Trailer
-
గబ్బిలాల శబ్దం వెనుక ఉన్న మర్మమేంటి?.. భయపెట్టిస్తోన్న తెలుగు ట్రైలర్
ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) ,లక్ష్మీ మీనన్(Lakshmi Menon )జంటగా నటిస్తోన్న చిత్రం శబ్దం (Shabdham). ఈ మూవీకి అరివళగన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను 7జీ ఫిల్స్మ్స్ బ్యానర్పై శివ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీ సైకలాజికల్ ఇన్స్టిగేటివ్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. గబ్బిలాల శబ్ధంతో బాధపడతున్న ఓ మహిళ చుట్టే ఈ కథను రూపొందించినట్లు అర్థమవుతోంది. ట్రైలర్లో దృశ్యాలు చూస్తుంటే మరోవైపు హారర్ థ్రిల్లర్ను తలపిస్తోంది. గబ్బిలాలు, దెయ్యం లాంటి సన్నివేశాలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నఈ చిత్రంలో సిమ్రాన్, లైలా, రెడిన్ కింగ్స్లీ, ఎంఎస్ బాస్కర్, రాజీవ్ మీనన్, వివేక్ ప్రసన్న కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు.The thrill has a new face! 🎬🔥#Sabdham trailer is out now!🎧Link: https://t.co/FsVROFuRUnGet ready for a #SoundThriller ❤️🔥From the makers of #Vaishali #SabdhamTrailer #SabdhamFromFeb28Starring @AadhiOfficialAn @dirarivazhagan FilmA @MusicThaman Musical pic.twitter.com/FTt0HZ814g— Aadhi🎭 (@AadhiOfficial) February 19, 2025 -
జ్యోతిక ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్.. ఏ ఓటీటీలో చూడాలంటే?
షబానా అజ్మీ, గజరాజ్, జ్యోతిక, నిమేషా సజయన్, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో వస్తోన్న వెబ్ సిరీస్ 'డబ్బా కార్టెల్' (Dabba Cartel Web Series). ఈ సిరీస్ను హితేష్ భాటియా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ట్రైలర్ను విడుదల చేశారు.ఈ వెబ్ సిరీస్ను క్రైమ్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముంబయిలో డబ్బావాలా బాగా ఫేమస్. ఆ కోణంలోనే ఈ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఫుడ్ డబ్బాల్లో లంచ్తో పాటు డ్రగ్స్ కూడా సరఫరా చేసే ఐదుగురు గృహిణుల చుట్టూ తిరిగే స్టోరీగా డబ్బా కార్టెల్ రూపొందించారు. ఈ సిరీస్లో అంజలి ప్రసాద్, సాయి తమంకర్ కీలకపాత్రలు పోషించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ వేదికగా ఫిబ్రవరి 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. They're cooking. And it's criminally good 👀 💸 Watch Dabba Cartel, out 28 February, only on Netflix. pic.twitter.com/ujxywmjaeW— Netflix India (@NetflixIndia) February 18, 2025 -
'తుంబాడ్' మేకర్స్ క్రేజీ సినిమా ట్రైలర్ చూశారా..?
భారతీయ సినీ ఇండస్ట్రీలో ఇదే సెన్సేషనల్ హిట్గా నిలిచిన చిత్రం 'తుంబాడ్'.. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన నిర్మాతలు క్రేజీ (Crazxy Movie) అనే మూవీని విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. గిరీశ్ కోహ్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో సోహుమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. సోహుమ్ షాతో పాటు ముకేశ్ షా, అమిత్ సురేశ్, ఆదేశ్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 28న రానుంది. తుంబాడ్ (2018) విషయానికి వస్తే.. హారర్ జానర్లో సెన్సేషన్ హిట్ అందుకున్న ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కుతోంది. -
బడ్జెట్కు వెనకాడకుండా తీసిన సినిమా.. ట్రైలర్ చూశారా?
శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్, సాహితి అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి ముఖ్య పాత్రల్ని పోషించిన చిత్రం త్రికాల (Trikala Movie). మణి తెల్లగూటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రిత్విక్ వేట్షా సమర్పణలో రాధిక, శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శనివారం నాడు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ‘యుద్ధం రేపటి వెలుగు కోసం.. కానీ ఈ అంధకాసురిడి యుద్ధం వెలుగుని నాశనం చేయడానికి’.. అంటూ తనికెళ్ల భరణి డైలాగ్స్తో ట్రైలర్ ఆరంభమవుతుంది. యాక్షన్ సీక్వెన్స్, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా అన్నీ కూడా హై స్టాండర్డ్స్లో ఉన్నాయి. ‘ఒక సైక్రియార్టిస్ట్గా ఛాలెంజింగ్ కేసుని చూస్తున్నా’ అంటూ శ్రద్దా దాస్ పాత్రను ఈ ట్రైలర్లో పరిచయం చేశారు. యాక్షన్ సీక్వెన్స్, ట్రైలర్ చివర్లో అజయ్ విశ్వరూపం, డైలాగ్స్ అదిరిపోయాయి. త్రికాల ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అజయ్ మాట్లాడుతూ.. ‘మణి గారు నాకు రెండు, మూడేళ్ల క్రితం త్రికాల కథ చెప్పారు. బడ్జెట్ ఎక్కువ అయ్యేట్టుంది ఎలా చేస్తారో అనుకున్నా. ఇంత వరకు నాకు ఏం చూపించలేదు. నేరుగా ఇక్కడే ట్రైలర్ను చూశాను. అద్భుతంగా వచ్చింది’ అని అన్నారు.మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ.. ‘త్రికాల సినిమా కోసం నిర్మాతలు చాలా కష్టపడ్డారు. ఈ మూవీ కోసం చాలా రీషూట్ జరిగింది. కానీ ఎప్పుడు కూడా వారు ప్రశ్నించలేదు. మా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. సమ్మర్లో మా సినిమా రాబోతోంది. అందరూ మా చిత్రాన్ని సపోర్ట్ చేయండి’ అని అన్నారు. దర్శకుడు మణి మాట్లాడుతూ.. ‘ఈ కథను అజయ్ గారికే ముందుగా చెప్పాను. వీఎఫ్ఎక్స్ గురించి జాగ్రత్తగా చూసుకో అని ఆయన సలహా ఇచ్చారు. త్రికాల సినిమాటిక్ యూనివర్స్ అని ట్రైలర్లో పెట్టాం. అంబటి అర్జున్ ఒక్క రోజే షూటింగ్ చేశారు. అదేంటో ఫ్యూచర్లో తెలుస్తుంది. ఈ మూవీ కోసం మేము చాలా వదులుకున్నాం. మా చిత్రాన్ని అందరూ సపోర్ట్ చేయండి’ అన్నారు. నిర్మాత రాధిక మాట్లాడుతూ.. ‘సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని, మన సూపర్ హీరోల్ని అందరికీ చూపించాలని త్రికాల సినిమా తీశాం. బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్లా మన త్రికాల ఉంటుంది. టైంతో సంబంధం లేకుండా కాపాడేవాడే త్రికాల. ఇంకా త్రికాల గురించి తెలియాలంటే సినిమా చూడాల్సిందే’ అన్నారు.నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘త్రికాల మూవీకి సీజీ వర్క్ ఎక్కువగా అవసరం పడింది. అందుకే ఈ మూవీ లేట్ అవుతూ వచ్చింది. మన పురాణాల్లోనే హనుమాన్, భీమ్ వంటి సూపర్ హీరోలున్నారు. మనం ఓ ఫిక్షనల్ హీరోని సృష్టించాలని అనుకున్నాం. అలా పుట్టిందే ఈ త్రికాల’ అన్నారు. చదవండి: జీవితంలో కొత్త అధ్యాయం షురూ.. మెహబూబ్ దిల్సే ఎమోషనల్ -
'నా కుమారుడికి పిల్లను ఇవ్వొద్దని తండ్రినే చెబుతున్నా'.. రామం రాఘవం ఎమోషనల్ ట్రైలర్
టాలీవుడ్ నటుడు ధనరాజ్ కొరనాని స్వీయ దర్శకత్వం వహిస్తోన్న తొలి చిత్రం 'రామం రాఘవం'. ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంతాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో నాని చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే తండ్రీ, కొడుకుల మధ్య జరిగే కథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ జనరేషన్లో తండ్రి, కుమారుల రిలేషన్స్ ఎలా ఉంటాయనే కోణంలోనే రామం రాఘవం చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సునీల్, సత్య, పృద్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి విమానం దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథను అందించగా అరుణ్ చిలువేరు సంగీత సమకూర్చారు. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలలో ఒకేసారి త్వరలో విడుదల కానుంది. Here’s #RamamRaghavam Telugu & Tamil Trailer, looks promising. To khani anna @thondankani and actor turned director @DhanrajOffl and the rest of the team. All the very best. Telugu ▶️ https://t.co/1tg1rzUcdLTamil ▶️ https://t.co/xyVFiSxjFi#RR In theatres on Feb 21st pic.twitter.com/2mZQdn3c5f— Nani (@NameisNani) February 14, 2025 -
ఒక రైతు బాధను కళ్లకు కట్టేలా చూపించే 'బాపు'.. ట్రైలర్ చూశారా?
బ్రహ్మాజీ, ఆమని, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం 'బాపు'. ‘ఎ ఫాదర్స్ స్టోరీ’ అనేది ట్యాగ్లైన్. ఈ సినిమాను దయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బాపు ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీర బ్యానర్లపై రాజు, సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించారు.ట్రైలర్ చూస్తే తండ్రి పడే కష్టాలను తెరపై చూపించనున్నట్లు తెలుస్తోంది. ఒక రైతు తన పిల్లల కోసం పడే తపన, బాధలను కథాంశంగా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో బలగం సుధాకర్ రెడ్డి, బ్రహ్మజీ తండ్రీ, కుమారులుగా నటించారు. గతంలో విడుదలైన టీజర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, రచ్చ రవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతమందించారు. -
బ్రహ్మ ఆనందం ట్రైలర్.. ప్రభాస్ చేతుల మీదుగా విడుదల
టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam), ఆయన కుమారుడు రాజా గౌతమ్ (Raja Goutham) నటించిన తాజా చిత్రం 'బ్రహ్మ అనందం'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వాలెంటైన్స్ డే కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించగా.. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి ప్రభాస్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మూవీ సూపర్ హిట్ అవుతుందని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆయన కుమారుడు తాత మనవళ్లుగా అభిమానులను అలరించనున్నారు. ట్రైలర్ చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రియ వడ్లమాని ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శాండిల్య సంగీతమందించారు. -
ధనుశ్ డైరెక్షన్లో లవ్ ఎంటర్టైనర్.. ట్రైలర్ చూశారా?
పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'జాబిలమ్మ నీకు అంత కోపమా'(Jaabilamma Neeku Antha Kopama Movie). ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ (Dhanush) దర్శకత్వం వహించారు. ఈ మూవీ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను వండర్బార్ ఫిల్మ్స్ బ్యానర్లో స్తూరి రాజా, విజయలక్ష్మి కస్తూరి రాజా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే ఇద్దరు ప్రేమజంటల స్టోరీనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. కథ మొత్తం రెండు ప్రేమజంటల చుట్టూ తిరిగే కథాంశంగా రూపొందించారు. ఈ చిత్రంలో వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనర్హన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్లలో సందడి చేయనుంది.It's the season to fall in love ❤️✨ #JaabilammaNeekuAnthaKopama Trailer out now:https://t.co/ZTw9vcjKUkIn cinemas on Feb 21, 2025 💞🎬 Written and directed by @dhanushkraja#JNAK @gvprakash @wunderbarfilms @theSreyas @editor_prasanna @leonbrittodp @asiansureshent pic.twitter.com/SCu6o2G0Fi— Asian Suresh Entertainment (@asiansureshent) February 10, 2025 -
విశ్వక్ సేన్ 'లైలా'.. ట్రైలర్ వచ్చేసింది
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం లైలా. ఈ మూవీ లేడీ పాత్రలో అభిమానులను అలరించనున్నాడు మన యంగ్ హీరో. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం రోజున థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్కు మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు. హైదరాబాద్లోని ఏఏఏ సినిమాస్లో లైలా ట్రైలర్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించింది. ట్రైలర్ చూస్తే అభిమానులకు ఫుల్ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఖాయంగా కనిపిస్తోంది. లేడీ గెటప్లో విశ్వక్ సేన్ నటన అద్భుతమైన ఫర్మామెన్స్తో ఆకట్టుకున్నాడు. ఈ ఫిబ్రవరి 14న రిలీజ్ కానున్న ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ఫ్యాన్స్ను అలరించనుంది. సోనూ మోడల్గా మాస్ కా దాస్ అభిమానులకు లవర్స్ డే రోజున అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారు. ఇంకేందుకు ఆలస్యం లైలా కోసం వెయిట్ చేస్తున్న మజ్నులంతా ట్రైలర్ చూసేయండి. The fun and humor will go to the next level with Laila and Sonu Model 💥💥💥The entertaining #LailaTrailer out now ❤🔥▶️ https://t.co/ytb4SlU2qV#Laila GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 14th 🌹 @RAMNroars #AkankshaSharma @sahugarapati7 @Shine_Screens @leon_james… pic.twitter.com/Pf9QSZOfnn— VishwakSen (@VishwakSenActor) February 6, 2025 -
‘తల’ కోసం రెండేళ్లు ఆలోచించా: అమ్మ రాజశేఖర్
అమ్మ ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల కొన్నాళ్లు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నాను. దీంతో అంతా అమ్మ రాజశేఖర్(Amma Rajasekhar ) పని అయిపోయిందని అన్నారు. కానీ నేను మళ్లీ వచ్చాను. ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను. వరుసగా సినిమాలు తీస్తూనే ఉంటాను. ప్రస్తుతం ‘తల’ అనే సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. త్వరలోనే చెయ్యితో, కాలితో అన్నింటితోనూ వస్తా(నవ్వుతూ). మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాను’ అన్నాడు ప్రముఖ దర్శకుడు అమ్మ రాజశేఖర్. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘తల’(thala Movie). ఈ చిత్రంలో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా నటించాడు. అంకిత నాన్సర్ హీరోన్. రోహిత్, ఎస్తేర్ నోరోన్హా, సత్యం రాజేష్, ముక్కు అవినాశ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ..నా కొడుకుతో సినిమా చేయాలనేది చిన్నప్పటి నుంచి నా కోరిక. ఓ సందర్భంలో స్టేజ్పై మా అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా చేస్తానని చెప్పాను. అప్పటి నుంచి నిద్ర లేదు. అబ్బాయికి సంబంధించిన కథ కావాలి. మంచి కథ కావాలి. నాకంత ఓపిక లేదు. రియల్ లైఫ్ లో లవ్ ప్రపోజ్ చేసి నెక్స్ట్ డే పెళ్లి చేసుకున్న కథ కాకుండా ఏం చేయాలని ఆలోచించి మాస్ తీయాలనుకున్నా, అబ్బాయితో ఎలా చేయాలని రెండేళ్లు ఆలోచించి ఒక పాయింట్, దానికి ఒక కొత్త పాయింట్ తీసుకున్నా, కొత్తదనం కావాలనుకునే వాడు సినిమా ఆనందంగా చూడవచ్చు’ అన్నారు.నటుడు సోహైల్ మాట్లాదుతూ.. తల ఎవరిదో తెలియదు కానీ ముందు మోషన్ టీజర్ పంపారు. అమ్మ రాజశేఖర్ నాకు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ నుంచి తెలుసు. తరువాత బిగ్బాస్ తో కలిశాం నిజంగానే అమ్మ రాజశేఖర్ పేరుకు తగ్గట్టే అందరికీ వండి పెట్టేవాడు. తినకున్నా అడిగి మరీ పుడ్ వండి పెట్టేవారు. తను కింద కూర్చొని భోజనం చేస్తాడు. ఇప్పటికీ అదే మెయిన్టైన్ చేస్తారు. రణం సినిమా తర్వాత ఈ మూవీ కంబ్యాక్ గా అనిపిస్తోంది. తల టీజర్ చూడగానే అమ్మ రాజశేఖర్ బ్యాక్ అనిపించింది. రాగిన్ నెక్ట్స్ ధనుష్ అవుతాడు ఇండస్ట్రీకి" అన్నారు.హీరో అశ్విన్ మాట్లాడుతూ. "తల ట్రైలర్ చూశాను. ఎక్స్ట్రార్డినరీగా ఉంది. రాగిన్ అదృష్టవంతుడు. నాన్న దర్శకుడు, అమ్మ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అక్క ఏడీ. ముగ్గురి చేతుల మీదుగా సినిమా లాంచ్ అవడం లక్కీ. విజువల్స్, కంటెంట్ తక్కువ బడ్జెట్లో అద్భుతంగా చేశారు. ఆర్ఆర్ చాల బాగుంది. అస్లాం సౌండ్ వినిపిస్తోంది. దీపా ఆర్ట్స్ హ్యాండ్ పడితే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కరికీ బిగ్ కంగ్రాట్స్, తల మూవీని ఆదరించండి" అన్నాడు.నటుడు సత్యం రాజేష్ మాట్లాడుతూ.. రాగిన్ రాజ్ నాకు చిన్నప్పటి నుంచి తెలును. అమ్మ రాజశేఖర్ ఫస్ట్ సినిమా రణం చేస్తున్నప్పుడు నుంచి వేషం ఉందని చెప్పారు. ఆ సినిమాలో వేషం ఇవ్వలేదు. అదే అడిగితే నెక్స్ట్ సినిమా అన్నారు. రెండు సినిమాల తర్వాత అవకాశం ఇచ్చారు. ఒకసారి అనుకోకుండా మేం కలిశాం. ఉదయం నుంచి సాయంత్రం వరకూ చెన్నై మొత్తం తిప్పి చూపించారు. రాగిన్ పుట్టినరోజుకి వెళ్లాను. ఆ తరువాత నాకు ఫోన్ చేసి మా అబ్బాయి హీరో అంటే నేను ముసలి అవుతున్నట్టు అనిపించింది. హీరోకి ఉండాల్సిన లక్షణాన్నీ ఉన్నాయి. తల వైలెంట్ వాలెంటైన్స్ డే నాడు విడుదలవుతుంది. అందరూ చూడండి' అన్నాడు.హీరో అమ్మ రాగిణ్ రాజ్ మాట్లాడుతూ... మూవీలో అంతా చాలా కష్టపడ్డారు. వారందరికి ధన్యవాదాలు చెబుతున్నాను. క్లైమేట్ చేంజెస్ కారణంగా బాగా ఇబ్బంది పడ్డాం. మా అమ్మ, నాన్న ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సహాయం చేశారు. శ్రీనివాస్ గౌడ్ గారు ఈ సినిమాను నిర్మించినంచుకు ధన్యవాదాలు. మీ డబ్బులకు ఈ మూవీ న్యాయం చేస్తుంది. ఫిబ్రవరి 14న తప్పక చూడండి వైలెంట్ వాలెంటైన్స్ థాంక్యూ" అన్నారు. -
ట్రైలర్కి వేళాయె
నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’ ట్రైలర్ విడుదలకు వేళయింది. ఈ నెల 28న ఈ మూవీ ట్రైలర్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, నాగచైనత్య కొత్త లుక్ని విడుదల చేశారు మేకర్స్. ‘లవ్ స్టోరీ’ (2021) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జోడీగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది.‘‘వాస్తవ ఘటనల స్ఫూర్తితో రూపొందిన చిత్రం ‘తండేల్’. లవ్ ఎలిమెంట్స్తోపాటు మంచి యాక్షన్ కూడా ఉంటుంది. తండేల్ రాజుపాత్రలో నాగచైతన్య అద్భుతమైన నటన చూస్తారు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘బుజ్జి తల్లి, శివ శక్తి, హైలెస్సో హైలెస్సా...’పాటలు మ్యూజిక్ చార్టులలో అగ్రస్థానంలో, యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: శ్యామ్దత్.. -
అజిత్ కుమార్ 'విదాముయార్చి'.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) నటించిన తాజా చిత్రం విదాముయార్చి(Vidaamuyarchi Movie). ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. అర్జున్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్తో నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా.. ఈ చిత్రానికి తెలుగులో పట్టుదల అనే టైటిల్ ఖరారు చేశారు. ట్రైలర్ చూస్తే ఈ సినిమా అంతా అజర్ బైజాన్లోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో కార్లతో అజిత్ స్టంట్స్ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా అర్జున్ సర్జాతో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ చూస్తుంటే మాఫియా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ముందుగా అనుకున్న ప్రకారం ఈ సంక్రాంతికే విదాముయార్చి విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.కారు రేస్ గెలిచిన అజిత్..ఇటీవల దుబాయ్లో జరిగిన 24హెచ్ కారు రేసులో అజిత్ టీమ్ మూడోస్థానంలో నిలిచింది. అజిత్ దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత అజిత్ తిరిగి రేసింగ్కు వచ్చాడు. దీంతో అజిత్ టీమ్పై సినీ తారలు ప్రశంసలు కురిపించారు. రేస్ గెలిచిన అనంతరం అజిత్ జాతీయజెండా పట్టుకుని సంతోషం వ్యక్తం చేశారు.అజిత్ కుమార్కు ప్రమాదం..రేసు ప్రారంభానికి ముందే తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్కు(Ajith Kumar) పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. దుబాయ్లో జరుగుతున్న రేసింగ్లో ఆయన నడుపుతున్న కారు పక్కనే ఉన్న ట్రాక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అజిత్కు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అజిత్ ప్రమాదం నుంచి బయటపడడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.మైత్రి మూవీ మేకర్స్తో సినిమా..అజిత్ కుమార్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్తో జతకట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఇందులోనూ త్రిషనే హీరోయిన్గా నటిస్తోంది . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. Persistence is the path, Victory is the destination. 💥 The VIDAAMUYARCHI & PATTUDALA Trailer is OUT NOW. ▶️🔗 Tamil - https://t.co/zKlPqI9XGE🔗 Telugu - https://t.co/mYt21igQIsFEB 6th 🗓️ in Cinemas Worldwide 📽️✨#Vidaamuyarchi #Pattudala #EffortsNeverFail#AjithKumar… pic.twitter.com/wTL2C1tZHP— Lyca Productions (@LycaProductions) January 16, 2025 -
హుకుం.. టైగర్ కా హుకుం...
ఇటీవల సరైన సక్సెస్లు లేక సతమతమవుతున్న నటుడు రజనీకాంత్కు నూతనోత్సాహాన్ని కలిగించిన చిత్రం జైలర్. సన్పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి నెల్సన్ దర్శకుడు. నటి తమన్న ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రం 2023లో తెరపైకి వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఈ తరువాత రజనీకాంత్ నటించిన లాల్ సలాం పూర్తిగా నిరాశపరిచింది. ఆ తరువాత రజనీకాంత్ నటించిన వేట్టైయన్ చిత్రం ఆశించిన రీతిలో ఆడలేదు.ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నటి శృతిహాసన్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే జైలర్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు నెల్సన్ మొదటి నుంచి చెబుతున్నారు. కాగా జైలర్ –2 చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ను పొంగల్ సందర్భంగా మంగళవారం చిత్ర వర్గాలు విడుదల చేసి రజనీకాంత్ అభిమానులకు కానుకగా అందించారు. నాలుగు నిమిషాల పాటూ సాగే ఆ ట్రైలర్లో దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుద్ చిత్ర కథా చర్చల కోసం గోవా వెళతారు. అక్కడ వారు మాట్లాడుకుంటుండగా నటుడు రజనీకాంత్ రౌడీలను వెంటాడి వేటాడుతూ వస్తారు. దీంతో భయభ్రాంతులకు గురైన నెల్సన్, అనిరుధ్ ఈ సన్నివేశం బాగుందే దీన్నే కథగా రూపొందిద్దాం అని అనుకుంటారు. ట్రైలర్ చివరిలో రజనీకాంత్ హుక్కుమ్ టైగర్ కా హుక్కుమ్ అంటారు. మాస్ మసాలాగా రూపొందిన ఈ ట్రైలర్కు ఇప్పుడు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. జైలర్– 2 చిత్ర షూటింగ్ మార్చి నెలలో ప్రారంభం అవుతుందని సమాచారం. ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు వెలువడాల్సి ఉంది. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థనే నిర్మిస్తోంది. -
'రాయలసీమ మాలుమ్ తేరేకు'.. డాకు మహారాజ్ రిలీజ్ ట్రైలర్ చూసేయండి
నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie). ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ను(Release Trailer) మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా వచ్చిన బాలయ్య మూవీ ట్రైలర్ను మీరు కూడా చూసేయండితాజాగా రిలీజైన ట్రైలర్ ఫ్యాన్స్కు మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తోంది. బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్ ఆడియన్స్ను ఊపేస్తున్నాయి. 'రాయలసీమ మాలుమ్ తేరేకు.. వో మై అడ్డా' అనే డైలాగ్ ఫ్యాన్స్ను అలరిస్తోంది. 'ఎవరైనా చదవడంలో మాస్టర్స్ చేస్తారు.. నేను చంపడంలో చేశా' అనే అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మాస్ డైలాగ్స్ చూస్తే సంక్రాంతికి ఫుల్ ఎంటర్టైనర్గా అలరించేలా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ మూవీని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్తో పాటు బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ , టీజర్పై భారీగా ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా తమన్ అందించిన బీజీఎమ్ మరో రేంజ్లో ఉందంటూ కామెంట్లు వచ్చాయి. ఇప్పుడు విడుదలైన మాస్ ట్రైలర్తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. తాజాగా రిలీజ్ ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది.టికెట్ ధరల పెంపు..జనవరి 12న విడుదల కానున్న మూవీకి బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. 12వ తేదీ ఉదయం 4 గంటల ప్రత్యేక షో కోసం అనుమతితో పాటు ఒక్కో టికెట్ రూ.500కు విక్రయించేందుకు అనుమతిచ్చింది. రోజుకు ఐదు షోలతో పాటు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్లో రూ.135, సింగిల్ థియేటర్స్లలో రూ.110 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. జనవరి 26 వరకు ఈ ధరలు ఉంటాయి.ఈ సారి డాకు మహారాజ్ సినిమాపై అమెరికాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అమెరికాలో ఇప్పటికే టికెట్స్ ప్రీ సేల్ ప్రారంభం అయింది. ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో 10 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. అమెరికాలోని 125 లోకేషన్స్లలో 350 షోలు ఫస్ట్ డే పడనున్నాయి.ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుజనవరి 9న జరగాల్సిన డాకు మహారాజ్ (Dsaku Maharaaj) చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre Release Event) రద్దయింది. శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన భక్తులు తిరుపతిలో టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరగడంతో ఆరుగురు భక్తులు మరణించారు. ఇలాంటి విషాధ ఘటన సమయంలో సినిమా ఈవెంట్ను నిర్వహించడం సరైన నిర్ణయం కాదని చిత్ర యూనిట్ రద్దు చేసింది. ఈ నిర్ణయంతో బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. MASS is a mood and he’s the MASTER🔥🪓#DaakuMaharaaj 𝐑𝐄𝐋𝐄𝐀𝐒𝐄 𝐓𝐑𝐀𝐈𝐋𝐄𝐑 is here to set your screens on fire! 🔥 — https://t.co/849jh9BlA0𝐉𝐀𝐍 𝟏𝟐, 𝟐𝟎𝟐𝟓 ~ A SANKRANTHI EXPLOSION awaits in cinemas ❤️🔥𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna @thedeol… pic.twitter.com/qsTNfHjpPm— Sithara Entertainments (@SitharaEnts) January 10, 2025 -
సుకుమార్ కూతురి చిత్రం.. ట్రైలర్ రిలీజ్ చేసిన మహేశ్ బాబు
పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి(Sukriti Veni Bandreddi) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'గాంధీ తాత చెట్టు'(Gandhi Tatha Chettu) ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అవార్డ్స్ను అందుకుంది. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, గోపీటాకీస్ సంస్థలతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ భార్య తబితా సుకుమార్ సమర్పకురాలుగా వ్యవహరించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను(Gandhi Tatha Chettu Trailer) విడుదల చేశారు మేకర్స్. ప్రిన్స్ మహేశ్ బాబు చేతుల మీదుగా గాంధీతాత చెట్టు ట్రైలర్ రిలీజ్ చేశారు. గాంధీ తాత చెట్టు ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. అందరి మనసులను హత్తుకునే సినిమాలా అనిపిస్తోంది. సుకృతికి, అలాగే ఈ సినిమా టీమ్ అందరికి నా అభినందనలు అంటూ ప్రిన్స్ మహేష్బాబు తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.తాజాగా రిలీజైన గాంధీ తాత చెట్టు ట్రైలర్ చూస్తే ఓ బాలిక ఇచ్చిన మాట కోసం గాంధీ మార్గాన్ని ఎంచుకున్న కథగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. గాంధీ పేరు పెట్టుకున్న ఓ అమ్మాయి.. ఆయన బాటను, సిద్దాంతాలను అనుసరిస్తూ, తన తాతకు ఇష్టమైన చెట్టును, తన ఊరును ఎలా రక్షించుకుంది అనే కథాంశంతో సినిమా తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. గాంధీగా సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ఈ సినిమాలో నటించారు. ట్రైలర్ అందరి హృదయాలకు హత్తుకునే విధంగా ఉంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా సుకుమార్ కూతురి నటన అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ట్రైలర్ విడుదల చేసిన సూపర్స్టార్ మహేష్బాబుకు నిర్మాతలు, దర్శకురాలు, చిత్ర సమర్పకురాలు తబితా సుకుమార్ తమ కృతజ్ఞతలు తెలియజేశారు.కాగా.. ఇప్పటికే ఈ 'గాంధీ తాత చెట్టు' సినిమా పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శించడమే కాకుండా ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి పురస్కారం పొందారు. దీంతో పుష్ప అభిమానులు సుకుమార్ కూతురు అనిపించుకున్నావ్ అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు. తండ్రి నేషనల్ అయితే, కూతురు ఇంటర్నేషనల్ అంటూ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకురాలు పద్మావతి మల్లాది మాట్లాడుతూ 'ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా చూసిన ద్వేషాలు, అసూయ..ఇలా ఓ నెగెటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం.. గొడవలు ఇలా ఎన్నో ఘర్షణలు కనిపిస్తున్నాయి.ఇక సాధారణంగా మనకు అహింస అనగానే మనకు మన జాతిపిత మహాత్మగాంధీ గుర్తొస్తారు. ఇలాంటి తరుణంలో గాంధీ గారి సిద్ధాంతాలు అభిమానిస్తూ, ఆయన బాటను అనుసరించే ఓ పదమూడేళ్ల అమ్మాయి తను పుట్టిన ఊరిని కాపాడుకోవడం కోసం ఏం చేసింది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చూపించాల్సిన సినిమా. అందరి హృదయాలను హత్తుకునే భావోద్వేగాలు ఈ చిత్రంలో ఉంటాయి. చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఓ అనీర్వచనీయమైన అనుభూతికి లోనవుతారు. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకముంది. ఈ నెల 24న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో ఆనంద్ చక్రపాణి, రఘురామ్, భాను ప్రకాశ్, నేహాల్ ఆనంద్ కుంకుమ, రాగ్ మయూర్ ముఖ్య పాత్రలు పోషించారు. -
పెద్దోడి ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది: మహేశ్ బాబు
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం సంక్రాంతి వస్తున్నాం. ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించారు. శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొంగల్ కానుకగా ఈ నెల 14న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. నిజామాబాద్లో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో రిలీజ్ చేశారు. సూపర్ స్టార్, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ను విడుదల చేశారు.ఈ సందర్భంగా చిత్రబృందానికి మహేశ్ బాబు అభినందనలు తెలిపారు. మా పెద్దోడి మూవీ ట్రైలర్ విడుదల చేయడం అనందంగా ఉందన్నారు. అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబోలో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మహేశ్ బాబు పోస్ట్ చేశారు. జనవరి 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్ చేశారు.కాగా.. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు.కేవలం 72 రోజుల్లోనే షూటింగ్ పూర్తి..సాధారణంగా స్టార్ హీరోలతో సినిమా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం ఏడాది సమయం అయినా పడుతుంది. కానీ ఈ రోజుల్లో మాత్రం ఏ స్టార్ హీరో సినిమా అయినా సరే రెండు, మూడు నెలల కంటె ఎక్కువ సమయం తీసుకోవట్లేదు. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించాడు.నాలుగైదు నిమిషాలే వృథాఇటీవల ప్రచార కార్యక్రమంలో భాగంగా అనిల్రావిపూడి మాట్లాడుతూ.. సినిమా మేకింగ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సినిమా షూటింగ్ని కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేశామని తెలిపారు. అంతేకాదు ఐదారు నిమిషాల ఫుటేజ్ మాత్రమే వృథా అయిందని పేర్కొన్నారు.అనిల్ రావిపూడి మాట్లాడుతూ..' ఈ చిత్రం అనౌన్స్ చేసినప్పుడే ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించాం. తక్కువ సమయం షూటింగ్ ముగించుకోవాలనుకున్నాం. స్క్రిప్ట్ సమయంలోనే ఎడిటింగ్ చేసేశాం. ఫలానా సీన్ మూడు నిమిషాలు తీయాలనుకుంటే అంతే తీశాం. అందుకే 72 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. మొత్తం సినిమా దాదాపు 2.26 గంటల నివిడితో పూర్తయితే.. 2.22 గంటల నిడివితో సెన్సార్కు పంపాం. కేవలం ఐదారు నిమిషాలు మాత్రమే ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఈ మూవీకి ఎంత బడ్జెట్ అవసరమో అంతకు ఏమాత్రం తగ్గకుండా తీశాం. క్వాలిటీ విషయంలోనూ అస్సలు రాజీపడలేదు’ అని అన్నారు.సంక్రాంతి బరిలో మూడు సినిమాలు..మరోవైపు ఈ సంక్రాంతి బరిలో మొత్తం మూడు సినిమాలు విడుదల కానున్నాయి. వెంకటేశ్ సంక్రాంతి వస్తున్నాం మూవీతో పాటు రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ జనవరి 10న విడుదల కానుంది. బాలకృష్ణ-బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ చిత్రం కూడా జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది. Looks like a sure shot🎯🔥Glad to launch the trailer of my peddhodu @VenkyMama garu and my blockbuster director @AnilRavipudi's #SankranthikiVasthunam Wishing you a both a victorious hattrick and the entire team a memorable Sankranthi. Looking forward to the film on Jan 14th!!…— Mahesh Babu (@urstrulyMahesh) January 6, 2025 -
గేమ్ ఛేంజర్తో పోటీ పడనున్న మూవీ.. మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ హీరో సోనూ సూద్ హీరోగా నటించిన తాజా చిత్రం ఫతే. అరుంధతి సినిమాతో టాలీవుడ్లో ఫేమస్ అయిన సోనూ సరికొత్త థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమాను తానే దర్శకత్వం వహించడం మరో విశేషం. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటున్నాయి.కాగా.. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సోనాలి సూద్, ఉమేష్ కెఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సైబర్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సైబర్ మాఫియా బారిన ఒక అమ్మాయిని హీరో ఏవిధంగా రక్షించాడు? అనే కోణంలో రూపొందించారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న బాలీవుడ్లో విడుదల కానుంది. దక్షిణాది భాషల్లో రిలీజ్ చేస్తారో లేదో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే పాన్ ఇండియా రేంజ్లో అదే రోజున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ కూడా రిలీజవుతోంది. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. పొంగల్ బరిలో నిలిచిన ఫతే హిందీలో గేమ్ ఛేంజర్తో పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది. దక్షిణాది భాషల్లోనూ ఫతే రిలీజైతే గనక చెర్రీ మూవీతో బాక్సాఫీస్ వద్ద పోరు తప్పేలా లేదు.తాజాగా ఈ మూవీ మరో ట్రైలర్ను కూడా విడుదల చేయనున్నట్లు సోనూ సూద్ ట్వీట్ చేశారు. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు చేతుల మీదుగా ఫతే ట్రైలర్-2 రిలీజ్ చేశారు. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేశారు మహేశ్ బాబు.తెలుగులో ప్రత్యేక గుర్తింపు..కాగా.. అనుష్క లీడ్ రోల్లో నటించిన అరుంధతి సినిమాలో పశుపతిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్. టాలీవుడ్లో జులాయి, అతడు లాంటి సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించారు. తెలుగు పలువురు స్టార్ హీరోల సినిమాల్లో ప్రతినాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. An action-packed spectacle that looks absolutely amazing! Wishing all the very best to my dear friend @SonuSood Can’t wait for everyone to witness this magic on screen! 😊 #Fateh https://t.co/d9CZlhWnnk— Mahesh Babu (@urstrulyMahesh) January 6, 2025 Love you brother ❤️ https://t.co/jXadXxOqQt— sonu sood (@SonuSood) January 6, 2025 This will Hit you Hard 🔥Be Ready🪓 #Fateh Trailer-2 🩸https://t.co/DtgNrqoBd0In cinemas on 10th January.@Asli_Jacqueline @ZeeStudios_ @condor_dop @Vm_buffy @ShaktiSagarProd @Fateh4Bharat pic.twitter.com/5UKXIAqEeX— sonu sood (@SonuSood) January 6, 2025 This will Hit you Hard 🔥Be Ready🪓 #Fateh Trailer-2 🩸 pic.twitter.com/s0U9s1Iyri— sonu sood (@SonuSood) January 6, 2025 -
మాజీ ప్రియురాలితో సినిమా.. ప్రశంసలు కురిపించిన హీరో
బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ గురించి పరిచయం అక్కర్లేదు. సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2018లో కేదార్నాథ్ అనే సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో కనిపించింది. గతేడాది ఏ వతన్ మేరే వతన్ మూవీతో మెప్పించిన సారా.. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తోన్న స్కై ఫోర్స్ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.ముంబయిలో జరిగిన ఈవెంట్లో స్కై ఫోర్స్ ట్రైలర్ను విడుదల చేశారు. అయితే ఈ మూవీలో సారా మాజీ ప్రియుడు వీర్ పహరియా కూడా నటిస్తున్నారు. ఈ సందర్భంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్కు హాజరైన వీర్ పహారియా.. మాజీ ప్రియురాలు సారా అలీఖాన్పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. సారా అలీ ఖాన్తో పని చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. షూటింగ్లో తనకు మద్దతు అందించినందుకు సారాకు కృతజ్ఞతలు తెలిపాడు.వీర్ పహారియా మాట్లాడుతూ.. "ఆమె చాలా మంచి వ్యక్తి. సారాకు సహాయం చేసే గుణం చాలా ఎక్కువ. తనకు ఇప్పటికే సినీ పరిశ్రమలో చాలా అనుభవం ఉంది. అందువల్లే నాకు చాలా సహాయం చేసింది. ఈ విషయంలో సారాకు రుణపడి ఉన్నా. తన మొదటి సినిమాలో మద్దతుగా నిలిచినందుకు సారాకు ధన్యవాదాలు" అని అన్నారు.కాగా.. 2018లో కేదార్నాథ్ మూవీ ఎంట్రీ ఇచ్చిన సారా అలీ ఖాన్ చిత్ర పరిశ్రమలోకి రాకముందు వీర్ పహారియాతో డేటింగ్ చేసింది. గతేడాది కాఫీ విత్ కరణ్ సీజన్- 7 లో పాల్గొన్న సారా ఈ విషయం బయటకొచ్చింది. ఈ షోలో జాన్వీ కపూర్ వీర్ సోదరుడు శిఖర్ పహారియాతో ప్రేమలో ఉన్న సమయంలోనే వీర్తో సారా డేటింగ్ చేస్తున్నారని హోస్ట్ కరణ్ జోహార్ ఆమెను ఆటపట్టించాడు. అయితే ప్రస్తుతం వీరిద్దరు ఎలాంటి రిలేషన్లో లేరు. వీర్ పహారియా, సారా అలీ ఖాన్ స్కై ఫోర్స్లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సందీప్ కెవ్లానీ, అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 24, 2025న విడుదల కానుంది.పొలిటీషియన్ కుమారుడితో డేటింగ్ రూమర్స్..మరోవైపు సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురు, హీరోయిన్ సారా అలీఖాన్పై గతంలో మరోసారి డేటింగ్ రూమర్స్ వచ్చాయి. ప్రముఖ మోడల్ అర్జున్ ప్రతాప్ బజ్వాతో సారా గత కొన్నాళ్లుగా సన్నిహితంగా ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అర్జున్కి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. పంజాబ్కి చెందిన బీజేపీ నేత ఫతే జంగ్ సింగ్ బజ్వా కొడుకు ఈయన. అర్జున్ మినహా ఫ్యామిలీ మొత్తం రాజకీయాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.కేదార్నాథ్ పర్యటన వల్లే..ఇటీవల సారా కేదార్నాథ్ పర్యటనకు వెళ్లింది.ఈ పర్యటననే డేటింగ్ రూమర్లకి కారణమైంది. సారాతో పాటు అర్జున్ కూడా కేదార్నాథ్ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ పర్యటనలోనే వీరిద్దరు మరింత క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.వీరిద్దరు కలిసి దర్శనం చేసుకుంటున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. అప్పటి నుంచి అర్జున్-సారా డేటింగ్లో ఉన్నారనే రూమర్స్ మొదలైయ్యాయి. అయితే ఈ డేటింగ్ రూమర్స్పై అటు సారా కానీ, ఇటు అర్జున్ కానీ స్పందించలేదు. -
పుష్ప-2, దేవర రికార్డులు బద్దలు కొట్టిన గేమ్ ఛేంజర్
-
'అవి చూడగానే తొడ గొట్టాలనిపించింది'.. గేమ్ ఛేంజర్పై దిల్ రాజు కామెంట్స్
గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. శంకర్ డైరెక్షన్ విజన్ టీజర్, సాంగ్స్ చూస్తేనే తెలుస్తోందన్నారు. ఈ సినిమాలో అన్ ప్రిడిక్టబుల్ సీన్స్ చాలా ఉంటాయని తెలిపారు. ప్రసాద్ ల్యాబ్కెళ్లి రెండు రీల్స్ చూశా.. అవీ చూశాక తొడ గొట్టాలని అనిపించిందన్నారు. ఈ నెల 10 తేదీ వరకు మీలాగే మేము కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని దిల్ రాజు అన్నారు.దిల్ రాజు మాట్లాడుతూ..'ఒక తమిళ్ సినిమాని పాన్ ఇండియా చేసిన శంకర్ గారికి, తెలుగు సినిమాని గ్లోబల్ సినిమా చేసిన రాజమౌళి గారికి ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున కృతజ్ఞతలు. మా లాంటి వారికి ఎంతో ధైర్యాన్నిచ్చారు. శంకర్ విజన్ ఒక్కో స్టెప్గా చూపిస్తూ వస్తున్నాం. ఇప్పటి వరకు కేవలం 40 నుంచి 50 శాతం వరకే చూపించాం. నిన్ననే ప్రసాద్ ల్యాబ్లో రెండు రీల్స్ చూసి తొడ గొట్టాలనిపించింది. జెంటిల్మెన్, భారతీయుడు, శివాజీ లాంటి శంకర్ సినిమాలు కమర్షియల్ హిట్స్. చాలా ఏళ్ల తర్వాత తెలుగులో డైరెక్ట్గా సినిమా చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ఎదిగారు. ఈ మూవీతో రామ్ చరణ్ క్రేజ్ మరింత పెరుగుతుంది. మా సినిమాకు లాభాలు కచ్చితంగా వస్తాయని' అన్నారు.(ఇది చదవండి: 'కలెక్టర్కి ఆకలేస్తోంది అంటా'... 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ చూసేయండి)కాగా.. శంకర్- రామ్ చరణ్ డైరెక్షన్లో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
'కలెక్టర్కి ఆకలేస్తోంది అంటా'... 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ చూసేయండి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్'(Game Changer Movie). స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ పాటలకు సంబంధించి మూవీ టీమ్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను (Game Changer Trailer)మేకర్స్ రిలీజ్ చేశారు.(ఇది చదవండి: Game Changer: తగ్గిన రామ్ చరణ్ రెమ్యునరేషన్!)తాజాగా రిలీజైన గేమ్ ఛేంజర్ ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ అండ్ పొలిటికల్ స్టోరీగానే తెరెకెక్కించినట్లు తెలుస్తోంది. ఫైట్స్, డైలాగ్స్ మెగా ఫ్యాన్స్కు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. రామ్ చరణ్, ఎస్జే సూర్య మధ్య సన్నివేశాలు ఆడియన్స్లో అంచనాలు మరింత పెంచేస్తున్నాయి. 'నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్.. నేను చనిపోయే వరకు ఐఏఎస్' అనే డైలాగ్ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ట్రైలర్ చివర్లో వచ్చే 'అర్థమయిందిరా.. రా కి రా.. సర్ కి సర్..' అనే డైలాగ్ ఎస్జే సూర్యతో చెప్పే డైలాగ్ మెగా ఫ్యాన్స్ను అలరిస్తోంది. దాదాపు 2 నిమిషాల 40 సెకన్ల పాటు ఉన్న గేమ్ ఛేంజర్ ట్రైలర్లో ఫైట్స్, విజువల్స్లో డైరెక్టర్ శంకర్ మార్క్ కనిపిస్తోంది. (ఇది చదవండి: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. కేవలం పాటలకే అన్ని కోట్లా!)ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శంకర్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ కావడంతో కోలీవుడ్లోనూ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. కోలీవుడ్ హీరో ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న గేమ్ ఛేంజర్ పొంగల్ కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. -
గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ ట్రైలర్ డేట్, ముహుర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ట్రైలర్ జనవరి 1న విడుదల చేస్తామని ఇటీవల విజయవాడలో దిల్ రాజు ప్రకటించారు. కానీ ఒక రోజు ఆలస్యంగా రెండో తేదీకి మారింది. హైదరాబాద్లోనే గేమ్ ఛేంజర్ ట్రైలర్ను రిలీజ్ చేస్తున్నారు. అయితే మెగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆయన చేతుల మీదుగానే గేమ్ ఛేంజర్ ట్రైలర్ను విడుదల చేయనున్నారు. గురువారం సాయంత్రం 05:04 గంటలకు గేమ్ ఛేంజర్ ట్రైలర్ విడుదల కానుంది.(ఇది చదవండి: గేమ్ ఛేంజర్ కటౌట్ వరల్డ్ రికార్డ్.. ట్రైలర్ డేట్ ప్రకటించిన దిల్ రాజు)256 అడుగుల రామ్ చరణ్ కటౌట్..ఇటీవల ఏపీలో రామ్ చరణ్ భారీ కటౌట్ను ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. విజయవాడలో దాదాపు 256 అడుగులతో ఏర్పాటు చేసిన కటౌట్ను నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు. ఈ భారీ కటౌట్కు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. ఈ సందర్భంగా దిల్ రాజుకు అవార్డ్ను అందజేశారు. కాగా.. రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో ఈ కటౌట్ను సిద్ధం చేశారు. ఈ భారీ కటౌట్కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోనూ చోటు దక్కింది.కాగా.. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో కోలీవుడ్ సూపర్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. Drum roll, please 🥁The one and only @ssrajamouli is making a spectacular entry at the #GameChangerTrailer launch on January 2nd! 😎💥See you tomorrow at 5:04 PM!#GameChanger#GameChangerOnJAN10 🚁Global Star @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @yoursanjali… pic.twitter.com/sdrTfzxLMi— Sri Venkateswara Creations (@SVC_official) January 1, 2025 -
గేమ్ ఛేంజర్ ట్రైలర్..
-
నీ ఫ్యూచర్ ఏంటో ముందే తెలిస్తే?.. ఆసక్తిగా ట్రైలర్
ప్రశాంత్ కృష్ణ, అనీషా దామా, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోళక్కల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం డ్రీమ్ క్యాచర్. ఈ సినిమాకు సందీప్ కాకుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సియల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించారు. సైకలాజికల్ థ్రిల్లర్గా వస్తోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 3న విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు.ఈ సందర్భంగా డ్రీమ్ క్యాచర్ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే మన జీవితంలో జరగబోయేది ముందే తెలిస్తే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి రోహన్ శెట్టి సంగీతమందిస్తున్నారు.ఈ సందర్భంగా డైరెక్టర్ సందీప్ కాకుల మాట్లాడుతూ..' సినిమా చేయాలనేది నా డ్రీమ్. కలల మీద సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ మూవీ మొదలైంది. ఇన్సెప్షన్ లాంటి హాలీవుడ్ మూవీస్ నాకు ఆదర్శంగా నిలిచాయి. ఒక హాలీవుడ్ స్థాయి అటెంప్ట్ చేయాలని అనుకున్నా. సినిమా మొత్తం హైదరాబాద్లోనే చేశాం. ట్రైలర్, పోస్టర్స్ చూసి ఈ మూవీ ఎక్కడ షూటింగ్ చేశారని అడుగుతున్నారు. కలల నేపథ్యంగా ఇలాంటి సినిమా ఇప్పటిదాకా తెలుగులో రాలేదని చెప్పగలను. గంటన్నర నిడివితో ఉన్న ఈ సినిమాలో ఎలాంటి పాటలు, ఫైట్స్ ఉండవు. కేవలం కథ మీదనే మూవీ నడుస్తుంది. నా టీమ్ అంతా ఎంతో బాగా సపోర్ట్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ చేస్తున్నాం' అని అన్నారు. -
ఓటీటీకి కేసీఆర్ సినిమా.. ట్రైలర్ చూశారా?
కమెడియన్గా రాకింగ్ రాకేశ్(Rocking Rakesh) హీరోగా నటించి నిర్మించిన సినిమా కేసీఆర్ (KCR Movie). గతనెల 22న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కేసీఆర్ అలియాస్ 'కేశవ చంద్ర రమావత్' సినిమాకు గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కొత్తగా ఏర్పడిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికైన పరిణామాలకు ఓ లంబాడీ యువకుడి జీవిత ప్రయాణాన్ని జోడించి ఈ మూవీని తెరకెక్కించారు. నటి సత్య కృష్ణన్ కూతురు అనన్య కృష్ణన్ (Ananya Krishnan) ఈ చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే స్ట్రీమింగ్ తేదీని ప్రకటించిన మేకర్స్.. తాజాగా ఓటీటీ ట్రైలర్ను రిలీజ్ చేశారు.అసలు కథేంటంటే..'కేసీఆర్' కథ విషయానికొస్తే.. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న రోజుల్లో కేసీఆర్ ప్రసంగాలు విని అతడికి అభిమాని అవుతాడు కేశవ చంద్ర రమావత్ (రాకింగ్ రాకేష్). ఊరివాళ్లంతా కేశవ చంద్రరమావత్ను కేసీఆర్ అని పిలుస్తుంటారు. కేశవను అతడి మరదలు మంజు (అనన్య కృష్ణన్) ఇష్టపడుతుంది. బావనే పెళ్లిచేసుకోవాలని కలలు కంటుంది. మరదల్ని కాదని కేశవ చంద్ర రమావత్ బాగా డబ్బున్న అమ్మాయితో పెళ్లికి సిద్ధపడతాడు.తన పెళ్లి అభిమాన నాయకుడు కేసీఆర్ చేతుల మీదుగా జరగాలని కేశవ చంద్ర కలలు కంటాడు. కేసీఆర్ను కలవడం కోసం హైదరాబాద్ వస్తాడు. ఆ తర్వాత ఏమైంది? కేశవ చంద్ర రమావత్.. కేసీఆర్ను కలిశాడా? తమ ఊరికి ఎదురైన రింగ్ రోడ్ సమస్యని ఇతడు ఎలా పరిష్కరించాడు? మరదలి ప్రేమను అర్థం చేసుకున్నాడా అనేదే మూవీ స్టోరీ. -
ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ చిత్రం.. ట్రైలర్ వచ్చేసింది!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ మూవీ ఆస్కార్ అవార్డ్ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ను సాధించింది. ఇటీవల ఈ మూవీకి సంబంధించి డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ అనే పేరుతో డాక్యుమెంటరీ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు.తాజాగా ఈ డాక్యుమెంటరీ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఆర్ఆర్ఆర్ షూటింగ్ సమయంలో జరిగిన సన్నివేశాలతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ డాక్యుమెంటరీని డిసెంబర్ 20న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.కాగా.. 2022లో వచ్చిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో టాలీవుడ్ పేరు వరల్డ్ వైడ్గా మార్మోగింది. ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కించుకుంది. మరోవైపు రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో సినిమా చేయనున్నారు. ఆ మూవీ పనులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాదిలో సెట్స్పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.Hear and watch out… From the first clap on the sets to the standing ovation at the Oscars stage, #RRRBehindAndBeyond brings it all to you. 🔥🌊❤️#RRRMovie In select cinemas, 20th Dec. pic.twitter.com/EfJLwFixFx— RRR Movie (@RRRMovie) December 17, 2024 -
బార్డర్ దాటేసిన 'బచ్చల మల్లి' ట్రైలర్
అల్లరి నరేశ్ కొత్త సినిమా 'బచ్చల మల్లి' నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన టీజర్తోనే ప్రేక్షకులను మెప్పించిన నరేశ్ ఇప్పుడు ట్రైలర్తో మరింత ఆసక్తి పెంచాడు. 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుబ్బు మంగదేవి ఈ ప్రాజెక్ట్ను తెరకెక్కించారు. ఇందులో అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా.. రావు రమేశ్,రోహిణి, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరితేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా బచ్చల మల్లి సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20న ఈ మూవీ రిలీజ్ కానుంది. -
మోహన్ లాల్ డ్రీమ్ ప్రాజెక్ట్.. 3డీ ట్రైలర్ చూశారా?
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం 'బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్స్'. ఈ మూవీని తన డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ ఫిల్మ్స్ బ్యానర్పై ఈ మూవీని ఆయన నిర్మిస్తున్నారు. ఆంటోనీ పెరుంబావూర్ నిర్మాతగా ఉన్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి హిందీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే మలయాళంలో ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే.మైథలాజికల్ థ్రిల్లర్గా జీజో పున్నూసే రచించిన నవల ఆధారంగా బరోజ్ చిత్రాన్ని తెరకెక్కించారు. వాస్కోడిగామాలో దాగి ఉన్న నిధిని 400 ఏళ్లుగా కాపాడే జినీగా మోహన్ లాల్ కనిపించనున్నాడు. అయితే ఆ సంపదను ఆయన ఎందుకు రక్షిస్తున్నాడు. చివరగా దానిని ఎవరికి అందించాలని ఆయన ప్రయత్నం చేస్తాడనేది ఈ చిత్ర కథగా తెలుస్తోంది. ఈ మూవీని తొలిసారిగా 3డీ వర్షన్లో తెరకెక్కించారు. భారీ వీఎఫ్ఎక్స్తో నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో క్రిస్మస్ కానుకగా ఈ డిసెంబరు 25న విడుదల కానుంది. అయితే హిందీ వర్షన్ మాత్రం డిసెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు మోహన్ లాల్ ట్వీట్ చేశారు. బాలీవుడ్లో పెన్ స్టూడియోస్ సహకారంతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 3న విడుదల చేయాలని ఇది వరకే ప్రకటించారు. కానీ, నిర్మాణంతర పనులు పెండింగ్ ఉండటం వల్ల విడుదల ఆలస్యమైంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, ఈ మూవీ రిలీజ్ కానుంది.The #Barroz3D Hindi trailer is here! Thrilled to present this magical adventure in Hindi, brought to you in collaboration with #Penstudios. The Hindi version hits theatres on December 27. https://t.co/3pgb0ku861#Barroz— Mohanlal (@Mohanlal) December 11, 2024 -
'డ్రింకర్ సాయి' ట్రైలర్.. బూతులే కాదు, ఎమోషన్స్ కూడా..
యూత్ను ప్రధానంగా టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న చిత్రం 'డ్రింకర్ సాయి' ఇప్పటికే విడుదలైన టీజర్లో ఎక్కువగా బోల్డ్ డైలాగ్స్ ఉండటంతో నెట్టింట తెగ వైరల్ అయింది. అయితే, తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. లవ్ స్టోరీతో పాటు యూత్ ఆలోచించతగిన కొన్ని వాస్తవ సంఘటనలకు దగ్గరగా ఈ చిత్రం ఉండనుంది.ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'డ్రింకర్ సాయి' సినిమాకు బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ట్యాగ్ లైన్గా ఉంచారు. ఈ మూవీని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. డిసెంబర్ 27న ఈ చిత్రం విడుదల కానుంది.డ్రింకర్ సాయి టీజర్ను ఇప్పటికే చూసిన ప్రేక్షకుల నుంచి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే, అందులో కాస్త బూతు డైలాగ్స్ ఉండటంతో కొంతమంది నుంచి వ్యతిరేకత కూడా రావడం జరిగింది. కానీ, ప్రస్తుతం విడుదలైన ట్రైలర్లో కథలోని గ్రిప్పింగ్ను తెలియచేస్తూ ఉంది. ధర్మ, ఐశ్వర్య మధ్య వచ్చే సీన్స్ ఎమోషన్స్తో పాటు అందరినీ ఆలోచింపచేసేలా ఉన్నాయి. -
నిర్మాతగా స్టార్ డైరెక్టర్ భార్య.. ట్రైలర్ చూశారా?
వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'బేబీ జాన్'. ఈ చిత్రాన్ని కలీస్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ అట్లీ భార్య ప్రియా అట్లీ నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబయిలో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో విడుదల చేశారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ మూవీగానే బేబీ జాన్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ యాక్షన్ సీన్స్, ఫైట్స్ ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, వామికా గబ్బి రాజ్పాల్ యాదవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ చిత్రానికి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతమందించడం మరో విశేషం. -
విడుదలకు ముందే భారీగా అవార్డ్స్.. వేదిక 'ఫియర్' ట్రైలర్
హీరోయిన్ వేదిక ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఫియర్' సినిమా నుంచి తాజాగా ట్రైలర విడుదలైంది. ప్రేక్షకుల్లో ఆసక్తితో పాటు భయాన్ని కలిగించేలా సీన్స్ ఉన్నట్లో ట్రైలర్లోనే అర్థం అవుతుంది. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని ఈ ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు.కాంచన, రూలర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ వేదిక టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగానే కనెక్ట్ అయింది. "ఫియర్" సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 70 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా డిసెంబర్ 14న గ్రాండ్గా విడుదల కానుంది.రెగ్యులర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా "ఫియర్" ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని డైరెక్టర్ హరిత ఇప్పటికే చెప్పారు. సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఫ్యామిలీ ఆడియెన్స్ చూసేందుకు ఇష్టపడరు. కానీ ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుందని ఆమె తెలిపారు. విడుదలకు ముందే పలు అవార్డ్స్తో తాము విజయం సాధించామని ఇప్పుడు ఇక్కడి ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నట్లు ఆమె అన్నారు. -
విజయ్ సేతుపతి మూవీ.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తోన్న తాజా చిత్రం విడుదల-2. గతంలో విడుతలై(విడుదల) మూవీకి కొనసాగింపుగా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. వెట్రిమారన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీరియాడికల్ మూవీగా వస్తోన్న ఈ చిత్రంలో సూరి కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే తమిళ ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్.. తాజాగా తెలుగు వర్షన్ రిలీజ్ చేశారు. -
110 ఏళ్ల సినీచరిత్రలో తొలిసారి ఇలాంటి కాన్సెప్ట్!
దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సీరియల్ క్రైం థ్రిల్లర్ మూవీ M4M (మోటివ్ ఫర్ మర్డర్). ఒడిశా స్టార్ సంబీట్ ఆచార్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా హిందీ ట్రైలర్ను గోవాలో జరుగుతున్న ఇఫీ (ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) కార్యక్రమంలో రిలీజ్ చేశారు. ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA) వైస్ ప్రెసిడెంట్ అతుల్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదలైంది.ఈ సందర్భంగా అతుల్ మాట్లాడుతూ.. సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్ కొత్తగా ఉందన్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు అందించాలని ప్రయత్నిస్తున్న దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్లను ప్రశంసించారు. మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. ఇఫీ వేడుకలో M4M ట్రైలర్ రిలీజ్ అవడం సంతోషంగా ఉందన్నారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఈ సినిమాను చూసి థ్రిల్ అవుతారన్నారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో త్వరలోనే రిలీజ్ చేస్తామన్నారు. హీరోయిన్ జో శర్మ మాట్లాడుతూ.. 110 ఏళ్ల సినీచరిత్రలో ఇలాంటి కాన్సెప్ట్ ఫస్ట్ టైమ్ అని, తాను ఈ సినిమాలో కథానాయికగా నటించడం గర్వకాణంగా ఉందని తెలిపింది. -
'ఎలిమినేట్ అయితే చంపేస్తారు'.. స్క్విడ్ గేమ్ ట్రైలర్ చూశారా?
2021లో విడుదలైన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంది. కొరియన్లో తెరకెక్కించిన ఈ సిరీస్ ఇండియాలోనూ విపరీతమైన క్రేజ్ను దక్కించుకుంది. ఈ వెబ్ సిరీస్కు దక్కిన ఆదరణతో స్క్విడ్ గేమ్ సీజన్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా సీజన్-2 ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. మొదటి సీజన్ లాగే ఆర్థికంగా ఇబ్బందులు పడే కొంతమంది వ్యక్తులు.. డబ్బు సంపాదించడం కోసం ఈ గేమ్లో భాగమవుతారని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది.తెలుగులోనూ విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ను మరింత ఆకట్టుకుంటోంది. గ్రీన్ లైట్, రెడ్ లైట్ వంటి గేమ్స్ ఈ సీజన్లో చూపించనున్నారు. ట్రైలర్లో సన్నివేశాలు, ప్రమాదకరమైన గేమ్స్ చూస్తుంటే హారర్ థ్రిల్లర్ లాంటి ఫీలింగ్ వస్తోంది. గేమ్లో పాల్గొన్న వారంతా ప్రాణాలతో బయటపడతారా లేదా అన్నది తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ స్క్విడ్ గేమ్ సీజన్- 2 డిసెంబర్ 26 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.అసలు ఈ స్క్విడ్ గేమ్ ఏంటంటే..జీవితంలో అప్పులపాలైన 456 మందిని ఒక రహస్య దీవికి తీసుకెళ్తారు. అక్కడ రెడ్లైట్, గ్రీన్లైట్, టగ్ ఆఫ్ వార్ లాంటి చిన్నపిల్లలు ఆడుకొనే పోటీలు నిర్వహిస్తారు. ఇందులో మొత్తం సిక్స్ గేమ్స్ ఉంటాయి. చివరి గేమ్ పేరే స్క్విడ్ గేమ్. అయితే ఈ గేమ్స్లో ఓడిపోయిన వారిని ఎలిమినేషన్ పేరుతో చంపేస్తుంటారు. సర్వైవల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ను సొంతం చేసుకుంది. -
మోహన్ లాల్ డ్రీమ్ ప్రాజెక్ట్గా 'బరోజ్' ట్రైలర్ విడుదల
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ దర్శకుడిగా తొలిసారి మెగాఫోన్ పట్టాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్గా 'బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్స్' చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ ఫిల్మ్స్ బ్యానర్పై ఆయన నిర్మిస్తున్నారు. ఆంటోనీ పెరుంబావూర్ నిర్మాతగా ఉన్నారు. ఇందులో ఆయనే ప్రధాన పాత్రలో నటిస్తున్నారు కూడా.. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.మైథలాజికల్ థ్రిల్లర్గా జీజో పున్నూసే రచించిన నవల ఆధారంగా బరోజ్ చిత్రాన్ని తెరకెక్కించారు. వాస్కోడిగామాలో దాగి ఉన్న నిధిని 400ఏళ్లుగా కాపాడే జినీగా మోహన్ లాల్ ఇందులో కనిపించనున్నాడు. అయితే, ఆ సందను ఆయన ఎందుకు రక్షిస్తున్నాడు. చివరగా దానిని ఎవరికి అందించాలని ఆయన ప్రయత్నం చేస్తాడనేది ఈ చిత్ర కథ అని తెలుస్తోంది. ఎక్కువ వీఎఫ్ఎక్స్తో నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో క్రిస్మస్ కానుకగా ఈ డిసెంబరు 25న విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ్,కన్నడ,మలయాళం,హిందీలో ఈ మూవీ రిలీజ్ కానుంది. వాస్తవంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 3న విడుదల చేయాలని ఇది వరకే ప్రకటించారు. కానీ, నిర్మాణంతర పనులు పెండింగ్ ఉండటం వల్ల విడుదల విషయంలో జాప్యం ఏర్పడింది. -
'మెకానిక్ రాకీ' 2.O ట్రైలర్.. భారీగానే ప్లాన్ చేసిన విశ్వక్
'మెకానిక్ రాకీ'గా విశ్వక్సేన్ వస్తున్నాడు. మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించగా రామ్ తాళ్లూరి నిర్మాతగా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఒక ట్రైలర్ విడుదలైంది. దానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, తాజాగా రెండో ట్రైలర్ను కూడా మేకర్స్ విడుదల చేశారు. వరంగల్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్తో 'మెకానిక్ రాకీ'కి మరింత బజ్ క్రియేట్ అయింది.మాస్ యాక్షన్, లవ్, సెంటిమెంట్ అంశాలతో మెప్పిస్తున్న ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. గతంలో విశ్వక్ చెప్పినట్లుగా సినిమా విడుదల సమయంలో మరో ట్రైలర్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఆయన అన్నట్లుగానే తాజాగా రిలీజ్ చేశారు. నవంబర్ 22న ఈ చిత్రం విడుదల కానుండగా ఒక రోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం కోసం విశ్వక్ భారీగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. -
హరుడు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన డైరెక్టర్ ఆర్జీవీ.. ఫోటోలు
-
'రికార్డుల్లో పుష్ప పేరు ఉండడం కాదు.. పుష్ప పేరు మీదే రికార్డులు ఉంటాయి'
ఇప్పుడంతా ఎక్కడ చూసినా పుష్ప-2 పేరే వినిపిస్తోంది. కేవలం వినిపించడమే కాదు..డైలాగ్స్తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఆదివారం పుష్ప-2 ట్రైలర్ రిలీజైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పుష్ప ఫీవర్ మొదలైంది. బన్నీ ఫ్యాన్స్ సందడి అయితే అంతా ఇంతా కాదు. ఏ నగరంలో చూసిన టపాసులు పేలుస్తూ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పటికే యూట్యూబ్లో ఎప్పుడు లేని రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది.అయితే ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొడుతున్న పుష్ప రాజ్.. మరో క్రేజీ రికార్డ్ నమోదు చేశాడు. బిహార్లో పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ను ఏకంగా 2.6 లక్షల మంది లైవ్లో వీక్షించారు. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా ఈ రికార్డ్ను సాధించలేదు. దీనికి సంబంధించిన పోస్టర్ను పుష్ప టీమ్ ట్విటర్లో పంచుకుంది. దీంతో పుష్ప-2 రికార్డులు చూస్తుంటే ఏ ఇండియన్ సినిమాకు ఇప్పట్లో అందేలా కనిపించడం లేదు. కాగా.. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్-1 బాక్సాఫీస్ను షేక్ చేసింది. 2021 డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం పలు రికార్డులు నమోదు చేసింది. వచ్చేనెల డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనున్న పుష్ప-2 ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతుందో వేచి చూడాల్సిందే. His arrival means one thing - the existing records tumble 💥💥#Pushpa2TheRuleTrailer launch event registers the highest number of live viewers for an event with 2.6 LAKH concurrent viewers❤🔥❤🔥#RecordBreakingPushpa2TRAILER 🌋🌋▶️ https://t.co/FKXAngle5q… pic.twitter.com/vuCpMypShD— Pushpa (@PushpaMovie) November 18, 2024 -
'పుష్ప 2' కోసం బన్నీ.. మెగా సపోర్ట్ ఎక్కడ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' ట్రైలర్ రిలీజైంది. చివర్లో బన్నీ చెప్పిన డైలాగ్లా వైల్డ్ ఫైర్లా ఉంది. ట్రైలర్ సంగతి అటుంచండి. పాట్నాలో ఆదివారం సాయంత్రం ఈవెంట్ జరిగితే లక్షకు పైగా జనాలు వచ్చారు. ఏ మాత్రం ముఖపరిచయం లేని ఓ తెలుగు హీరో కోసం ఇంతమంది రావడం ఏంటా అని చాలామంది ఇప్పటికే షాక్లో ఉన్నారు. అయితే టాలీవుడ్ మాత్రం 'పుష్ప 2'ని సరిగా పట్టించుకోవట్లేదా అనిపిస్తుంది!'బాహుబలి' ముందు వరకు టాలీవుడ్ అంటే దేశంలో ఓ ఇండస్ట్రీ మాత్రమే. కానీ ఈ సినిమా దెబ్బకు దేశవ్యాప్తంగా టాలీవుడ్ పేరు మార్మోగిపోయింది. దీని తర్వాత 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' తదితర చిత్రాలతో ఇంటర్నేషనల్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ సందర్భంగా ఆయా సినిమాల రిలీజ్ టైంలో తెలుగు స్టార్ హీరోహీరోయిన్లు చాలామంది సపోర్ట్ చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టి మరీ తమ అభిమానాన్ని చాటుకున్నారు.(ఇదీ చదవండి: పుష్ప 2 ట్రైలర్.. ఈ అర గుండు నటుడు ఎవరంటే?)'పుష్ప 2' విషయానికొస్తే ట్రైలర్ రిలీజ్ తర్వాత డైరెక్టర్ రాజమౌళి, నిర్మాత నాగవంశీ, హీరో శర్వానంద్ లాంటి కొద్దిమంది తప్పితే టాలీవుడ్ నుంచి అనుకున్నంతగా సపోర్ట్ రావడం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా ఇప్పటివరకు ట్వీట్ గానీ పోస్ట్ గానీ వేయలేదు. దీన్నిబట్టే అర్థమవుతోంది 'పుష్ప 2' కోసం అందరూ ఉన్నా బన్నీ ఒంటరిగానే పోరాడుతున్నాడని!టాలీవుడ్ నుంచి అనుకున్నంత సపోర్ట్ రానంత మాత్రాన 'పుష్ప 2'కి వచ్చిన నష్టమేమి లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ దెబ్బకు రూ.1000 కోట్ల కలెక్షన్ అనే మాట వినిపిస్తోంది. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం సౌత్లో ఏమో గానీ బాలీవుడ్, ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం పూనకాలు గ్యారంటీ. (ఇదీ చదవండి: మహేశ్-ప్రభాస్ రికార్డ్ బ్రేక్ చేసిన 'పుష్ప 2' ట్రైలర్) -
మహేశ్-ప్రభాస్ రికార్డ్ బ్రేక్ చేసిన 'పుష్ప 2' ట్రైలర్
'పుష్ప 2' ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో ఏమో గానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం తెగ చూసేస్తున్నారు. ఎంతలా అంటే ఇప్పటివరకు టాలీవుడ్లో మహేశ్ బాబు, ప్రభాస్ సినిమాల ట్రైలర్స్ వ్యూస్ పరంగా టాప్లో ఉన్నాయి. ఇప్పుడు వాటిని అల్లు అర్జున్ ఇంకా సమయం ఉండగానే దాటేశాడు. సరికొత్త రికార్డ్ సృష్టించాడు.(ఇదీ చదవండి: కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి.. ప్రీ వెడ్డింగ్ ఫొటో వైరల్)తెలుగులో ఇప్పటివరకు వచ్చిన ట్రైలర్లలో 24 గంటల్లో ఎక్కుమంది చూసింది అయితే మహేశ్ 'గుంటూరు కారం' ట్రైలర్నే. 37.68 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. తర్వాత ప్లేస్లో ప్రభాస్ సలార్ 32.58 మిలియన్ వ్యూస్తో ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని కేవలం 15 గంటల్లో అల్లు అర్జున్ దాటేశాడు. 'పుష్ప 2' తెలుగు వెర్షన్ ట్రైలర్ ఈ స్టోరీ రాసేటప్పటికే అంటే 15-16 గంటల్లోనే 42 మిలియన్ల వ్యూస్తో దూసుకుపోతోంది. 24 గంటలు పూర్తయ్యేసరికి ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి?ఇక ట్రైలర్ విషయానికొస్తే కథనేం పెద్దగా రివీల్ చేయలేదు. కానీ జాతర ఎపిసోడ్, పుష్పరాజ్కి ఎలివేషన్స్, భన్వర్ సింగ్ షెకావత్ సీన్లు చాలానే చూపించారు. పక్కా కమర్షియల్గా ట్రైలర్ కట్ చేశారు. 2:48 నిమిషాల నిడివితో ఉన్న ట్రైలర్ వైల్డ్ ఫైర్ అనేలా ఉంది. డిసెంబరు 5న థియేటర్లలో బ్లాస్ట్ అయిపోవడం గ్యారంటీ అనిపిస్తోంది.(ఇదీ చదవండి: పుష్ప 2 ట్రైలర్.. ఈ అర గుండు నటుడు ఎవరంటే?) -
పుష్ప 2 ట్రైలర్.. ఈ అర గుండు నటుడు ఎవరంటే?
అనుకున్నట్లుగానే 'పుష్ప 2' ట్రైలర్ వైల్డ్ ఫైర్లా ఉంది. పెద్దగా కథ రివీల్ చేయలేదు గానీ మూవీ ఎంత గ్రాండియర్గా ఉండబోతుందనేది శాంపిల్ చూపించారు. తొలి భాగంలో ఉన్న చాలామంది యాక్టర్స్.. ట్రైలర్లో కనిపించారు. వీళ్లతో పాటు పలు కొత్త పాత్రలు కూడా కనిపించాయి. మిగతా వాళ్ల సంగతేమో గానీ అరగుండుతో ఓ పాత్ర కనిపించింది. ఇంతకీ ఈ నటుడు ఎవరబ్బా అని అందరూ బుర్ర గోక్కుంటున్నారు.ట్రైలర్లో అర గుండు, మెడలో చెప్పుల దండతో కనిపించిన నటుడి పేరు తారక్ పొన్నప్ప. స్వతహాగా కన్నడ నటుడు అయిన ఇతడు 'కేజీఎఫ్' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. మొన్నటికి మొన్న 'దేవర'లోనూ విలన్ సైఫ్ అలీఖాన్ కొడుకుగా నటించాడు. ఇప్పుడు 'పుష్ప 2'లోనూ కీలక పాత్ర పోషించినట్లే కనిపిస్తున్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'పుష్ప 2లో చాలా ముఖ్యమైన పాత్రలో నటించాను. నా క్యారెక్టర్ మూవీ టర్న్ అయ్యే ట్విస్ట్ మాత్రమే కాదు. పుష్ప లైఫ్ మారిపోయే ట్విస్ట్ & టర్న్ తీసుకొస్తుంది' అని చెప్పుకొచ్చాడు. ఇంతకీ తారక్ పొన్నప్ప చేసిన రోల్ ఏంటనేది మూవీ రిలీజైతే గాని తెలియదు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)పాట్నాలో ఆదివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా.. ఇదిప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. ఎందుకంటే లక్షకు పైగా జనాలు అల్లు అర్జున్ని చూడటానిక వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి.(ఇదీ చదవండి: కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి.. ప్రీ వెడ్డింగ్ ఫొటో వైరల్) -
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడింది.
-
పుష్ప-2 ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. వేదిక ఎలా ఉందో చూశారా?
-
Pushpa 2: వెయిటింగ్ ఈజ్ ఓవర్.. పుష్ప-2 ట్రైలర్ వచ్చేసింది
ప్రపంచవ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్గా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. బిహార్లోని పాట్నాలో జరిగిన భారీ ఈవెంట్లో పుష్ప-2 ట్రైలర్ను విడుదల చేశారు. ఈ ఈవెంట్లో భారీ ఎత్తున ఐకాన్ స్టార్స్ ఫ్యాన్స్ పాల్గొన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ యూట్యూబ్ షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ రిలీజైన మాస్ ట్రైలర్ ఏకంగా ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టనుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా పుష్ప 2 ట్రైలర్ చూసేయండి.తాజాగా విడుదలైన ట్రైలర్లో బన్నీ డైలాగ్స్ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. పుష్ప అంటే పేరు కాదు.. పుష్ప అంటే బ్రాండ్ అంటూ రష్మిక చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ను ఊపేస్తోంది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్ అంటూ బన్నీ అదరగొట్టేశాడు. అలాగే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా?.. వైల్డ్ ఫైర్ అంటూ అభిమానులను ఊర్రూతలూగిస్తోంది. ఇక ట్రైలర్ చూస్తే బన్నీ ఫ్యాన్స్కు పూనకాలే పూనకాలు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
మహేశ్ మేనల్లుడి సినిమా ట్రైలర్ రిలీజ్
'హీరో' అనే సినిమాతో మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'దేవకీ నందన వాసుదేవ'. ప్రశాంత్ వర్మ స్టోరీ అందించిన ఈ చిత్ర ట్రైలర్ని తాజాగా రిలీజ్ చేశారు. ఇంతకీ ఇది ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: స్టార్ హీరో ఫ్యాన్స్ నన్ను టార్గెట్ చేశారు: మహిళా ఎంపీ)ప్రశాంత్ వర్మ పేరుతో ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. లెక్క ప్రకారం నవంబర్ 14నే మూవీ రిలీజ్ కావాలి. కానీ 'మట్కా', 'కంగువ'తో పోటీ ఎందుకులే అని వాయిదా వేసుకున్నారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. సినిమాలో ఉన్నట్లే హీరో ఎంట్రీ, హీరోయిన్ వెనక పడటం, విలన్, చివరలో కృష్ణుడి రిఫరెన్స్.. ఇలా ప్రస్తుత ట్రెండ్కి తగ్గట్లే అన్ని ఎలిమెంట్స్ చూపించారు.'ఆదిపురుష్'లో హనుమంతుడిగా చేసిన దేవదత్తా.. ఇందులో విలన్గా చేశాడు. ట్రైలర్లోని ఎలివేష్ షాట్స్ చూస్తుంటే యాక్షన్ కూడా బాగానే దట్టించినట్లు అనిపిస్తుంది. ట్రైలర్ అయితే బాగానే ఉంది కానీ కృష్ణుడి అనే స్టోరీ పాయింట్ ఈ సినిమాకు ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత) -
వెయిటింగ్ ఈజ్ ఓవర్.. పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ తేదీని ప్రకటించిన మేకర్స్.. అనుకున్న తేదీ కంటే ఒక రోజు ముందుకు మార్చారు. అంటే డిసెంబర్ 5న పుష్పరాజ్ థియేటర్లలో సందడి చేయనున్నాడు.తాజాాగా పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ తేదీని ప్రకటించారు మేకర్స్. ఈనెల 17న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అల్లు అర్జున్ పోస్టర్ను పంచుకున్నారు. ఆ రోజు సాయంత్రం 06 గంటల 03 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ను బిహార్లో పాట్నాలో భారీఎత్తున నిర్వహిస్తున్నట్లు ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు.కాగా.. పుష్ప-2లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా శ్రీవల్లిగా మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ సైతం కీలకపాత్ర పోషిస్తున్నారు. పుష్ప పార్ట్-1 లాగే ఈ సినిమాలో ప్రత్యేక ఐటమ్ సాంగ్ను ప్లాన్ చేశారు. పార్ట్-1లో సమంత ఫ్యాన్స్ను అలరించగా.. పుష్ప-2లో కన్నడ బ్యూటీ శ్రీలీల అభిమానులను మెప్పించనుంది. ఇటీవల ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. Dropping an EXPLOSIVE BANGER before the MASS festival begins in Cinemas ❤🔥Experience the MASSIVE #Pushpa2TheRuleTrailer on 17th November at 6:03 PM 🌋🌋With a Blasting Event at PATNA 💥💥#Pushpa2TheRule#Pushpa2TheRuleOnDec5thIcon Star @alluarjun @iamRashmika… pic.twitter.com/nCFKC4kYA5— Pushpa (@PushpaMovie) November 11, 2024 -
'చీకటి కోన పులులన్నీ ఏకమై ఉరిమితే'.. కంగువా రిలీజ్ ట్రైలర్ చూశారా?
కోలీవుడ్ స్టార్ హీరో నటించిన పీరియాడికల్ యాక్షన్ చిత్రం 'కంగువా'. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. శివ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా నిర్వహించారు మేకర్స్.తాజాగా ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. దుబాయ్లో నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్లో ట్రైలర్ను విడుదల చేశారు. ఈవెంట్లో సూర్యతో పాటు బాబీ డియోల్ సందడి చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్తో కంగువాపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా.. ఈ మూవీని భారీస్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదివేల స్క్రీన్లలో రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. (ఇది చదవండి: సూర్య 'కంగువా' రిలీజ్.. మేకర్స్ బిగ్ ప్లాన్!)కాగా.. ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్లో సూర్య రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, దిశా పటాని, నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, రెడిన్ కింగ్స్లీ, కోవై సరళ, ఆనందరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. -
పుష్ప-2 కౌంట్ డౌన్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ తేదీని ప్రకటించిన మేకర్స్.. అనుకున్న తేదీ కంటే ఒక రోజు ముందుకు మార్చారు. అంటే డిసెంబర్ 5న పుష్పరాజ్ థియేటర్లలో సందడి చేయనున్నాడు.పుష్ప-2 విడుదలకు సరిగ్గా నెల రోజుల సమయం ఉండడంతో ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అల్లు అర్జున్, ఫాహద్ ఫాజిల్ ఉన్న పోస్టర్ను పంచుకున్నారు. నెల రోజుల్లోనే పుష్ప-2 రానుందంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. అంతేకాకుండా ట్రైలర్ త్వరలోనే పేలనుందంటూ హింట్ ఇచ్చారు. అయితే ట్రైలర్ రిలీజ్ తేదీని మాత్రం ప్రకటించలేదు. అయితే ఈ నెలలోనే పుష్ప-2 ట్రైలర్ విడుదలయ్యే అవకాశముంది. కేవలం 30 రోజులు మాత్రమే సమయం ఉండగా.. వరుసగా మరిన్నీ అప్డేట్స్ ఇవ్వనున్నారు. (ఇది చదవండి: ఓటీటీలో 'దేవర'.. అధికారిక ప్రకటన వచ్చేసింది)గ్రాండ్గా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్..పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ పెద్ద ప్లానింగే వేసినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన పాట్నా, కొచ్చి, చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్లో ఓకేసారి ట్రైలర్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపుగా ఈనెల 15న ట్రైలర్ విడుదల చేసే అవకాశముందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా బాహుబలి-2 తర్వాత అత్యధిక బజ్ ఉన్న చిత్రంగా పుష్ప-2 నిలిచింది. #Pushpa2TheRule TRAILER EXPLODING SOON 🌋🌋#1MonthToGoForPushpa2RAGE#Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/DylHFYbItZ— Pushpa (@PushpaMovie) November 5, 2024 -
నిఖిల్ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' ట్రైలర్ రిలీజ్
'కార్తికేయ 2' మూవీతో నిఖిల్.. పాన్ ఇండియా క్రేజ్ సంపాదించాడు. అలాంటిది ఈ హీరో నుంచి సినిమా వస్తుందంటే ఎంత హడావుడి ఉండాలి. కానీ అలాంటిదేం లేకుండా ఉన్నట్లుండి ఓ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' పేరుతో తీసిన ఈ చిత్రం నవంబర్ 8న థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)ట్రైలర్ చూస్తుంటే యూకేలోనే మూవీ అంతా తీసినట్లు కనిపిస్తుంది. డివైజ్ కోసం ఓ గ్యాంగ్ అంతా వెతుకుంటారు. అసలు ఇందులో హీరో, అతడి ఫ్రెండ్ ఎలా ఇరుక్కున్నారు? చివరకు ఏమైందనేదే స్టోరీ అనిపిస్తుంది. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్, దివ్యాంశ హీరోయిన్లుగా నటించారు. నిఖిల్తోనే 'స్వామి రారా', 'కేశవ' సినిమాలు తీసిన సుధీర్ వర్మ ఈ మూవీకి దర్శకుడు. చాలా ఏళ్ల క్రితమే షూటింగ్ పూర్తవగా.. ఇప్పుడు మూవీని రిలీజ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న నటి సన్నీ లియోన్!) -
'ధూం ధాం'గా హెబ్బా పటేల్ కొత్త సినిమా ట్రైలర్
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా కొత్త సినిమా 'ధూం ధాం'. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్కు గోపీ మోహన్ కథ అందిస్తున్నారు. నవంబర్ 8న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ను ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేశారు. 'మల్లెపూల టాక్సీ..' అంటూ సాగే పాటకు సోషల్మీడియాలో మంచి గుర్తింపు దక్కింది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. గోపీ సుందర్ కంపోజ్ చేశారు. గాయని మంగ్లీ ఈ పాటను ఎనర్జిటిక్ పాడటమే కాదు లిరికల్ వీడియోలో స్టెప్స్ వేసి ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, వన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
వరుణ్ తేజ్ 'మట్కా' ట్రైలర్ రిలీజ్
'మట్కా' మూవీ ట్రైలర్ రిలీజైంది. చాన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న మెగాహీరో వరుణ్ తేజ్.. ఈ సినిమాపై బోలెడన్ని ఆశలన్ని పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్లే ట్రైలర్ ఉంది. 'మట్కా' అనే గేమ్ నేపథ్య కథతో దీన్ని తెరకెక్కించారు. మూడు విభిన్న గెటప్స్లో వరుణ్ కనిపించాడు. వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు.(ఇదీ చదవండి: పవన్తో తొలి సినిమా.. తర్వాత కెరీర్ ఖతం.. ఈ హీరోయిన్ ఎవరంటే?)నవంబర్ 14న థియేటర్లలోకి 'మట్కా' రానుంది. అదే రోజు సూర్య పాన్ ఇండియా మూవీ 'కంగువ' కూడా థియేటర్లలోకి రానుంది. అయితేనేం ట్రైలర్ చూస్తుంటే వర్కౌట్ అయ్యే బొమ్మలా అనిపిస్తుంది. ట్రైలర్లో వరుణ్ తేజ్ చెప్పిన 'నాకు ఇక్కడ (మెదడు).. ఇక్కడ (గుండె)... ఇక్కడ (ఇంకా ఇంకా కిందకు) కంట్రోలు ఉంది కాబట్టే ఇలా వున్నాను' అనే డైలాగ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. (ఇదీ చదవండి: మొదటి పెళ్లిరోజు.. స్పెషల్ వీడియోతో వరుణ్ తేజ్-లావణ్య) -
Jithender Reddy Trailer: జగిత్యాల టైగర్ అంటారు.. పేరు జితేందర్ రెడ్డి!
‘ఉయ్యాలా జంపాల’, ‘మజ్ను’ చిత్రాల ఫేం విరించి వర్మ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘జితేందర్ రెడ్డి’. రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్నారు. 1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ని రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే అంశాలతో ఉండగా, ప్రధాన పాత్రలు పోషించిన రాకేష్ పర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచింది. కాలేజీ రోజుల నుంచే ప్రజా సమస్యల కోసం పోరాడుతూ దేశం కోసం ధర్మం కోసం నక్సలైట్ల తో జితేందర్ రెడ్డి చేసిన పోరాటాన్ని ఈ సినిమా లో చూపించారు. అంతే కాకుండా, ఆ తర్వాత అతను రాజకీయాల్లోకి రావడం, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న సీనియర్ ఎన్టీఆర్తో మాట్లాడటం ట్రైలర్ లో చూపించారు. వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
ఓటీటీలో మరో క్రేజీ మూవీ.. ఇది 69 ఏళ్ల వృద్ధుడి కథ
థియేటర్లలో అంటే కమర్షియల్ అంశాలు ఉండాలి, లేదంటే ప్రేక్షకులు చూడరు అంటుంటారు. ఓటీటీలకు అలాంటి ఇబ్బందులేం ఉండవు. ఏం చెప్పాలి అనిపిస్తే అది చెప్పేయొచ్చు. బౌండరీలు ఉండవు. దీంతో అప్పుడప్పుడు కొన్ని మంచి కథలు వస్తుంటాయి. తాజాగా రిలీజైన 'విజయ్ 69' అనే హిందీ మూవీ ట్రైలర్ చూస్తుంటే అదే అనిపించింది. ఇంతకీ ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు రానుందంటే?(ఇదీ చదవండి: తెలుగు నిర్మాత.. హైదరాబాద్లోని చెరువులో దూకేశాడు: శ్రియ)బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ లీడ్ రోల్ చేసిన సినిమా 'విజయ్ 69'. పేరుకి తగ్గట్లే 69 ఏళ్ల వయసులో ట్రయథ్లాన్ పూర్తి చేసి రికార్డ్ సాధించాలనేది ఇతడి కల. ఇందులో భాగంగా 1.5 కిలోమీటర్ల స్విమ్మింగ్, 40 కి.మీ సైక్లింగ్, 10 కి.మీ రన్నింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ విజయ్ని కుటుంబ సభ్యులు, ఫ్రెండ్, ఇలా ప్రతి ఒక్కరూ డిసప్పాయింట్ చేసేవాళ్లే. కానీ కలలకు వయసుతో సంబంధం లేదు. చెప్పాలంటే వాటికి ఎక్స్పైరీ డేట్ ఉండదని చివరకు నిరూపిస్తాడు. ఇదే కాన్సెప్ట్.నవంబరు 8 నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది చూస్తుంటే వర్కౌట్ అయ్యేలా ఉంది. కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా బాగానే దట్టించినట్లు ఉన్నారు. ప్రస్తుతానికి హిందీ మాత్రమే అని చెప్పారు కానీ ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేటప్పుడు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. ఎమోషనల్ డ్రామా మూవీస్ అంటే ఇష్టముంటే మాత్రం దీన్ని మిస్ కావొద్దు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?) -
కిరణ్ అబ్బవరం 'క' ట్రైలర్ రిలీజ్
యువహీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా 'క'. గురువారం ట్రైలర్ రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సాంకేతిక కారణాల వల్ల కుదరలేదు. దీంతో తాజాగా దాన్ని రిలీజ్ చేశారు. పూర్తి రిచ్నెస్తో థ్రిల్లింగ్గా భలే అనిపించింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)'క' ట్రైలర్ చూస్తే.. చుట్టూ కొండల మధ్య కృష్ణగిరి అనే అందమైన ఊరి. అక్కడ పోస్ట్ మ్యాన్ అభినయ వాసుదేవ్. మధ్యాహ్నమే చీకటి పడే ఈ ఊరు. 1979 ఏప్రిల్ 22న అభిషేక్ పేరుతో వచ్చిన ఉత్తరం వాసుదేవ్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ ఉత్తరంలో ఏముందో చెప్పమంటూ ఓ ముసుగు వ్యక్తి వాసుదేవ్ని బెదిరిస్తాడు. ఆ ఉత్తరంలో ఏముంది ?, వాసుదేవ్ ను ఆ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు ? అనేదే స్టోరీ.గ్రిప్పింగ్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్గా 'క' సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. ఈ సినిమాలో కిరణ్ సరసన నయన్ సారిక, తన్వీ రామ్ నటించారు. సుజీత్-సందీప్ దర్శకులు. దీపావళి సందర్భంగా ఈ నెల 31న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో థియేటర్లలో రిలీజ్ అవుతోంది.(ఇదీ చదవండి: 'నరుడి బ్రతుకు నటన' సినిమా రివ్యూ) -
దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' ట్రైలర్
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం 'లక్కీ భాస్కర్'. ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను మెప్పించాయి. ఇందులో మీనాక్షీ చౌదరి హీరోయిన్,సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ అంచనాలతో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ను నిర్మించారు. అయితే, తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.'లక్కీ భాస్కర్' దీపావళి కానుకగా థియేటర్లోకి రానున్నాడు. తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో అక్టోబరు 31న రిలీజ్ చేయనున్నామనీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఓ సాధారణ వ్యక్తికి చెందిన అసాధారణ ప్రయాణమే ఈ చిత్రమని వారు చెప్పుకొచ్చారు. 1980ల నాటి బొంబాయి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. -
ప్రశాంత్ నీల్ కథతో సినిమా.. 'బఘీర' ట్రైలర్ చూశారా?
'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో తెలుగులోనూ బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఎన్టీఆర్ కొత్త మూవీ కోసం రెడీ అవుతున్నాడు. డైరెక్టర్గా పుల్ ఫామ్లో ఉన్న నీల్.. 'బఘీరా' సినిమాకు స్టోరీ అందించాడు. తాజాగా ఆ చిత్ర తెలుగు ట్రైలర్ని రిలీజ్ చేశారు.శ్రీమురళి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించిన 'బఘీరా' సినిమాను.. 'కేజీఎఫ్', 'సలార్' నిర్మించిన హోంబల్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్తో నిర్మించింది. డాక్టర్. సూరి దర్శకుడు. ట్రైలర్ చూస్తుంటే మంచి యాక్షన్ ఫీస్ట్లా అనిపించింది. అమ్మ సెంటిమెంట్, ముసుగు వేసుకుని విలన్లని చంపడం లాంటివి 'కేజీఎఫ్' చిత్రాన్ని గుర్తుచేస్తున్నాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 24 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)ట్రెలర్ బట్టి చూస్తే.. చిన్నప్పుడు తల్లిని పోగొట్టుకున్న ఓ పిల్లాడు.. పెద్దయ్యాక పోలీస్ అవుతాడు. న్యాయం జరగట్లేదని, ముసుగు వేసుకుని 'బఘీరా' గెటప్లో విలన్లని చంపుతుంటాడు. చివరకు బఘీరాని పోలీసులు పట్టుకున్నారా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది.కన్నడతో పాటు తెలుగులోనూ దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే 'లక్కీ భాస్కర్', 'క' లాంటి తెలుగు స్ట్రెయిట్ మూవీస్, 'అమరన్' అనే డబ్బింగ్ దీపావళికి రిలీజ్ కానున్నాయి. మరి వీటితో పోటీపడి మరీ తెలుగులో 'బఘీరా' ఏ మేరకు ప్రేక్షకుల్ని అలరిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో) -
'సౌండ్ ఎక్కువైతే బోర్ చేస్తా'.. విశ్వక్సేన్ మాస్ ట్రైలర్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో మెకానిక్ రాకీ అంటూ అభిమానులను అలరించేందుకు వచ్చేస్తున్నాడు. ఈ చిత్రంలో గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో హిట్ కొట్టిన మాస్ కా దాస్ మరో బ్లాక్బస్టర్ను తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అయిపోయారు. ఈ చిత్రానికి రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. హైదరాబాద్లోని మూసాపేట్లో ఉన్న శ్రీరాములు థియేటర్లో మెకానిక్ రాకీ ట్రైలర్ 1.0ను లాంఛ్ చేశారు. ట్రైలర్ చూస్తే మరోసారి మాస్ పాత్రలో విశ్వక్సేన్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మెకానిక్ పాత్రలో ఫ్యాన్స్ను అలరించనున్నాడు. అంతే కాకుండా మాస్ యాక్షన్తో పాటు ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా ఉందని ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ రివీల్ చేశారు.కాగా.. ఈ చిత్రంలో సునీల్, వీకే నరేష్, హైపర్ ఆది, హర్ష వర్ధన్, వైవా హర్ష, రఘురామ్ కీలక పాత్రలు పోషించారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రజనీ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మెకానిక్ రాకీ మూవీకి జేక్స్ బిజోయ్ సంగీతమందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 22న థియేటర్లలో సందడి చేయనుంది. -
బిచ్చగాడిలా మారిపోయిన యంగ్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా?
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో చాలా ప్రయోగాలు చేశారు. హిట్ కొట్టడంతో పాటు ప్రేక్షకుల మనసుల్ని కూడా గెలుచుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం రొటీన్ రొట్ట కొట్టుడు కమర్షియల్ మూవీస్ ఎక్కువగా తీస్తున్నారు. కొద్దోగొప్పో పలువురు చిన్న హీరోలు ప్రయోగాలు చేస్తున్నారు గానీ పెద్దగా వర్కౌట్ కావట్లేదు. తాజాగా తమిళ యంగ్ హీరోని బిచ్చగాడు పాత్రలో పెట్టి ఏకంగా సినిమా తీసేశారు.(ఇదీ చదవండి: 'లెవల్ క్రాస్' సినిమా రివ్యూ (ఓటీటీ))తమిళ బిగ్బాస్ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న కవిన్.. రీసెంట్ టైంలో 'దాదా' అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా కాస్త పరిచయమే. ఇప్పుడు ఇతడిని హీరోగా పెట్టి 'బ్లడీ బెగ్గర్' అనే మూవీ తీశారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. బిచ్చగాడు పాత్రలో కనిపించిన సీన్స్ చూసి ఆశ్చర్యపోయారు. నిజం బెగ్గర్ ఏమో అనుకునేంతలా పరకాయ ప్రవేశం చేశాడనిపించింది.దివ్యాంగుడిలా నటిస్తూ బిచ్చమెత్తుకుంటే జీవించే ఓ బెగ్గర్.. ఊహించని పరిస్థితుల్లో ఓ ఇంట్లో పెద్ద కుటుంబం మధ్యలో చిక్కుకుపోతే ఏం జరిగింది? చివరకు ఆ ఇంటినుంచి బయటపడ్డాడా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది. 'బీస్ట్', 'జైలర్' సినిమాలతో దర్శకుడిగా ఆకట్టుకున్న నెల్సన్.. ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ఈ మూవీ రిలీజ్ కానుంది. తమిళ వెర్షన్ మాత్రమే థియేటర్లలోకి వస్తుంది. కొన్నాళ్లకు డబ్బింగ్ వెర్షన్ ఓటీటీలోకి వస్తుంది. (ఇదీ చదవండి: బిగ్బాస్ 8 ఎలిమినేషన్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు కానీ!) -
అనన్య నాగళ్ల పొట్టేల్.. ట్రైలర్ వచ్చేసింది!
అనన్య నాగళ్ల, యువచంద్ర కృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం పొట్టేల్. 1980లోని తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. బందం రేగడ్, సవారీ చిత్రాల ఫేమ్ సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే ఆ కాలంలో మూఢ నమ్మకాల నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కూతురికి చదివించాలని తండ్రిపడే తపన.. ఆ నాటి పరిస్థితులే కథాంశంగా తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఈనెల 25న థియేటర్లలో పొట్టేల్ సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీమందించారు. అజయ్, నోయెల్, ప్రియాంక శర్మ కీలక పాత్రలు పోషించారు. -
ఓటీటీకి థ్రిల్లర్ వెబ్ సిరీస్.. రానా చేతుల మీదుగా ట్రైలర్
నవీన్ చంద్ర, ముత్తు కుమార్, నందా, శ్రిందా, మనోజ్ భారతీ రాజా కీలక పాత్రల్లో తెరకెక్కించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్. నలుగురు పిల్లల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ థ్రిల్లర్ సిరీస్ను రూపొందించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈనెల 18 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది.ఈ నేపథ్యంలో తెలుగు ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ విషయాన్ని రానా తన ట్విటర్లో షేర్ చేశారు. కాగా.. వెబ్ సిరీస్ తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ సిరీస్కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్కు భరత్ మురళీధరన్, అశోక్ వీరప్పన్, కమలా అల్కెమిస్ దర్శకత్వం వహించారు.DANGER awaits at every step.Ee Vaikuntapaali aata chudadaniki meeru siddhama?🔥Trailer Out Now: https://t.co/jpNQ20usGi#SnakesandLaddersOnPrime, New Series, Oct 18 only on @PrimeVideoIN@stonebenchers @karthiksubbaraj @kalyanshankar @kaarthekeyens @Naveenc212 @nandaa_actor…— Rana Daggubati (@RanaDaggubati) October 16, 2024 -
రాయలసీమ నేపథ్యంలో వస్తోన్న లవ్ స్టోరీ.. ట్రైలర్ చూశారా?
అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం లవ్ రెడ్డి. ఈ సినిమాను గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా స్మరన్ రెడ్డి డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ - 'లవ్ రెడ్డి సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. 20 మంది యంగ్ టాలెంటెడ్ హీరోలు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ నెల 18న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్' అని అన్నారు.లవ్ రెడ్డి సినిమా ట్రైలర్ చూస్తే లవ్, ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రాయలసీమ నేపథ్యంలో ఈ ప్రేమకథను రూపొందించారు. ఈ ప్రేమ కథ చివరికి ఎక్కడికి చేరిందనేది ట్రైలర్లో ఆసక్తికరంగా చూపించారు. రాయలసీమ నేపథ్యంతో, అక్కడి యాసలో సినిమా ప్రేక్షకుల ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. -
'సిటాడెల్' ట్రైలర్.. ఫైట్స్ అదరగొట్టేసిన సమంత
సమంత సినిమా వచ్చి చాలా కాలమైపోయింది. చివరగా 'ఖుషి' మూవీ చేసింది. అనారోగ్య సమస్యల కారణంగా యాక్టింగ్ కొన్నాళ్లు పక్కనబెట్టేసింది. కొత్త మూవీస్ కూడా పెద్దగా ఒప్పుకోలేదు. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తీసిన దర్శకులు.. 'సిటాడెల్: హనీ-బన్నీ' పేరుతో ఓ సిరీస్ తీస్తున్నారు. ఇందులో సమంత, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ లీడ్ రోల్స్ చేశారు. ఇప్పుడు ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'పుష్ప2' ప్రతి సీన్ ఇంటర్వెల్లా ఉంటుంది: దేవిశ్రీ ప్రసాద్)ట్రైలర్ చూస్తే సిరీస్ అంతా ఫుల్ యాక్షన్ ఉండటం గ్యారంటీ అనిపిస్తుంది. ఇందులో సమంత ఓ సీక్రెట్ ఏజెంట్. ఈమెకు ఓ కూతురు కూడా ఉంటుంది. మరోవైపు వరుణ్ కూడా సీక్రెట్ ఏజెంట్. వీళ్లిద్దరూ ఎలా కలిశారు? ఏ మిషన్స్ పూర్తి చేశారు అనేదే స్టోరీ అని తెలుస్తోంది. ట్రైలర్లోనే ఫుల్ యాక్షన్ దట్టించారు. గన్ ఫైరింగ్, ఫైటింగ్.. ఇలా సమంత అదరగొట్టేసింది.అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నవంబరు 7 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ట్రైలర్తోనే బజ్ వచ్చిందంటే మాత్రం సిరీస్పై కచ్చితంగా ఆసక్తి పెరుగుతుంది. సమంత కొత్త ట్రైలర్పై మీరు ఓ లుక్కేసేయండి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు) -
పుష్ప నటుడి థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ చూశారా?
పుష్ప నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సైకలాజికల్ థ్రిల్లర్ బౌగెన్విల్లా. ఈ సినిమాకు అమల్ నీరద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కుంచాకో బోబన్, జ్యోతిర్మయి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా అక్టోబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది.కాగా.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ పుష్ప మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. పుష్ప సీక్వెల్ పార్ట్-2 లోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
లగ్గం మూవీ ట్రైలర్.. నూతన వధూవరులకు సర్ప్రైజ్!
సాయి రోనక్, ప్రజ్ఞ నగ్రా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని సుభిషి ఎంటర్టైనమెంట్స్ పతాకంపై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, పోస్టర్స్, టీజర్కు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.అయితే ట్రైలర్ రిలీజ్ను రోటీన్కు భిన్నంగా ప్లాన్ చేశారు మేకర్స్. లగ్గం మూవీ ట్రైలర్ను రియల్గా పెళ్లి చేసుకుంటున్న నూతన వధూవరుల చేతుల మీదుగా విడుదల చేశారు. ఓ కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో సినిమా టీమ్ అంతా పాల్గొన్నారు. వెరైటీగా మూవీ ప్రమోషన్స్ చేయడంతో మూవీ టీమ్ను అభినందించారు. వధూవరులు సైతం ఆనందం వ్యక్తం చేశారు. కాగా.. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, రోహిణి, సప్తగిరి, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు చరణ్ అర్జున్ సంగీతమందించారు. Here’s the unique #Laggam trailer launch event video, out now! ✨▶ https://t.co/6ex2wPVLMq#LaggamOnOct25th#RajendraPrasad @rameshcheppala #Venugopalreddy @saironak3 @pragyanagra #BalReddy @CharanArjunwave @bnreddystar @SreedharSri4u @Subishiofficial #LaggamMovie… pic.twitter.com/0cu1eQsVaZ— Aditya Music (@adityamusic) October 10, 2024 A celebration of love, laughter, and family like never before! The ultimate marriage and family entertainer #Laggam trailer is out now on @adityamusic.▶ https://t.co/u14wc4vcps#LaggamOnOct25thTrailer launched by real Bride & Bridegroom pic.twitter.com/2VzUmhZjwb— Madhu VR (@vrmadhu9) October 10, 2024 -
ఆత్మల కాన్సెప్ట్తో వస్తోన్న హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
విద్యా బాలన్, కార్తీక్ ఆర్యన్, మాధురి దీక్షిత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన భూల్ భూలయ్యా-3. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ కీలకపాత్రలో కనిపించనుంది. హారర్ కామెడీ చిత్రంగా వస్తోన్న ఈ సినిమాకు అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. గతంలో ఈ సిరీస్లో వచ్చిన రెండు చిత్రాలు సూపర్ హిట్గా నిలిచాయి. దీంతో మూడో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్.తాజాగా భూల్ భూలయ్యా -3 ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ మంజూలిక పాత్రల్లో నటించారు. దాదాపు మూడు నిమిషాల యాభై సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఈ హారర్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్లోని హారర్ సీన్స్ మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఈ చిత్రంలో రాజ్పాల్ యాదవ్, విజయ్ రాజ్, అశ్విని కల్సేకర్, రాజేష్ శర్మ, సంజయ్ మిశ్రా కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 1న దీపావళి కానుకగా విడుదల కానుంది. రోహిత్ శెట్టి డైరెక్షన్లో వస్తోన్న సింగం ఎగైన్తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. -
సరికొత్త కాన్సెప్ట్తో జనక అయితే గనక.. ఆసక్తిగా ట్రైలర్
టాలీవుడ్ హీరో సుహాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాదిలో మరో మూవీతో అలరించేందుకు వస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్లతో సినీ ప్రియులను ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్నాడు. తాజాగా సుహాస్ నటించిన చిత్రం జనక అయితే గనక. ఈ సినిమాను సందీప్ రెడ్డి బండ్ల డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సంకీర్తన హీరోయిన్గా నటించగా.. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ విజయదశమి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం పిల్లలు పుడితే లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందో అన్న కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కించారుపిల్లలంటే భయపడే ఓ వ్యక్తి జీవితంగా ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించారు. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా గురించి దిల్ రాజు మాట్లాడారు. సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉందని ఆయన తెలిపారు. ఈనెల 12న జనక అయితే గనక థియేటర్లలో అలరించనుంది. -
మహేశ్ రిలీజ్ చేసిన 'మా నాన్న సూపర్ హీరో' ట్రైలర్
సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మా నాన్న సూపర్ హీరో'. పేరుకి తగ్గట్లే నాన్న అనే సెంటిమెంట్తో ఈ సినిమా తీశారు. హీరోకి ఇద్దరు నాన్నలు ఉండటం అనే కాన్సెప్ట్తో టీజర్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హీరో మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఇంతకీ ఇది ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: మెగా హీరో 'మట్కా' టీజర్ ఎలా ఉందంటే?)డబ్బు కోసం కొడుకుని మరొకరి అమ్మేస్తాడు ఓ తండ్రి. పెరిగి పెద్దయిన తర్వాత ఈ విషయం కొడుక్కి తెలుస్తుంది. ఆ తర్వాత కన్న తండ్రి, పెంచిన తండ్రితో ఎలాంటి జర్నీ సాగింది. చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది. ఫుల్ ఆన్ ఎమోషనల్ రైడ్గా ఉండబోతుందని తెలుస్తోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కనెక్ట్ అయ్యేలా ఉంది.సుధీర్ బాబు కొడుకుగా నటించగా.. సాయాజీ షిండే, సాయిచంద్ తండ్రి పాత్రల్లో కనిపించారు. అభిలాష్ కంకర దర్శకుడు. అక్టోబరు 11న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే దసరా రేసులో వేట్టయిన్, విశ్వం, జనక అయితే గనక సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు సూపర్ హీరో నాన్న పోటీలో ఉన్నాడు. మరి హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: మణికంఠ గాలి తీసేసిన నాగార్జున.. స్ట్రాటజీలన్నీ బయటపెట్టేసి) -
వారం రోజులు అక్కర్లేదు!
‘‘ఖైదు చెయ్ ఖైదు చెయ్... నేరస్తుణ్ణి ఖైదు చెయ్... ఖైదు చెయ్ ఖైదు చెయ్... నేరస్తుణ్ణి ఖైదు చెయ్’’ అంటూ మొదలవుతుంది ‘వేట్టయాన్: ద హంటర్’ సినిమా తెలుగు ట్రైలర్. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వేట్టయాన్’. అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్ ఇతర లీడ్ రోల్స్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘వేట్టయాన్’ ట్రైలర్ను బుధవారం విడుదల చేశారు. ‘ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదు. కానీ పోరంబోకులకు బాగా భద్రత ఉంది’, ‘నేరస్తుణ్ణి వెంటనే పట్టుకోవాలి. అందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోండి’, ‘ఒక వారంలో ఎన్కౌంటర్ జరిగిపోవాలి’ (రావు రమేశ్), ‘అక్కర్లేదు సార్... వారం రోజులు అక్కర్లేదు... మూడే రోజుల్లో డిపార్ట్మెంట్కు మంచి పేరు వస్తుంది’ (రజనీకాంత్), ‘కాలం విలువ తెలిసిన మనిషి మాత్రమే ఏదైనా సాధించగలడు’ (రానా), ‘న్యాయం అన్యాయం అయినప్పుడు న్యాయంతోనే సరిచేయాలి. అంతేకానీ... ఇంకో అన్యాయంతో కాదు’ (అమితాబ్ బచ్చన్), ‘నన్ను ఏ పోస్ట్లోకి తిప్పికొట్టినా నేను మాత్రం పోలీస్వాడినే సార్... నా నుంచి వాడిని కాపాడటం ఎవ్వరి వల్ల కాదు (రజనీకాంత్)’ అన్న డైలాగ్స్ ఈ ట్రైలర్లో ఉన్నాయి. -
రజినీకాంత్ 'వెట్టైయాన్'.. ట్రైలర్ వచ్చేసింది!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వెట్టైయాన్. టీజీ జ్ఞానలేల్ డైరెక్షన్లో ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరెకెక్కించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇప్పటికే రిలీజైన 'మనసియాలో' అనే సాంగ్ తలైవా ఫ్యాన్స్ను ఊర్రూతలూగిస్తోంది. తాజాగా వేట్టైయాన్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.(ఇది చదవండి: ఆస్పత్రిలో రజినీకాంత్.. కోలుకోవాలంటూ విజయ్ ట్వీట్!) కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషిస్తున్నారు. బిగ్బీ అమితాబ్ బచ్చన్ కూడా ాకనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ దసరాకు అక్టోబర్ 10 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ మూవీలో ఫాహాద్ ఫాజిల్, రితికా సింగ్, మంజు వారియర్, దుషారా విజయన్ ముఖ్య పాత్రల్లో నటించారు. -
హీరోగా టాలీవుడ్ రచయిత మనవడు.. ఆసక్తిగా ట్రైలర్!
ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్ పరుచూరి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం మిస్టర్ సెలెబ్రిటీ. ఈ సినిమాకు రవి కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్పీ సినిమాస్ బ్యానర్పై ఎన్ పాండురంగారావు, చిన్నా రెడ్డి నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.(ఇది చదవండి: అతనంటే చిరాకు.. ఆ షో అంతా ఓ చెత్త: సినీయర్ నటుడు ఆగ్రహం)ట్రైలర్ చూస్తే ఒక సెలబ్రిటీగా మారాలనుకునే యువకుడి కథనే సినిమాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హనుమాన్ నటి వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్రలో కనిపించనుంది. అంతేకాకుండా సీనియర్ నటి ఆమని,శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. Wishing best wishes to #ParuchuriSudarshan and the entire team of #MrCelebrity!The trailer looks very promising 👍🏻https://t.co/wxnwA3YIQCIn theatres from October 4th@varusarath5 #ChandinaRaviKishore #NPandurangarao— Rana Daggubati (@RanaDaggubati) October 2, 2024 -
రజినీకాంత్ వెట్టైయాన్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
సూపర్స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న తాజా చిత్రం వెట్టైయాన్. ఈ సినిమాను టీజీ జ్ఞానవేల్ డైరెక్షన్లో భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా బిగ్బీ అమితాబ్ బచ్చన్ కూడా కనిపించనున్నారు. ఈ దసరాకు థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. వేట్టైయాన్ ట్రైలర్ను అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా.. ఇప్పటికే ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా రన్టైమ్ దాదాపు 2 గంటల 43 నిమిషాల 25 సెకన్లు ఉన్నట్లు తెలుస్తోంది. వెట్టైయాన్కు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. మూడు చోట్ల డైలాగ్స్పై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటిని మ్యూట్ చేయాలని.. లేదంటే వేరే పదాలు వినియోగించాలని చిత్ర బృందానికి సూచించింది.(ఇది చదవండి: రజినీకాంత్తో నటించావా? అని అడిగారు.. రాయన్ ఫేమ్ ఆసక్తికర కామెంట్స్!)ఈ మూవీలో ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్, మంజు వారియర్, దుషారా విజయన్ కీలక పాత్రలు పోషించారు. తెలుగులోనూ ఇదే పేరుతో వెట్టైయాన్ విడుదల కానుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.The Target is set! 🎯 The VETTAIYAN 🕶️ trailer is dropping on October 2nd. 🔥 Get ready to catch the prey. 🦅#Vettaiyan 🕶️ Releasing on 10th October in Tamil, Telugu, Hindi & Kannada!@rajinikanth @SrBachchan @tjgnan @anirudhofficial @LycaProductions #Subaskaran… pic.twitter.com/Qs8w8xJRqH— Lyca Productions (@LycaProductions) September 30, 2024 -
సమ్థింగ్ డిఫరెంట్గా 'స్వాగ్' ట్రైలర్
యంగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ 'స్వాగ్'. ఇందులో సింగ, భవభూతి, యయాతి, కింగ్ భవభూతి అనే నాలుగు పాత్రల్లో కనిపిస్తాడు. వీటన్నింటికీ డిఫరెంట్ షేడ్స్ ఉండటంతో పాటు డైలాగ్ డెలివరీ కూడా అంతే డిఫరెంట్గా ఉంది. 1551లో మొదలైన ఈ కథ ప్రస్తుతం వరకు దాదాపు నాలుగు టైమ్ లైన్స్లో ఉండనుంది. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ట్రైలర్ని తాజాగా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)పురుషాధిక్యం అనే పాయింట్ ఆధారంగా 'స్వాగ్' సినిమా తీసినట్లు తెలుస్తోంది. చాలావరకు అచ్చ తెలుగు పదాలే వినిపిస్తున్నాయి. అక్టోబరు 4న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. గతంలో శ్రీవిష్ణుతోనే 'రాజరాజచోర' అనే హిట్ మూవీ తీసిన హసిత్ గోలి దీనికి దర్శకుడు.ఈ సినిమాతో మీరా జాస్మిన్ చాలారోజుల తర్వాత మళ్లీ తెలుగులో నటించింది. రీతూ వర్మ హీరోయిన్. సునీల్, దక్ష నగర్కర్, శరణ్య ప్రదీప్, గెటప్ శ్రీను, రవిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు.(ఇదీ చదవండి: Bigg Boss8: సోనియాని ఎలిమినేట్ చేసి మంచి పనిచేశారా?) -
హీరోగా రవితేజ వారసుడి ఎంట్రీ.. ట్రైలర్ వచ్చేసింది!
మాస్ మహారాజా రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన తమ్ముడు రఘు తనయుడు మాధవ్ హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం 'మిస్టర్ ఇడియట్'. ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్గా నటిస్తోంది. గౌరీ రోణంకి డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జేజేఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్ఎల్ పీ పతాకంపై రవిచంద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ కార్యక్రమంలో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పాల్గొన్నారు.డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ..' రవితేజ ఇండస్ట్రీలో నాలాంటి వారిని ఎంతోమందిని సపోర్ట్ చేశారు. ఈ ఫంక్షన్కు పిలిచినప్పుడు మాధవ్కు సపోర్ట్ చేయడం నా బాధ్యతగా భావించి వచ్చా. టైటిల్ మిస్టర్ ఇడియట్ అని చెప్పగానే నాకు ఇడియట్ సినిమా చూసిన రోజులు గుర్తొచ్చాయి. నేను కూడా చంటిగాడిలా ఫీలయ్యేవాడిని. ఆ సినిమాలో హీరోయిజం కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. రవితేజ స్థాయికి మాధవ్ చేరుకోవాలని కోరుకుంటున్నా. మిస్టర్ ఇడియట్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా' అని అన్నారు. -
స్టార్ హీరోయిన్ మూవీ.. ట్రైలర్ రిలీజ్ చేసిన రామ్ చరణ్!
బాలీవుడ్ భామ అలియా భట్ నటించిన తాజా చిత్రం జిగ్రా. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది. ఈనెల 27న విడుదల కావాల్సిన జిగ్రా.. దేవర ఎంట్రీతో బాక్సాఫీస్ నుంచి తప్పుకుంది. ఈ చిత్రంలో వేదాంగ్ రైనా కీలక పాత్ర పోషిస్తున్నాడు. వాసన్ బాలా దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, ఎటర్నల్ సన్షైన్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, షహీన్ భట్, సౌమెన్ మిశ్రాతో పాటు ఆలియా భట్ కూడా నిర్మాత వ్యవహరిస్తున్నారు.తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. జిగ్రా తెలుగు వర్షన్ థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సొంతం చేసుకుంది. అక్టోబర్ 11న దసరా సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది. కాగా.. సినిమాలో భారీ యాక్షన్తో కూడిన స్టంట్స్ కూడా ఆలియా భట్ చేశారు. తన తమ్ముడిని రక్షించుకునేందుకు ఆమె చేసిన సాహసం ఎలాంటిదో ఈ చిత్రంలో దర్శకుడు చూపించారు. ఇప్పటికే విడుదలైన హిందీ ట్రైలర్పై చాలామంది బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. The #Jigra trailer looks absolutely amazing… taking you on an emotional rollercoaster! Best wishes to Alia and the entire team for a blockbuster release on October 11th! ❤️🔥Here's the Telugu trailer!https://t.co/a5AabB24uZ#JigraTelugu #KaranJohar @apoorvamehta18 @aliaa08… pic.twitter.com/oXeWCs4U7V— Ram Charan (@AlwaysRamCharan) September 29, 2024 -
Jigra Trailer: యాక్షన్తో అదరగొట్టిన ఆలియా
ఆలియా భట్ ప్రధాన పాత్రధారిగా, వేదంగ్ రైనా మరో కీలక పాత్రలో నటించిన హిందీ చిత్రం ‘జిగ్రా’. ‘మౌనిక ఓ మై డార్లింగ్, పెడ్లర్స్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన వాసన్ బాల ‘జిగ్రా’ చిత్రాన్ని తెరకెక్కించారు. కరణ్ జోహార్, అపూర్వ మెహతా, ఆలియా భట్, షాహిన్ భట్, సోమెన్ మిశ్రా నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో సత్యా ఆనంద్ పాత్రలో ఆలియా భట్, అంకుర్ ఆనంద్ పాత్రలో వేదంగ్ రైనా నటించారు. మరణ శిక్ష విధించబడి, జైల్లో మూడు నెలల్లో మరణించనున్న తన తమ్ముణ్ణి ఓ అక్క ఏ విధంగా కాపాడుకుంది? అనే కోణంలో ‘జిగ్రా’ కథ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ‘నన్ను నేను ఓ ఎథికల్ పర్సన్గా ఎప్పుడూ అనుకోలేదు. అంకుర్కి సిస్టర్గానే అనుకున్నాను, లోపల ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నారా?, అంత ధైర్యం ఎవరికి ఉంది? నువ్వు నా సిస్టర్గా ఉన్నప్పుడు’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ట్రైలర్లో ఆలియా యాక్షన్, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. -
సస్పెన్స్ థ్రిల్లర్గా కలి.. ట్రైలర్ చూశారా?
యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కలి". ప్రముఖ కథా రచయిత కె.రాఘవేంద్రరెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు రచించి దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 4న విడుదల కానుంది. ఈ క్రమంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా "కలి" మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ - "కలి" ట్రైలర్ థ్రిల్లింగ్ గా అనిపించింది. టీమ్ అంతా మంచి ఎఫర్ట్స్ పెట్టి చేశారు. వీఎఫ్ఎక్స్ హై క్వాలిటీతో ఉన్నాయి. "కలి" మూవీ చూసేందుకు నేనూ వెయిట్ చేస్తున్నా అన్నారు.కలి ట్రైలర్ విషయానికి వస్తే.. శివరామ్ (ప్రిన్స్) మంచి వ్యక్తిత్వం ఉన్న పర్సన్. అతని మంచితనం వల్ల ఇబ్బందులు పడుతుంటాడు. 'నువ్వు మంచివాడివే కానీ.. కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో నీకు తెలియదంటూ' ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వాళ్ల పాపను తీసుకుని వెళ్లిపోతుంది. ఈ కష్టాలతో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమవుతాడు శివరామ్. ఆ రాత్రి అతని ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి (నరేష్ అగస్త్య) వస్తాడు.ఈ వ్యక్తి ఎవరు, అతను వచ్చాక శివరామ్ జీవితంలో ఎదురైన అనూహ్య ఘటనలు ఏంటి? అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ప్రియదర్శి వాయిస్ ఓవర్ నవ్వించింది. 'మనిషి పుట్టడంతోనే జీవితం అనే శత్రువును వెంటేసుకుని మరీ పుడతాడు. దాని మీద గెలిచినోడే గొప్పోడవుతాడు. ఓడినోడు మధ్యలోనే...' అనే డైలాగ్ "కలి" కథలోని సారాంశాన్ని చెప్పింది. -
ఎన్టీఆర్ 'దేవర' నుంచి మరో ట్రైలర్?
ఎన్టీఆర్ 'దేవర' మూవీ రిలీజ్కి మరో ఆరురోజులే ఉంది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలు, ప్రమోషనల్ కంటెంట్ బాగానే ఇస్తున్నారు. మరోవైపు ఆదివారం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది. వీటన్నింటితో పాటు 'దేవర' టీమ్ మరో సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేసిందట.(ఇదీ చదవండి: తీస్తే 'దేవర' 8-9 గంటల సినిమా అయ్యేది: ఎన్టీఆర్)కొన్నిరోజుల క్రితం 'దేవర' ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే దీనికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ మూవీపై కాస్త నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైంలో మూవీపై హైప్ పెరగాలంటే మాస్ కంటెంట్ రావాలి. ఇందుకు తగ్గట్లే ఫుల్ యాక్షన్ సీన్స్తో ట్రైలర్ రెడీ చేశారని, దీన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.మరోవైపు 'ఆయుధ పూజ' సాంగ్ కూడా ఈ పాటికే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఎందుకో వెనక్కి తగ్గారు. బహుశా థియేటర్లలో చూసి థ్రిల్ అవ్వాలని ఇలా ప్లాన్ చేశారేమో. ఇకపోతే 'దేవర'లో తారక్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్గా చేశాడు. అనిరుధ్ సంగీత దర్శకుడు కాగా కొరటాల దర్శకుడు. సెప్టెంబరు 27న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ నోట తమిళనాడు ఫేమస్ బిర్యానీ.. ఏంటంత స్పెషల్?) -
ఫన్నీగా 'పైలం పిలగా'.. ట్రైలర్ చూశారా?
సాయి తేజ కల్వకోట, పావని కరణం జంటగా నటించిన చిత్రం పైలం పిలగా. హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు, టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను డైరెక్టర్ వెంకటేష్ మహా లాంచ్ చేశారు. పల్లె నుంచి పట్నం దాకా ఈ గ్లోబలైజేషన్ యుగంలో యువత ఉద్యోగాల కన్నా సొంత స్టార్ట్ అప్లు, వ్యాపారాల వైపే పరుగులు పెడుతున్నారు. కోట్లు సంపాదించాలని కలలు కంటున్నారు. ఇలాగే ఓ యువకుడు తన ఊళ్లోనే, తన భూమిలోనే సొంత వ్యాపారం ప్రారంభించి జీవితంలో ఎదగాలనుకుంటాడు. కానీ పంచాయితీ ఆఫీస్ నుంచి సెక్రటేరియట్ ఆఫీస్ వరకు సవాళ్లు, అవినీతి, అలసత్వం నిండిన బ్యూరోక్రసీ సిస్టంలో ఇరుక్కొని ఎన్ని బాధలు పడ్డాడో తెలిపే హాస్యభరిత వ్యంగ చిత్రమే పైలం పిలగా. నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ వంటి టాలీవుడ్, బాలీవుడ్ అగ్రనటులతో వందకి పైగా యాడ్ ఫిలిమ్స్ కి డైరెక్షన్ చేసిన ఆనంద్ గుర్రం ఈ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం కానున్నాడు. ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ సందర్బంగా డైరెక్టర్ వెంకటేష్ మహా మాట్లాడుతూ ఈ చిత్ర దర్శకుడు ఆనందం గుర్రం రాసిన 'ఊరెళ్ళిపోతా మావ', 'కంచె లేని దేశం' పాటలకు పెద్ద అభిమానిని, ఇప్పుడు ఈ సినిమాలో పాటలు కూడా చాలా బాగున్నాయి. సినిమా ట్రైలర్ మంచి డైలాగ్స్ తో చాలా ఇంట్రెస్టింగా ఉంది అన్నారు.హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై రామకృష్ణ బొద్దుల, ఎస్.కే.శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం లో డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు నటించారు. యశ్వంత్ నాగ్ సంగీతం అందించగా సందీప్ బద్దుల సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించారు. -
ఆసక్తికరంగా సుహాస్ ‘గొర్రె పురాణం’ ట్రైలర్
టాలీవుడ్లో విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న నటుడిగా సుహాస్కు గుర్తింపు ఉంది . ఈ క్రమంలో ఆయన నటించిన కొత్త సినిమా 'గొర్రె పురాణం' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. తాజాగా చిత్ర ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇటీవలే అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్, శ్రీరంగనీతులు, ప్రసన్నవదనం వంటి సినిమాలతో ప్రేక్షకులకు సుహాస్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు 'గొర్రె పురాణం' చిత్రంతో సెప్టెంబర్ 20న థియేటర్లోకి రానున్నారు. ఒక గ్రామంలో రెండు మతాల మధ్య ఒక గొర్రె ఎలా చిచ్చు పెట్టిందో ట్రైలర్తో హింట్ ఇచ్చారు. కోర్టు, కేసులు, గొడవలు ఇలా అన్నీ ఒక గొర్రె చుట్టూ సాగే ఎమోషనల్ డ్రామాగా సినిమా తెరకెక్కించారు. -
Khairatabad Ganesh: మహా ట్రైలర్ సిద్ధం
ఖైరతాబాద్: అశేష భక్తజనం పూజలందుకున్న శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి సాగర నిమజ్జనానికి తరలించేందుకు ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్కు చెందిన ట్రైలర్ వాహనం శనివారం ప్రాంగణానికి చేరుకుంది. వెల్డింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ట్రైలర్ పొడవు 75 అడుగులు, 11 అడుగుల వెడల్పు. 26 టైర్లు ఉన్న ఈ వాహనం 100 టన్నుల బరువు వరకు కూడా మోయగలదు. ఖైరతాబాద్ మహా గణపతిని నిమజ్జనానికి తరలించే వాహన సారథిగా నాగర్కర్నూల్ జిల్లా గౌతంపల్లి గ్రామానికి చెందిన భాస్కర్రెడ్డి ఈసారి కూడా వ్యవహరించనున్నారు. ‘మహా గణపతి బరువు 70 టన్నుల వరకు ఉంటుంది. నిమజ్జన సమయంలో ఎలాంటి పగుళ్లు రాకుండా నాలుగు లేయర్లుగా తయారీ చేశాం. 4 గంటల పాటు వర్షం వచ్చినా కరిగిపోదు. నిమజ్జనం పూర్తిచేసిన 7 గంటల్లో నీటిలో కరిగిపోతుంది’ అని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు.