
బాహుబలి-2 ట్రైలర్ పీక్ సీన్ వచ్చేసింది
చెన్నై: బాహుబలి-2 సునామీ షురూ అయింది. ఫస్ట్లుక్, మోషన్ పిక్చర్స్, విజువల్ ఎఫెక్ట్స్ విశేషాలతో ఇప్పటికే బాహుబలిని మించిన స్థాయిలో బాహుబలి-2కి ప్రచారం ప్రారంభించిన చిత్ర యూనిట్ తాజాగా మరోసారి ప్రేక్షకుల ఆసక్తిని పీక్ స్టేజ్కు తీసుకెళ్లింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ గురువారం విడుదల కానుండగా అప్పటి వరకు వెయిట్ చేయడం తమ వల్లకాదు అని ప్రేక్షకుడు అనుకునేంత రేంజ్లో ట్రైలర్లోని ప్రభాస్పై ఉన్న చిన్న నిడివి సీన్ను విడుదల చేసింది.
ఈ ట్రైలర్లో తాజాగా విడుదల చేసిన ఈ బిట్ సీన్ ఉత్తాన దశదని చెప్పుకోవచ్చంట. నిజానికి అది ఉండటం కూడా అలాగే ఉంది. తల నుంచి రక్తం కారుతుండగా రౌద్ర రూపంతో ఉన్న ప్రభాస్ కళ్లు ఎర్రజేసి శత్రువువైపుగా చూస్తున్నట్లుగా ఉన్న ఆ వీడియో చూస్తుంటే నిజంగానే ట్రైలర్కోసం ఏ మాత్రం వెయిట్ చేయబోమని అనుకునే అవకాశం లేకపోలేదు. బాహుబలి-2 ట్రైలర్ అధికారికంగా ఈ గురువారం (మార్చి-16)న విడుదలవుతున్న విషయం తెలిసిందే.