
మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన ఎల్2 ఎంపురాన్ విడుదలకు సిద్దమైంది. ఈ చిత్రానికి సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. గతంలో లూసిఫర్కు సీక్వెల్గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
అయితే వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న మలయాళ స్టార్ మోహన్లాల్ మరో మూవీలో నటిస్తున్నారు. తాజాగా ఆ సినిమా ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. తుడరమ్ అనే క్రైమ్ థ్రిల్లర్లో ఆయన కనిపించనున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ జోడీగా శోభన హీరోయిన్గా నటించారు. ట్రైలర్ చూస్తే క్రైమ్ కామెడీ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తరుణ్ మూర్తి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మోహన్లాల్ షణ్ముఖం పాత్రను పోషిస్తుండగా.. శోభన లలితగా కనిపించింది. ఈ సినిమాను రెజపుత్ర విజువల్ మీడియా బ్యానర్పై ఎం రెంజిత్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment