Mohanlal
-
మనీ తీసుకోకుండా మూవీ
-
లూసీఫర్ 2 తెలుగు వెర్షనే చూడండి : పృథీరాజ్ సుకుమార్
మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్(Mohanlal), పృథ్వీరాజ్ సుకుమార్(Prithviraj Sukumaran) కాంబోలో తెరకెక్కిన భారీ చిత్రం ‘లూసిఫర్2: ఎంపురాన్’. ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. మురళీ గోపి కథను అందించారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మార్చి 27న మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం చిత్రబృందం ప్రీరిలీజ్ ప్రెస్మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా పృథ్విరాజ్ సినిమా గురించి మాట్లాడుతూ.. తెలుగులోనే ఈ చిత్రాన్ని చూడాలని కోరాడు. ‘మాములుగా ఏ డెరెక్టర్ అయినా కూడా తన సినిమాను ఒరిజినల్ వెర్షన్ చూడమని చెపుతారు. నేను మాత్రం లూసీఫర్ 2 తెలుగు వెర్షన్ చూడమని సలహా ఇస్తున్నాను. తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని తెలుగులోనే చూడండి. ఒరిజినల్ వెర్షన్ చూసిన ఫీలింగే కలుగుతుంది. డబ్బింగ్ విషయంలో టీమ్ బాగా కష్టపడి మంచి ఔట్పుట్ ఇచ్చింది. దిల్ రాజుగారు తెలుగు రాష్ట్రాల్లో మలయాళ వెర్షన్ కూడా రిలీజ్ చేస్తున్నారు కానీ.. నేను మాత్రం తెలుగులోనే చూడమని కోరుతున్నాను’ అన్నారు. మోహన్ లాల్ మాట్లాడుతూ.. ‘టాలీవుడ్ ప్రపంచంలోనే నెంబర్ వన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగులో సినిమా చేయాలని నేను కూడా ఎదురుచూన్నాను. మంచి కథ వస్తే కచ్చితంగా చేస్తాను. ఇప్పుడు ఏ సినిమా ఫైనల్ కాలేదు.అయితే కచ్చితంగా చెబుతాను’ అన్నారు. -
లూసిఫర్2: 'మోహన్లాల్' రెమ్యునరేషన్పై పృథ్వీరాజ్ కామెంట్స్
మలయాళ టాప్ హీరో మోహన్లాల్ నటించిన 'లూసిఫర్2: ఎంపురాన్' (L2 Empuraan) మార్చి 27న విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్లో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఆయన ఒక కీలకమైన పాత్రలో కూడా కనిపించనున్నారు. అయితే, ఈ సినిమా రెమ్యునరేషన్ వివరాల గురించి ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. 2019లో వచ్చిన లూసిఫర్ చిత్రానికి సీక్వెల్గా ఈ మూవీని భారీ బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సుమారు రూ.140 కోట్ల బడ్జెట్తో లూసిఫర్2 చిత్రాన్ని నిర్మించారు.'లూసిఫర్2' కోసం మోహన్లాల్ ఒక్కరూపాయి కూడా తీసుకోలేదని పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వల్లే ఈ సినిమాను తెరకెక్కించడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ముందుగా అనుకున్నదానికంటే బడ్జెట్ పెరగడంతో సినిమా చిత్రీకరణ విషయంలో కాస్త జాప్యం ఏర్పడిందని పృథ్వీరాజ్ తెలిపారు. ‘‘ఎల్ 2 ఎంపురాన్’లో స్టీఫెన్ గట్టుపల్లి (ఖురేషి అబ్రమ్)గా మోహన్లాల్, ఆయనకు రైట్ హ్యాండ్లా జయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు.మోహన్లాల్ రెమ్యునరేషన్ గురించి గతంలో కూడా పలు వార్తలు వచ్చాయి. లూసిఫర్ భారీ హిట్ కావడంతో దానికి సీక్వెల్ తీయాలని ఆయన అనుకున్నారు. ఈ క్రమంలో లైకా ప్రొడక్షన్ ముందుకు రావడంతో సినిమా మొదలైంది. అయితే, బడ్జెట్ పెరిగిపోవడంతో ఆ ఇబ్బందులు గ్రహించిన మోహన్లాల్ తనకు రెమ్యునరేషన్ వద్దని చెప్పారట. అదే విషయాన్ని ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. అయితే, ఈ సినిమాలో నటించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలను సుకుమారన్ తీసుకున్నారు. అందుకు గాను ఆయన కూడా ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది. కానీ, సినిమా నుంచి లాభాలు ఏమైనా వస్తే అందులో షేర్ తీసుకునే ఛాన్స్ ఉంది.కన్నప్పకు కూడా అండగా నిలిచిన మోహన్లాల్మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కుతున్న కన్నప్పలో మోహన్లాల్ కూడా కీలకపాత్రలు పోషించారు. ఇందులో నటించాలని మోహన్లాల్ను కోరిన వెంటనే ఆయన ఒప్పుకున్నారని ఒక ఇంటర్వ్యూలో తన రెమ్యునరేషన్ గురించి విష్ణు తెలిపారు. 'అంకుల్.. రెమ్యునరేషన్ గురించి మీ మేనేజర్తో ఏమైనా మాట్లాడమంటారా అని అడిగాను. అప్పుడు ఆయన నవ్వుతూనే.. ‘నువ్వు అంత పెద్ద వాడివయ్యావా..?’ అని అన్నారు. ఈ మూవీ కోసం ప్రభాస్ కూడా ఎలాంటి రెమ్యునరేషన తీసుకోలేదని విష్ణు చెప్పిన విషయం తెలిసిందే. -
మోహన్ లాల్ ‘లూసిఫర్ 2’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
కాలినడకన శబరిమల అయ్యప్పని దర్శించుకున్న హీరో మోహన్ లాల్ (ఫొటోలు)
-
స్టీఫెన్ తిరిగొచ్చాడు.. 'లూసిఫర్2' తెలుగు ట్రైలర్ రిలీజ్
మలయాళ టాప్ హీరో మోహన్లాల్ నటించిన 'లూసిఫర్2: ఎంపురాన్' (L2 Empuraan) తెలుగు ట్రైలర్ వచ్చేసింది. 2019లో వచ్చిన లూసిఫర్ చిత్రానికి సీక్వెల్గా ఈ మూవీని తెరకెక్కించారు. స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో నటిస్తూనే దర్శకత్వం వహించారు. మార్చి 27న విడుదల కానున్న ఈ మూవీపై తెలుగులో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని నిర్మాత దిల్రాజు రిలీజ్ చేస్తున్నారు. ‘‘ఎల్ 2 ఎంపురాన్’లో స్టీఫెన్ గట్టుపల్లి (ఖురేషి అబ్రమ్)గా మోహన్లాల్, ఆయనకు రైట్ హ్యాండ్లా జయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. -
ఎల్2కు ముందు 'లూసిఫర్' రీరిలీజ్
మోహన్లాల్ హీరోగా నటించిన మలయాళ బ్లాక్బస్టర్ ఫిల్మ్ ‘లూసిఫర్’ (2019) మళ్లీ విడుదల కానుంది. స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో ఒక చిన్న రోల్లో నటించడమే కాకుండా.. దర్శకత్వం కూడా వహించారు. ఈ మూవీ భారీ విజయం అందుకోవడంతో సీక్వెల్గా ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా కూడా తెరకెక్కించారు. ఈ మూవీలో కూడా మోహన్లాల్ హీరోగా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహించారు.‘లూసిఫర్’ మార్చి 20న రీరిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు మోహన్లాల్ ట్రైలర్ను కూడా తన సోషల్మీడియాలో షేర్ చేశారు. ఈ మూవీకి సీక్వెల్గా వస్తున్న ‘ఎల్ 2 :ఎంపురాన్’ మార్చి 27న విడుదల కానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పార్ట్-2 విడుదలకు ముందు ఇలా పార్ట్-1 రీరిలీజ్ చేయడం వల్ల ప్రేక్షకులకు సినిమా బాగా రీచ్ అవుతుందని మేకర్స్ ప్లాన్ చేశారు. లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ నిర్మించిన ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.మొదట కేవలం మలయాళంలో మాత్రమే విడుదలైన లూసిఫర్ బాక్సాఫీస్ వద్ద రూ. 160 కోట్ల రాబట్టి భారీ విజయాన్ని అందుకుంది. అయితే, తెలుగులో గాడ్ఫాదర్ పేరుతో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేసిన విషయం తెలిసిందే. కానీ, ఇక్కడ పెద్దగా చిరు ప్రభావం చూపలేకపోయారు. దీంతో రూ. 100 కోట్ల వరకు మాత్రమే గాడ్ఫాదర్ కలెక్ట్ చేసింది. మలయాళంలో విడుదలైన లూసిఫర్తో పోల్చితే చాలా వ్యత్యాసం కనిపించింది. -
‘కన్నప్ప’ మూవీ HD స్టిల్స్
-
ఇండియాతో ఎంతో అనుబంధం ఉంది: హాలీవుడ్ నటుడు జెరోమ్ ఫ్లిన్
‘‘నాకు ఇండియాతో ఎంతో అనుబంధం ఉంది. నా యంగ్ ఏజ్లో నేను ఎక్కువగా ఇక్కడి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాను. ఇండియాలో గడిపిన తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. ‘ఎల్2ఈ ఎంపురాన్’(L2E Empuraan) సినిమాలో నటించడంతో మళ్లీ నా ఇంటికి వచ్చినట్టు అనిపించింది’’ అని ప్రముఖ హాలీవుడ్ నటుడు జెరోమ్ ఫ్లిన్ (Jerome Flynn)(‘గేమ్ ఆఫ్ థ్రోన్స్, జాన్ విక్ చాప్టర్ 3, సోల్జర్ సోల్జర్, బ్లాక్ మిర్రర్’ ఫేమ్) తెలిపారు.మోహన్లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ ‘లూసిఫర్’ (2019)కి సీక్వెల్గా ‘ఎల్2ఈ ఎంపురాన్’ మూవీ రూపొందింది. సీక్వెల్లోనూ మోహన్లాల్ హీరోగా నటించగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో నటించడంతోపాటు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో జెరోమ్ ఫ్లిన్ చేసిన బోరిస్ ఆలివర్పాత్రని రివీల్ చేశారు. జెరోమ్ ఫ్లిన్ మాట్లాడుతూ– ‘‘ఖురేషి (మోహన్లాల్పాత్ర పేరు) ప్రయాణంలో బోరిస్ ఆలివర్ది ఒక ముఖ్యమైనపాత్ర. ఈ క్యారెక్టర్ని ప్రేక్షకులు ఇష్టపడతారు’’ అని పేర్కొన్నారు. మార్చి 27న మలయాళం, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
'లూసిఫర్2'లో స్టార్ హీరో సోదరి.. ఫస్ట్ సినిమా ఇదే
మలయాళ స్టార్ మోహన్లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'లూసిఫర్2: ఎంపురాన్(రాజు కన్నా గొప్పవాడు)'. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సోదరి ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. సౌత్ ఇండియాలో ఆమె నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఈమేరకు ఆమె తాజాగా ఒక వీడియోతో ఈ సినిమా గురించి పలు విషయాలు తెలిపారు. సుభద్ర బెన్ పాత్రలో ఆమె కనిపించనున్నారు. 2019లో వచ్చిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’ చిత్రానికి ప్రీక్వెల్గా పార్ట్2ను మేకర్స్ నిర్మించారు.ఆమీర్ ఖాన్ సోదరి నిఖాత్ ఖాన్ హెగ్డే(Nikhat Khan Hegde) లూసిఫర్2లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. అమీర్ ఖాన్ కుటుంబంలో చాలామంది సినీ పరిశ్రమతో టచ్లో ఉన్నారు. కానీ, నిఖాత్ ఖాన్ మిషన్ మంగళ్ (2019) చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అయితే, ఆమె ఎక్కువగా వాణిజ్య ప్రకటనలలో కనిపించారు. యాక్సిస్ బ్యాంక్,రిలయన్స్ జ్యువెల్స్,హల్దిరామ్స్,విప్రో,ఫస్ట్ క్రై వంటి యాడ్స్ ఆమెకు గుర్తింపు తెచ్చాయి. అయతే, తన సోదరడు అమీర్ ఖాన్ నటించిన లగాన్ (2001) సినిమాకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు.లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్స్పై భారీ బడ్జెట్తో 'ఎల్2: ఎంపురాన్' చిత్రాన్ని సుభాస్కరన్, ఆంటోని పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. ఇందులో టొవినో థామస్, మంజు వారియర్, నందు కీలక పాత్రలు చేస్తున్నారు. సినిమా 2025 మార్చి 27న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఖురేషి అబ్రమ్గా మోహన్లాల్(Mohanlal), ఆయనకు రైట్ హ్యాండ్లా జయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కనిపించనున్నారు. -
గతం నిశ్శబ్దంగా ఉండదు!
మలయాళంలో హీరో మోహన్లాల్(Mohanlal), దర్శకుడు జీతూ జోసెఫ్ల కాంబినేషన్లోని ‘దృశ్యం’ ఫ్రాంచైజీ బ్లాక్బస్టర్. ఈ మలయాళ ‘దృశ్యం’ ఫ్రాంచైజీలోని సినిమాలు భారతదేశ ఇతర భాషల్లోనే కాకుండా అంతర్జాతీయ భాషల్లో కూడా రీమేక్ అయ్యాయి. రీమేక్ అయిన ప్రతి భాషలోనూ ఈ చిత్రం హిట్ కావడం విశేషం. ‘దృశ్యం’ సినిమాకు ఇంతటి క్రేజ్ ఉంది. కాగా కొన్ని రోజులుగా ‘దృశ్యం 3’ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుందనే టాక్ మాలీవుడ్లో వినిపిస్తూనే ఉంది.ఫైనల్గా గురువారం ఈ సినిమాపై అధికారిక ప్రకటన చేశారు మోహన్లాల్. ‘దృశ్యం 3’(Drishyam 3)సినిమా కన్ఫార్మ్ అని, ‘ఎక్స్’లో ఓ ఫొటోను షేర్ చేశారు. ‘ఎక్స్’లో మోహన్లాల్ పేర్కొన్న పోస్ట్లో ‘ది పాస్ట్ నెవర్ స్టేస్ సైలెంట్’ (గతం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు) అనే క్యాప్షన్ కూడా ఉంది. ‘దృశ్యం, దృశ్యం 2’ సినిమాలను నిర్మించిన ఆంటోనీ పెరుంబవూర్ ‘దృశ్యం 3’ సినిమానూ నిర్మించనున్నారు.త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణప్రారంభం కానుంది. మరోవైపు అనూప్ మీనన్తో తన నెక్ట్స్ మూవీ ఉంటుందని ఇటీవల ప్రకటించారు మోహన్లాల్. ఆయన సోలో హీరోగా అనూప్ మీనన్ మూవీని పూర్తి చేసిన తర్వాత ‘దృశ్యం 3’ సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇక మమ్ముట్టీ, మోహన్లాల్ల కాంబినేషన్లో ఓ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే మోహన్లాల్ సోలో హీరోగా నటించిన ‘ఎల్2: ఎంపురాన్’ చిత్రం మార్చి 28న రిలీజ్ కానుంది. -
‘కన్నప్ప’కోసం ప్రభాస్, మోహన్లాల్ ఎంత తీసుకున్నారంటే..
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’(Kannappa). అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్ కీలక పాత్రలు పోషించిన ఈమూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ని ముమ్మరం చేశారు మేకర్స్. ప్రతి సోమవారం ఈ చిత్రం నుంచి ఒక అప్డేట్ ఇస్తున్నారు. దీంతో పాటు మంచు విష్ణు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నప్ప సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సినిమా కోసం ఏడేళ్లుగా పని చేస్తున్నామని, దాదాపు రూ. 140 కోట్ల బడ్జెట్తో సినిమాను తెరకెక్కించామని చెప్పాడు. ఇందులో నటీనటులు పారితోషికాలతో కలిపి చూస్తే.. ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరగాల్సింది. కానీ చాలా మంది నటీనటులు డబ్బులు తీసుకోకుండానే నటించారట. మోహన్ లాల్, ప్రభాస్ అయితే ఒక్క రూపాయి తీసుకోకుండానే నటించారట. ఈ విషయాన్ని మంచు విష్ణునే చెప్పారు.‘ఈ చిత్రంలో ప్రభాస్(Prabhas), మోహన్ లాల్(Mohanlal) పోషించిన పాత్రలు చాలా కీలకం. వాళ్లను కథ చెప్పగానే ఒప్పుకున్నారు.ఈ సినిమా కోసం వాళ్లిద్దరూ ఒక్క రూపాయి పారితోషికం కూడా తీసుకోలేదు. నాన్నగారిపై(మోహన్ బాబు)పై ఉన్న అభిమానంతో వారిద్దరు నటించారు. మోహన్లాల్ దగ్గరకు వెళ్లి కథ చెప్పిన తర్వాత పారితోషికం గురించి మీ మేనేజర్తో మాట్లాడమంటారా అని అడిగితే..‘అప్పుడే అంత పెద్ద వాడివయ్యావా?’ అన్నాడు. ఇక ప్రభాస్ నాకు మంచి స్నేహితుడు. అతని వల్ల నాకు స్నేహంపై నమ్మకం పెరిగింది. నా కోసం ప్రభాస్ ఇందులో నటించాడు. అలాగే అక్షయ్ కుమార్ పోషించిన పాత్ర కూడా కీలకమే. శివుని పాత్ర కోసం ఆయనను సంప్రదిస్తే.. రెండు సార్లు సున్నితంగా తిరస్కరించాడు. తర్వాత వేరే దర్శకుడితో చెప్పించి ఆయనను ఒప్పించాం. చాలా అద్భుతంగా నటించాడు’ అని విష్ణు చెప్పుకొచ్చాడు.అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుద్రగా ప్రభాస్, పార్వతీదేవిగా కాజల్ నటిస్తున్నారు. శివరాజ్కుమార్, ఆర్.శరత్కుమార్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
కొచ్చి టు ఢిల్లీ
మోహన్లాల్(Mohanlal), మమ్ముట్టి(Mammootty) హీరోలుగా మలయాళంలో ఓ భారీ మల్టీస్టారర్ ఫిల్మ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్, కుంచకో బోబన్, ఆసిఫ్ అలీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. కాగా ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో హీరోయిన్ నయనతార(Nayanthara) నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కొచ్చిలో జరుగు తోంది.ఈ మూవీ షూటింగ్లో నయనతార జాయిన్ అయ్యారని మేకర్స్ ఆదివారం ప్రకటించారు. అలాగే ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ ఢిల్లీలో జరుగనుందని, ఈ షెడ్యూల్తో మేజర్ షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. మరోవైపు గతంలో ‘తస్కరవీరన్ (2005), రప్పకల్ (2005), భాస్కర్ ది రాస్కెల్ (2015), పుతియ నియమం (2016)’ వంటి చిత్రాల్లో మమ్ముట్టి–నయనతార స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. -
మోహన్లాల్ మూవీలో..?
మోహన్లాల్ హీరోగా సత్యన్ అంతికాడ్ దర్శకత్వంలో ‘హృదయపూర్వం’(Hridayapoorvam) అనే మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆంటోనీ పెరుంబవుర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా మాళవికా మోహనన్(Malavika Mohanan)కు అవకాశం లభించిందని మాలీవుడ్ సమాచారం.కథ నచ్చడం, పైగా మోహన్లాల్(Mohanlal) మూవీ కూడా కావడంతో ఈ సినిమాకు మాళవికా మోహనన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభం కానుందని, నాలుగు రోజుల తర్వాత ఈ మూవీ షెడ్యూల్లో మోహన్లాల్ జాయిన్ అవుతారని తెలిసింది. -
మోహన్లాల్ 'లూసిఫర్2' మూవీ టీజర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
నిన్ను ఆదుకునేది ఒకే ఒక్కడు.. మోహన్లాల్ 'లూసిఫర్2' టీజర్
మలయాళ టాప్ హీరో మోహన్లాల్ హీరోగా నటించిన బ్లాక్బస్టర్ ఫిల్మ్ 'లూసిఫర్' (2019). ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఓ చిన్న రోల్లో నటించారు పృథ్వీరాజ్ సుకుమారన్. కాగా 'లూసిఫర్' సినిమాకు సీక్వెల్గా 'ఎల్2: ఎంపురాన్'ను( L2E Empuraan) తెరకెక్కించారు. ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. తెలుగు వర్షన్లో మీరు చూడాలంటే.. వీడియో దిగువన రైట్సైడ్ ఉండే సెట్టింగ్స్ వద్ద క్లిక్ చేసి ఆడియో ఆప్షన్లో తెలుగు భాషను ఎంచుకోవచ్చు.లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్స్పై భారీ బడ్జెట్తో 'ఎల్2: ఎంపురాన్' (రాజు కన్నా గొప్పవాడు) చిత్రాన్ని సుభాస్కరన్, ఆంటోని పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. ఇందులో టొవినో థామస్, మంజు వారియర్, నందు కీలక పాత్రలు చేస్తున్నారు. సినిమా 2025 మార్చి 27న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఖురేషి అబ్రమ్గా మోహన్లాల్(Mohanlal), ఆయనకు రైట్ హ్యాండ్లా జయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కనిపించనున్నారు. -
పడుచు హీరోయిన్లతో సీనియర్ హీరోల రొమాన్స్.. 'తప్పేముంది?'
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు వస్తుంటారు, పోతుంటారు కానీ హీరోలు మాత్రం అలాగే ఉంటారు. ఒక్కసారి స్టార్ ఇమేజ్ వచ్చిందంటే వయసుతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తారు. ఈ క్రమంలో వారి వయసుకు తగ్గ కథానాయికలతో కాకుండా కుర్ర హీరోయిన్లతోనూ స్టెప్పులేస్తున్నారు. అయితే ఇందులో తప్పే లేదంటున్నాడు మలయాళ స్టార్ మోహన్లాల్ (Mohanlal).అందులో తప్పేం లేదుతాజాగా ఓ ఇంటర్వ్యూలో మోహన్లాల్ మాట్లాడుతూ.. ఈ పద్ధతి ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. ఎప్పటినుంచో మన ఇండస్ట్రీ ఇలాగే ఉంది. తెలుగు (Tollywood), తమిళంలోనూ ఇదే కొనసాగుతోంది. నువ్వు ఆరోగ్యంగా ఉంటే వంద ఏళ్లు వచ్చినా సరే యాక్ట్ చేయొచ్చు. ఎలాంటి పాత్రల్ని ఎంచుకుంటున్నావనేది నీ చేతిలో ఉంటుంది. నీకు అసౌకర్యంగా అనిపిస్తుందంటే అలాంటి అవకాశాలను వదిలేసుకోవడమే మంచిది. కానీ జనాలు మిమ్మల్ని ఆయా పాత్రల్లో ఇష్టపడుతుంటే వాటిని అంగీకరించడంలో తప్పేం లేదు. యాక్టింగ్ అనేది ఒక పర్ఫామెన్స్ అంతే! దానికి వయసుతో సంబంధం లేదు. కేవలం అక్కడ ఎటువంటి పాత్ర చేస్తున్నావన్నది నీపై ఆధారపడి ఉంటుంది అన్నాడు.చదవండి: 2025 ప్రారంభంలో ఓటీటీలో రిలీజయ్యే కొత్త సినిమాలు, సిరీస్లు ఇవే!ఏదీ ఆలోచించలేదుభవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? అన్న ప్రశ్నకు.. ఏదీ చేయాలనుకోవడం లేదు. నా జీవితంలో అన్నీ వాటికవే జరిగిపోతున్నాయి. ఇప్పుడు సినిమాలు (Movies) చేస్తున్నాను. కాబట్టి ఇంకా దేని గురించీ ఆలోచించట్లేదు. ఒకవేళ ఏదైనా జరగాల్సి ఉంటే అదే జరుగుతుంది. జీవితం అనేది ఒక ప్రవాహం.. అది ఎటు తీసుకెళ్తే అటు సాగిపోతూ ఉండాలి అని చెప్పుకొచ్చాడు.అదే పెద్ద మార్పుసినిమా ఇండస్ట్రీలో వచ్చిన మార్పులపై స్పందిస్తూ.. కాలం వేగంగా గడుస్తోంది. అన్నీ మారిపోతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ.. ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. ఏఐ, వీఎఫ్ఎక్స్ వల్ల సినిమాల్లో అద్భుతాలు సృష్టించవచ్చు. ఇదే అన్నింటికంటే పెద్ద మార్పు. కానీ ఏ గ్యాడ్జెట్ కూడా ఎమోషన్స్ను మార్చలేవు. మన ఎమోషన్స్ మన చేతిలోనే ఉన్నాయి అని మోహన్లాల్ చెప్పుకొచ్చాడు.చదవండి: టాలీవుడ్ ప్రముఖ హీరో కుమారుడు.. సినిమా ఎంట్రీకి రెడీ -
మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ
స్వతహాగా మలయాళీ హీరో అయిన్ మోహన్ లాల్ (Mohanlal).. 'దృశ్యం' సినిమాలతో మంచి పాపులరిటీ సొంతం చేసుకున్నారు. తెలుగులో 'జనతా గ్యారేజ్' మూవీలోనూ చేశారు. అలా తెలుగు ప్రేక్షకులకు ఈయన సుపరిచితుడే. 400కి సినిమాల్లో నటించిన ఈయన తొలిసారి 'బరోజ్' (Barroz Movie) అనే సినిమాతో దర్శకుడిగా మారారు. ఇందులో ఈయనే హీరోగానూ నటించారు. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజైంది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? మోహన్ లాల్ డైరెక్టర్గా హిట్ కొట్టారా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?