటగా నటించిన చిత్రం ‘రాజరాజ చోర’. హితేశ్ గోలి దర్శకత్వం వహించారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మేఘా ఆకాశ్ మాట్లాడుతూ.. ‘నేనెప్పుడూ భాష ఆధారంగా స్క్రిప్ట్స్ ఒప్పుకోను. మంచి కథ ఏ భాషలో ఉన్నా నటిస్తా. ‘రాజరాజ చోర’ కథ వైవిధ్యంగా ఉంది. నా నిజ జీవితానికి భిన్నమైన పాత్రను ఇందులో చేశాను. ఇప్పుడు ఓ స్థాయికి వచ్చాను కాబట్టి ప్రయోగాత్మక పాత్రలు చేయాలనుకుంటున్నాను. మా అమ్మ, నాన్న నా సినిమాల ఎంపికలో జోక్యం చేసుకోరు. అమ్మ కథ వింటుంది కానీ చేయాలా? వద్దా? అనే నిర్ణయం నాదే. ప్రస్తుతం ‘డియర్ మేఘ, మనుచరిత్ర, గుర్తుందా శీతాకాలం (అతిథి పాత్ర)’ చేస్తున్నాను. మరో సినిమా ప్రకటన త్వరలో వస్తుంది’’ అన్నారు. -
శ్రోతల్ని అలరిస్తున్న రాజ రాజు
శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాజ రాజ చోర’. హసిత్ గోలి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ‘రాజా రాజు వచ్చె లోకాలు మెచ్చే..’ అనే పాటను బుధవారం విడుదల చేశారు. ‘దొరలని మీకు మీరు దొర్లుతూ తిరిగారు.. చొరబడి చెడిపోతే చతికిల పడతారు.. రాజా రాజు వచ్చె లోకాలు మెచ్చే..’ అంటూ సాగే ఈ పాటకు వివేక్ సాగర్ ట్యూన్స్ ఇచ్చారు. హసిత్ గోలి సాహిత్యం అందించగా, మోహనా భోగరాజు ఆలపించారు. మేఘా ఆకాష్, సునైన, తనికెళ్ల భరణి, గంగవ్వ, అజయ్ ఘోష్ నటిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్: కీర్తీ చౌదరి, కో ప్రొడ్యూసర్: వివేక్ కూచిభొట్ల, సంగీతం: వివేక్ సాగర్, కెమెరా: వేదరామన్. -
‘భలా తందనాన’ మూవీ: ఆసక్తిగా గరుడ రామ్ ఫస్ట్లుక్
యంగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా చైతన్య దంతులూరి దర్శకత్వంతో తెరకెక్కుతోన్న వైవిధ్యమైన చిత్రం ‘భళా తందనాన’. ఇందులో కేథరిన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల ఈమూవీ షూటింగ్ కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో విలన్గా కేజీఎఫ్ ఫేం రామచంద్రరాజు(గరుడ) నటిస్తున్నాడు. అయితే ఈ రోజు రామచంద్రరాజు పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీలో ఆయన ఫస్ట్లుక్ను మేకర్స్ విడుదల చేశారు. అంతేగాక ఈ సందర్భంగా అతడి పాత్రను కూడా మూవీ యూనిట్ వెల్లడించింది. ‘ఆనంద్ బలిగా గరుడ రామ్’ అంటూ చిత్ర బృందం ఫస్ట్లుక్ను షేర్ చేసింది. ఇందులో గడ్డంతో ఉన్న రామ్ను చూస్తుంటే ఆనంద్ బలిగా పవర్ ఫుల్ విలన్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సాయి కొర్రపాటి వారాహి చలన చిత్ర బ్యానర్పై రజనీ కొర్రపాటి ఈ మూవీని నిర్మిస్తున్నాడు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. -
గంగవ్వ నోటి వెంట శ్రీవిష్ణు ‘చోర గాథ’
శ్రీవిష్ణు హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాజ రాజ చోర’. సునయన, మేఘా ఆకాశ్లు కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను ‘చోర గాథ బై గంగవ్వ’ పేరుతో చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో ‘నీకు ఊ.. కొట్టే కథ తెలుసా? ఏది చెప్పినా ఊ.. కొట్టాలి’ అని అసలు కథ మొదలు పెడుతుంది గంగవ్వ. ‘అనగనగా ఓ సూర్యుడు ఉంటడు. ఆ సూర్యడేమో భూమికి ప్రాణం ఇచ్చాడు. భూమి నుంచి కోతి, బంగారం వచ్చాయి’ అంటూ సాగే ఆద్యంతం ఆసక్తిగా సాగింది. గంగవ్వ చెప్పుకొచ్చిన ఈ కథ రాజు, దొంగ, కిరీటం చూట్టు తిరగనుందనేది అర్థమైంది. చివరకు ఈ మూడింటి మధ్య ఏం జరిగింది, రాజు కిరీటాన్ని ఎత్తుకెళ్లిన ఆ దొంగ దొరుకుతాడా? లేదా? అనే ప్రశ్నతో ముగించిన గంగవ్వ చోర గాథ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. విభిన్న కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం టీజర్ జూన్ 18న విడుదల కానుంది. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో తనికెళ్ల భరణి, రవిబాబు, కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. -
ఆయనకి జాతీయ అవార్డు రావాలి
‘‘మా స్రవంతి మూవీస్ బ్యానర్ స్టార్ట్ అయిందే రాజేంద్రప్రసాద్గారి ‘లేడీస్ టైలర్’ సినిమాతో. ఆయన పేరు ముందు ఏ బిరుదు పెట్టినా అది చిన్నదే అవుతుంది. ‘గాలి సంపత్’ సినిమాతో ఆయనకు జాతీయ అవార్డు రావాలి.. వస్తుందనుకుంటున్నా’’ అని హీరో రామ్ అన్నారు. శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ జంటగా రాజేంద్ర ప్రసాద్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘గాలి సంపత్’. అనీష్ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలో ఎస్.కృష్ణ, హరీశ్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ మాట్లాడుతూ–‘‘గాలి సంపత్’ ట్రైలర్ చూశాక రాజ్కుమార్ హిరాణీ చిత్రంలా అనిపించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్’’ అన్నారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘జీవితంలో నన్ను నటుడిగా నిలబెట్టిన మొదటి సినిమా ‘లేడీస్ టైలర్’ స్రవంతి మూవీస్దే.. ఆ సినిమా లేకుంటే ఇవాళ నేను ఇక్కడ లేను. ‘గాలి సంపత్’ నా జీవితంలో ఒక ఆణిముత్యం’’ అన్నారు. ‘‘ఈ సినిమా కథ ఆసక్తిగా అనిపించింది’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘తండ్రీ కొడుకుల మధ్య సాగే ఫన్ అండ్ ఎమోషన్ జర్నీ ‘గాలి సంపత్’’ అన్నారు అనీష్. ‘‘మా ‘గాలి సంపత్’ చూస్తున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటారు’’ అన్నారు నిర్మాతల్లో ఒకరైన రామ్. ‘‘హీరో రామ్గారితో పాటు సాహు, హరీష్గార్లతో ఓ సినిమా చేయాలనుకుంటున్నాను’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘నేనెప్పుడూ నా క్యారెక్టర్ చూసి సినిమాలు చేయను.. కథ చూసి చేస్తా’’ అన్నారు శ్రీవిష్ణు. ఈ కార్యక్రమంలో లవ్లీ సింగ్, కెమెరామెన్ సాయి శ్రీరామ్, సంగీత దర్శకుడు అచ్చురాజమణి, దర్శకులు గోపీచంద్ మలినేని, బీవీఎస్ రవి, శివ నిర్వాణ పాల్గొన్నారు. -
పెద్ద దర్శకులు చిన్న సినిమాలు కూడా తీయాలి
‘‘దాసరి నారాయణరావుగారు, రాఘవేంద్రరావుగారు, కోడి రామకృష్ణగారు వంటి వారు పెద ్దసినిమాలతో పాటు చిన్న సినిమాలూ తీశారు. అందుకే వారు వంద సినిమాల మార్క్ను ఈజీగా దాటగలిగారు. పెద్ద దర్శకులు చిన్న సినిమాలు కూడా తీయాలి. పెద్ద డైరెక్టర్ యాడ్ అయితే చిన్న సినిమా పెద్ద సినిమా అవుతుంది. ‘గాలి సంపత్’ అలాంటి పెద్ద సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరో హీరోయిన్లుగా రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో అనీష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గాలి సంపత్’. దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ, సమర్పణలో ఎస్. కృష్ణ, హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది. అనిల్æరావిపూడి మాట్లాడుతూ – ‘‘గాలి సంపత్ (రాజేంద్రప్రసాద్ పాత్ర) గొంతుకు ప్రమాదం జరిగి, మాట బయటకు రాదు. గాలి మాత్రమే వస్తుంది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్గారిది చిలిపిగా మాట్లాడే ఫీ..ఫీ..ఫీ భాష’’ అన్నారు. ‘‘ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి ఎమోషన్స్ ఉన్నాయి’’ అన్నారు అనీష్. ‘‘చిన్న సినిమాగా మొదలైన ‘గాలిసంపత్’ అనిల్ రావిపూడి రాకతో పెద్ద సినిమాగా రిలీజ్ కాబోతోంది’’ అన్నారు సాహు గారపాటి, ఎస్. కృష్ణ. -
శ్రీ విష్ణు భళా.. ప్రారంభం
వైవిధ్యమైన చిత్రాలు నిర్మించే సాయి కొర్రపాటి తాజాగా ‘భళా తందనాన’ అనే సినిమాకి శ్రీకారం చుట్టారు. శ్రీ విష్ణు హీరోగా ‘బాణం’ దర్శకుడు చైతన్య దంతులూరి దర్శకత్వంలో సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో కేథరిన్ కథానాయిక. మంగళవారం జరిగిన ఈ చిత్రం ప్రారంభోత్సవంలో తొలి సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కెమెరా స్విచ్చాన్ చేయగా, శ్రీశైల దేవస్థానం మాజీ ప్రధాన సలహాదారు పురాణపండ శ్రీనివాస్ క్లాప్నిచ్చారు. కీరవాణి సతీమణి శ్రీవల్లి, రాజమౌళి సతీమణి రమా రాజమౌళి స్క్రిప్ట్ను చిత్రబృందానికి అందించారు. మార్చిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. -
ఆసక్తి పెంచుతున్న ‘అర్జున ఫల్గుణ’ థీమ్ పోస్టర్
వైవిధ్యభరిత చిత్రాలు తీస్తూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు యండ్ హీరో శ్రీవిష్ణు. ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడతాడు. ఇప్పటికే ‘గాలి సంపత్’ అనే వెరైటీ చిత్రం చేస్తున్న ఈ యువ హీరో..తాజాగా మరో ఆసక్తికర కాన్సెప్ట్తో కొత్త సినిమాను ప్రకటించారు. ఫేమ్ తేజ మర్ని దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోన్న చిత్రానికి ఆదివారం 'అర్జున ఫల్గుణ' అనే టైటిల్ని ఖరారు చేశారు. టైటిల్ పోస్టర్లో ఐదుగురు వ్యక్తులు పరుగులు పెడుతుంటే, వారిని ఓ పోలీస్ జీప్ వెంటాడుతోంది. పైన వ్యక్తుల ముఖాలు మాత్రం కనిపించడం లేదు. కానీ వారు పరుగెత్తుతుండగా, పక్కనే ఉన్న కాలవలో వారి ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రతిబింబాలు ఎవరివో వెల్లడవుతున్నాయి. హీరో హీరోయిన్లు, వారి ముగ్గురు ఫ్రెండ్స్.. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి పారిపోతున్నారని ఆ పోస్టర్ తెలియజేస్తోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఇప్పటికే 75% షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో.. శ్రీ విష్ణు సరసన బ్యూటీ ఫుల్ హీరోయిన్ అమృత అయ్యర్ నటిస్తోంది. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా ఉన్నారు. -
‘గాలి సంపత్’ కోసం రంగంలోకి అనిల్ రావిపూడి
శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరోహీరోయిన్లుగా, రాజేంద్రప్రసాద్ గాలి సంపత్గా టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘గాలి సంపత్’. హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో అనీష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అనిల్ రావిపూడి సమర్పణ, స్క్రీన్ ప్లేతో ఆయన కో డైరెక్టర్, రైటర్, మిత్రుడు ఎస్. కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా మాకు చాలా స్పెషల్. అందుకే నా పూర్తి సహకారాన్ని అందిస్తూ దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నాను’’ అన్నారు. ఎస్. కృష్ణ మాట్లాడుతూ – ‘‘నా మిత్రుడు అనిల్ రావిపూడి ఈ చిత్రానికి బ్యాక్ బోన్గా నిలబడడమే కాకుండా స్క్రీన్ ప్లే, సమర్పణతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేయడానికి అంగీకరించినందుకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఫైనల్ షెడ్యూల్ జరుగుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి కథ: ఎస్. కృష్ణ, రచనా సహకారం: ఆదినారాయణ, మాటలు: మిర్చి కిరణ్, కెమెరా: సాయి శ్రీ రామ్, సంగీతం: అచ్చు రాజమణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగమోహన్ బాబు. ఎమ్ When #GaaliSampath was first announced, I planned to present and write screenplay for the film. This film is extra special for us and now I am extending my complete support by providing direction supervision as well. I always believe that team work means more meaningful work !! pic.twitter.com/mmFBnYWYk9 — Anil Ravipudi (@AnilRavipudi) January 21, 2021 -
సరికొత్త పాత్రలో
వైవిధ్యమైన కథలు, నటనకు అవకాశం ఉన్న పాత్రలతో దూసుకుపోతున్నారు శ్రీ విష్ణు. ఆయన నటిస్తున్న ‘రాజ రాజ చోళ’ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ‘గాలి సంపత్’ చిత్రంతో పాటు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రూపొందుతున్న ఓ సినిమా షూటింగ్ ప్రోగ్రెస్లో ఉండగా తాజాగా మరో సినిమా అంగీకరించారు శ్రీ విష్ణు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో లక్కీ మీడియా బ్యానర్పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా రూపొందనున్న చిత్రమిది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ చేయని సరికొత్త పాత్రలో శ్రీవిష్ణు కనిపిస్తారు. 2021 మొదట్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర, సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్. -
వినోదం.. సాహసం
‘క్షణం, ఘాజి, గగనం’ లాంటి కమర్షియల్ హిట్స్ అందించి, ప్రస్తుతం చిరంజీవితో ‘ఆచార్య’, నాగార్జునతో ‘వైల్డ్ డాగ్’ లాంటి క్రేజీ ఫిలిమ్స్ నిర్మిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ. ఇటీవల ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె. దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ప్రకటించారు సంస్థ నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి. తాజాగా తమ సంస్థ రూపొందించనున్న తొమ్మిదో చిత్రాన్ని గురువారం ప్రారంభించారు. శ్రీవిష్ణు, అమృతా అయ్యర్ జంటగా ‘జోహార్’ ఫేమ్ తేజ మార్ని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ క్లాప్ ఇచ్చారు. శ్రీవిష్ణు, అమృతా అయ్యర్ సినిమా స్క్రిప్టును దర్శక–నిర్మాతలకు అందజేశారు. ‘‘వినోద ప్రధానంగా సాగే అడ్వంచరస్ రోడ్ మూవీగా రూపొందనున్న చిత్రమిది. వైవిధ్యమైన కథ, కథనాలు ఉంటాయి’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సహ నిర్మాత: ఎన్.ఎమ్. పాషా, సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్, కెమెరా: జగదీష్ చీకటి. -
అరకులో గాలి సంపత్
శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరోహీరోయిన్లుగా, డా. రాజేంద్ర ప్రసాద్ గాలి సంపత్గా టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘గాలి సంపత్’. అనీష్ దర్శకత్వంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పిస్తూ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి ఎస్. క్రిష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అరకులో జరుగుతోంది. ‘‘తండ్రీ కొడుకుల మధ్య ముందెన్నడూ చూడని ఒక వైవిధ్యమైన భావోద్వేగంతో రూపొందుతోన్న చిత్రమిది. అనిల్ రావిపూడి మార్క్ వినోదంతో అందమైన ప్రయాణంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం అరకులో రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణుతో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ డిసెంబర్ 5 వరకు జరుగుతుంది. ఆ తర్వాత హైదరాబాద్లో షెడ్యూల్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, సంగీతం: అచ్చు రాజమణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగమోహన్ బాబు. ఎమ్. -
అచ్చ తెలుగు కథ
దర్శకుడు అనిల్ రావిపూడి సమర్పణలో శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ జంటగా ‘గాలి సంపత్’ చిత్రం ప్రారంభమైంది. టైటిల్ రోల్ను రాజేంద్ర ప్రసాద్ చేస్తున్నారు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఎస్.కృష్ణ, సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సీన్కి నారా రోహిత్ కెమెరా స్విచాన్ చేయగా, ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. వరుణ్ తేజ్ గౌరవ దర్శకత్వం వహించగా, స్క్రిప్ట్ను అనీష్ కృష్ణకు నిర్మాత ఎస్వీసీ శిరీష్ అందజేశారు. ‘‘నేనీ సినిమాకు స్క్రీన్ప్లే అందిస్తున్నాను’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘అచ్చ తెలుగు స్క్రిప్ట్ ఇది’’ అన్నారు శ్రీవిష్ణు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నాగమోహన్ బాబు ఎమ్. -
రాజరాజచోర ప్రారంభం
శ్రీ విష్ణు హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాజ రాజ చోర’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కరోనా బ్రేక్ తర్వాత ఈ సినిమా చిత్రీకరణ మంగళవారం తిరిగి ప్రారంభం అయింది. మేఘా ఆకాశ్, సునయిన కథానాయికలు. యస్పీ బాలసుబ్రహ్మణ్యంకి నివాళులు అర్పించి, చిత్రీకరణ ప్రారంభించారు. ‘ఒక వినూత్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది’ అన్నారు నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్. ‘సినిమా పూర్తయ్యేవరకూ రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం’ అన్నారు సహనిర్మాత వివేక్ కూచిభొట్ల. తనికెళ్ల భరణి, రవిబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: వేదరామన్, సంగీతం: వివేక్ సాగర్. -
దొంగల రారాజు
వెరైటీ కథలను ఎంచుకొని నటించే నటుల్లో శ్రీవిష్ణు ఒకరు. శనివారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా తన నూతన చిత్రం ‘రాజ రాజ చోర’ తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ‘రాజ రాజ చోర’ అంటే దొంగలందరికీ రాజు లాంటివాడు అని అర్థం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా హసిత్ గోలి దర్శకునిగా పరిచయమవుతున్నారు. సునయన కథానాయిక. చిత్రనిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ– ‘‘శ్రీవిష్ణు, హసిత్ గోలి లాంటి ఇద్దరు యువ ప్రతిభావంతులతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం, మా హీరో శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా ప్రచార చిత్రాన్ని విడుదల చేయటం ఆనందంగా ఉంది. ఏప్రిల్ నాటికి ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, క్రియేటివ్ ప్రొడ్యూసర్: కీర్తి చౌదరి, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
వేసవిలో సవారి
నందు, ప్రియాంకా శర్మ జంటగా సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘సవారి’. ఫిబ్రవరి 7న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. హీరో శ్రీ విష్ణుతో కలిసి ట్రైలర్ను విడుదల చేసిన సుధీర్బాబు మాట్లాడుతూ– ‘‘నేను హీరోగా నటించిన ‘సమ్మోహనం’ చిత్రంలో నందు నటించాడు. మొదట అతని పాత్రకు వేరొకరని తీసుకుందామని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణను అడిగాను. కానీ ఆ పాత్రను నందూయే చేయాలన్నారు. నందు బాగా నటించాడు. నేను, తను దాదాపు ఒకేసారి ఇండస్ట్రీలోకి వచ్చాం. నందు ఎలాంటి క్యారెక్టర్లో అయినా ఒదిగిపోగలడు. ఈ చిత్రదర్శకుడు సాహిత్ నాకో కథ చెప్పాడు. ఆ కథ నచ్చినప్పటికీ సినిమా చేయలేకపోయాం. ‘సవారి’ కంటెంట్ ఉన్న సినిమాలా కనిపిస్తోంది. సాహిత్ భవిష్యత్లో పెద్ద దర్శకుడు అవుతాడు’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం నందు పడ్డ కష్టం ఎక్కడికీ పోదు. విడుదల తర్వాత ‘సవారి’ చిత్రం పెద్ద సినిమాగా నిలవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా పాటలు నాకు బాగా నచ్చాయి’’ అన్నారు శ్రీ విష్ణు. ‘‘డబ్బుల కోసం నేను చాలా సినిమాలు చేశాను. నటుడిగా అవి నాకు మంచి అనుభవాన్ని ఇచ్చాయి. ‘సమ్మోహనం’ తర్వాత మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతో ఏడాది గ్యాప్ తీసుకుని ‘సవారి’ చిత్రం చేశాను. తొలి పోస్టర్ రిలీజ్ నుంచే ఈ సినిమాకు మంచి బజ్ వస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి మంచి సినిమాలే చేస్తాను’’ అన్నారు నందు. ‘‘ఈ సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం. ఈ సినిమాను మా అన్నయ్య, స్నేహితుడు కలిసి నిర్మిస్తున్నారు. ఇందులోని రెండు పాటలకు 10 మిలియన్ (కోటి) వ్యూస్ రావడం చిన్న విషయం కాదు’’ అన్నారు సాహిత్ మోత్కూరి. ఈ కార్యక్రమంలో శివ, జీవన్, మ్యాడీ, శ్రీకాంత్ రెడ్డి, బల్వీందర్, పూర్ణాచారి, కరిముల్లా, ఎడిటర్ సంతోష్ మేనం పాల్గొన్నారు. -
ఏడ ఉన్నావే...
శ్రీ మానస్, సమ్మోహన జంటగా తెరకెక్కిన చిత్రం ‘పటారుపాళెం ప్రేమ కథ’. జె.ఎస్ ఫిలిమ్స్ పతాకంపై దొరైరాజు వూపాటి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. బాలు ధాకే స్వరపరచిన ఈ సినిమాలోని ‘ఏడ ఉన్నావే ఏడ ఉన్నావే..’ అనే తొలి పాటను హీరో శ్రీవిష్ణు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది దొరైరాజుగారే. ఆయన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పాటను విడుదల చేయడం సంతోషంగా ఉంది. పాట చాలా బాగుంది’’ అన్నారు. దొరైరాజు మాట్లాడుతూ– ‘‘పరువు హత్యల నేపథ్యంలో, కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాను’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: బాలు ధాకే, సమర్పణ: జిఎస్ రెడ్డి, నిర్మాతలు: వి.లతా రెడ్డి, వి. సౌజన్యా దొరైరాజు, బి.ఆర్. బాలు, కె. రామకృష్ణ ప్రసాద్. -
రూట్ మార్చారా?
సౌత్ ఇండస్ట్రీల్లో దాదాపు స్టార్ హీరోలందరితో నటించారు కాజల్ అగర్వాల్. ఇప్పుడు యంగ్ హీరోలతోనూ ఆమె సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీవిష్ణు హీరోగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో శ్రీవిష్ణుకి జోడీగా కాజల్ నటించనున్నారని సమాచారం. ఈ సినిమాలో శ్రీవిష్ణు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారట. శ్రీవిష్ణుతో కాజల్ నటించడం ఇదే తొలిసారి. మరి.. ఇలానే యంగ్ హీరోలతోనూ వరుసగా కాజల్ జోడీ కట్టాలనుకుంటున్నారా? వేచి చూడాలి. -
సమయానికి వస్తాను... చెప్పింది చేస్తాను
‘‘ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది. కంటెంట్ అండ్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలవైపే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. కానీ పెద్ద హీరోలు చేసిన కాన్సెప్ట్ సినిమాలు మాత్రమే ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరుతున్నాయి. ‘రంగస్థలం’ అందుకు ఓ ఉదాహరణ. మధ్య స్థాయి హీరోలు చేసిన కాన్సెప్ట్ సినిమాలు మల్టీఫ్లెక్స్లకే పరిమితం కాకూడదు. అందుకే స్క్రిప్ట్లో ఏయే అంశాలు కావాలో వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని శ్రీవిష్ణు అన్నారు. విజయ్కృష్ణ. ఎల్ దర్శకత్వంలో శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘తిప్పరామీసం’. రిజ్వాన్ నిర్మించిన ఈ చిత్రం గ్లోబల్ సినిమాస్ ద్వారా రేపు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు చెప్పిన విశేషాలు. ► ‘తిప్పరామీసం’ సినిమాలో నేను నైట్ క్లబ్లో పని చేసే డీజే పాత్ర చేశాను. క్యారెక్టర్లో నెగటీవ్ షేడ్స్ ఉంటాయి. కాస్త రఫ్గా కనిపిస్తాను. ఈ సినిమా కోసం నేను బరువు పెరిగాను. ఫుల్గా మాస్ క్యారెక్టర్ కాదు. కానీ మాస్ అప్పీల్ ఉంటుంది. చాలా నిర్లక్ష్యంగా ఉండే క్యారెక్టర్. తినడం.. తాగడం.. పడుకోవడం. అలాంటి అతని జీవితం కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఎలా ప్రభావితం అయ్యిందన్నదే కథ. తెలుగు ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని మూడు సీక్వెన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. అవి ప్రేక్షకులకు నచ్చుతాయని ఆశిస్తున్నాం. ► సినిమాలో అమ్మ సెంటిమెంట్ ఉంటుంది. అమ్మ కోసం హీరో ఏ పని చేసి గర్వంగా ఫీల్ అయ్యాడో, ఏ పరిస్థితుల్లో మీసం తిప్పాడో వెండితెరపై చూసినప్పుడు ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటుంది. తల్లి పాత్రలో రోహిణిగారు అద్భుతంగా నటించారు. దర్శకుడు విజయ్ సినిమాను బాగా తీశాడు. ► విజయ్ అసోసియేషన్లో ఎక్కువ సినిమాలు చేయడానికి ప్రత్యేకమైన కారణం లేదు. నేను, నారా రోహిత్, విజయ్ భాగస్వాములం. నాతో పని చేసిన ఎవరైనా నాతో మళ్లీ వెంటనే సినిమా చేస్తామంటారు. కానీ నాకు ఉన్న ఇతర కమిట్మెంట్స్ గురించి కూడా ఆలోచించాలి. నాతో వర్క్ చేయడం కంఫర్ట్గా ఉంటుందని దర్శకుడు విజయ్ కృష్ణ చెప్పారంటే సంతోషంగా ఉంది. నేను ఎవరితో సినిమా చేసినా సమయానికి వెళతాను.. దర్శకులు చెప్పింది చేస్తాను. ► ‘బ్రోచెవారెవరురా’ సినిమా నన్ను మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేసింది. ఈ సినిమాలో క్రేజీ కామెడీ ఉంది. కానీ కామెడీ మాత్రమే ప్రేక్షకులకు చాలదు. కథలో కంటెంట్ కూడా బాగుండాలి. ‘బ్రోచేవారెవరురా’ తర్వాత వస్తున్న నా చిత్రాలపై అంచనాలు ఉండొచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత బాధ్యతగా సినిమాలు చేస్తున్నాను. ► నా కెరీర్ మొదట్లో నా దగ్గరకు కమర్షియల్ కథలు వచ్చేవి. కానీ ఇప్పుడు భిన్నమైన కథలే వస్తున్నాయి. నేను కూడా రెగ్యులర్ సినిమాలు చేయాలనుకోవడం లేదు. కానీ పెద్ద హీరోలు చేసే కమర్షియల్ సినిమాలు చూస్తాను. ఎంజాయ్ చేస్తాను. అయితే నేను కాన్సెప్ట్ సినిమాలు చేస్తాను. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు వస్తే చేయడానికి సిద్ధమే. కథ నచ్చాలి. ► ఇప్పటికే మూడు సినిమాలు కమిట్ అయ్యాను. ఈ సినిమాల చిత్రీకరణ పూర్తయ్యాక పారితోషికం పెంపుదల గురించి ఆలోచిస్తాను. నారా రోహిత్తో కలిసి నేను నటించాల్సిన ఓ పీరియాడికల్ మూవీ కోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. బహుశా వచ్చే ఏడాది మొదలుకావొచ్చు. -
శ్రీవిష్ణు మంచి కథలను ఎంపిక చేసుకుంటాడు
‘‘మంచి కథలను ఎంపిక చేసుకుంటూ, ఆ కథల్లో తాను ఇన్వాల్వ్ అవుతూ కొత్త రకం సినిమాలు చేస్తున్నాడు శ్రీవిష్ణు. తను నటించిన సూపర్హిట్ సినిమా ‘బ్రోచేవారెవరురా’ని మూడుసార్లు చూశాను’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి జంటగా ‘అసుర’ చిత్ర దర్శకుడు విజయ్కృష్ణ. ఎల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తిప్పరా మీసం’. శ్రీ హోమ్ సినిమాస్ సమర్పణలో రిజ్వాన్ నిర్మించారు. గ్లోబల్ సినిమాస్ ద్వారా ఈ నెల 8న విడుదలవుతున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘మంచి సినిమాలు చేస్తే ప్రేక్షకుల్లో, సినీ పరిశ్రమలో మంచి గౌరవం సంపాదించుకున్నారు శ్రీవిష్ణు. ఇకముందు కూడా ఇలాగే మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. ఈ చిత్రం ట్రైలర్, పోస్టర్స్ చాలా బావున్నాయి’’ అన్నారు. నారా రోహిత్ మాట్లాడుతూ– ‘‘సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. అద్భుతమైన సినిమా. శ్రీవిష్ణు ఇంకా పెద్ద సినిమాలు చేయాలి’’ అన్నారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘చాలా దగ్గరగా నన్ను చూసిన దర్శకుడు విజయ్ నాకు నెగటివ్ క్యారెక్టరు డిజైన్ చేశాడు. ప్రపంచంలో ఏదైనా మారొచ్చు కానీ అమ్మ ప్రేమ ఎప్పటికీ మారదు. తల్లి గొప్పదనం గురించి చెప్పే చిత్రంలో నటించినందుకు గర్వంగా ఉంది’’ అన్నారు. దర్శకుడు విజయ్ మాట్లాడుతూ– ‘‘మేం చేసిన ఈ మంచి ప్రయత్నం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. శ్రీవిష్ణు పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో తల్లి పాత్రలో నటించిన రోహిణి గారికి అంతే ఇంపార్టెన్స్ ఉంది’’ అన్నారు. ‘‘నా పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేశారు’’ అన్నారు నటి రోహిణి. రిజ్వాన్ మాట్లాడుతూ– ‘‘విజయ్ ది బెస్ట్ ఫిల్మ్ను ఇచ్చాడు.. సురేశ్ బొబ్బిలి సంగీతానికి మంచి రెస్పాన్స్ వచ్చింది’’ అన్నారు. ఇంకా ఈ వేడుకలో నిర్మాత యం.ఎల్. కుమార్ చౌదరి, బెనర్జీ, అచ్యుత రామారావు తదితరులు పాల్గొన్నారు. -
అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది
‘‘అసుర’ సినిమా నుంచి విజయ్ కృష్ణ, నా ప్రయాణం కొనసాగుతోంది. మాకు ఒక ప్లాట్ఫామ్ కావాలని రెండు మూడు సినిమాలు నిర్మించాం. అందులో నేను చిన్న చిన్న వేషాలు వేశాను. నేను కొంచెం మంచి సినిమాలు చేశాక ఇద్దరం సినిమా చేద్దామనుకున్నాం. తను ఇచ్చిన మాట కోసం నాతో ‘తిప్పరా మీసం’ సినిమా చేశాడు’’ అని శ్రీవిష్ణు అన్నారు. ‘అసుర’ ఫేమ్ విజయ్ కృష్ణ ఎల్. దర్శకత్వంలో శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి జంటగా తెరకెక్కిన చిత్రం ‘తిప్పరా మీసం’. శ్రీ హోమ్ సినిమాస్ సమర్పణలో రిజ్వాన్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 8న గ్లోబల్ సినిమాస్ ద్వారా విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో దర్శకుడు విజయ్ కృష్ణ మాట్లాడుతూ– ‘‘ఒక మంచి సినిమా చేద్దామని నేను, శ్రీవిష్ణు ‘తిప్పరామీసం’ స్టార్ట్ చేశాం. ఆ తర్వాత నా ఫ్రెండ్ అచ్యుత రామారావు, రిజ్వాన్ జాయిన్ అయ్యారు. శ్రీవిష్ణు, నిక్కి బాగా నటించారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన రిజ్వాన్గారికి థ్యాంక్స్’’ అన్నారు నిక్కీ తంబోలి. ‘‘ఈ సినిమాకి విజయ్ హార్ట్ అయితే, శ్రీవిష్ణు ప్రాణం. వారిద్దరూ కష్టపడి ఈ సినిమా చేశారు’’ అన్నారు రిజ్వాన్. సహనిర్మాత అచ్యుత రామారావు, హాస్యనటుడు నవీన్, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, ఎడిటర్ ధర్మేంద్ర, పాటల రచయిత పూర్ణచారి పాల్గొన్నారు. -
తిప్పరా మీసం
అనుకున్నది సాధించినప్పుడో, పందెంలో గెలిచినప్పుడో మీసం తిప్పుతారు. ఇప్పుడు శ్రీవిష్ణు కూడా మీసం తిప్పుతున్నారు. మరి ఆయనేం చేశారో సినిమా చూసి తెలుసుకోవాలి. శ్రీవిష్ణు హీరోగా ఎల్. కృష్ణ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తిప్పరా మీసం’. నికీ తంబోలీ హీరోయిన్. శ్రీ ఓం బ్యానర్ సమర్పణలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, కృష్ణ విజయ్ ప్రొడక్షన్స్ బ్యానర్లు నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబర్ 8న విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ట్రైలర్, ఆడియోను త్వరలోనే రిలీజ్ చేస్తాం. థియేట్రికల్ రైట్స్ను ఏషియన్ సినిమాస్ బ్యానర్ తీసుకున్నారు’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: సురేశ్ బొబ్బిలి, కెమెరా: సి«ద్. -
వినూత్నమైన కథతో...
‘నీదీ నాదీ ఒకే కథ, బ్రోచేవారెవరురా’ ఫేమ్ శ్రీవిష్ణు హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్నాయి. శ్రీవిష్ణు హీరోగా ‘మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా’ వంటి చిత్రాలతో విజయం అందుకున్న డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దగ్గర రచన, దర్శకత్వ విభాగంలో పని చేసిన హాసిత్ గోలి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. చిత్రనిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ– ‘‘శ్రీవిష్ణు, హాసిత్ గోలి వంటి ప్రతిభ కలిగినవారితో సినిమా నిర్మించనుండటం ఎంతో ఆనందంగా ఉంది. ఒక వినూత్నమైన కథతో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివరిలో ప్రారంభమవుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, కీర్తీ చౌదరి. -
శత్రువు కూడా వ్యసనమే
‘మందు, సిగరెట్, అమ్మాయిలా.. శత్రువు కూడా వ్యసనమే.. ఆ వ్యసనానికి నేనూ బానిసనే’ అంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్తో ‘తిప్పరా మీసం’ చిత్రం టీజర్ విడుదలైంది. శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి జంటగా కృష్ణ విజయ్.ఎల్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కృష్ణ విజయ్ ఎల్ ప్రొడక్షన్, శ్రీ ఓం సినిమా పతాకాలపై రూపొందుతోన్న ఈ సినిమా టీజర్ని హైదరాబాద్లో విడుదల చేశారు. ‘‘యాక్షన్ రివెంజ్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రమిది. మా సినిమా టీజర్కు, శ్రీవిష్ణు డైలాగ్కి అనూహ్య స్పందన వస్తో్తంది. శ్రీవిష్ణుని కృష్ణ విజయ్ ఆవిష్కరించిన తీరు, లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: ఖుషీ, అచ్యుత్ రామారావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మనోజ్ మావిళ్ల, సంగీతం: సురేశ్ బొబ్బిలి, కెమెరా: సిద్. -
ఇద్దరం.. వెంకటేష్ అభిమానులమే..
ఒకప్పుడు వారిద్దరూ వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. ఒకరికొకరు పరిచయం కూడా లేదు. కానీ ఇద్దరి గమ్యం ఒక్కటే.. అదే ‘సినిమా’. ఇప్పుడు వారిద్దరూ ఒక్కటే. వారిని సినిమా ప్రపంచమే కలిపింది. ఒకరు సినీ హీరో అయితే, మరొకరు దర్శకుడిగా మారారు. వారే హీరో శ్రీవిష్ణు, దర్శకుడు వివేక్ ఆత్రేయ. విష్ణు బీబీఎం చదివి హైదరాబాద్ పయనమవగా.. వివేక్ బీటెక్ చేసి ఓ ప్రముఖ ఎమ్మెన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాడు. మనసంతా సినిమా వైపు లాగడంతో ఉద్యోగాన్ని వదిలేసి నగరానికి వచ్చేశాడు. వీరిద్దరూ తమ గమ్యాన్ని చేరుకుని ‘మెంటల్ మదిలో’ చిత్రంతో ప్రేక్షకుల మదిని దోచేశారు. తర్వాత ‘బ్రోచేవారెవరురా’తో మరో హిట్ కొట్టారు. ఈ మిత్ర ద్వయం తమ సినీ ప్రయాణాన్ని.. అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. అవి వారి మాటల్లోనే.. -సత్య గడేకారి అమలాపురంలో మొదలై.. శ్రీవిష్ణు: నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లపైనే అయింది. మాది అమలాపురం సమీపంలోని గోడి గ్రామం. బీబీఎం చదివా. చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. వెంకటేష్ సినిమాలు అదేపనిగా చూసేవాణ్ని. చదువు, జాబ్ మనకు సెట్ కావని హైదరాబాద్ వచ్చేశా. వినయ్వర్మ వద్ద థియేటర్ ఆర్టిస్ట్గా చేరా. నటనలో కొన్ని మెళకువలు నేర్చుకున్నా. సినిమా కష్టాలను అనుభవించా. చిన్నచిన్న వేషాలు వేసింతర్వాత ‘బాణం’ చిత్రంలో చిన్న పాత్ర వేసి పేరు తెచ్చుకున్నా. తర్వాత ‘ప్రేమ.. ఇష్క్.. కాదల్’ నటుడిగా గుర్తింపు వచ్చింది. అల్లు అర్జున్ ప్రశంసించారు.. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమా చూశాక హీరో అల్లు అర్జున్ ఫోన్ చేసి అభినందించి ప్రత్యేకంగా పిలిచి మాట్లాడారు. తమిళంలో విజయ్ సేతుపతి, శివకార్తికేయన్లా నీకు మంచి టాలెంట్ ఉందని కితాబిచ్చారు. విభిన్న కథలను చేయమంటూ సలహా ఇచ్చారు. ఓ పెద్ద హీరో అభినందించడం చాలా సంతోషంగా అనిపించింది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో బన్నీతో కలిసి నటించాను. మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత ‘నీది నాది ఒకటే కథ’.. ‘అప్పట్లో ఒకడుండేవాడు’.. ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలు చేశాను. ఇద్దరం.. వెంకటేష్ అభిమానులమే.. శ్రీవిష్ణు, వివేక్ ఆత్రేయ: మేమిద్దరం చిన్నప్పటి నుంచి వెంకటేష్ అభిమానులమే. ఆయన తన ఇంటికి పిలిచి అభినందించడం మరిచిపోలేని అనుభవం. మమ్మల్ని ప్రోత్సహించిన సినీ పెద్దలకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఓ డిఫరెంట్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తాం. మేం వచ్చింది ఆంధ్రా ప్రాంతం నుంచే అయినా మాకు తెలంగాణ వంటలంటే ఎంతో ఇష్టం. హైదరాబాదీ కల్చర్పై మమకారం ఎక్కువ. తెలంగాణ స్నేహితులే ఎక్కువ. వారితో సాన్నిహిత్యం బాగా పెరిగింది. గుంటూరులో షురువై.. వివేక్ ఆత్రేయ: మాది గుంటూరు. తమిళనాడులోని శాస్త్రి యూనివర్సిటీలో బీటెక్ చేశా. అప్పుడే కొంత మందిమి జట్టుగా ఏర్పడి షార్ట్ఫిలింస్ చేశాం. కావ్యం అనే షార్ట్ఫిలింకి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత ఐబీఎంలో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. జాబ్లో జాయిన్ అయినా ఎక్కడో ఏదో వెలితి అనిపించింది. జాబ్ మానేసి హైదరాబాద్ వచ్చేశా. కథలను రాసి యువ హీరోలతో పాటు నిర్మాతలను వినిపించడం మొదలుపెట్టా. భిన్నమైన కథతో వచ్చాను నేను రాసిన కథతో నిర్మాత రాజ్ కందుకూరిని కలిశాను. అప్పటికే ‘పెళ్లిచూపులు’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉన్నారు. ‘మెంటల్ మదిలో’ కథ చెప్పాను. ఆయనకు అది బాగా నచ్చింది. శ్రీవిష్ణుని రికమెండ్ చేశారు. శ్రీ విష్ణుని కలిశాక ‘మెంటల్ మదిలో’ హీరో కన్ప్యూజ్డ్ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా రెప్లికాలా అనిపించాడు. అతనికీ కథ బాగా నచ్చడంతో సినిమా పట్టాలెక్కింది. కథలోలీనమయ్యా.. శ్రీవిష్ణు: వివేక్ వచ్చి కలిసి కథ చెప్పడం మొదలుపెట్టాక. కథలో లీనమైపోయా. చాలా సూపర్బ్గా అనిపించింది. కానీ చెప్పిన విధంగా సినిమా తీస్తాడా అని కొద్దిగా భయం. అయితే, అతడిలో కాన్ఫిడెన్స్ కనిపించింది. చాలామంది నన్ను రిజర్వ్డ్ పర్సన్ అని అంటుంటారు. కానీ నేను అలా కాదు. వివేక్ కథ చెప్పాడు. ఈ కథ నీకే సూటవుతుందన్నాడు. అంతే సినిమా చకచకా సాగిపోయింది. 2017లో వచ్చిన ఈ పిక్చర్ మదిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మాలో కాన్ఫిడెంట్ రెట్టింపు చేసింది. టీంవర్క్తో విజయం సాధించాం వివేక్ ఆత్రేయ: నేను బీటెక్ చేస్తున్న సమయంలో మేము సెట్ అయిన టీం.. మా జూనియర్స్ కలిసి టీంగా ఏర్పడ్డాం. అందులో చాలా మంది మంచి జాబ్స్ వదులుకొని వచ్చారు. సినిమా రిలీజ్కి దగ్గలో ఉన్నా సినిమాకి సంబంధించిన వర్క్ చాలా ఉంది. టీమంతా కష్టపడటంతో ‘బ్రోచేవారెవరురా’ చిత్రం విజయాన్ని నమోదు చేసుకుంది. చాలామంది ఫోన్లు చేసి అభినందించారు. అల్లు అర్జున్, వెంకటేష్, నాగచైతన్య, అడవిశేషు, సుప్రియల అభినందనలు ఆనందాన్నిచ్చాయి. -
ఇది సమష్టి విజయం
‘‘బ్రోచేవారెవరురా’ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇందులో ప్రతి ఒక్కరూ బాగా చేశారు. ఇది మా టీమ్ సమష్టి కృషితో సాధించిన విజయం’’ అన్నారు దర్శకుడు వివేక్ ఆత్రేయ. శ్రీవిష్ణు, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. సత్యదేవ్, నివేతా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటించారు. విజయ్కుమార్ మన్యం నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ‘‘సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది’’ అని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘థాంక్స్ మీట్’లో విజయ్కుమార్ మన్యం మాట్లాడుతూ –‘‘మా సినిమా చూసి ప్రోత్సహించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. కేటీఆర్గారు, సురేశ్బాబుగారు, వెంకటేశ్గారు, నానిగారు, అనిల్ రావిపూడి, తరుణ్ భాస్కర్, రామ్.. ఇలా మా సినిమా గురించి మంచి మాటలు చెప్పిన అందరికీ థ్యాంక్స్. మంచి కలెక్షన్లు, మంచి ఓపెనింగ్స్ రావడానికి మంచి రివ్యూలు దోహదపడ్డాయి’’ అన్నారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘మా సినిమా చూసి సురేష్బాబుగారు బావుందన్నారు. ప్రీ రిలీజ్కి రామ్గారు, రోహిత్గారు వచ్చారు. దానివల్ల అందరికీ రీచ్ అయింది. ముందు రోజు నానిగారు చూసి బావుందని చెప్పడంతో అందరూ థియేటర్లకు వచ్చి మెచ్చుకోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు. -
నా నటనలో సగం క్రెడిట్ అతనిదే
‘‘సినిమా రిలీజైన తర్వాత తెలుస్తుంది.. మనం చిన్న సినిమా చేశామా? పెద్ద సినిమా చేశామా? అని. ‘మెంటల్ మదిలో’ సినిమా చూశా. వివేక్ ఆత్రేయ చాలా బాగా తీశాడు. ఇలాంటి ప్రతిభ ఉన్న డైరెక్టర్కి ‘బ్రోచేవారెవరురా’ సినిమాకి మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదిరారు’’ అన్నారు హీరో రామ్. శ్రీవిష్ణు, నివేదా థామస్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. విజయ్ కుమార్ మన్యం నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. హైదరాబాద్లో జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రామ్ మాట్లాడుతూ– ‘‘నిన్నుకోరి’లో తొలి షాట్ చూసిన తర్వాత నివేదా మంచి నటి అని తెలిసింది. వివేక్ మ్యూజిక్ బావుంటుంది. నా ఫేవరేట్ లిరిసిస్ట్ రామజోగయ్యశాస్త్రి. ‘ఎందుకంటే ప్రేమంట’ సినిమాలో ‘తదుపరి జన్మకైనా...’ పాట రాశారు. ఈ సినిమాకి కూడా మంచి పాటలు రాశారు. శ్రీవిష్ణుని ఫస్ట్ టైమ్ ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ టైమ్లో కలిశా. ఆ సినిమాలో నా నటనలో సగం క్రెడిట్ శ్రీవిష్ణుదే. తను చాలా మంచి నటుడు. నాకు నటన నేర్పించిన అరుణ భిక్షుగారు ఈ చిత్రానికి చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘మంచి సినిమాలు తీయగానే సురేష్ బాబుగారిలాంటి వాళ్లు ఇన్వాల్వ్ అయి సపోర్ట్ చేస్తున్నారు.. ఇందుకు చాలా హ్యాపీ. నేను చిన్నప్పటి నుంచి వెంకటేష్గారికి వీరాభిమానిని. ఈ సినిమాలో నేను ఆయన ఫ్యాన్గా చేయడం ఆనందంగా ఉంది. ‘బ్రోచేవారెవరురా’ కథని వివేక్ ఆత్రేయ చెప్పినప్పుడు చాలా నచ్చింది. మిత్ర పాత్రలో నివేదా బాగా నటించారు. ఆ పాత్రకోసం, కేవలం మహిళల కోసం ఈ సినిమా చేశా’’ అన్నారు. ‘‘ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు సురేష్ బాబు. ‘‘మహిళలు చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు నివేదా థామస్. ‘‘విజువల్గా సినిమా రిచ్గా ఉంటుంది’’ అన్నారు విజయ్ కుమార్ మన్యం. ‘‘ఈ చిత్రం గురించి నేను మాట్లాడటం కన్నా సినిమా చూస్తేనే మంచిది’’ అన్నారు వివేక్ ఆత్రేయ. ‘‘ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నా’’ అన్నారు నారా రోహిత్. -
నా లైఫ్లో ఆ బ్యాచ్ ఉంటే బాగుంటుంది
‘‘స్క్రీన్ టైమ్ కాదు.. కథలో నా పాత్రకు ప్రాముఖ్యత ఉండాలని కోరుకుంటున్నాను. ఎగై్జట్ చేసిన స్క్రిప్ట్స్నే ఒప్పుకుంటున్నాను’’ అన్నారు నివేదా థామస్. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీవిష్ణు, నివేదా థామస్ జంటగా నటించిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. మన్యం విజయ్కుమార్ నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను ఈ నెల 28న విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా నివేదా థామస్ చెప్పిన కబుర్లు. ► ఇందులో నా పాత్ర పేరు మిత్రా. క్లాసికల్ డ్యాన్సర్ కావాలన్నది మిత్రా కోరిక. నా రియల్లైఫ్లో నా ఐదేళ్లప్పుడే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నా. హ్యూమన్ రిలేషన్షిప్స్ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుందనే విషయాలను ఆసక్తికరంగా చూపించాం. మహిళలపై వేధింపుల అంశాన్ని చర్చించాం. స్క్రీన్ప్లే ఆసక్తికరంగా ఉంటుంది. ► ‘ఆర్ 3’ బ్యాచ్ (శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ) వల్ల మిత్రా లైఫ్లో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనల ప్రభావం ఆర్3 బ్యాచ్పై పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఎవరు ఎవర్ని ఎలా కాపాడుకున్నారు అన్నదే కథాంశం. ఇది ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్ కాదు. సినిమాలోని అందరి పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సినిమా చేసిన తర్వాత నా లైఫ్లో ఆర్ 3 బ్యాచ్లాంటి వారు ఉంటే బాగుండు అనిపించింది. వివేక్ ఆత్రేయ మంచి డైరెక్టర్. మంచి అవుట్పుట్ ఇచ్చారు. ► నేనేం చేసినా ఒక పద్ధతి ప్రకారం చేయాలనుకుంటాను. సీన్కు అవసరం అయితేనే హోమ్వర్క్ చేస్తాను. రొటీన్ సినిమాలు చేయడం నాకు అంతగా ఇష్టం ఉండదు. ఈ సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పాను. ‘జెంటిల్మన్’ అప్పుడే నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పాలనుకున్నాను. కుదర్లేదు. ‘118’ చిత్రం నుంచి నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నా. ► తమిళంలో సినిమాలు చేయకపోవడానికి పెద్దగా కారణం ఏమీ లేదు. ‘జెంటిల్మన్’ తర్వాత తెలుగులో నాకు చాలా మంచి స్క్రిప్ట్స్ వచ్చాయి. చేస్తున్నాను. హైదరాబాద్లో ఇల్లు కొనలేదు. కొనే ఆలోచనలో ఉన్నాను. ► ‘మీటూ’ అనేది మూమెంట్. మహిళలపై వేధింపులనేవి అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. యాక్టర్స్ పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి ఈజీగా కామెంట్ చేయొచ్చని కొందరు అనుకుంటారు. సోషల్మీడియాలో నా పై ట్రోల్స్ను పట్టించుకోను. ► ప్రస్తుతం ఇంద్రగంటిగారి ‘వి’లో నటిస్తున్నా. ‘శ్వాస’ సినిమా ప్రీ–ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. రజనీకాంత్గారి ‘దర్బార్’ సినిమాలో నటిస్తున్నానా? లేదా? అనేది నేను చెప్పలేను. చిత్రబృందం అధికారికంగా చెబితే బాగుంటుందన్నది నా అభిమతం. -
అది ఇంకా ప్రశ్నే
‘బ్రోచేవారెవరురా అంటే కాపాడేవారు ఎవరురా అని అర్థం. ఈ సినిమాలో ఏ రెండు పాత్రలను తీసుకున్నా ఏదో ఓ సందర్భంలో ఒక పాత్ర మరో పాత్రను కాపాడుతుంది. దాంతో ‘బ్రోచేవారెవరురా’ అనే టైటిల్ బావుంటుందని పెట్టాం’’ అని దర్శకుడు వివేక్ ఆత్రేయ అన్నారు. శ్రీవిష్ణు, నివేదా థామస్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. మన్యం విజయ్కుమార్ నిర్మాత. సత్యదేవ్, నివేదా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటించారు. సురేశ్ ప్రొడక్షన్స్ విడుదల చేస్తున్న ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా వివేక్ ఆత్రేయ పంచుకున్న విశేషాలు... ► ఈ కథను నా మొదటి సినిమా ‘మెంటల్ మదిలో’ తర్వాతే రాసుకున్నాను. ఫస్ట్ రాజ్ కందుకూరిగారి బ్యానర్లో చేద్దామనుకున్నాను. ప్రొడక్షన్ ఆలస్యం అవుతుండటంతో ‘మళ్లీ ఏదైనా ప్రాజెక్ట్ కలసి చేద్దాం’ అని రాజ్సార్తో చెప్పి బయటకు వచ్చేశా. ► కథ రాసుకున్నప్పుడు శ్రీవిష్ణుని మనసులో పెట్టుకునే రాసుకున్నాను. వేరే వాళ్లకు కథ చెప్పినా, ఫైనల్గా విష్ణుతోనే చేశాను. ‘మెంటల్ మదిలో’ అప్పుడు మా కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇందులో ఉమెన్ హెరాస్మెంట్ పాయింట్ని టచ్ చేస్తూ లైట్ హార్ట్ కామెడీగా తెరకెక్కించాం. ప్రతి మహిళ చూడాల్సిన సినిమా ఇది. మిత్ర అనే పాత్ర నివేదా థామస్ తప్ప ఎవరూ చేయలేరు అన్నట్టుగా చేసింది. ► ఇందులో ఆర్3 బ్యాచ్ (శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ) ఐదేళ్లుగా ఇంటర్ చేస్తుంటారు. వాళ్లకు మిత్రా (నివేదా థామస్) పరిచయం అవుతుంది. తన వల్ల వీళ్ల లైఫ్ ఎలా మారింది అనేది కథ. ఇందులో సినిమా హీరోయిన్గా నివేదా పేతురాజ్, దర్శకుడు కావాలనే పాత్రలో సత్యదేవ్ చేశారు. ► ‘మెంటల్ మదిలో’ నచ్చింది, హిట్ అని కొందరంటారు. కొందరేమో ఇంకా బావుండాల్సింది అంటారు. సో ఫస్ట్ సినిమా హిట్టా లేదా? నాకు రావాల్సినంత పేరు వచ్చిందా? లేదా అనేది నాకింకా ప్రశ్నే. ఆ విషయాన్ని మెల్లిగా పట్టించుకోవడం మానేశాను. ‘బ్రోచేవారెవరురా’ తర్వాత ఏ సినిమా చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. -
కాపాడేవారెవరు రా?
‘‘బ్రోచేవారెవరురా... అంటూ దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ టైటిల్ చెప్పగానే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. దాని అర్థం‘కాపాడేవారు ఎవరురా?’ అని చెప్పారు. కథ విన్నాక టైటిల్ ఈ సినిమాకు సూట్ అవుతుందనిపించింది’’ అని శ్రీవిష్ణు అన్నారు. శ్రీవిష్ణు, నివేదా థామస్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. మన్యం విజయ్కుమార్ నిర్మాత. సత్యదేవ్, నివేదా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ట్రైలర్ను శనివారం దర్శకుడు అనిల్ రావిపూడి రిలీజ్ చేసి, మాట్లాడుతూ – ‘‘శ్రీవిష్ణు చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాకు నేను క్లాప్ కొట్టాను. ఆ సినిమా బాగా ఆడింది. ‘బ్రోచేవారెవరురా’ ట్రైలర్ చాలా ఫన్నీగా, హాంటింగ్గా ఉంది. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ‘మెంటల్ మదిలో’ సినిమాతో ఆల్రెడీ వివేక్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు చేసిన ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘వివేక్ ఫస్ట్ ఈ కథ చెప్పగానే బాగా నచ్చింది. అందరికీ కనెక్ట్ అయ్యే కథ ఇది. అద్భుతమైన క్వాలిటీతో మన్యం విజయ్గారు నిర్మించారు. ఆయన మన్యం పులిలా విజృంభించి మరిన్ని సినిమాలు తీయాలి’’ అన్నారు శ్రీవిష్ణు. ‘‘ఇది టీమ్ వర్క్. ఇందులో ‘మంత్ర’ అనే పాత్ర చేశాను’’ అన్నారు నివేదా థామస్. ‘‘మెంటల్ మదిలో’ చూసి వివేక్తో ఓ సినిమా చేయాలనుకున్నాను. లక్కీగా ఈ ప్రాజెక్ట్ సెట్టయింది. యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ తమ సపోర్ట్ అందించారు. జూన్లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత విజయ్కుమార్. -
చలనమే చిత్రము
వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ‘చలనమే చిత్రము.. చిత్రమే చలనము..’ అనేది ట్యాగ్ లైన్. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్పై విజయ్ కుమార్ మన్యం నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. రంగురంగుల దుస్తుల్లో ఉన్న శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు ఒకే స్కూటర్పై వెళుతుండటం ఫస్ట్ లుక్ పోస్టర్లో కనిపిస్తోంది. ఈ చిత్రంలో శ్రీవిష్ణుకి జోడీగా నివేదా థామస్ నటించారు. సత్యదేవ్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు చేశారు. ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. మా సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, కెమేరా: సాయి శ్రీరాం. -
మీసం తిప్పాడు
శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘తిప్పరా మీసం’. నిక్కి తంబోలీ, రోహిణి హీరోయిన్లుగా నటించారు. ‘అసుర’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కృష్ణ విజయ్. ఎల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రిజ్వాన్ ఎంటరై్టన్మెంట్స్, శ్రీ ఓం సినిమా బ్యానర్స్పై రిజ్వాన్ నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ బుధవారం విడుదలైంది. ‘‘తిప్పరా మీసం’ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉంది. వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు దర్శక, నిర్మాతలు. అచ్యుత్ రామారావు, బెనర్జీ, రవిప్రకాష్, రవి వర్మ, నవీన్ నేని, ప్రవీణ్, నేహా దేశ్ పాండే తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, కెమెరా: సి«ద్, సహ నిర్మాతలు: ఖుషీ, అచ్యుత రామారావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మనోజ్ మావిళ్ల. -
‘తిప్పరా మీసం’ ఫస్ట్ లుక్ వచ్చేసింది
విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకే కథ సినిమాలతో మెప్పించిన శ్రీ విష్ణు, ఈసారి రూటు మార్చాడు. యాక్షన్ ఎంటర్టైనర్తో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. అసుర సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ విజయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో నిక్కి తంబోలి హీరోయిన్గా నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతమందిస్తున్న ఈసినిమాకు సిధ్ సినిటోగ్రాఫర్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ సినిమాను సమ్మర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
బ్రోచేవారెవరురా..
‘నీదీ నాదీ ఒకే కథ’ చిత్రంతో ఈ ఏడాది హీరోగా ప్రేక్షకులను మెప్పించారు శ్రీ విష్ణు. తాజాగా ఆయన హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘బ్రోచేవారెవరురా..’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. నివే«థా థామస్, నివేథా పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. మన్యం ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ కుమార్ మన్యం నిర్మిస్తున్నారు. సత్యదేవ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. 2017లో వివేక్–శ్రీవిష్ణు కాంబినేషన్లో వచ్చిన ‘మెంటల్ మదిలో..’ చిత్రం ఆడియన్స్ను మెప్పించిన విషయం తెలిసిందే. -
ఎవరూ టచ్ చేయని పాయింట్తో...
‘‘యు’ చిత్రదర్శకుడు, హీరో కొవెర అసలు పేరు రాజేంద్ర. నేను, తను కలిసి ఇంటర్ చదువుకున్నాం. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాతో చాలా విషయాలు డిస్కస్ చేసేవాడు. తన సినిమాలో సెన్సిబుల్ పాయింట్ ఉంటుందనే నమ్మకం ఉంది. పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. కానీ, రాజేంద్ర తొలి సినిమాతోనే ఆ ప్రయత్నం చేయడం గొప్ప విషయం’’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. కొవెర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘యు’. ‘కథే హీరో’ అన్నది ట్యాగ్ లైన్. హిమాన్షి కాట్రగడ్డ కథానాయిక. నాగానిక సమర్పణలో విజయలక్ష్మి కొండా నిర్మించారు. సత్య మహావీర్ స్వరపరచిన ఈ సినిమా పాటలను శ్రీవిష్ణు విడుదల చేశారు. హీరో, దర్శకుడు కొవెర మాట్లాడుతూ– ‘‘అల్లు అర్జున్, అఖిల్, శ్రీవిష్ణు.. ఇలా అందరికీ కథలు చెప్పాను. ఓ డైరెక్టర్ హీరోను ఎలా ఒప్పిస్తాడు? అనే ఆలోచన నుంచి పుట్టిందే ఈ సినిమా. కథ బావుంటే డైరెక్షన్ అవకాశం ఇచ్చేయరు. ఎందుకంటే.. మనల్ని నమ్మి ఓ వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాడు.. ఆ రిస్క్ డైరెక్టర్ భరిస్తాడా? లేదా? అనే కోణంలో నిర్మాతలు ఆలోచిస్తారు. రాజమౌళిగారే 400 కోట్ల రూపాయల సినిమా ఎందుకు చేయగలిగారు. ఆ రిస్క్ను తీసుకున్నారు కాబట్టి పెద్ద బడ్జెట్ మూవీ చేశారు. అందుకే నేనూ రిస్క్ తీసుకుని హీరోగా నటించి, దర్శకత్వం చేసి, ఈ సినిమా నిర్మించా. ఎక్కువ రిస్క్ తీసుకున్నాను కాబట్టే ఎక్కువ కష్టపడ్డానని గర్వంగా చెప్పుకోగలను. ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్స్ని మా సినిమాలో చూపిస్తున్నాం’’ అన్నారు. సంగీత దర్శకుడు సత్య మహావీర్, రచయిత ‘డార్లింగ్’ స్వామి పాల్గొన్నారు. -
‘వీర భోగ వసంత రాయలు’ మూవీ రివ్యూ
టైటిల్ : వీర భోగ వసంత రాయలు జానర్ : క్రైమ్ థ్రిల్లర్ తారాగణం : సుధీర్ బాబు, నారా రోహిత్, శ్రీ విష్ణు, శ్రియ సంగీతం : మార్క్ కె రాబిన్ దర్శకత్వం : ఆర్ ఇంద్రసేన నిర్మాత : అప్పారావు నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు.. ఈ ముగ్గురు డిఫరెంట్ ఇమేజ్ ఉన్న తెలుగు హీరోలు. విభిన్న కథలను ఎంచుకునే ఈ ముగ్గురు ఒకే సినిమాలో కలిసి నటిస్తే అభిమానుల అంచనాల మరింత భారీగా ఉంటాయి. వీర భోగ వసంత రాయలు విషయంలో అదే జరిగింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ ముగ్గురు హీరోలతో పాటు శ్రియ, శశాంక్లు ప్రధాన పాత్రల్లో ఈ సినిమాను తెరకెక్కించారు. పోస్టర్లతో మంచి హైప్ క్రియేట్ చేసిన వీర భోగ వసంత రాయలు తరువాత తరువాత ఆ స్థాయిలో సందడి చేయలేదు. దీంతో రిలీజ్ సమయానికి సినిమా మీద అంచనాలు పడిపోయాయి. మరి ఇలాంటి సమయంలో రిలీజ్ అయి వీర భోగ వసంత రాయలు ఏమేరకు ఆకట్టుకుంది..? కథ ; సినిమా ప్రధానంగా మూడు నేరాలకు సంబంధించిన కథగా సాగుతుంది. క్రికెటర్స్ తో పాటు పలువురు ప్రముఖులు ప్రయాణిస్తున్న ఓ విమానం హైజాక్కు గురవుతుంది. అదే సమయంలో సిటీలో వరుసగా అనాథ పిల్లల కిడ్నాప్లు కలకలం సృష్టిస్తాయి. ఇక మూడో కేసులో ఓ కుర్రాడు తన ఇళ్లు ఎక్కడో తప్పిపోయిందంటూ పోలీసు కంప్లయింట్ ఇస్తాడు. ప్రధానమైన విమాన హైజాక్ కేసును దీపక్ (నారా రోహిత్), నీలిమా (శ్రియ)లకు అప్పగిస్తారు. మిస్ అయిన ఇంటి కేసును వినయ్ (సుధీర్ బాబు) టేకప్ చేస్తాడు. ఫ్లైట్ హైజాక్ చేసిన వ్యక్తి 300 మంది బంధీలను విడుదల చేసేందుకు అంతే సంఖ్యలో నేరస్తులను చంపేయాలని డిమాండ్ చేస్తాడు. అసలు విమానం హైజాక్ చేసింది ఎవరు..? మిగిలిన రెండు కేసులతో ఈ కేసుకు ఉన్న సంబంధం ఏంటి..? హైజాకర్ డిమాండ్కు ప్రభుత్వం అంగీకరించిందా..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; ప్రమోషన్లో శ్రీవిష్ణు పాత్రను హైలెట్ చేసినా సినిమాలో ఎక్కువ సేపు తెర మీద కనిపించింది మాత్రం సుధీర్ బాబు ఒక్కడే. అయితే సుధీర్ బాబుకు మరొకరితో డబ్బింగ్ చెప్పించటం వర్క్ అవుట్ కాలేదు. సుధీర్ నటన పరంగా ఆకట్టుకున్నా వాయిస్ తనది కాకపోవటంతో ఆడియన్స్ కనెక్ట్ కావటం కష్టమే. నారా రోహిత్, శ్రియలకు తెర మీద కనిపించింది కొద్ది సేపే కావటంతో పెద్దగా ప్రూవ్ చేసుకునే అవకాశం దక్కలేదు. ఇక కీలకమైన పాత్రలో కనిపించిన శ్రీ విష్ణు తీవ్రంగా నిరాశపరిచాడు. ఇన్నాళ్లు పక్కింటి అబ్బాయి పాత్రలో కనిపించిన శ్రీవిష్ణు విలన్ లుక్లో ఆకట్టుకోలేకపోయాడు. డైలాగ్ డెలివరీ కూడా నిరాశకలిగిస్తుంది. ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవటంతో ఉన్నంతలో తమ పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. విశ్లేషణ ; సినిమాను ఇంట్రస్టింగ్ పాయింట్తో స్టార్ట్ చేసిన దర్శకుడు ఆ క్యూరియాసిటీని కొనసాగించటంలో తడబడ్డాడు. మూడు భిన్నమైన కేసుల నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు ఆ కథను అనుకున్నట్టుగా తెర మీద చూపించటంలో ఫెయిల్ అయ్యాడు. చాలా సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతూ ప్రేక్షకులను ఇబ్బంది పెడతాయి. చివరి 15 నిమిషాలు ఆసక్తికరంగా ఉన్నా అవి సినిమాను ఏమేరకు కాపాడతాయో చూడాలి. ముఖ్యంగా సినిమాకు నిర్మాణ విలువలే ప్రధాన సమస్యగా మారాయి. క్వాలిటీ పరంగా సినిమా నిరాశపరుస్తుంది. కథా కథనాలు కూడా అదే స్థాయిలో ఉండటంతో వీర భోగ వసంత రాయలు ఆడియన్స్ సహనానికి పరీక్షగా మారింది. సినిమాటోగ్రఫి, సంగీతం పరవలేదనిపిస్తాయి. ప్లస్ పాయింట్స్ ; లీడ్ యాక్టర్స్ నటన కథ మైనస్ పాయింట్స్ ; నిర్మాణ విలువలు స్లో నేరేషన్ ఆసక్తికరంగా లేని సన్నివేశాలు -
భయం వేసింది
నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియా శరణ్, శ్రీ విష్ణు ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘వీరభోగ వసంతరాయలు’. ‘కల్ట్ ఈజ్ రైజింగ్’ అనేది ట్యాగ్లైన్. ఆర్. ఇంద్రసేన్ దర్శకత్వంలో అప్పారావు బెల్లన నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని శ్రీవిష్ణు లుక్ను విడుదల చేశారు. ‘‘పచ్చబొట్లు వేయించుకున్నాను. కాస్త భయం కలిగింది. ఈ పాత్ర చేస్తున్నప్పుడు చాలా రకాల అనుభూతులకు లోనయ్యాను’’అని పేర్కొన్నారు శ్రీవిష్ణు. ‘‘వినూత్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇప్పటికే రిలీజ్ చేసిన మిగతా తారల లుక్స్, టీజర్కు మంచి స్పందన వచ్చింది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి మార్క్ కె. రాబిన్ సంగీతం అందించారు. -
‘వీర భోగ వసంత రాయలు’ టీజర్ విడుదల
-
స్టన్నింగ్
‘మెంటల్ మదిలో, ఉన్నది ఒకటే జిందగీ, నీదీ నాదే ఒకే కథ’ చిత్రాలతో శ్రీవిష్ణు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘వీర భోగ వసంత రాయలు’ ఒకటి. నారా రోహిత్, సుధీర్బాబు, శ్రియలు కూడా ఈ చిత్రంలో మెయిన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇప్పటివరకూ నారా రోహిత్, శ్రియల లుక్స్ని రిలీజ్ చేశారు. శనివారం శ్రీవిష్ణు లుక్ని విడుదల చేశారు. చిత్రానికి పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు ఈ లుక్ని రిలీజ్ చేయడం విశేషం. ‘‘నారా రోహిత్, శ్రియల లుక్స్కి మంచి స్పందన లభించింది. తాజాగా విడుదల చేసిన శ్రీవిష్ణు స్టన్నింగ్ లుక్ బాగుందని అందరూ అంటున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. క్రైమ్ థ్రిల్లర్గా వస్తున్న ఈ సినిమాకి ఇంద్రసేన్ ఆర్. దర్శకుడు. మార్క్ కే. రాబిన్ సంగీతం సమకూరుస్తున్నారు. బాబా క్రియేష¯Œ ్స బ్యానర్పై అప్పారావు బెల్లనా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి, మనోజ్ నందన్, శశాంక్, రవి ప్రకాష్, నవీన్ నేని, చరిత్ మానస్, స్నేహిత్ , ఏడిద శ్రీరామ్, గిరిధర్, అనంత ప్రభు, రాజేశ్వరి, అశ్వితి మరియు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్, ఎడిటర్: శశాంక్ మాలి. -
పోలిక ఉండదు
నారా రోహిత్, శ్రియా శరణ్, సుధీర్బాబు, శ్రీ విష్ణు ముఖ్య తారలుగా నటించిన మల్టీస్టారర్ మూవీ ‘వీర భోగ వసంత రాయలు’. బాబా క్రియేషన్స్ పతాకంపై ఎంవీకే రెడ్డి సమర్పణలో ఇంద్రసేన .ఆర్ దర్శకత్వంలో అప్పారావు బెల్లాన నిర్మించారు. సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా అప్పారావు బెల్లాన మాట్లాడుతూ– ‘‘ఇంద్రసేన కథ చెప్పగానే సినిమా ప్రొడ్యూస్ చేద్దామనిపించింది. అంతగా కథ నచ్చింది. మంచి నటీనటులు కుదిరారు. సినిమాలోని నాలుగు ముఖ్య పాత్రలను ఇప్పటివరకు ఏ సినిమాలోనూ కనిపించని విధంగా దర్శకుడు డిజైన్ చేశారు. ఏ పాత్రకు మరో పాత్రతో పోలిక ఉండదు. ఈ సినిమా తెలుగు అండ్ హిందీ శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెలలోనే టైటిల్ లోగో ఆవిష్కరణ ఉంటుంది. వచ్చే నెల మొదటి వారంలో టీజర్, ట్రైలర్ను విడుదల చేసి, మూవీ రిలీజ్డేట్ను ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘ఇది సొసైటీలో జరిగే గ్రే అండ్ డార్క్ సైడ్లను టచ్ చేసే వినూత్నమైన మల్టీస్టారర్ మూవీ’’అన్నారు ఇంద్రసేన. శశాంక్, చరిత్ మానస్, స్నేహిత్, శ్రీనివాసరెడ్డి తదితరులు నటించిన ఈ సినిమాకు సంగీతం: రాబిన్. -
ఇంకో సినిమా
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మలయాళ కథానాయికల హవా కొనసాగుతోంది. కీర్తీ సురేశ్, అనుపమా పరమేశ్వరన్, అనూ ఇమ్మాన్యుయేల్, నివేథా థామస్, మాళవికా నాయర్.. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మల్లో నివేథా కొంచెం స్లో అయ్యారు. దానికి కారణం ఉంది. ‘జెంటిల్మెన్’, ‘నిన్ను కోరి, జై లవ కుశ’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారీ మాలీవుడ్ బ్యూటీ. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చినా ఒప్పుకోకుండా స్టడీస్పై కాన్సన్ట్రేట్ చేసి, డిగ్రీ పూర్తి చేశారు నివేథా. స్మాల్ బ్రేక్కి కారణం ఇదే. కొంచెం స్లో అయిన నివేథా ఇప్పుడు సినిమాలు చేసే విషయంలో స్పీడ్ పెంచారు. ప్రస్తుతం కల్యాణ్రామ్తో ఓ సినిమా చేస్తోన్న ఈ బ్యూటీ తాజాగా మరో చిత్రం అంగీకరించారట. ‘మెంటల్ మదిలో, నీదీ నాదీ ఒకే కథ’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణుతో జోడీ కట్టనున్నారట ఆమె. ‘మెంటల్ మదిలో’ చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ శ్రీవిష్ణుతో ఓ సినిమా తెరకెక్కించనున్నారట. ఈ చిత్రంలోనే నివేథా నటించనున్నారట. నటనకు అవకాశం ఉన్న పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చే నివేథా ఇక పైనా అలాంటివే చేయాలనుకుంటున్నారు. -
నెరవేరిన మూడో ప్రతిజ్ఞ
నమ్మాళ్వార్లు అనుగ్రహించిన ద్రావిడ వేదాన్ని ఇంటింటికీ తీసుకు వెళ్లడం మరో యజ్ఞం. అదే యామునులకు రామానుజులు ఇచ్చిన మూడో వాగ్దానం. యామునుల మరో శిష్యుడు తిరుమాలై ఆండాన్. ఆయనను అనుసరించి రామానుజులు తిరువాయిమొళి ప్రబంధ అధ్యయనంపై సాధికారికమైన కృషి చేశారు. అందులోని తత్వ గాంభీర్యాన్ని వెలికి తీసి విశేషార్థాలను వివరించి రామానుజులు చెప్పేవారు. ఆండాన్ నుంచి ప్రత్యక్షంగా తిరువాయిమొళి వ్యాఖ్యానాన్ని ఆమూలాగ్రంగా చదివి నిష్ణాతులైనారు రామానుజులు. యామునుల మరో శిష్యరత్నం శ్రీవరరంగాచార్యులు. వారికి తిరువరంగప్పెరుమాళ్ అఱైయర్ అని మరో పేరు ఉంది. నాలాయిర దివ్య ప్రబంధగానంలో ఈయన నిష్ణాతుడు. వారి నుంచి ప్రత్యక్షంగా నాలుగువేల పాశురాల అర్థాన్ని నేర్చుకున్నారు రామానుజులు. ఎంత ఏకసంథాగ్రాహి అయినా గురుముఖతః వినయంతో విద్య నేర్చుకోవాలని రామానుజులు ఆ విధంగా ఆచరించి తరతరాలకు ప్రబోధించారు. శ్రీవిష్ణు పురాణానికి సమంగా ఆరువేల సంఖ్యతో అలరారే విధంగా తిరువాయిమొళికి వ్యాఖ్యానాన్ని రచించమని తిరుక్కురుగై పిరాన్ పిళ్లాన్ అనే తన శిష్యుడిని ఆదేశించారు. అదే ఆరాయిఱప్పడి (ఆరువేల శ్లోకాల సంపుటి). ఇది ద్రావిడవేదానికి తొలి భాష్యం. ఆ తరువాత మరికొందరు ఆచార్యులు తిరువాయిమొళిపై ఇదేబాటలో మరో నాలుగు వ్యాఖ్యాన గ్రంథాలు రచించారు. ఆరువేల పద్యాలున్న ఆరాయిఱప్పడి తరువాత మిగిలిన నాలుగువేల పాశురాలపైన కూడా వ్యాఖ్యానాలు రావడానికి ఈ గ్రంథం ప్రేరణ అయింది. అదే విధంగా వేదాంతసారాన్ని కూడా రామానుజులు తన శ్రీభాష్య రచన ద్వారా సామాన్యీకరించారు. తమిళ సంస్కృత వేదాల అధ్యయనం చేసిన వారిని ఉభయ వేదాంత ప్రవక్త అని సంబోధిస్తారు. అటువంటి ఉభయవేదాంత ప్రవక్తలు ఎందరో రామానుజుల శిష్యకోటిలో ఉన్నారు. ఆ విధంగా రామానుజుడు యామునాచార్యుల మూడో వాగ్దానాన్ని కూడా పూర్తి చేశారు. రామానుజుల ఆచార్యత్వంలో వేలాది శిష్యులు నాలుగువేల పాశురాలను నేర్చుకుని ప్రతి ఆలయంలో గానం చేస్తూ మంగళా శాసనం పలుకుతూ ఉన్నారు. ప్రతి ఆలయం తిరువాయిమొళి పారాయణాలతో ప్రతిధ్వనిస్తున్నది. రామానుజ కూటములు ప్రతి ఊళ్లో ఏర్పడ్డాయి. కులమత భేద రహితంగా అందరికీ భోజనం పెట్టే సత్సంప్రదాయాన్ని రామానుజులే ప్రారంభింపచేశారు. ఆ రామానుజ కూటములలోనే ద్రవిడ వేద పారాయణం కూడా సాగుతూ ఉండేది. ఆ విధంగా ఊరూరా వాడవాడలా ఇంటింటా ద్రవిడవేదం ప్రతిధ్వనించింది. వైష్ణవం ప్రకాశించింది. శరణాగతి గద్య, శ్రీరంగ గద్య, శ్రీవైకుంఠ గద్య అనే మూడు గద్యములను (గద్యత్రయం) రామానుజులు రచించారు. ప్రపన్నుడు ప్రతిదినం భగవంతుడి గురించి ఏ విధంగా చింతించాలో ధ్యానించాలో ఆయన ఈ మూడు అద్భుత రచనల్లో వివరించారు. మనలో అహంకారాన్ని తొలగించుకుని, సాధారణ అల్ప జీవులమన్న నిజాన్ని గుర్తించి అందరికన్న తక్కువ అనే నైచ్యానుసంధానాన్ని వివరించి, జగన్నాథుడిని ఆశ్రయించే పద్ధతులను సామాన్యులకు కూడా అందే రీతిలో ఈ గ్రంథాలు తెలియజేశాయి. జగన్నాథుడి ప్రేమ రామానుజుడు ఉత్తరదేశ యాత్ర కొనసాగిస్తూ పూరీ జగన్నాథ క్షేత్రం చేరుకున్నారు. అది పురుషోత్తమ క్షేత్రం. అతి పవిత్రమైన నారాయణ స్థానం. అన్నధామం. జగన్నాథుడు మట్టికుండల్లో వండిన ఆహారాన్ని భుజించే సామాన్యుడు. అందరికీ అందుబాటులో ఉండే సౌశీల్యుడు. అక్కడ రామానుజ మఠాన్ని స్థాపించారు. అక్కడ పూజా వ్యవహారాలలో అవకతవకలు శాస్త్ర వైరుధ్యాలు కనిపించాయి. వాటిని సరి చేద్దామనుకున్నారు. పాంచరాత్ర ఆగమ పద్ధతిలో అర్చనాది కార్యక్రమాలను క్రమబద్ధం చేద్దామనుకున్నారు కానీ అక్కడి పండాలు అందుకు అంగీకరించలేదు. మరునాటి నుంచి ఈ కొత్త విధానాలు ప్రవేశ పెట్టాల్సిందే అని నిర్దేశించారు. ప్రేమతో మాకు వచ్చిన రీతిలో మాకు నచ్చిన రీతిలో నిన్ను పూజిస్తాము కానీ మాకీ కొత్త పద్ధతుల్లో వాత్సల్యం కనిపించడం లేదు మాకొద్దు ఈ పద్ధతి అని జగన్నాథ భక్తులు తమ దేవున్ని వేడుకున్నారు. ఆ రాత్రి జగన్నాథ క్షేత్రంలో నిద్రించిన రామానుజుడు మరునాడు శ్రీకూర్మంలో నిద్రలేచారు. శ్రీకూర్మమా? శివలింగమా? శ్రీరామానుజులు కళ్లు తెరిచే సమయానికి ఎదురుగా ఒక మహాలింగం నెలకొన్న ఆలయం ఉంది. త్రిశూలాలు పట్టుకున్న వారు చుట్టూ చేరి శివనామ స్మరణ చేస్తున్నారు. తన వెంట శిష్యులు లేరు. తన ఆరాధనా సామగ్రి లేదు. పెరుమాళ్ల పెట్టె లేదు. తిరుమణి పెట్టె లేదు. ఇప్పుడు ఏం చేయడం. తన నిత్యానుష్ఠాన కార్యక్రమానికి అవరోధం ఏర్పడినట్టేనా. నిరాహారంతో పరమాత్ముడిని ధ్యానం చేస్తూ గడిపారు. స్వామీ ఏమిటీ పరీక్ష అని మనసు దైవాన్ని ప్రశ్నిస్తున్నది. అంతలో ఒక అంతర్వాణి అశరీరవాణి వినిపించింది. ‘‘రామానుజా..నీ ముందున్న ఆలయంలో మహాదేవుడు కాదు, మహాకూర్మం ఉంది. ఆ ఎదురుగా ఉన్న పుష్కరిణి నా పాల సముద్రమే. తిరుమన్ను లేదనే కదా నీ బాధ. ఆ పుష్కరిణి చుట్టూ ఉన్నదంతా తిరుమణే’’ అని వినిపించింది. తరచి చూస్తే ఆ విషయం నిజమని అర్థమైంది. అక్కడ పురుషోత్తమపురం పూరీలో రామానుజుని శిష్యులు గురువుగారు కానరాక ఆందోళన పడ్డారు. ఒక వృద్ధ బ్రాహ్మణుడు వారికి కనిపించి ‘‘మీ గురువుగారు శ్రీకూర్మంలో ఉన్నారు. వెళ్లండి వెళ్లండి’’ అన్నారు. వారు వెంటనే బయలుదేరి రామానుజులను చేరుకున్నారు. శ్రీకూర్మంలో ఉన్నది మహాకూర్మమే కానీ మహాలింగం కాదని రామానుజులు అనేక ప్రమాణాలు చూపారు. అనేక పురాణాలు స్థలపురాణంలోని భాగాలు వివరించి, ఆలయంలో శ్రీకూర్మపు జాడలు ప్రత్యక్షంగా చూపినారు. అయినా అక్కడి అర్చకులు ఒప్పుకోలేదు. ఆ దేవుడు శివుడనే వాదించారు. సరే అయితే ఈ రాత్రి తలుపులు మూసి రేపు తెరుద్దాం. శ్రీ కూర్మనాథుడు శివలింగమే అయితే ఎట్లున్నది అట్లే ఉండును. శ్రీకూర్మావతారుడైతే ఈ మూర్తి పడమర వైపు తిరుగుగాక అన్నారు. అందుకు అర్చకులు ఒప్పుకున్నారు. రాత్రి గుడి తలుపులు మూసివేశారు. మరునాటికి పడమటవైపు తిరిగి తానే శ్రీకూర్మనాథుడినని, హరిననీ నిరూపించుకున్నారు స్వామి. అప్పటికే తూర్పుదిశలో అక్కడ ఒక ధ్వజస్తంభం ఉంది. వైష్ణవ క్షేత్ర పాంచరాత్రాగమ విధానం ప్రకారం మూలస్వామి ఎటువైపు చూస్తూ ఉంటే అటువైపే (అంటే ఇక్కడ పడమరవైపు ముఖం ఉంటే అటువైపే) ధ్వజస్తంభం ఉండాలని, అక్కడ మరో ధ్వజస్తంభాన్ని ప్రతిష్టింపచేశారు రామానుజుడు. ప్రపంచంలో రెండు ధ్వజస్తంభాలున్న మహాక్షేత్రం శ్రీకూర్మం ఒక్కటే. అక్కడి నుంచి సింహాచలం చేరుకున్నారు రామానుజులు. సింహాచలంలో రామానుజులు ద్వయరూపంలో హరి నెలకొన్న పుణ్యక్షేత్రం సింహాచలం. వరాహ నరసింహుడాయన. దశావతారాల్లో మూడో అవతారమైన వరాహరూపంలో ముఖం ఉంది. నిలబడినది నరుని తీరు. కొండ సింహం ఆకారంలో ఉంటుంది కనుక సింహాచలం. మొత్తంగా ఆయన వరాహ, నర, సింహుడు. కూర్మం నుంచి వరాహమై, నరసింహమై ఆ తరువాత వామనుడు, పరశురాముడు, రాముడనే పరిపూర్ణ మానవుడిగా పరిణమించబోతున్న క్రమానికి ఒక విచిత్ర సంధి దశ సింహాచలాధీశుడు. హిరణ్యాక్ష హిరణ్యకశిపుల హింసకు జ్వలిస్తున్న కోపాన్ని తగ్గించుకోవడానికి ఆయన నిరంతరం చందనంలో మునిగి శాంత స్వరూపంగా ఉంటారు. అక్కడ శ్రీ కృష్ణమాచార్యులనే కవి, సంగీత విద్వాంసుడు మహాభక్తుడు ఉన్నారు. ఆయన గానం వినడానికి నరసింహుడు స్వయంగా వచ్చి పాటకు తగ్గట్టు లయబద్ధంగా నృత్యం చేసేవాడు. ప్రతిరాత్రి ఈ భక్తుడు ఆ భగవంతుడు కవితా గాన మృదంగ నృత్య కార్యక్రమాలతో గడుపుతారు. వారి నిలయానికి చేరి రామానుజులు కృష్ణమాచార్యులకు నమస్కరించారు. ఆయన ప్రతి నమస్కారం చేయకుండా ‘క్షేమమే కదా’ అని పలకరించారు. ‘‘మీ దయవల్ల, హరి అనుగ్రహం వల్ల అంతా క్షేమమే స్వామీ. నాదొక మనవి. వరాహ నరసింహుని ఆంతరంగికులైన మీరు ఈసారి పెరుమాళ్లతో ముచ్చటించినప్పుడు శ్రీరంగం నుంచి వచ్చిన (తనను చూపుతూ) ఈ సన్యాసికి మోక్షం ఉందో లేదో కనుక్కోవాలని ప్రార్థన’’ అని వినయంగా చెప్పుకున్నారు. ‘ఓ అదెంత పని...సరే’నన్నారాయన. ఆ రాత్రి నరసింహుని ముందుంచారు ఈ సందేహాన్ని. ‘‘ఆ సన్యాసికి తప్పక మోక్షం లభించగలదు. ఆయనకే కాదు కృష్ణమాచార్యా.. ఆయన ఎవరికి మోక్షం ఉండాలని చెబితే వారికి కూడా మోక్షం ఉండగలదు’’ అన్నారు హరి. ‘ఓహో సన్యాసి సామాన్యుడు కాడ’న్నమాట అనుకున్నారు కృష్ణమాచార్య. మరునాడు రామానుజుడు కలిస్తే ఈ విషయం చెప్పారు. ఆయన చాలా సంతోషించి ‘‘స్వామీ నా సంగతి సరే మీ మోక్షం గురించి కూడా కనుక్కున్నారా, కనుక్కునే ఉంటారు లెండి’’, అని రామానుజులు వాక్యాన్ని మధ్యలోనే ఆపారు. ‘నాకు మోక్షం లేకపోవడమా, నా సంగీతానికి నాట్యం చేసే హరి నాకు మోక్షం ఇవ్వడా? అయినా సరే అడుగుదాం’ అని మనసులో అనుకున్నారు. ఆ రాత్రి హరిని అడిగితే నవ్వి ఊరుకున్నారు. ‘భగవాన్ ఏమిటిది? నాకు నిత్యదర్శనం ఇచ్చే భాగ్యం కలిగించిన మీరు మోక్ష భాగ్యం ఇవ్వడం లేదా?’ అని ఆందోళనగా అడిగారు. ‘‘అది నీవు ఇప్పటిదాకా అడుగనే లేదు కదా కృష్ణమాచార్యా. నీ పాటకు మృదంగానికి నా ఆట సరిపోయింది కదా. అయినా ప్రస్తుతం మోక్షం ఇచ్చే అధికారం ఆ శ్రీరంగం సన్యాసికే ఉంది. నీవు మోక్షార్థివే అయితే ఆయన్ను ఆశ్రయించాల్సిందే’’ అని నరసింహుడు అనగానే కృష్ణమాచార్యులు ఆగ్రహోదగ్రులైనారు. తీవ్రకోపంతో ‘‘నీ గుడి ఏడు రాత్రులూ పగళ్లూ దగ్ధమైపోవు గాక.. ఈ గుడి శిఖరము నేలకూలుగాక’’ అని శపించారు. ‘‘అకారణంగా ఇంత తీవ్ర శాపమా, నీ కవిత్వం నీచుల పాలవుగాక’’ అని హరి ప్రతిశాపం ఇచ్చారు. తన కోపమే విధ్వంసానికి కారణమని అర్థం అయిన వెంటనే ఆయనకు పాదాక్రాంతులైనారు కృష్ణమాచార్య. ‘‘నీవు ఈ అహంకారాన్ని వదులుకుని అకారత్రయాన్ని (అనన్యార్హశేషత్వము, అనన్యశరణత్వము, అనన్యభోగత్వము) తెలుసుకున్నపుడే నీకు శాంతి, మోక్షం. రామానుజుని ఆశ్రయించడమే నీకు మార్గం’’ అని హరి అంతర్థానమైనారు. మరునాడు ఆయన రామానుజుని ఆశ్రమానికి వెళ్లి ‘‘నేను కృష్ణమాచార్యుడిని వచ్చానని చెప్పండి’’ అన్నారు. చెప్పారు. రామానుజులు ‘‘నేను చనిపోయిన తరువాత రమ్మన్నానని చెప్పండి’’ అని తిరిగి పంపించారు. ఆయన తరువాత ఎవరి దగ్గరికి వెళ్లాలి, దీని అర్థం ఏమిటి అని లోతుగా ఆలోచిస్తే ‘‘నేను అంటే అహంకారం. అది ఛస్తేనే లోనికి అనుమతి’’. తన లోపమేమిటో తెలిసింది. కోపంతో పాటు లోపమూ పోతేనే గురువు ఆశ్రయం లభిస్తుంది. ఈసారి ఆయన కృష్ణదాసుడు వచ్చాడని చెప్పుకున్నాడు. చెప్పగానే లోనికి రమ్మన్నారు. రామానుజుని శిష్యులైనారు. సింహాచలంలో కొన్నాళ్లుండి రామానుజులు అక్కడి భక్తులకు తిరుమంత్రార్థాన్ని ఉపదేశించారు. ఆ మూలను హంస మూల అని పవిత్రభావంతో పిలుస్తారు. కొన్నాళ్ల తరువాత అక్కడి నుంచి బయలుదేరితే కృష్ణరామానుజ దాసు తానూ కూడా వస్తానన్నాడు. ‘‘ఇక్కడే ఉండి వరాహ నరసింహుని సేవించు’’ అని ఆదేశించి వెళ్లారు రామానుజులు. కృష్ణమాచార్యుని శాపం వల్ల తురుష్కులు దాడిచేసి దేవాలయాన్ని ఏడురోజుల పాటు కాల్చారట. గోదాగ్రజుడు... గోదాభీష్టుడు ఒకరోజు నాచ్చియార్ తిరువాయ్మొళికి వ్యాఖ్యానం చెబుతున్నపుడు తొమ్మిదవ తిరుమోళి లో ఆరు, ఏడో పాశురాలకు అర్థం వివరిస్తున్నారు రామానుజులు. సుందరబాహు స్వామికి నూరు పాత్రలలో వెన్నను, చక్కెర పొంగలిని సమర్పిసా ్తనని గోదాదేవి వాగ్దానం చేసినట్లు ఆ పాశురాల్లో ఉంది. కానీ గోదాదేవి ఆ మాట చెల్లించుకోలేక పోయారు. రామానుజులు ఆ వ్యాఖ్యానాన్ని అక్కడే నిలిపివేసి అప్పుడే శ్రీవిల్లి పుత్తూరుకు బయలుదేరి గోదాదేవి మొక్కిన విధంగా నూరు గిన్నెల వెన్నను, చక్కెరపొంగలిని సమర్పించారు. గోదాదేవి అభీష్టాన్ని పూర్తి చేసినందుకు రామానుజుడు గోదాదేవికి అన్న అయ్యారనే పేరు తెచ్చుకున్నారు. రామానుజ అష్టోత్తరంలో గోదాగ్రజాయనమః అనీ గోదాభీçష్టపూరకాయనమః అనీ నామాలను సంతరించుకున్నారు. వడుగనంబి రామానుజుని శిష్యులలో వడుగనంబికి రామానుజుని రూపమే దైవం. రామానుజుని పాదాలను తయారు చేయించుకుని సాలగ్రామంలో పెట్టి పూజించుకునే వాడు. శ్రీపాద తీర్థం మాత్రమే తీసుకునేవాడు. శ్రీరామానుజుల తిరువారాధన పెట్టెను నెత్తిన పెట్టుకుని రామానుజుల పాదుకలను చేతిలో పట్టుకుని ప్రయాణిస్తూ ఉండేవాడు. ఓ సందర్భంలో నీటి ప్రవాహం దాట వలసివచ్చినపుడు రామానుజుని ఆరాధన పేటికలోనే ఆయన పాదుకలను కూడా పెట్టి తీసుకుపోతుంటే నా దేవుడిమీద నా పాదాలు పెట్టడం నాకు పాపం కదూ అని అడిగారు రామానుజులు. మీకు మీ దేవుడెంతో మాకు నా దేవుడంతే స్వామీ... అనేవాడు. శ్రీరంగనాథుని ఊరేగింపు వస్తున్నది. రామానుజుడు శ్రీరంగనాథుని చూడడానికి మఠంలోంచి బయటకు నడుస్తూ ‘వత్సా నీవూ రా స్వామిని చూద్దాం’ అని పిలిచారు. అప్పుడు ఆయన రామానుజుల కోసం పాలు మరిగిస్తున్నారు. ‘మీ దేవుడి కోసం మీరు వెళ్లండి స్వామీ నా దేవుడి కోసం నేను పాలు మరగబెట్టుకోవడమే నాకు ముఖ్యం.’ అని జవాబిచ్చాడు. అతని గురుభక్తిని రామానుజులు చిరునవ్వుతో ప్రశంసించేవారు. వడుగనంబి రామానుజ అష్టోత్తరశత నామ స్తోత్రం రచించారు. అందులో చివరి శ్లోకం ఇది.యదాన్ద్ర పూర్ణేవ మహాత్మానేదం కృతం స్తుతం సర్వజనావనాయ, తజ్జీవ భూతం భువి వైష్ణవానాం బభూవ రామానుజ మానసానామ్ -
వైవిధ్యమైన పాత్రలో యంగ్హీరో
నీదీ నాదీ ఒకే కథ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు శ్రీవిష్ణు. ఈ సినిమా విమర్శకులను మెప్పించింది. మొదట్నుంచీ వైవిధ్యభరితమైన చిత్రాల్లో నటిస్తూ వస్తున్నాడు శ్రీవిష్ణు. అప్పట్లో ఒకడుండేవాడు లాంటి సీరియస్ క్యారెక్టర్లోనూ, మెంటల్ మదిలో లాంటి రొమాంటిక్ పాత్రల్లోనూ నటించి తనేంటో నిరూపించుకున్నాడు. నీదీ నాదీ ఒకే కథ సినిమాతో మళ్లీ తనలోని నటుడ్ని పరిచయం చేశాడు. అయితే తాజా సమాచారం ప్రకారం శ్రీవిష్ణు తన రాబోయే సినిమాలో మరొక విభిన్న పాత్రల్లో నటించబోతున్నాడని సమాచారం. ఈ గెటప్ గజని సినిమాలోని సూర్య పాత్రను పోలి ఉంటుందని, గుండు, ఒళ్లంతా టాటూలతో ఉంటుందని సమాచారం. ఈ సినిమా చిన్నపాటి మల్టీస్టారర్గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబులు కలిసి నటించబోతున్నారు. సీనియర్ హీరోయిన్ శ్రియ కీలకపాత్రలో నటించినట్లు సమాచారం. ఈ సినిమాకు ‘వీరభోగ వసంత రాయలు’ అని టైటిల్ను ఫిక్స్ చేశారు. -
దర్శకుడిగా మారనున్న యంగ్ హీరో
అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో, నీదీ నాదీ ఒకే కథ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు శ్రీ విష్ణు. సహాయనటుడిగా కెరీర్ ప్రారంభించి హీరోగా విజయాలు సాధిస్తున్న ఈ యువ కథానాయకుడు త్వరలో దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. నటుడిగా మారక ముందు పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన శ్రీ విష్ణు తన అనుభవాన్ని వృథా కానివ్వనని చెపుతున్నాడు. ప్రస్తుతం నటన మీదే దృష్టి పెడుతున్నానన్న శ్రీవిష్ణు, మంచి కథ కుదిరితే తప్పుకుండా దర్శకుడిగా మారతానని చెపుతున్నాడు. వెంకీ ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన నీదీ నాదీ ఒకే కథ సినిమా ఇటీవల విడుదలై విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ ను అందుకున్న శ్రీ విష్ణు... ప్రస్తుతం వీరభోగ వసంత రాయలుతో పాటు ‘తిప్పరా మీసం’ అనే కామెడీ ఎంటర్టైనర్లోనూ నటిస్తున్నాడు. -
నిర్మాతలకు దండం పెట్టాలనిపించింది..
‘‘నీదీ నాదీ ఒకే కథ’ టైటిల్ విని ఈరోజుల్లో ఇటువంటి సినిమాలు ఎవరు చూస్తారులే అనుకున్నా. రివ్యూస్ చూశాక సినిమా చూడాలనిపించింది. ఈ సినిమా చూశాక నా మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇంత మంచి సినిమా నిర్మించిన నిర్మాతలకు దండం పెట్టాలనిపించింది’’ అని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. శ్రీ విష్ణు, సాట్నా టైటస్ జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మించిన ‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. చిత్ర సమర్పకుడు నారా రోహిత్ మాట్లాడుతూ– ‘‘మా ఆరాన్ మీడియా వర్క్స్ బేనర్లో కొత్తదనం ఉన్న కథలతో మరిన్ని సినిమాలు వస్తాయి. ఈరోజుల్లో ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారు? అని చెప్పారు. అయినా నా డబ్బు, నా ఇష్టం. నాకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను. ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘నా సినిమాలకు వేణు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ సినిమాలు చేయడానికి నాలాంటి దర్శకులందరికీ కొత్త ఉత్సాహాన్ని కలిగించిన చిత్రమిది’’ అన్నారు దర్శకుడు మదన్. ‘‘సినిమా చూస్తున్నంత సేపు నాకు దర్శకుడు వేణు, శ్రీవిష్ణులే కన్పించారు’’ అన్నారు దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి. ‘‘సినిమా చూస్తున్నంత సేపు నాకు బాలచందర్గారే గుర్తుకొచ్చారు’’ అని దర్శకుడు వీఎన్ ఆదిత్య అన్నారు. ‘‘ఈ సినిమా చేయకపోయుంటే జీవితంలో ఒక గొప్ప గౌరవాన్ని మిస్ అయ్యేవాణ్ణి’’ అన్నారు దేవిప్రసాద్. ‘‘ప్రతి ఒక్కరూ ఇది నా కథ, మా ఇంట్లో జరిగిన కథ అని ఓన్ చేసుకుంటున్నారు. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు శ్రీవిష్ణు. ‘‘రివ్యూస్ బాగున్నాయి. కొన్ని విమర్శలూ ఉన్నాయి. అవన్నీ సరిదిద్దుకొని తర్వాత ఓ మంచి సినిమా తీయడానికి కృషి చేస్తా’’ అన్నారు వేణు ఊడుగుల. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, కెమెరామెన్ రాజ్ తోట, ఎడిటర్ బొంతల నాగేశ్వరరెడ్డి, శ్రీ వైష్ణవి క్రియేషన్స్ అధినేత నారాయణరావు, నిర్మాతలు రాజ్ కందుకూరి, బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
‘నీదీ నాదీ ఒకే కథ’ మూవీ రివ్యూ
టైటిల్ : నీదీ నాదీ ఒకే కథ జానర్ : ఫ్యామిలీ డ్రామా తారాగణం : శ్రీ విష్ణు, సాట్నా టిటస్, దేవీ ప్రసాద్, పోసాని కృష్ణ మురళీ సంగీతం : సురేష్ బొబ్బిలి దర్శకత్వం : వేణు ఊడుగుల నిర్మాత : నారా రోహిత్, ప్రశాంతి, కృష్ణ విజయ్, అట్లూరి నారాయణరావు అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో లాంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు.. లీడ్ రోల్ లో తెరకెక్కిన తాజా చిత్రం నీదీ నాదీ ఒకే కథ. మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చదువులు, ర్యాంకుల కోసం పరుగులు, పరువు ప్రతిష్టల కోసం తల్లిదండ్రులు పిల్లలను పెట్టే ఇబ్బందులు ప్రధానంగా ప్రస్థావించారు. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా శ్రీ విష్ణుకు మరో విజయాన్ని అందించిందా..? కథ : రుద్రరాజు దేవీ ప్రసాద్ (దేవీ ప్రసాద్) ప్రొఫెసర్. ఉన్నత మైన చదువు చదుకొని సమాజంలో పరువు ప్రతిష్ట ఉన్న మధ్య తరగతి తండ్రి. తన కొడుకు జీవితంలో మంచి స్థాయిలో సెటిల్ అవ్వాలని తపన పడే తండ్రి. సాగర్ (శ్రీ విష్ణు) డిగ్రీ మూడు సార్లు ఫెయిల్ అయ్యి తన చెల్లెలితో కలిసి మళ్లీ ఎగ్జామ్స్ రాసే కుర్రాడు. జీవితం మీద, భవిష్యత్తు మీద క్లారిటీ లేకుండా టైం పాస్ చేసేస్తుంటాడు. కానీ తండ్రి బాధ తెలుసుకున్న సాగర్ ఎలాగైనా తండ్రి కోరుకున్నట్టుగా మారాలని ప్రయత్నిస్తాడు. అందుకోసం ధార్మిక (సాట్నా టిటస్) సాయం తీసుకుంటాడు. కానీ ఈ ప్రయత్నాల్లో తనని తాను కోల్పోవడం ఇష్టం లేక.. తండ్రి ఆశించినట్టుగా మారలేక నలిగిపోతుంటాడు. చివరకు సాగర్.. తండ్రి కోరుకున్నట్టుగా మారాడా..? లేక తనలాగే తాను ఉండిపోయాడా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : సినిమా అంతా తండ్రీ కొడుకుల మధ్యే నడిచే కథ కావటంలో ప్రధానం గా రెండు పాత్రలే తెరమీదే కనిపిస్తుంటాయి. జీవితంలో ఏది సాధించలేననే నిరుత్సాహంలో బతికే కుర్రాడిగా శ్రీవిష్ణు అద్భుతంగా నటించాడు. తన కొడుకు జీవితంలో ఉన్నతంగా సెటిల్ అవ్వాలన్న తండ్రి కోరిక నేరవేర్చలేక.. తనని తాను కోల్పోలేక సతమతమ్యే పాత్రలో మంచి భావోద్వేగాలను పండించాడు. తొలిసారిగా తెరపైన కనిపించిన దర్శకుడు దేవీ ప్రసాద్.. నటుడిగానూ మంచి మార్కులు సాధించాడు. మధ్య తరగతి మనుషుల మనస్థత్వాలకు, ఆలోచనలకు, ఆశలకు ప్రతిరూపంగా నటించి మెప్పించారు. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సాట్నా టిటస్కు ఈ సినిమాలో కూడా నటనకు ఆస్కారమున్న పాత్రే దక్కింది. ఫస్ట్ హాఫ్లో నవ్వించే ప్రయత్నం చేసిన సాట్నా.. ద్వితీయార్థంలో వచ్చే ఎమోషనల్ సీన్స్లో మంచి నటన కనబరిచింది. విశ్లేషణ : మధ్య తరగతి కుటుంబాల్లో ప్రతీ ఇంట్లోను ఉండే సమస్యలనే కథా వస్తువుగా తీసుకున్న దర్శకుడు వేణు ఊడుగుల తొలి ప్రయత్నంలోనే మంచి విజయం సాధించాడు. ప్రతీ ప్రేక్షకుడు ఏదో ఒక సన్నివేశంలో ఇది నా కథే అనిపించేలా ఉంది కథనం. ప్రస్తుత సమాజంలో అందరు మనుషులు ముసుగులు వేసుకునే బతుకున్నారన్న అంశాన్ని మనసుకు హత్తుకునేలా ప్రజెంట్ చేశాడు. పోటీ ప్రపంచంలో ర్యాంకుల కోసం, పరువు ప్రతిష్టల కోసం తల్లిదండ్రులు పిల్లలను ఎంత ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఆ ఒత్తిడి వల్ల పిల్లలు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారన్న అంశాలను బలమైన ఎమోషనల్ సీన్స్తో తెర మీద ఆవిష్కరించాడు.. సంగీతం కూడా సినిమాకు తగ్గట్టుగా కుదిరింది. ఎక్కడ కమర్షియల్ లెక్కల కోసం పాటలను ఇరికించకుండా ప్రతీ పాట కథలో భాగంగా వచ్చిపోతుంటాయి. సినిమాకు మరో ప్రధానబలం నేపథ్య సంగీతం. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి తన నేపథ్య సంగీతంతో కథలోని భావోద్వేగాలను మరింతగా ఎలివేట్ చేశాడు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథా కథనం శ్రీ విష్ణు నటన సంగీతం మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
ఈ సినిమా కొనాలనుకున్నా – శర్వానంద్
‘‘నీది నాది ఒకే కథ’ ట్రైలర్ చూడగానే మార్నింగ్ షో చూడాలనిపించింది. ఈ సినిమాను నేను కొనుక్కుంటే బావుంటుందనిపించి విజయ్కి కాల్ చేస్తే, అప్పటికే బిజినెస్ పూర్తయ్యింది. మంచి సినిమాను మిస్ చేసుకున్నానే అనిపిస్తోంది’’ అన్నారు హీరో శర్వానంద్. శ్రీ విష్ణు, సాట్నా టైటస్ జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీది నాది ఒకే కథ’. ప్రశాంతి, కృష్ణ విజయ్, అట్లూరి నారాయణ రావు నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో దర్శకుడు దేవీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘చాలామంది అడిగినా నటించలేదు. ఈ కథ నచ్చి, చేశా. హీరో తర్వాత అంత ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ నాదే’’ అన్నారు. ‘‘కథ విన్నప్పుడు ‘ఏంట్రా ఇదేదో నా స్టోరీలాగే ఉందే’ అనిపించింది. నా జీవితాన్ని ఎప్పుడైనా సినిమాగా చూసుకోవాలంటే ఈ చిత్రం చూసుకోవచ్చని చేశా. ఒక అమ్మాయి వెంటపడి ప్రేమ కోసం ఒప్పించేటప్పుడు.. జీవితం కోసం ఎంత ఒప్పించాలని చెప్పేదే ఈ సినిమా’’ అన్నారు శ్రీ విష్ణు. ‘‘ఈ చిత్రం ట్రైలర్ చూడగానే పెద్ద హిట్ అవుతుందనే వైబ్రేషన్ కలిగింది. ‘ఆకలిరాజ్యం’ సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య జరిగే సంఘర్షణ గుర్తుండిపోయింది. మరోసారి ఆ చిత్రాన్ని గుర్తుకు తెచ్చిన సినిమా ఇది’’ అని దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి అన్నారు. నారా రోహిత్ మాట్లాడుతూ – ‘‘ఇంటర్ చదివే రోజుల్లో నా ఫ్రెండ్ బాస్కెట్ బాల్ ప్లేయర్ అవ్వాలనుకుంటే ఇంట్లో ఒప్పుకోలేదు. దాంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యాడు. అలాంటివాళ్ల గురించి చెప్పే చిత్రమిది’’ అన్నారు. -
‘నా కథలా కూడా అనిపిస్తుంది’
యంగ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం నీదీ నాదీ ఒకే కథ. మధ్య తరగతి మనుషుల జీవితం కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల సినీ ప్రముఖుల కోసం స్పెషల్ ప్రీమియర్ను నిర్వహించారు చిత్రయూనిట్. ఈ షో చూసిన దర్శకుడు శేఖర్ కమ్ముల చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించారు. తాజాగా యంగ్ హీరో నాని కూడా ఈ సినిమాపై స్పందించారు. సినిమా ట్రైలర్ను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసిన నాని... ‘ఇది నా కథలా కూడా అనిపిస్తుంది. శ్రీ విష్ణు నటనలో అతను ఎంత మనసుపెట్టి పర్ఫామ్ చేశాడో తెలుస్తోంది. అతనికి అతని టీంకు నా శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు నాని. This looks like my Katha too .. there’s a lot of heart in sree vishnu’s performance .. wishing him and his team all the very best :)#NeedhiNaadhiOkeKatha https://t.co/hoisBjLIFl — Nani (@NameisNani) 22 March 2018 -
మనందరి కథలా ఉంది : శేఖర్ కమ్ముల
విభిన్న కథలతో వరుస విజయాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నీదీ నాదీ ఒకే కథ. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బిచ్చగాడు ఫేం సట్నా టైటస్ హీరోయిన్ గా నటించింది. నారా రోహిత్ సమర్పణలో ప్రశాంతి, కృష్ణ విజయ్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల కోసం ప్రత్యేకం ప్రదర్శించారు. సినిమా చూసిన శేఖర్ కమ్ముల చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. సమాజానికి అవసరమైన కథను ఎంతో అందంగా రూపొందించిరనందుకు యూనిట్ సభ్యులకు హ్యాట్సాఫ్ అన్నారు. ప్రస్తుతం సొసైటీలో గెలిచిన వాళ్లకే కెరీర్ ఉంటుందని, ఓడిపోయిన వాళ్లను ఎందుకు పనికి రానివారిగా చూస్తున్నారని.. అలాంటి సంఘటనలను మనసుకు హత్తుకునేలా చిత్రీకరించారని తెలిపారు. శ్రీవిష్ణు యాక్టింగ్ గత చిత్రాల కన్నా ఇంకా బాగుంది. ఇలాంటి సినిమాలు సమాజానికి అవసరమన్నారు. -
ఆ మాట అనిపించుకోకూడదు
‘‘చదువు సరిగ్గా రాని కుర్రాడి జీవితంలో చదువు పూర్తయినప్పటి నుంచి సెటిలయ్యే వరకు ఏం జరిగిందన్నదే ‘నీది నాది ఒకే కథ’. వేణుగారు ఫుల్ క్లారిటీతో మంచి సినిమా తీశారు’’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. శ్రీవిష్ణు, సాట్నా టైటస్ జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నీది నాది ఒకే కథ’. ప్రశాంతి, కృష్ణ విజయ్, అట్లూరి నారాయణరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది. శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నా క్యారెక్టర్ని చూసి, చాలామంది కుర్రాళ్లు వాళ్లను వాళ్లు చూసుకుంటున్నట్లుగా భావిస్తారు. జీవితంలో కీలక సమయాల్లో సొసైటీ గురించి ఆలోచిస్తాం. కానీ, సొసైటీ మనకేమీ చేయదు. అందుకే.. అన్ని సందర్భాల్లో సమాజం గురించి ఆలోచించి, మన ఇష్టాయిష్టాలను చంపేసుకోవాల్సిన అవసరం లేదని మా చిత్రంలో చెబుతున్నాం. దర్శకులు దేవి ప్రసాద్గారు నా తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారు. ఆయన పాత్రతో పెద్దవాళ్లు కనెక్ట్ అవుతారు. ఆయన ఓ డైరెక్టర్లా కాకుండా మాతో ఓ నటుడిలా కలిసిపోయారు. ఆయన పాత్ర చూసి థ్రిల్ అవుతారు. మాస్ హీరో అయిపోవాలనే ఆలోచనతో ఇలాంటి పాత్రలు ఎంచుకోవడం లేదు. కథ నచ్చే ఒప్పుకుంటున్నా. అయినా.. మాస్ హీరో అవ్వడం చాలా కష్టం. ఈ చిత్రంలో డోగ్మే 95 టెక్నిక్ వాడారు. అది 1995 టెక్నిక్.తక్కువ బడ్జెట్లో సినిమా తీయడం ఎలా అనేది అందులో మెయిన్. ట్రాలీలు, జిమ్మీలు, సెట్లు వంటివి లేకుండా చాలా తక్కువలో సినిమా చేశాం. ఆ టెక్నిక్ వాడి తెలుగులో తీసిన మొదటి సినిమా మాదే. ఒకే తరహా సినిమాలు, పాత్రలు చేస్తే ‘వీడు ఒకే టైప్ క్యారెక్టర్స్ చేస్తున్నాడ్రా’ అంటారు. ఆ మాట అనిపించుకోకూడదన్నదే నా ప్రయత్నం. అందుకే డిఫరెంట్ మూవీస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నాకు వెంకటేష్గారంటే చాలా ఇష్టం. ప్రస్తుతం ‘వీరభోగ వసంతరాయలు’ సినిమా చేస్తున్నాను. తర్వాత ‘అసుర’ దర్శకుడితో ‘తిప్పరా మీసం’ చేస్తా. ఆ తర్వాత కొత్త డైరెక్టర్తో ఓ పోలీస్ స్టోరీ చేయనున్నా’’ అన్నారు. -
ఇద్దరిదీ ఒకే కథ
‘నువ్వు ఆత్మన్యూనతా భావంతో బాధ పడుతున్నావ్.. అయ్యో.. ఇదేదో బ్లడ్ క్యాన్సరో, మౌత్ క్యాన్సరో కాదు కదా అండీ?.. దానికన్నా పెద్దది’... ‘పాన్షాపు వాడిది బతుకు కాదా? కొబ్బరి బోండాలు అమ్ముకునేవాడిది ఓ బతుకు కాదా? మెకానిక్ షెడ్డు వాడిది బతుకు కాదా? డ్రైవర్ది బతుకు కాదా? ఏం.. మీలాంటి లెక్చరర్లు, డాక్టర్లు, ఇంజనీర్లవే బతుకులా?’ వంటి డైలాగులు ‘నీది నాది ఒకే కథ’ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. శ్రీ విష్ణు, ‘బిచ్చగాడు’ ఫేమ్ సాట్నా టైటస్ జంటగా నటించిన చిత్రం ‘నీది నాది ఒకే కథ’. వేణు ఊడుగుల దర్శ కత్వంలో ప్రశాంతి, కృష్ణ విజయ్, అట్లూరి నారాయణరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ మా సినిమా టీజర్, పాటలకు మంచి స్పందన వస్తోంది. శ్రీ విష్ణు స్టూడెంట్గా కనిపించనున్నారు. చిత్తూరు యాసలో తను పలికిన ఘాటైన డైలాగులు యూత్ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమా కూడా అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. పోసాని కృష్ణమురళి, దేవిప్రసాద్ నటించిన ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, కెమెరా: రాజ్ తోట (అర్జున్రెడ్డి ఫేమ్). -
మార్చి 23న ‘నీది నాది ఒకే కథ’
శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘నీది నాది ఒకే కథ’ చిత్రం మార్చి 23 న విడుదల కానుంది. టీజర్ మరియు పాటలకు అద్భుత స్పందన వస్తున్న ఈ చిత్రంలో శ్రీ విష్ణు స్టూడెంట్ గా కనిపించనున్నారు. టీజర్ లో చిత్తూర్ యాసలో శ్రీ విష్ణు పలికిన ఘాటైన డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తోంది. డిఫరెంట్ కాన్పెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాతో శ్రీవిష్ణు మరో సక్సెస్ సాధిస్తాడన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన ‘బిచ్చగాడు’ ఫేమ్ సాట్నా టైటస్ హీరోయిన్గా కనిపించనున్నారు. ఈ సినిమాను ప్రశాంతి, కృష్ణ విజయ్ మరియు అట్లూరి నారాయణ రావు అరాన్ మీడియా వర్క్స్ మరియు శ్రీ వైష్ణవి క్రియేషన్స్ బ్యానర్ లపై సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘నీది నాది ఒకే కథ’ చిత్రం మార్చి 23 న విడుదల కానుంది. -
శ్రీవిష్ణుతో బిచ్చగాడు బ్యూటీ
'మెంటల్ మదిలో' చిత్రంతో విజయాన్ని అందుకున్న శ్రీవిష్ణు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజగా నూతన దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో 'నీది నాది ఒకే కథ' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ‘బిచ్చగాడు’ ఫేమ్ సాట్నా టైటస్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన మోషన్ పోస్టర్కు మంచి స్పందన రాగా తాజగా టీజర్ విడుదలకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. టీజర్ను జనవరి 6న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ప్రశాంతి, కృష్ణ విజయ్లు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు స్నేహితుడు నారారోహిత్ అరన్ మీడియా వర్క్స్ బ్యానర్ పై సమర్పిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. -
రియల్ లైఫ్లో ఫుల్ క్లారిటీ
‘‘అప్పట్లో ఒకడుండేవాడు’ రిలీజ్ టైమ్లో నిర్మాత రాజ్ కందుకూరి దర్శకుడు వివేక్ను నా వద్దకు పంపారు. మొదటి 10 నిముషాల కథ వినగానే ‘మెంటల్ మదిలో’ చిత్రానికి ఓకే చెప్పేశా’’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు.శ్రీవిష్ణు, నివేథా పేతురాజ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డి.సురేశ్బాబు సమర్పణలో రాజ్ కందుకూరి నిర్మించిన ‘మెంటల్ మదిలో’ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ... ► ఈ చిత్రంలో ప్రతి విషయానికీ కన్ఫ్యూజ్ అయ్యే పాత్ర నాది. కానీ, రియల్ లైఫ్లో సరైన నిర్ణయాలు తీసుకుంటా. నాకు ఏది సరిపోతుందో దాన్నే ఎంచుకుంటా. కథ బాగుండీ నాకు సెట్టవ్వకపోతే చేయను. అదే నా పాలసీ. మా చిత్రాన్ని ఫస్ట్ చూసింది నారా రోహితే. చాలా బాగుందన్నారు. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో ఎక్కువ డబ్బులు వచ్చింది ‘మెంటల్ మదిలో’ చిత్రానికే. ► ఇది రెగ్యులర్ స్టోరీ కాదు. స్క్రీన్ప్లేలో చిన్న మ్యాజిక్ ఉంటుంది. ఇందులో నచ్చకపోవడానికి ఏమీ ఉండదు. సింపుల్గా ఉంటుంది. కొంతమందికి విపరీతంగా నచ్చేసింది. నాకు, శివాజీరాజాగారికి మధ్య వచ్చే సీన్లు, హీరోయిన్లతో నా లవ్ ట్రాక్స్ ప్రేక్షకులను బాగా ఎట్రాక్ట్ చేశాయి. ► కథలో నేను ఒక్కడినే మార్పులు చెప్పను. అందరం చర్చించుకున్నాక అవసరమైన మార్పులు.. చేర్పులు చేసుకుంటుంటాం. దర్శకులు చెప్పిన కథ నచ్చితే వెంటనే ఓకే చెప్పేస్తా. ► నా తాజా సినిమా ‘నీది నాది ఒకే కథ’ రిలీజ్కు సిద్ధంగా ఉంది. ‘సుర’ డైరెక్టర్ విజయ్తో ‘తిప్పరా మీసం’ సినిమా చేస్తున్నా. ‘వీర భోగ వసంతరాయలు’ కూడా చిత్రీకరణలో ఉంది. -
విజయంతో పాటు గౌరవం
‘‘పెళ్ళి చూపులు’కు ఎంత పేరొచ్చిందో ‘మెంటల్ మదిలో’ చిత్రానికీ అంతే పేరొచ్చింది. సినిమా బాగుందని అందరూ అభినందిస్తున్నారు’’ అని రాజ్ కందుకూరి అన్నారు. శ్రీవిష్ణు, నివేథా పేతురాజ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డి.సురేశ్బాబు సమర్పణలో రాజ్ కందుకూరి నిర్మించిన ‘మెంటల్ మదిలో’ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా సక్సెస్మీట్ నిర్వహించారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ద్వారా పదిమంది టెక్నీషియన్స్ పరిచయమయ్యారు. వీళ్లు మరో ఇరవై సినిమాలు చేస్తారు. నా బ్యానర్ నుంచి వచ్చిన వారు ఇలా సినిమాలు చేస్తున్నారని గొప్పగా ఫీలవుతా. ఇటువంటివారిలో వివేక్ ఆత్రేయ, సంగీత దర్శకుడు ప్రశాంతి విహారి, కెమెరామెన్ వేద రామన్, ఎడిటర్ విప్లవ్ కూడా ఉంటారనడంలో సందేహం లేదు. నేను ఏడాదికి ఒక సినిమా చేయగలను. ప్రేక్షకులు సపోర్ట్ చేస్తే కొత్తవారిని నా సినిమాల ద్వారా పరిచయం చేస్తా’’ అన్నారు. ‘‘మంచి హిట్తో పాటు గౌరవం తెచ్చిన సినిమా ఇది. ఈ చిత్రం బాగుందని అందరూ అంటుంటే హ్యాపీగా ఉంది’’ అన్నారు శ్రీవిష్ణు. ‘‘ఇళయరాజాగారి, ఎ.ఆర్. రెహమాన్గారి పాటలు విన్నప్పుడు అప్పుడే అయిపోయాయా అనే ఫీలింగ్ కలుగుతుంది. ‘మెంటల్ మదిలో’ జర్నీలో ఈ సినిమా అప్పుడే అయిపోయిందా అనిపించింది’’ అన్నారు వివేక్ ఆత్రేయ. ‘మా’ అధ్యక్షుడు, నటుడు శివాజీ రాజా, దర్శకుడు ప్రవీణ్ సత్తారు, రచయితలు భాస్కరభట్ల, సిరా శ్రీ, నటి అనితా చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లిళ్లు, శుభకార్యాలున్నా... ప్రేక్షకులు థియేటర్లకొచ్చారు!
‘‘ఈ నాలుగు రోజుల్లో బోల్డన్ని పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్నాయి. అయినా... ప్రేక్షకులు సినిమాను చక్కగా ఆదరిస్తున్నారు. 80 శాతం థియేటర్లు ఫుల్ అవుతున్నాయి. హ్యాపీగా ఉంది’’ అని నిర్మాత రాజ్ కందుకూరి అన్నారు. శ్రీవిష్ణు, నివేతా పేతురాజ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘మెంటల్ మదిలో’ శుక్రవారం విడుదలైంది. డి. సురేశ్బాబు సమర్పకులుగా వ్యవహరించిన ఈ సినిమా సక్సెస్ మీట్ శనివారం జరిగింది. శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ కాపీ రాగానే సురేశ్బాబుగారు 10రోజులు స్పెషల్ షోలు వేయమని చెప్పారు. ఆయన కాన్ఫిడెన్స్కి థ్రిల్లయ్యా. ఆ పది రోజులూ ఐసీయులో పేషెంట్ ఎలా ఉన్నాడని ఆరా తీసినట్టు... టెన్షన్ పడేవాణ్ణి. ప్రేక్షకులు సినిమాను ఆదరించడంతో హ్యాపీగా ఉంది. వివేక్ లాంటి దర్శకులు ఎక్కువమంది ఉన్నా... రాజ్ కందుకూరి వంటి నిర్మాత ఒక్కరే ఉన్నారు. ఇటువంటి సినిమాలను ఆదరిస్తే... ఎక్కువమంది రాజ్ కందుకూరిలు ఇండస్ట్రీకి వస్తారు’’ అన్నారు. ‘‘సినిమా విడుదలకు ముందు సురేశ్బాబుగారు అందించిన సహకారం మరువలేనిది. శ్రీవిష్ణు, శివాజీరాజా (హీరో తండ్రి పాత్ర) ఇద్దరూ మా సినిమాలో హీరోలే. శ్రీవిష్ణు కోసం అతిథి పాత్రలో నటించిన నారా రోహిత్గారికి థ్యాంక్స్. మా టీమ్ అందరూ ఎంతో సపోర్ట్ చేశారు’’ అన్నారు రాజ్ కందుకూరి. ‘‘రోజా రమణిగారు ‘ఇన్నేళ్ల నా అనుభవంలో సినిమా చూసి, ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుకి కాల్ చేయడం ఇదే తొలిసారి’ అన్నారు. అంతకంటే గొప్ప అభినందన ఏముంటుంది’’ అన్నారు శివాజీ రాజా. ఈ కార్యక్రమంలో దర్శక–నిర్మాత ‘మధుర’ శ్రీధర్రెడ్డి, నటి అనితా చౌదరి, సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి తదితరులు పాల్గొన్నారు. -
మనసుకు నచ్చిన కథ
‘‘పెళ్లిచూపులు’ వంటి భారీ హిట్ తర్వాత నేను బిగ్ మూవీ చేస్తానని అందరూ అనుకున్నారు. నాకూ చేయాలని ఉంది. కానీ కొత్త దర్శకులతో పని చేస్తే ఎక్కువ ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఎడిటింగ్, కెమెరా, ఆర్ట్.. ఇలా డిఫరెంట్ క్రాఫ్ట్స్లో కొత్తవారిని పరిచయం చేశా’’ అన్నారు రాజ్ కందుకూరి. శ్రీవిష్ణు, నివేతా పేతురాజ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డి. సురేష్బాబు సమర్పణలో ఆయన నిర్మించిన ‘మెంటల్ మదిలో’ సినిమా ఈ రోజు విడుదల కానుంది. రాజ్ కందుకూరి మాట్లాడుతూ– ‘‘నా మనసుకు నచ్చిన కథ ఇది. హీరో పాత్రకు సరిపోయే టైటిల్ పెట్టాం. శ్రీవిష్ణు అద్భుతంగా నటించాడు. శివాజీరాజాగారి పాత్ర స్పెషల్ ఎట్రాక్షన్. వివేక్ బాగా తెరకెక్కిం చాడు. సురేశ్బాబు గారు సినిమా చూసి బాగుంది అంటే చాలా ఆనందంగా ఉంటుంది. రాజ్ కందుకూరి చేస్తే మంచి సినిమాలే చేస్తాడు. బ్యాడ్ మూవీ మాత్రం చేయడని అందరూ చెప్పుకునేలా ఈ సినిమా ఉంటుంది. నెక్ట్స్ మరో షార్ట్ఫిల్మ్ దర్శకునితో సినిమా చేయబోతున్నాను’’ అన్నారు. -
'మెంటల్ మదిలో...' మూవీ రివ్యూ
టైటిల్ : మెంటల్ మదిలో... జానర్ : రొమాంటిక్ ఎంటర్ టైనర్ తారాగణం : శ్రీ విష్ణు, నివేథ పెతురాజ్, శివాజీ రాజా సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి దర్శకత్వం : వివేక్ ఆత్రేయ నిర్మాత : రాజ్ కందుకూరి పెళ్లిచూపులు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నిర్మాత రాజ్ కందుకూరి మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ శ్రీ విష్ణు హీరోగా మెంటల్ మదిలో సినిమాను తెరకెక్కించారు. సపోర్టింగ్ రోల్స్ లో మంచి ఇమేజ్ సంపాదించిన శ్రీ విష్ణు, అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో నటుడిగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమాతో హీరోగా తొలి విజయాన్ని అందుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు సోలో హీరోగా మెంటల్ మదిలో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. సినిమాలోని కంటెంట్ నచ్చిన సురేష్ బాబు.. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ తొలిసారిగా డైరెక్ట్ చేసిన మెంటల్ మదిలో.. మరోసారి రాజ్ కందుకూరికి సక్సెస్ అందించిందా? శ్రీవిష్ణు సోలో హీరోగా ఆకట్టుకున్నాడా..? కథ : అరవింద్ కృష్ణ (శ్రీ విష్ణు) ఏ విషయంలోనూ సొంతంగా నిర్ణయం తీసుకోలేని గందరగోళ మనస్తత్వం కలిగిన వ్యక్తి. కనీసం ఏ షర్ట్ వేసుకోవాలో కూడా సొంతంగా నిర్ణయం తీసుకోలేడు. అందుకే చిన్నప్పటి నుంచి ఏ విషయంలోనూ ఆప్షన్స్ తీసుకోవడానికి ఇష్టపడడు. అంతేకాదు చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన కారణంగా అమ్మాయిలంటే కూడా అరవింద్ కు భయం కలుగుతుంది. చదువు పూర్తయి ఉద్యోగంలో చేరినా అమ్మాయిలతో మాత్రం మాట్లాడడు. పెళ్లి చేస్తే ఏమైన మార్పు వస్తుందని భావించిన అరవింద్ తల్లిదండ్రులు సంబంధాలు చూస్తుంటారు. (సాక్షి రివ్యూస్)డజనుకు పైగా పెళ్లిచూపులు చూసినా అరవింద్ ప్రవర్తన కారణంగా ఒక్కటి కూడా సెట్ కాదు. చివరకు స్వేచ్ఛ (నివేథ పెతురాజ్), అరవింద్ తో పెళ్లికి ఓకె చెపుతుంది. అరవింద్ కూడా తొలి చూపులోనే స్వేచ్ఛతో ప్రేమలో పడతాడు. తనతో పరిచయం అయిన తరువాత అరవింద్ ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది. అనుకోని పరిస్థితుల్లో వీరి ఎంగేజ్ మెంట్ వాయిదా పడుతుంది. అదే సమయంలో అరవింద్ ఆఫీస్ పనిమీద ముంబై వెళ్లాల్సి వస్తుంది. అయిష్టంగానే ముంబై వెళ్లిన అరవింద్, కొద్ది రోజులు తరువాత స్వేచ్ఛకు ఫోన్ చేసి ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకుందాం అని చెప్తాడు. అరవింద్ ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి..? ముంబైలో ఏం జరిగింది..? చివరకు అరవింద్, స్వేచ్ఛలు ఒక్కటయ్యారా అన్నదే మిగతా కథ. నటీనటులు : అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలో సీరియస్ రోల్ లో కనిపించిన శ్రీ విష్ణు, మెంటల్ మదిలో లవర్ బాయ్ లుక్స్ లో అదరగొట్టాడు. సొంతంగా నిర్ణయం తీసుకోలేని గందరగోళ మనస్తత్వం ఉన్న వ్యక్తిగా మంచి నటన కనబరిచాడు. ఫస్ట్ హాఫ్ అంతా అమాయకుడిగా కనిపించిన శ్రీవిష్ణు, సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకున్నాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ హీరోయిన్ గా నటించిన నివేథ పెతురాజ్, లుక్స్ తో పాటు నటనతోను స్వేచ్ఛపాత్రకు ప్రాణం పోసింది నివేథ. (సాక్షి రివ్యూస్)మరో కీలక పాత్రలో నటించిన రేణు, కథను మలుపు తిప్పే పాత్రలో ఆకట్టుకుంది. బబ్లీగా కనిపిస్తూనే మంచి ఎమోషన్స్ పండించింది. చాలా కాలం తరువాత ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించిని సీనియర్ నటుడు శివాజీ రాజా మిడిల్ క్లాస్ తండ్రిగా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : పెళ్లిచూపులు లాంటి క్లాస్ ఎంటర్ టైనర్ తో ఆకట్టుకున్న రాజ్ కందుకూరి మరోసారి అలాంటి అందమైన ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకోలేని వ్యక్తి, తన సమస్య కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ప్రేమ విషయంలో ఎలాంటి మానసిక సంఘర్షణకు గురయ్యాడో ఎంటర్ టైనింగ్ గా చూపించారు. తొలి సినిమానే అయినా.. దర్శకుడు వివేక్ ఆత్రేయ కథను చాలా బాగా డీల్ చేశాడు. కథనంలో కాస్త వేగం తగ్గినా ఓ అందమైన ప్రేమకథను చూస్తున్న ఫీల్ కలిగించటంలో సక్సెస్ సాధించాడు. ముఖ్యంగా దర్శకుడు ఎంచుకున్న టీం సినిమా అంత బాగా రావడానికి హెల్ప్ అయ్యింది. (సాక్షి రివ్యూస్) తొలి చిత్రమే అయినా సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్ విహారి తన మార్క్ చూపించాడు. మనసును తాకే మెలోడీస్ తో పాటు అద్భుతమైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. కమర్షియల్ మూసలో కాకుండా ఇలాంటి డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటున్న రాజ్ కందుకూరి ప్రయత్నాన్ని సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. కథ ఎంపికలో ఆయన చూపిస్తున్న కొత్తదనం ఎంతో మంది కొత్త సాంకేతిక నిపుణులకు ప్రొత్సాహాన్ని ఇస్తుందంటున్నారు. - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
విశ్వనాథ్గారి కథను మణిరత్నం డైరెక్ట్ చేస్తే...– శ్రీవిష్ణు
శ్రీవిష్ణు, నివేతా పెతురాజ్ జంటగా డి. సురేశ్బాబు సమర్పణలో రాజ్ కందుకూరి నిర్మించిన సినిమా ‘మెంటల్ మదిలో’. వివేక్ ఆత్రేయ దర్శకుడు. ఈ నెల 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్లో ప్రీ–రిలీజ్, పాటల వేడుక నిర్వహించారు. ఆడియో సీడీలను సురేశ్బాబు–విజయ్ దేవరకొండ, ట్రైలర్ను నారా రోహిత్ విడుదల చేశారు. ‘‘సినిమా చూసి బాగా ఏంజాయ్ చేశా. శ్రీవిష్ణు బాగా నటించాడు. నా సిన్మా కూడా ఈ 24నే విడుదలవుతోంది. రెండూ బాగా ఆడి నిర్మాతలకు డబ్బులు తీసుకురావాలి. పోటీగా అనుకోవడం లేదు’’ అన్నారు నారా రోహిత్. ‘‘ప్రీమియర్ షోలు చూసిన వాళ్లంతా సినిమా బాగుందంటున్నారు. పరీక్ష రాశాం. ప్రేక్షకుల రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సురేశ్బాబుగారు కొండంత అండ. నన్ను, నా టీమ్ని నమ్మి మరొక్క అవకాశం ఇచ్చిన ఆయనకి థ్యాంక్స్. తరుణ్ భాస్కర్ (‘పెళ్లి చూపులు’ దర్శకుడు) తర్వాత వివేక్ను మా బ్యానర్లో పరిచయం చేయడం ఆనందంగా ఉంది. శ్రీ విష్ణు బాగా నటించాడు’’ అన్నారు రాజ్ కందుకూరి. ‘‘లైప్ ఈజ్ బ్యూటీఫుల్’లో నేను, శ్రీ విష్ణు చిన్న పాత్రల్లో నటించాం. తన సినిమాలు బాగుంటాయని వింటూనే ఉన్నాను. ఈ సినిమా పెద్ద హిట్టవుతుంది’’ అన్నారు విజయ్ దేవరకొండ. ‘‘విశ్వనాథ్గారి కథను తీసుకుని, ఆ కథకు జంధ్యాలగారు మాటలు రాసి చిన్న బడ్జెట్తో మణిరత్నంగారు డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అంత హాయిగా ఉంటుందీ సిన్మా. ఇది నా పర్సనల్ ఫీలింగ్’’ అన్నారు శ్రీవిష్ణు. ఈ వేడుకలో దర్శక–నటుడు అవసరాల శ్రీనివాస్, నిర్మాత ‘మధుర’ శ్రీధర్, ప్రశాంత్ విహరి, ‘కళామందిర్’ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. -
మౌత్ పబ్లిసిటీ ఇవ్వండి చాలు!
శ్రీ విష్ణు, నివేతా పెతురాజ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై రాజ్ కందుకూరి నిర్మించిన సినిమా ‘మెంటల్ మదిలో’. ప్రముఖ నిర్మాత డి. సురేశ్బాబు చిత్రసమర్పకులు. ఈ నెల 24న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సినిమాలోని నాలుగో పాట ‘ఏదేలా ఏదోలా’ను విడుదల చేసిన డి. సురేశ్బాబు మాట్లాడుతూ– ‘‘చాలా మంది తమ సినిమా బాగుంది చూడమని ప్రెస్మీట్స్లో చెప్తుంటారు. మా సినిమా ప్రివ్యూలు వేస్తాం. చూడండి... నచ్చితే మౌత్ పబ్లిసిటీ ఇవ్వండి. మాకది చాలు’’అన్నారు. ‘‘కన్ఫ్యూజన్లో ఉన్న ఓ అబ్బాయి కథే ఈ సినిమా. సురేశ్బాబుగారికి నచ్చడంతో విడుదల చేయాడానికి ముందుకొచ్చారు. ఈ నెల 20న ప్రీ–రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నాం. శ్రీవిష్ణు, నివేతా బాగా నటించారు. వివేక్ సినిమాను చక్కగా తెరకెక్కించాడు. ప్రశాంత్ మంచి పాటలు అందించారు’’ అన్నారు రాజ్ కందుకూరి. ‘‘యంగ్ అండ్ ఫ్రెష్ టీమ్ కలిసి పని చేసిన సినిమా ఇది. సురేశ్బాబుగారు అండగా నిలవడం ఆనందంగా ఉంది’’ అన్నారు శ్రీవిష్ణు. చిత్రదర్శకుడు వివేక్, హీరోయిన్ నివేతా పేతురాజ్, నటుడు కిరిటీ దామరాజు, సంగీత దర్శకుడు ప్రశాంత్ పాల్గొన్నారు. -
ఇద్దరు మిత్రుల సవాల్
నారా వారబ్బాయి రోహిత్, యంగ్ హీరో శ్రీవిష్ణుల మధ్య ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే. తన ప్రతీ సినిమాలో శ్రీవిష్ణుకు కీలక పాత్రలు ఇవ్వటంతో పాటు తానే స్వయంగా నిర్మాతగా మారి అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో శ్రీవిష్ణుకు బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం సెట్స్ మీదున్న వీరభోగవసంత రాయలు సినిమాలో కూడా ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నారు. అయితే ఇంతటి స్నేహంగా ఉంటున్న ఈ ఇద్దరు యంగ్ హీరోలు బాక్సాఫీస్ ముందు అమీతుమీకి సిద్ధమవుతున్నారు. నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన ఫ్యాక్షన్ మూవీ బాలకృష్ణుడు ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదే రోజు శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన మెంటల్ మదిలో సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. దీంతో ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య పోటీ తప్పేలాలేదు. రోహిత్ సిక్స్ప్యాక్లుక్లో కనిపిస్తుండటంతో పాటు ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్ బాలకృష్ణుడు సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేశాయి. పెళ్లిచూపులు లాంటి క్లాస్ హిట్ తరువాత రాజ్ కందుకూరి, సురేష్ బాబులు నిర్మిస్తున్న మెంటల్ మదిలో సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ ఇద్దరు మిత్రుల్లో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి. -
'ఉన్నది ఒకటే జిందగీ' మూవీ రివ్యూ
టైటిల్ : ఉన్నది ఒకటే జిందగీ జానర్ : ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తారాగణం : రామ్ పోతినేని, అనుపమా పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి, శ్రీవిష్ణు సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ దర్శకత్వం : కిశోర్ తిరుమల నిర్మాత : స్రవంతి రవికిశోర్ నేను శైలజ సినిమాతో సూపర్ ఫాంలోకి వచ్చినట్టుగా కనిపించిన యంగ్ హీరో రామ్, తరువాత హైపర్ తో మరోసారి తడబడ్డాడు. అందుకే తన కెరీర్ ను గాడిలో పెట్టే బాధ్యతను మరోసారి దర్శకుడు కిశోర్ తిరుమల చేతిలో పెట్టాడు. తొలి సినిమాలో కేవలం ప్రేమ కథ మీదే ఫోకస్ పెట్టిన రామ్, కిశోర్ లు ఉన్నది ఒకటే జిందగీలో లవ్ తో పాటు స్నేహబంధాన్ని కూడా అదే స్థాయిలో చూపించారు. మరి రామ్ నమ్మకాన్ని కిశోర్ నిలబెట్టుకున్నాడా..? ఈ ఇద్దరి కాంబినేషన్ నేను శైలజ మ్యాజిక్ ను రిపీట్ చేసిందా..? కథ : అభి (రామ్ పోతినేని) స్నేహమంటే ప్రాణమిచ్చే కుర్రాడు. స్కూల్ లో తన తో పాటు చదువుకునే వాసు (శ్రీ విష్ణు) అంటే అభికి ప్రాణం. వాసు జోలికి ఎవరు వచ్చిన అభి ఊరుకోడు. అంతేకాదు ఆరేళ్ల వయసులోనే మంచి స్కూల్ లో సీటు వచ్చినా.. వాసు కోసం వదులుకుంటాడు అభి. వారి వయసుతో పాటు వారి స్నేహం కూడా పెరిగి పెద్దదవుతుంది. అభికి వాసుతో పాటు మ్యూజిక్ అంటే కూడా ఇష్టం, సొంతంగా ఓ రాక్ బ్యాండ్ ను తయారు చేసుకోని కన్సర్ట్ లు ఇస్తుంటాడు. (సాక్షి రివ్యూస్) హ్యాపిగా సాగిపోతున్న వారి జీవితాల్లోకి ఓ ప్రమాదం కారణంగా మహా (అనుపమా పరమేశ్వరన్) అనే అమ్మాయి ఎంటర్ అవుతుంది. మహాకు కూడా సంగీతం అంటే ఇష్టముండటంతో పాటు అభి తన కుటుంబ సమస్యల విషయంలో ధైర్యం చెప్పటంతో మహా, అభిలు ఒకరినొకరు ఇష్టపడతారు. కానీ అదే సమయంలో వాసు కూడా మహాను ఇష్టపడుతున్న విషయం అభికి తెలుస్తుంది. మన మధ్య ఈగోలు రాకూడదన్న ఒప్పందంతో అభి, వాసులు ఒకేసారి మహాకు ప్రపోజ్ చేస్తారు. కానీ మహా మాత్రం వాసుకే ఓకె చెపుతుంది. వాసు ఫ్రెండ్స్ కన్నా ఎక్కువగా మహాకే వ్యాల్యూ ఇస్తుండటంతో కోపంతో అభి, వాసుకు దూరంగా వెళ్లిపోతాడు. ప్రాణమైన ఫ్రెండ్ ను కాదని అభి ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు..? అభి, వాసు తిరిగి కలుసుకున్నారా..? వీరి కథలో వెడ్డింగ్ ప్లానర్ మేఘన (లావణ్య త్రిపాఠి)కి సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు : నేను శైలజ సినిమాలో సెటిల్డ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న రామ్, ఈసినిమాలో తన మార్క్ ఎనర్జీని కూడా చూపించాడు. ముఖ్యంగా రాక్ స్టార్ లుక్ లో రామ్ బాడీ లాంగ్వేజ్, పర్పామెన్స్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఎమోషనల్ సీన్స్ లో రామ్ నటన కంటతడి పెట్టిస్తుంది. వాసు పాత్రలో శ్రీ విష్ణు ఒదిగిపోయాడు. ఫ్రెండ్ అంటే ప్రాణమిచ్చే స్నేహితుడిగా, ప్రియురాలు దూరమైన ప్రేమికుడిగా మంచి నటన కనబరిచాడు.(సాక్షి రివ్యూస్) అనుపమా పరమేశ్వరన్ అందంగా హుందాగా కనిపించింది. కళ్లతోనే భావాలను పలికిస్తూ మహా పాత్రకు ప్రాణం పోసింది. సెకండ్ హాఫ్ లో మేఘనగా లావణ్య త్రిపాఠి నటన బబ్లీ బబ్లీగా అలరించింది. గ్లామర్ షోతోనూ లావణ్య మంచి మార్కులు సాధించింది. ఫ్రెండ్స్ గా నటించిన ప్రియదర్శి ఇతర నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతిక నిపుణులు : నేను శైలజ సినిమాతో రామ్ కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు కిశోర్ తిరుమల మరోసారి అదే బాధ్యతను తీసుకొని ఉన్నది ఒకటే జిందగీ సినిమాను తెరకెక్కించాడు. ప్రేమ, స్నేహంల మధ్య కిశోర్ రాసుకున్న కథ మరోసారి యూత్ ఆడియన్స్ ను కట్టిపడేసేలా ఉంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్ లో కిశోర్ టాలెంట్ సూపర్బ్ అనిపిస్తుంది. కానీ తొలి భాగం మరింత వేగంగా కథ నడించి ఉంటే బాగుండనిపిస్తుంది. ఇంటర్వెల్ వరకు కథలో పెద్దగా ట్విస్ట్ లు లేకుండా ఫ్రెండ్స్ మధ్య సరదా సన్నివేశాలతోనే కథ నడిపించటం కాస్త ఇబ్బంది పెడుతుంది. అయితే క్లైమాక్స్ ట్విస్ట్ తో అన్ని మరిచిపోయేలా అందమైన ముగింపునిచ్చి అలరించాడు దర్శకుడు.(సాక్షి రివ్యూస్) సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం. ఇప్పటికే సూపర్ హిట్ అయిన వాట్ అమ్మా, ట్రెండ్ మారినా పాటలు వెండితెర మీద మరింతగా అలరించాయి. ఎమోషనల్ సీన్స్ కు దేవీ తన బెస్ట్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలో మరికాస్త దృష్టి పెట్టాల్సింది. ప్లస్ పాయింట్స్ : రామ్ నటన ఎమోషనల్ సీన్స్ సంగీతం మైనస్ పాయింట్స్ : స్లో నేరేషన్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
కన్ఫ్యూజన్ కుర్రాడు!
శ్రీవిష్ణు, నివేతా పేతురాజ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రాజ్ కందుకూరి నిర్మించిన చిత్రం ‘మెంటల్ మదిలో’. ప్రశాంత్ విహారి స్వరకర్త. ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో విడుదల చేయనున్నారు. శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ చిత్రం పోస్టర్ను నిర్మాత డి. సురేశ్బాబు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో అందరూ యంగ్స్టర్స్ ఉన్నారు. అది బాగా నచ్చింది. సినిమా తీయాలనే కల చాలామందికి ఉంటుంది. వీరందరూ మంచి సినిమా తీశారు’’ అన్నారు. రాజ్కందుకూరి మాట్లాడుతూ– ‘‘చిన్నసినిమా ప్రేక్షకులకు చేరువ కావాలంటే మంచి సపోర్టింగ్ సిస్టమ్ ఉండాలి. సురేశ్బాబుగారు సినిమా చూసి, ఇచ్చిన సలహాను దర్శకుడు వివేక్ ఆత్రేయ పాటించారు. ఇందులో హీరో ఇంట్రావర్ట్ అండ్ కన్ఫ్యూజ్డ్ షై పర్సన్. అలాంటి వ్యక్తి కన్ఫ్యూజ్ వల్ల ఏం కోల్పోయాడు? అన్నది డైరెక్టర్ బాగా చూపించారు. సురేశ్బాబు సినిమా చూసి బాగుంది అన్నప్పుడు సగం సక్సెస్ వచ్చిందని భావించాం’’ అన్నారు. ‘‘సురేశ్బాబుగారిని హెడ్మాస్టార్లా చూస్తుంటాను’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్. ‘‘నేను డైరెక్ట్ చేసిన సినిమాను సురేశ్బాబుగారు ప్రజెంట్ చేయడం అనేది గొప్ప విషయం. ఆయనకు థ్యాంక్స్. ‘పెళ్లి చూపులు’ వంటి హిట్ తర్వాత రాజ్ కందుకూరి నాతో సినిమా చేయడంతో ఆయన కాస్త రిస్క్ తీసుకునే వ్యక్తని భావిస్తున్నాను’’ అన్నారు దర్శకుడు. -
సురేష్ బాబు చేతికి మెంటల్ మదిలో..
గత ఏడాది పెళ్లిచూపులు సినిమాతో ఘనవిజయం సాధించిన రాజ్ కందుకూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న మరో మూవీ మెంటల్ మదిలో... అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు ఈ సినిమాతో మరోసారి ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. న్యూ ఏజ్ యూత్ ఫుల్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నివేతా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాజ్ కందుకూరి నిర్మించిన పెళ్లి చూపులు సినిమా రైట్స్ తీసుకున్న స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, మెంటల్ మదిలో సినిమా రైట్స్ కూడా సొంతం చేసుకోవటం విశేషం. ఇటీవల చిత్రయూనిట్ తో కలిసి మెంటల్ మదిలో ఫస్ట్ కాపీ చూసిన సురేష్ బాబు వెంటనే ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకునేందుకు ఓకె చెప్పారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటించనున్నారు. -
జ్ఞానమూర్తి... గీతాచార్య
సందర్భం శ్రీ మహావిష్ణువు దశావతారాలలో అత్యంత విలక్షణమైనదీ, జ్ఞానస్మృతి కలిగినదీ శ్రీ కృష్ణావతారం. సకల జీవులలో తానే ఉన్నానని తనను తాను స్వయంగా భగవానుడిగా ప్రకటించుకున్న మధుసూదనుడాయన. సమస్త భూమండలాలలో యదువంశ శిరోమణి అయిన శ్రీ కృష్ణభగవానుడు అందరినీ మించిన పూజార్హుడని వేదం చెబుతుంది. పిలవగానే పలికే దైవం శ్రీమన్నారాయణుడే అని అనడానికి కారణాలెన్నో ఉన్నాయి కానీ, వాటిలో ముఖ్యమైనవి కొన్ని... వాసుదేవుని ఎంతో ఆరాధించే పాండవులతోపాటు ద్రౌపదికి జరిగిన అవమానం ఇప్పుడు ప్రస్తావిస్తే.. నిస్సహాయులైన తన భర్తలను చూసి రోదిస్తూ నిండుసభలో ద్రౌపది పరాభవ సమయంలో త్వమేవ శరణం అని పిలవగానే వచ్చి తన శీలాన్ని కాపాడిన కృష్ణుడిని సోదర భావంతో ఆరాధించేది. ఎప్పుడు కష్టం కలిగినా, నేనున్నాను అని అన్నయ్య స్థానాన్ని తీసుకుని ద్రౌపదికి ఆపద్బాంధవుడయ్యాడు ఈ గోకుల నందనుడు. తనను ఆరాధించే వారికి తానున్నానంటూ అక్కున చేర్చుకునే దయాహృదయుడు వాసుదేవుడు. అర్జునుడికి ఒక ఇష్టసఖుడనే కాకుండా తనని ఎప్పుడూ మంచి స్నేహితునిగా చూసే శ్రీకృష్ణభగవానుడు, ధర్మక్షేత్రంగా పేరుగాంచిన కురుక్షేత్ర రణరంగంలో యోధానుయోధుల నడుమ నిలిచి శోకమోహాలలో మునిగిన అర్జునుడికి గురువై తత్వ దర్శనం కలిగించాడు. శకునికి మాయారూపిగా, విదురునికి ధర్మాత్మునిగా ఇలా అనేకులకు అనేకవిధాలుగా దర్శనం ఇవ్వడం శ్రీమన్నారాయణుడికే సాధ్యం. నీతిశాస్త్ర కోవిదుడు అయిన విదురుడు శ్రీకృష్ణభగవానుడి గురించి అనేక సందర్భాలలో మహారాజు ధృతరాష్ట్రునికి, సభికులందరికీ శ్రీకృష్ణుడి జీవితం ఒక ధర్మశాస్త్రం అని భగవానుడి నోటినుంచి వచ్చే అక్షర ధ్వని వేదప్రమాణం అని తెలిపేవాడు. మాయాజూదగాడయిన శకునికి ఎవరివద్దనైనా తన మాయ చెల్లుతుంది కానీ శ్రీకృష్ణుని వద్ద మాత్రం సాధ్యం కాదని తెలుసు. అందుకే కృష్ణ భగవానుడు శకునికి మాయారూపిగా దర్శనం ఇస్తుండేవాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మాధవ మేధస్సుకు అందని ఆ గోవిందుడి లీలలు అనేకం. భీష్ముడే శ్రీ కృష్ణుని జగద్గురువుగా కీర్తించాడు. పరమేశ్వరుడు కూడా శ్రీ మహావిష్ణువునే ఆరాధిస్తాడని వేదాలు ఘోషిస్తున్నాయి. జయ జయ కృష్ణ. – స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, శారదాపీఠం, విశాఖపట్నం -
రిపీట్ అవుతోన్న హిట్ కాంబినేషన్
నారా రోహిత్, శ్రీ విష్ణులది హిట్ కాంబినేషన్.. ఈ ఇద్దరు హీరోలు కలిసి నటించిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇటీవల ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన అప్పట్లో ఒకడుండేవాడు అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకే మరోసారి ఈ హిట్ కాంబినేషన్ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాకు అసోసియేట్గా పనిచేసిన ఇంద్రసేనను దర్శకుడిగా పరిచయంచేస్తూ నారా రోహిత్, శ్రీవిష్ణు కాంబినేషన్లో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బెల్లాన అప్పారావు నిర్మిస్తున్న ఈ సినిమాను మే రెండో వారంలో ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ శ్రియ కీలక పాత్రలో కనిపించనుంది. మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్కు జ్యోతిలక్ష్మి ఫేం సత్యదేవ్ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం నారా రోహిత్, శ్రీ విష్ణులు చేస్తున్న ప్రాజెక్ట్స్తో పాటు ఈ సినిమాను కూడా ఒకసారి పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. -
డబ్బింగ్ కార్యక్రమాల్లో 'మెంటల్ మదిలో'
గత ఏడాది పెళ్లిచూపులు సినిమాతో ఘనవిజయం సాధించిన రాజ్ కందుకూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న మరో సినిమా మెంటల్ మదిలో.. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా యూనిట్ షూటింగ్ ముగించుకునే డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభిస్తోంది. న్యూ ఏజ్ యూత్ ఫుల్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నివేతా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా యువ ప్రతిభాశాలి వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ''పెళ్ళిచూపులు' విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఓ వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. శ్రీవిష్ణు, నివేతాల జంట చాలా బాగుంది, శ్రీవిష్ణు నేచురల్ పెర్ఫార్మెన్స్, వివేక్ ఆత్రేయ టేకింగ్ 'మెంటల్ మదిలో' చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. మా ధర్మపధ క్రియేషన్స్ బ్యానర్ నుంచి వస్తున్న మరో మంచి చిత్రం 'మెంటల్ మదిలో' అని గర్వంగా చెప్పగలను. ఇవాళే డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టాం.. జూలైలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే ట్రైలర్ మరియు ఆడియో విడుదల తేదీలు ప్రకటిస్తాం' అన్నారు. -
పెళ్లిచూపులు తరువాత మెంటల్ మదిలో
పెళ్లిచూపులు సినిమాతో బిగ్ హిట్ అందుకున్న నిర్మాత రాజ్ కందుకూరి మరో ఇంట్రస్టింగ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పెళ్లిచూపులు తరహాలోనే 'మెంటల్ మదిలో' పేరుతో మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాతో వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో నటుడిగా మంచి మార్కులు సాధించిన శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్నాడు. నివేథ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పోస్టర్ ను ఉగాది సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో శ్రీవిష్ణు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేన్ లా కనిపిస్తున్నాడు. కథ ఎపింకలో కొత్తదనం చూపిస్తూ దూసుకుపోతున్న శ్రీవిష్ణు ఈ సినిమాతో మరో విజయం అందుకుంటానన్న నమ్మకంతో ఉన్నాడు. పెళ్లిచూపులు నిర్మాత రాజ్ కందుకూరి ఈ సినిమాను నిర్మిస్తుండటం సినిమా మీద అంచనాలను మరింత పెంచేస్తోంది. -
ఈ అబ్బాయికి తిక్క ఎక్కువ!
ఈ అబ్బాయికి కొంచెం తిక్క ఎక్కువ. ప్రేమ... పగ... ఏదైనా ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో కావాలంటాడు. ఎదురింటి అమ్మాయితో ప్రేమలో పడిన ఈ అబ్బాయి లైఫ్ హ్యాపీగా ముందుకు వెళ్తున్న సమయంలో సడన్గా యాక్షన్ టర్న్ తీసుకుంది. అబ్బాయి లైఫ్లో ఈ మలుపులకు కారణం ఏంటో? వచ్చే వారం వస్తోన్న ‘మా అబ్బాయి’ సినిమా చూసి తెలుసుకోమంటున్నారు దర్శకుడు కుమార్ వట్టి. శ్రీవిష్ణు, చిత్ర శుక్ల జంటగా ఆయన దర్శకత్వంలో బలగ ప్రకాశ్రావు నిర్మించిన ‘మా అబ్బాయి’ ఈ నెల 17న రిలీజవుతోంది. ‘‘లవ్, యాక్షన్, రొమాన్స్, కామెడీ.. ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఉన్న చిత్రమిది. ఇటీవల విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. ఫ్యామిలీ అంతా కలసి చూసేలా తీశాం’’ అన్నారు బలగ ప్రకాశ్రావు. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వండాన రామకృష్ణ, సమర్పణ: బేబి సాక్షి. -
ఒక్క హిట్.. ఫుల్ కిక్ ఇచ్చింది
ప్రేమ ఇష్క్ కాదల్, ప్రతినిథి, సన్నాఫ్ సత్యమూర్తి, జయమ్ము నిశ్చయమ్మురా లాంటి చిత్రాల్లో కీలకపాత్రల్లో నటించిన యువ నటుడు శ్రీ విష్ణు. మంచి పాత్రలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు, అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో ఒక్కసారిగా స్టార్గా మారిపోయాడు. ఈ సినిమాలో నారా రోహిత్ కూడా మరో కీలక పాత్రలో నటించినప్పటికీ.., శ్రీ విష్ణు చుట్టే కథ నడవటంతో పాటు విష్ణు ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయటంతో సక్సెస్తో పాటు వరుస అవకాశలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఇప్పటికే మా అబ్బాయి సినిమాను పూర్తి చేసిన శ్రీ విష్ణు.. మరో ఇంట్రస్టింగ్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. పెళ్లి చూపులు లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని అందించిన రాజ్ కందుకూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న మెంటల్ మదిలో షూటింగ్లో పాల్గొంటున్నాడు. వీటితో పాటు నీది నాది ఒకే కథ అనే సినిమాను త్వరలో ప్రారంభించనున్నాడు. కథా బలం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న శ్రీ విష్ణు, మరిన్ని విజయాలతో దూసుకుపోయేందుకు ప్లాన్ చేస్తున్నాడు. -
ధైర్యంగా సినిమా తీసినందుకు అభినందనలు – రోజా
‘‘ఓ మంచి కథను నమ్మి, ధైర్యంగా సినిమా తీసిన ప్రకాశ్రావుగారికి అభినందనలు. డైరెక్టర్ టేకింగ్ గొప్పగా ఉంది. శ్రీ విష్ణు చక్కగా నటించడంతో పాటు డ్యాన్సులు బాగా చేశాడు. ఈ సినిమా విజయవంతమై, ఇదే యూనిట్ మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నా’’ అని రోజా అన్నారు. శ్రీ విష్ణు, చిత్రా శుక్లా జంటగా కుమార్ వట్టి దర్శకత్వంలో బేబి సాక్షి సమర్పణలో బలగం ప్రకాశ్రావు నిర్మిస్తోన్న చిత్రం ‘మా అబ్బాయి’. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ సినిమా పాటల సీడీలను హీరోలు నారా రోహిత్, నాగశౌర్య విడుదల చేశారు. రోజా, నిర్మాత మల్కాపురం శివకుమార్, దర్శకుడు విరించి వర్మ ట్రైలర్ రిలీజ్ చేశారు. ‘‘శ్రీకాకుళంలో పుట్టిన నేను ఈ రోజు సినిమా నిర్మించడం ద్వారా ఏదో సాధించానని అనుకుంటున్నా. దర్శకుడు కథ చెప్పగానే సినిమా చేయగలుగుతాడా? అనిపించింది. కానీ, వట్టి కుమార్ కాదు.. తాను గట్టి కుమార్ అని నిరూపించుకున్నాడు’’ అని నిర్మాత అన్నారు. ‘‘మార్తాండ్ కె.వెంకటేశ్గారి వద్ద ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నప్పుడు సినిమా ఎలా తీయాలో నేర్చుకున్నా. ‘మా అబ్బాయి’ పాత్రకు వేరే ఎవరూ సరిపోరనేలా శ్రీవిష్ణు నటించాడు’’ అన్నారు దర్శకుడు. శ్రీవిష్ణు, మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నిర్మాత సాయి కొర్రపాటి, ఐజీ ఎ.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
మనవి ఆలకించరాదటె!
శ్రీవిష్ణుకు పిచ్చి పట్టిందంటున్నారు అతడి స్నేహితులు. పక్కనున్న వాళ్లను పట్టించుకోకుండా ఎప్పుడూ ప్రేయసి ఊహల్లో విహరిస్తుండడంతో ‘అతడిది లవ్ మెంటల్’ అని డిసైడ్ చేశారట! ‘‘సిగ్గుతో మనసులో ఫీలింగ్స్ చెప్పలేకపోవడం, ప్రేమలో ఓ పనికి బదులు మరో పని చేయడం ‘మెంటల్’ అయితే.. నాది మెంటలే’’ అంటున్నారు శ్రీవిష్ణు. రియల్ లైఫ్లో కాదు... రీల్ లైఫ్ సంగతిది. శ్రీవిష్ణు, నివేథా పెతురాజ్ జంటగా ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై రాజ్ కందుకూరి నిర్మిస్తున్న సినిమా ‘మెంటల్ మదిలో’. మనవి ఆలకించరాదటె.. అనేది ఉపశీర్షిక. వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ను ప్రేమికుల రోజున విడుదల చేశారు. ఇందులో షై, ఇంట్రా వర్ట్, కన్ఫ్యూజ్డ్ కుర్రాడిగా శ్రీవిష్ణు నటిస్తున్నారు. ‘పెళ్లి చూపులు’ తర్వాత రాజ్ కందుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి కూర్పు: విప్లవ్, కెమేరా: వేదా రామన్, సంగీతం: ప్రశాంత్ విహారి. -
ఒక్క సినిమా.. మూడు కథలు
‘అప్పట్లో ఒకడుండే వాడు’ సినిమాతో ప్రేక్షకు ల దృష్టిని ఆకర్షించిన యువ హీరో శ్రీవిష్ణు తాజాగా ఓ మల్టీస్టారర్లో నటించనున్నారు. ఇంద్ర సేనని దర్శకునిగా పరిచయం చేస్తూ ఏంవీకే రెడ్డి సమర్పణలో అప్పారావు బెల్లాన నిర్మించనున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణుతో పాటు ఓ స్టార్ హీరో, హీరోయిన్ నటించనున్నారు. ఫిబ్రవరిలో సెట్స్పైకి వెళ్లనున్న ఈ సినిమా గురించి ఇంద్రసేన మాట్లాడుతూ – ‘‘ఇందులో సమాంతరంగా సాగే మూడు కథలు ఉంటాయి. ఆయా కథల్లో ఉండే మూడు మిస్టరీ లను పరిష్కరిస్తూ సాగే థ్రిల్లర్ మూవీ. కథలు, కథనాలు హాలీవుడ్ సై్టల్లో ఉంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్, సంగీతం: సతీశ్ రఘునాధన్. -
ఆ సినిమా కోసం తగ్గుతున్నా!
‘‘నారా రోహిత్ బాగా చేశాడనే ప్రశంసల కన్నా సినిమా బాగుందంటే చాలు. ఎక్కువ సంతోషపడతా. కథ నచ్చితే నా పాత్ర నిడివి గురించి ఆలోచించను’’ అన్నారు నారా రోహిత్. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో నారా రోహిత్, శ్రీవిష్ణు హీరోలుగా ప్రశాంతి, కృష్ణవిజయ్ నిర్మించిన సినిమా ‘అప్పట్లో ఒకడుండేవాడు’. గత ఏడాది డిసెంబర్ 31న విడుదలైన ఈ సినిమా గురించి రోహిత్ చెప్పిన సంగతులు... ► మూడేళ్లు ఈ కథపై వర్క్ చేశాం. ఈ సినిమాలోని ఇంతి యాజ్ అలీ తరహా పాత్ర మళ్లీ రావడం కష్టమే. అందుకే లెంగ్త్ తక్కువైనా ఆ పాత్ర చేశా. నాకు హీరోయిన్ పెట్టాలా? వద్దా? అని ఆలోచించి 3 నెలలు షూటింగ్ పక్కన పెట్టాం. కథ ప్రకారం హీరోయిన్ లేకపోతేనే బాగుంది. అలాగే, మొదటి నుంచి రైల్వేరాజుగా శ్రీవిష్ణు సెట్ అవుతాడనుకున్నా. మా క్యారెక్టర్లకి మంచి పేరుతో పాటు సినిమా హిట్ కావడం హ్యాపీ. ఈ సినిమాతో నిర్మాతగా మారడంతో ఈ హిట్ మరింత హ్యాపీనిచ్చింది. ► గత ఏడాది నా తప్పులేంటో నేను తెలుసుకున్నా. ముఖ్యంగా ఓ సినిమా రిలీజైన తర్వాతే తదుపరి సినిమా లుక్, టైటిల్ ప్రకటించాలని నిర్ణయించుకున్నా. ఒకేసారి ఎక్కువ సినిమాలు ప్రకటించి లుక్స్ రిలీజ్ చేయడం వల్ల కన్ఫ్యూజన్ పెరుగుతోంది. మళ్లీ అటువంటి తప్పు చేయను. ప్రస్తుతం చేస్తున్న ‘కథలో రాజకుమారి’ చిత్రీకరణ 80 శాతం పూర్తయింది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తా. ► ఫిబ్రవరిలో పవన్ మల్లాలని దర్శకునిగా పరిచయం చేస్తూ నటించబోయే కమర్షియల్ సినిమా ప్రారంభమవుతుంది. ఆ సినిమా కోసం సన్నబడాలని జిమ్లో వర్కౌట్స్ చేస్తున్నా. శ్రీవిష్ణు హీరోగా ‘నీదీ నాదీ ఒకే కథ’ అనే సినిమా నిర్మిస్తున్నా. -
చిన్న తెలుగు సినిమాకు పెద్ద వసూళ్లు!
మీడియం బడ్జెట్తో చిన్న సినిమాగా తెరకెక్కిన 'అప్పట్లో ఒకడుండేవాడు'.. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో నారా రోహిత్, శ్రీ విష్ణు ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. పాసిటివ్ మౌత్టాక్ రావడం, మంచి రివ్యూలు వెలువడటంతో పరిమితమైన థియేటర్లలో విడుదలైనా ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాకు రూ. 20 కోట్లకుపైగా వసూళ్లు వచ్చే అవకాశముందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉన్నప్పటికీ వచ్చేవారం ఖైదీ 150, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి బిగ్ సినిమాలు వస్తుండటంతో కలెక్షన్లు తగ్గవచ్చునని భావిస్తున్నారు. అయ్యారే సినిమాతో దర్శకుడిగా మారిన సాగర్ కె చంద్ర తన రెండో సినిమా 'అప్పట్లో ఒకడుండేవాడు' మంచి ఆదరణ పొందుతోంది. పీరియాడిక్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాలో నారా రోహిత్, శ్రీ విష్ణు నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. -
'అప్పట్లో ఒకడుండేవాడు' మూవీ రివ్యూ
టైటిల్ : అప్పట్లో ఒకడుండేవాడు జానర్ : పీరియాడిక్ యాక్షన్ డ్రామా తారాగణం : నారా రోహిత్, శ్రీ విష్ణు, తాన్య హోపే, బ్రహ్మజీ, ప్రభాస్ శ్రీను, సంగీతం : సాయి కార్తీక్ దర్శకత్వం : సాగర్ కె చంద్ర నిర్మాత : ప్రశాంతి, కృష్ణ విజయ్ కథల ఎంపికలో ఎప్పటికప్పుడు కొత్తదనం చూపించే యంగ్ హీరో నారా రోహిత్, తానే సమర్పకుడిగా తెరకెక్కించిన సినిమా అప్పట్లో ఒకడుండేవాడు. ఈ సినిమా తనకు రీలాంచ్ లాంటిదంటూ ప్రకటించిన రోహిత్ సినిమా సక్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. తన గత చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించిన శ్రీవిష్ణు మరో హీరోగా నటించిన అప్పట్లో ఒకడుండేవాడు నారా రోహిత్ నమ్మకాన్ని నిలబెట్టిందా..? కథ : 1990లలో జరిగే కథ అప్పట్లో ఒకడుండేవాడు. రైల్వే రాజు (శ్రీ విష్ణు)... అమ్మ, ఫ్రెండ్స్, క్రికెట్ తప్ప మరో విషయం తెలియని కుర్రాడు. ఎప్పటికైన రంజీ జట్టులో స్థానం సంపాదించి స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలని కలలు కంటుంటాడు. అదే కాలనీలో ఉండే నిత్యా (తాన్యా హోపె)తో ప్రేమలో ఉంటాడు. ఇంతియాజ్ అలీ (నారా రోహిత్) సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. తను నమ్మిన ధర్మాన్ని గెలిపించడానికి అధర్మం చేయడానికి కూడా వెనుకాడని ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్. రైల్వే రాజు అక్క, అహల్య కాలేజీ రోజుల్లో సవ్యసాఛి అనే నక్సలైట్ను ప్రేమించి దళంలోకి వెళ్లిపోతుంది. దళంలో యాక్టివ్గా పనిచేసే అహల్య వివరాలు తెలుసుకున్న పోలీస్ ఆఫీసర్ ఇంతియాజ్ అలీ, రైల్వే రాజును పిలిపించి ఇంటరాగేట్ చేస్తాడు. తన అక్క ఎప్పుడో వెళ్లిపోయిందని ఆమెతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వినకుండా.. రాజుకు రంజీ టీంలో క్రికెట్ ఆడే అవకాశం దక్కకుండా చేస్తాడు. అదే సమయంలో తను ప్రేమించిన నిత్యాను ఎత్తుకెళ్లిన భగవాన్ దాస్ అనే రౌడీతో గొడవపడిన రాజు ఆ రౌడీని చంపి, అరెస్ట్ అవుతాడు. దీంతో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న రాజు జీవితంలో ఒక్కసారిగా కల్లోలం మొదలవుతుంది. దళంలో పనిచేసే అక్క చనిపోతుంది. ఆ విషయం తెలిసి రాజు తల్లి కూడా చనిపోతుంది. ఇలా తనకు ఇష్టమైనవన్ని ఒక్కొక్కటిగా దూరమవుతుండటంతో వీటన్నింటికీ కారణమైన ఇంతియాజ్ అలీ మీద కోపం పెంచుకుంటాడు రాజు. అదే సమయంలో ఓ ఇండస్ట్రియలిస్ట్ తన అవసరాల కోసం రాజుకు బెయిల్ ఇప్పించి బయటకు తీసుకువస్తాడు. తన ఆస్తులకు రాజును బినామీగా మారుస్తాడు. ఆ ఇండస్ట్రీయిలిస్ట్ అండతో రాజు ఎన్నో చీకటి వ్యాపారాలు, దందాలు మొదలుపెడతాడు. ప్రేమించిన నిత్యాను పెళ్లి చేసుకుంటాడు. తన జీవితం కష్టాలపాలవ్వడానికి కారణమైన ఇంతియాజ్ అలీని సస్పెండ్ చేయించి, ఇక జీవితంలో నీ ఒంటి మీదకు పోలీస్ డ్రెస్ రానివ్వనని ఛాలెంజ్ చేస్తాడు. ఒక్కొక్కటిగా రాజు ఆగడాలు ఎక్కువవుతాయి. తనకు అడ్డొచ్చిన వారిని చంపటం బెదిరించటంతో పాటు రియల్ ఎస్టేట్, హవాలా లాంటి వ్యాపారాలతో చాలా డబ్బు సంపాదిస్తాడు. అంతే కాదు దేశాన్నే కుదిపేసే స్టాంప్ పేపర్ల స్కాంలోనూ భాగస్వామి అవుతాడు. దీంతో రాజు ఆటకట్టించడానికి ఇంతియాజ్ అలీనే కరెక్ట్ అని భావించిన పోలీస్ డిపార్టెమెంట్, రాజును వేటాడటానికి ఇంతియాజ్కు పోస్టింగ్ ఇస్తుంది. తిరిగి డ్యూటిలో జాయిన్ అయిన ఇంతియాజ్, రాజు అనుచరలను, వ్యాపారాలను, అన్నింటిని నాశనం చేస్తాడు. ఈ యుద్ధంలో ఎవరిదిపై చేయి అయ్యింది. తప్పుడుదారిలో వెళ్లిన రాజు చివరకు ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : మొదట నుంచి ఇది నారా రోహిత్ సినిమాగా ప్రచారం జరిగినా.. కథ అంతా శ్రీవిష్ణు పాత్ర చుట్టూనే తిరుగుతుంది. రోహిత్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మరోసారి ఆకట్టుకున్నాడు. రోహిత్ లుక్, బేస్ వాయిస్ సినిమాకు ప్లస్ అయ్యింది. ఇక శ్రీ విష్ణు తన నటనతో సినిమా స్థాయిని పెంచాడు. లక్ష్యం కోసం ప్రయత్నించే అమాయకుడైన కుర్రాడిగా, సమాజం మీద ఎదురుతిరిగే యువకుడిగా అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్లో శ్రీ విష్ణు నటనకు మంచి మార్కులు పడ్డాయి. హీరోయిన్గా నటించిన తాన్యా ఉన్నంతలో పర్వాలేదనిపించింది. ఇతర పాత్రలో బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీనులు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : ఈ సినిమాతో నిర్మాతగానూ మారిన హీరో నారా రోహిత్ తన మార్క్ కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయ్యారే సినిమాతో దర్శకుడిగా మారిన సాగర్ కె చంద్ర, అప్పట్లో ఒకడుండేవాడుతో ఆకట్టుకున్నాడు. పీరియాడిక్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 1990లలో ఉన్న రాజకీయ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా కథా రెడీ చేసుకున్న దర్శకుడు, ఆకట్టుకునే కథనంతో సినిమాను నడిపించాడు. పెద్దగా పాటలు అవసరం లేని కథలో సాయి కార్తీక్ అందించిన పాటలు స్పీడు బ్రేకర్లలా అనిపించాయి. సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం సీన్స్ ను మరింతగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : నారా రోహిత్, శ్రీ విష్ణు నటన నేపథ్య సంగీతం కథా కథనం మైనస్ పాయింట్స్ : పాటలు తొలి 15 నిమిషాలు స్లో నారేషన్ ఓవరాల్గా అప్పట్లో ఒకడుండేవాడు.. 2016కు వీడ్కోలు చెప్పే సక్సెస్ఫుల్ యాక్షన్ డ్రామా - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
డైరెక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా
‘డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా’ అని సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది అంటుంటారు. అయితే శ్రీవిష్ణు దీన్నే మరోలా అంటున్నారు. ‘డైరెక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా’ నని! నారా రోహిత్, శ్రీ విష్ణు, తాన్యా హోప్ ముఖ్య తారలుగా సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఆరన్ మీడియా వర్క్స్ పతాకంపై ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మించిన చిత్రం ‘అప్పట్లో ఒకడుండేవాడు’. ఈ సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది. శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చి పదకొండేళ్లవుతోంది. నాకున్న మొహమాటానికి యాక్టర్ అవుతానని ఊహించలేదు. కానీ, అయ్యాను. 1990లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. దేశాన్నే వణికించిన ఐదారు అంశాలు ఇందులో ఉంటాయి. ఒక క్రికెటర్, ఓ పోలీసాఫీసర్ మధ్య జరిగిన కథే ఈ చిత్రం. ఇందులో క్రికెటర్ రైల్వే రాజు పాత్రలో నటించాను. ఉద్యోగం కోసం ఏదైనా చేయడానికి వెనకాడని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రను నారా రోహిత్ చేసారు. ఈ సినిమా నటుడిగా నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం ‘నీది నాది ఒకే ప్రేమకథ’ అనే చిత్రంలో సోలో హీరోగా చేస్తున్నా. అలాగే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేయనున్న ‘మెంటల్ మదిలో’ చిత్రం జనవరిలో ప్రారంభమవుతుంది’’ అన్నారు. -
‘అప్పట్లో ఒకడుండేవాడు’ మూవీ స్టిల్స్
-
పోటాపోటీగా...
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు నారా రోహిత్. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘అప్పట్లో ఒకడుండేవాడు’. శ్రీవిష్ణు, తాన్యా హోప్ ముఖ్య పాత్రల్లో సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఆరన్ మీడియా వర్క్స్ పతాకంపై ప్రశాంతి, కృష్ణ విజయ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని, ఈనెల 30న విడుదలవుతోంది. నిర్మాత మాట్లాడుతూ– ‘‘తెలుగు చిత్రసీమలో ఇప్పటి వరకూ రాని వైవిధ్యభరితమైన కథా చిత్రమిది. ‘ప్రతినిధి’ చిత్రం తర్వాత రోహిత్, శ్రీవిష్ణు కలిసి నటించారు. ఒకరు పోలీసాఫీసర్గా, మరొకరు క్రికెటర్గా కనిపిస్తారు. ఇద్దరి పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. నారా రోహిత్ సహకారంతోనే ఈ చిత్రాన్ని అనుకున్న టైమ్కి పూర్తి చేశాం. సాయికార్తీక్ పాటలకు మంచి స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా చిత్రం నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నవీన్ యాదవ్, సమర్పణ: నారా రోహిత్. -
సెన్సార్ పూర్తి చేసుకున్న `అప్పట్లో ఒకడుండేవాడు`
బాణంతో హీరోగా తెరంగేట్రం చేసిన నారా రోహిత్ తరువాత డిఫరెంట్ సబ్జెక్ట్స్తో అలరిస్తున్నాడు. ప్రతినిధి, సోలో, రౌడీఫెలో, జ్యో అచ్యుతానంద లాంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా నారా రోహిత్ నటించిన మరో విలక్షణ చిత్రం `అప్పట్లో ఒకడుండేవాడు`. నారా రోహిత్, శ్రీ విష్ణు, తాన్యా హోప్ హీరో హీరోయిన్లుగా నారారోహిత్ సమర్పణలో ఆరన్ మీడియా వర్క్స్ బ్యానర్పై సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నారా రోహిత్ ముస్లిం పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరో శ్రీ విష్ణు క్రికెటర్గా కనిపించనున్నాడు. ఒకే సమయంలో 90వ దశకం కథతో పాటు ప్రస్తుత కథ కూడా నడిచేలా డిఫరెంట్ స్క్రీన్ప్లేతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. యు/ఎ సర్టిఫికేట్తో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 30న రిలీజ్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. -
క్యాంపస్ సెలక్షన్స్లో శ్రీవిష్ణు విద్యార్థులు 502 మంది ఎంపిక
భీమవరం: భీమవరం శ్రీవిష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో నాల్గవ సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు వివిధ బహుళ జాతీయ సంస్థలు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్యూల్లో 502 మందికిపైగా ఎంపిక కావడంతో కళాశాలలో శనివారం విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. గత మూణెళ్లుగా రాత, ఆన్లైన్ పరీక్షలు, గ్రూప్ డిస్కషన్స్, సాంకేతిక, మానసిక పరీక్షల అనంతరం అర్హులైన విద్యార్థులను ఎంపిక చేశారు. వీరిలో ఐబిఎం సంస్థకు 179 మంది, క్యాప్ జెమినీ 167, ఇన్ఫోసిస్ 54, టెక్ మహీంద్రా 82, జాన్డీర్ 7, కోని ల్యాబ్స్ 6, టాలెంట్ స్ప్రింట్ 3, థర్మాక్స్ 2, ఎన్టిటి డేటా ఇరువురు ఉగ్యోగాలకు ఎంపికయ్యారు. దీంతో కళాశాల యాజమాన్యం, విద్యార్థులు, అధ్యాపకులు క్యాంపస్ ఇంటర్యూల శిక్షణా బందంతో కలిసి భారీ కేక్ కట్ చేసి విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవిష్ణు ఎడ్యుకేషనల్ సొసైటి చైర్మన్ కెవి విష్ణురాజు మాట్లాడుతూ క్యాంపస్ సెలక్షన్స్లో ఎంపికైన వారిలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు కావడం అభినందనీయమని విద్య పట్ల గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయ కుటుంబాలకు అమితాసక్తి కనబరుస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్లో ఎంపిక కావడం పట్ల తమ మనోభావాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సొసైటి వైస్ చైర్మన్ ఆర్.రవిచంద్రన్, ప్రిన్సిపాల్ డాక్టర్ జి.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు, ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ జి.సుబ్బరాజు పాల్గొన్నారు. -
ఒక్కడే ఉండేవాడట!
నారా రోహిత్, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘అప్పట్లో ఒకడుండేవాడు’. తానియా హోప్ కథానాయికగా నటిస్తున్నారు. రోహిత్ సమర్పణలో ఆరన్ మీడియా వర్క్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘అయ్యారే’ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాయి కార్తీక్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను త్వరలో విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రశాంతి, కృష్ణ విజయ్ తెలిపారు. ‘‘ఇది మంచి మాస్ ఎంటర్టైనర్. ఇందులో నారా రోహిత్ కొత్తగా కనిపిస్తారు. ఆయన పాత్ర కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కూర్పు: కోటగిరి వెంక టేశ్వరరావు, కెమేరా: నవీన్ యాదవ్. -
యూత్ఫుల్ ఎంటర్టైనర్!
యువతరానికి నచ్చే కథాంశంతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ విష్ణు, చిత్రా శుక్లా జంటగా నూతన దర్శకుడు కుమార్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని బలగ ప్రకాశ్రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘నేటి యువతను ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. స్క్రీన్ప్లే ప్రధానంగా సాగే ఈ చిత్రం అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కథలోని ట్విస్ట్లు ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగిస్తాయి’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సురేశ్ యువన్, కెమెరా: తమశ్యామ్, పాటలు: శ్రీమణి. -
అప్పటి కుర్రాడి కథ..!
1992 నుంచి 1996 వరకు ఆ నాలుగేళ్లలో ఇద్దరు యువకుల జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం ‘అప్పట్లో ఒకడుండేవాడు’. నారా రోహిత్, ‘ప్రేమ.. ఇష్క్..కాదల్ ’ ఫేం శ్రీ విష్ణు కథానాయకులుగా వశిష్ట మూవీస్ పతాకంపై హరి, సన్నీరాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘అయ్యారే’ ఫేం సాగర్ కె.చంద్ర దర్శకుడు. ‘‘యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించనున్నాం. ఈ భారీ యాక్షన్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ను జూన్ మొదటి వారంలో మొదలుపెడతాం’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. -
శ్రీవిష్ణు హీరోగా...
‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందనుంది. సినిమా ప్రమోషన్ రంగంలో పేరు తెచ్చుకున్న ఆర్.కె. మీడియా అధినేత రవికుమార్ పనస, హాంకాంగ్కు చెందిన హౌస్ఫుల్ మూవీస్ ఇండియా ప్రై. లిమిటెడ్తో కలిసి ఈ సినిమా నిర్మించనున్నారు. దర్శకుడు మదన్ దగ్గర దర్శకత్వశాఖలో పనిచేసిన వేణు ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఓ ప్రముఖ కథానాయిక నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: సురేష్ యువన్, కెమెరా: విజయ్ సి. కుమార్. -
శేఖర్ కమ్ముల సూచనతో హీరోనయ్యా : శ్రీవిష్ణు
దర్శకుడు శేఖర్ కమ్ముల సూచనతోనే తాను హీరోనయ్యానని వర్ధమాన నటుడు శ్రీవిష్ణు తెలిపారు. ప్రేమ ఇష్క్ కాదల్లో ముగ్గురు హీరోల్లో ఒకరిగా, సెకండ్ హ్యాండ్ సినిమాలో ఇద్దరు హీరోల్లో ఒకరిగా ఆయన నటించాడు. అల్లవరం మండలం గోడిపాలెంలోని తన స్వగృహ ంలో శని, ఆదివారాల్లో కుటుంబ సభ్యులతో సరదగా గడిపారు. అమలాపురం పళ్ల వెంకట్రావు వీధిలోని వారి వసతి గృహంలో ఆదివారం ఉదయం తన తండ్రి కృష్ణంరాజుతో కలసి శ్రీవిష్ణు ‘న్యూస్లైన్’తో ముచ్చటించారు. లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ చిత్రంలో శేఖర్ కమ్ముల తనకో అవకాశం ఇచ్చారన్నారు. ‘ నువ్వు ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కాకుండా హీరోగా నటిస్టే బాగుంటావు.. ట్రైచేయి’ అని శేఖర్ కమ్ముల తనను ప్రోత్సహించారని, ఆయన సూచనతోనే తాను హీరోనయ్యానని శ్రీవిష్ణు ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా నారా రోహిత్ హీరోగా నటిస్తున్న ప్రతినిధి చిత్రంలో మరో హీరోగా తాను నటిస్తున్నట్టు తెలిపారు. అమలాపురం పరంజ్యోతి స్కూల్లో ఎనిమిదో తరగతి వరకు, భీమవరం విశ్వకవి స్కూల్లో పదో తరగతి వరకు చదివానన్నారు. విజయవాడ నలందలో ఇంటర్మీడియెట్, వైజాగ్ గీత మ్లో బీబీఎం చదివినట్టు తెలిపారు. అమలాపురంలో మా మావయ్యకు సినిమా థియేటర్ ఉండేదని, అక్కడకు వచ్చిన నటులను చూసి తనకు కూడా నటపై ఆసక్తి కలిగిందని ఆయన వివరించారు. కొత్తగా ‘మ్యారియో’ అనే చిత్రంలో పూర్తిస్థాయి హీరోగా నటిస్తున్నానని, ఇటీవలే షూటింగ్ ప్రారంభమైందన్నారు. పవన్ కల్యాణ్, ప్రభాస్ల నట ప్రేరణతో తాను నటుడిగా ఎదగాలనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. కోనసీమ నేటివిటీతో తాను హీరోగా ఓ ప్రేమకథా చిత్రం చిత్రీకరించాలన్న కోరిక ఉందని, ప్రయత్నాలు చేస్తున్నట్టు శ్రీవిష్ణు వివరించారు.