ఒకప్పుడు గోవాని పాలించిన పోర్చుగీస్ రాజు డి గామా (ఇగ్నాసియో మతయోస్)కు బరోజ్ (మోహన్ లాల్) నమ్మిన బంటు. ఆయన నిధిని అంతా బరోజ్ కాపాడుతూ ఉంటాడు. భూతంలా మారి వాళ్ల వంశస్థులకు ఇదంతా అప్పగించేందుకు గత 400 ఏళ్లుగా కాపాలా కాస్తూనే ఉంటాడు. అలా డి గామా వంశంలోని 13వ జనరేషన్కి చెందిన ఇసబెల్లా (మాయా రావ్) గోవా వస్తుంది. ఆమె బరోజ్ని శాపవిముక్తుడిని చేస్తుంది. ఇసబెల్లాకు బరోజ్ నిధి అప్పగించాడా లేదా? 400 ఏళ్ల పాటు నిధిని కాపాడుకునే క్రమంలో బరోజ్ ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాడు? ఇసబెల్లాకు మాత్రమే బరోజ్ ఎందుకు కనిపిస్తాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?మనలో చాలామంది చిన్నప్పుడు చందమామ కథలు చదివే ఉంటారు. హాలీవుడ్ కార్టూన్ డబ్బింగ్ మూవీస్ కూడా చూసే ఉంటారు. అయితే అవి డబ్బింగ్ మూవీస్ కాబట్టి ఆ మైండ్ సెట్తోనే చూస్తాం. అర్థం కాకపోయినా సరే ఎంజాయ్ చేస్తాం. ఇలాంటి సినిమానే మన దగ్గర తీస్తే.. మనకు రిలేట్ అవుతుందా లేదా అనేది మాత్రం అబ్జర్వ్ చేస్తాం. కానీ 'బరోజ్' మాత్రం పేరుకే మలయాళ మూవీ కానీ.. ఏదో ఇంగ్లీష్ మూవీ చూస్తున్నామా అనిపిస్తుంది. రెండున్నర గంటల నిడివి అయినప్పటికీ నాలుగు గంటల మూవీ చూసిన అనుభూతి కలుగుతుంది.మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్తో 'బరోజ్' మొదలవుతుంది. ఫాదో గీతంతో ఈ మూవీని ప్రారంభిద్దామని అంటారు. అసలు ఫాదో గీతం అంటే ఏంటి అనుకునేలోపు.. సడన్గా పోర్చుగీస్ పాట ప్లే అవుతుంది. దీని మీనింగ్ ఏంటో అర్థం కాదు. ఇదొక్కటే కాదు మూవీ అంతా దాదాపు ఇదే కన్ఫ్యూజన్. నిధిని కాపాడే భూతంగా బరోజ్ ఎంట్రీ.. అసలు ఈ నిధి సంగతేంటి? దెయ్యంగా ఎందుకు మారాడు? ఈ నిధిని ఎవరికి అప్పగించాలి అనే అంశాలే సినిమా కథ.నిధికి కాపలాగా భూతం ఉండటం.. 400 ఏళ్లుగా ఒకే గదిలో ఈ భూతం ఉండిపోవడం.. లైన్ చూస్తుంటే మంచి హాస్యం పుట్టించొచ్చు. నిధిని ఎవరైనా కొట్టేయడానికి వస్తే ఆ సీన్లని అడ్వెంరెస్గా తీయొచ్చు. కానీ 'బరోజ్'లో అలాంటి సన్నివేశాలే ఉండవు. హీరోగా నటించి దర్శకత్వం వహించింది మోహన్ లాల్ కదా. అంతా ఆయన కనిపిస్తాడనుకుంటే.. అడపాదడపా కనిపిస్తాడు. ఈయన పాత్ర భూతం కదా. జీనీలా అద్భుతాలు చేయొచ్చు. తర్వాత ఏం జరుగుతుందో అనే ఆత్రుతని కలిగించొచ్చు. కానీ మోహన్ లాల్ అలా చేయలేకపోయారు. సినిమా ప్రారంభం నుంచి ఈయన మార్క్ చూపించే, అరె భలే ఉందే అనిపించే సీన్ ఒక్కటీ ఉండదు. మోహన్ లాల్ కాకుండా మిగిలిన సీన్లలో మనకు ఏ మాత్రం పరిచయం లేని విదేశీ నటులు వచ్చిపోతుంటారు. ఒకరు తెలుగులో మాట్లాడితే మరొకరు పోర్చుగీస్లో మాట్లాడుతుంటారు. ఇది ఇబ్బందిగా అనిపించింది.హాలీవుడ్ సినిమాలని చూసిన మోహన్ లాల్.. వాటి స్ఫూర్తితో సినిమా చేద్దామని ఫిక్సయ్యారు. కానీ ప్రాంతీయ ప్రేక్షకులని ఆకట్టుకునేలా తీయలేకపోయారు. నేటివిటీ లేక ఆడియన్స్ డిస్ కనెక్ట్ అయ్యారు. ఇలాంటి పాయింట్ కోసం పోర్చుగీస్ కథల వరకే వెళ్లాల్సిన అవసరం లేదు. మన జానపదాలు వెతికితే ఎన్నో అద్భుతమైన కథలు కనిపిస్తాయి. ఆ దిశగా మోహన్ లాల్ ఆలోచించి ఉంటే లోకల్ ఆడియెన్స్కి సినిమా ఇంకా నచ్చి ఉండేది. దర్శకుడిగా త్రీడీ మూవీ ఎక్స్పీరియెన్స్ ఇవ్వాలని తపించిన మోహన్ లాల్.. కంటెంట్పై సరిగా దృష్టి పెట్టలేదు. దీంతో మూవీ అటోఇటో అన్నట్లు సాగుతూ వెళ్తుంది.ఎవరెలా చేశారు?బరోజ్గా టైటిల్ రోల్ చేసిన మోహన్ లాల్.. పాత్రలో సరిగ్గా సరిపోయారు. హీరో కమ్ డైరెక్టర్ నేనే కదా అని అనవసర ఎలివేషన్ల జోలికి పోలేదు. పాత్రకు ఎంత కావాలో అంత ఇచ్చారు. కానీ ఇంకాస్త థ్రిల్లింగ్, ఎంటర్టైనింగ్గా బరోజ్ పాత్రని రాసుకుని ఉంటే బాగుండేది. ఇషా పాత్ర చేసిన మాయారావు చూడటానికి బాగుంది. యాక్టింగ్ ఓకే ఓకే. మిగిలిన విదేశీ నటీనటులు బాగానే చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫీ బాగుంది. అండర్ వాటర్ త్రీడీ విజువల్స్ ఔట్పుట్ మాత్రం అనుకున్నంతగా రాలేదు. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలే గుర్తొస్తాయి. నిర్మాణ విలువల మాత్రం టాప్ నాచ్ ఉన్నాయి. ఖర్చు విషయంలో అసలు వెనుకాడలేదు. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ బాగుంది.ఓవరాల్గా చెప్పుకొంటే మోహన్ లాల్ 'బరోజ్'తో కష్టపడ్డారు గానీ కంటెంట్ పరంగా తడబడ్డారు. దీంతో సగటు ప్రేక్షకుడు.. ఇది మా కోసం తీశారా? పోర్చుగీసు వాళ్ల కోసం తీశారా అని సందేహపడటం గ్యారంటీ.-చందు డొంకాన -
మోహన్ లాల్ 'బరోజ్' మూవీ ప్రెస్మీట్ (ఫోటోలు)
-
బంగారాన్ని కాపాడే భూతం 'బరోజ్'.. తెలుగు ట్రైలర్
మోహన్లాల్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బరోజ్’. ఫ్యాంటసీ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా తెలుగు ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 25న పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీ విడుదల కానుంది.బరోజ్ కథ నచ్చడంతో తొలిసారిగా మోహన్లాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర కూడా చాలా ఆసక్తిగా ఉంది. వాస్కోడిగామా నిధిని కాపాడే జినీగా మోహన్ లాల్ నటిస్తున్నాడు. వాస్కోడిగామాకి చెందిన అపార సంపద (బంగారం,వజ్రాలు) బరోజ్ అనే ఒక భూతం 400 ఏళ్ళగా కాపాడుతూ వస్తుంది. ఆయనకు సంబంధించిన నిజమైన వారసులకు ఆ సంపదని అప్పగించాలని ఆ భూతం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్తో సినిమా ఉండనుంది.తన డ్రీమ్ ప్రాజెక్ట్గా 'బరోజ్' చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ ఫిల్మ్స్ బ్యానర్పై ఆయన నిర్మించారు. ఆంటోనీ పెరుంబావూర్ నిర్మాతగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25న తెలుగు,హిందీ,తమిల్,కన్నడ,మలయాళంలో బరోజ్ సినిమా విడుదల కానుంది. -
కన్నప్పలో 'కిరాట'గా మలయాళ స్టార్
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్బాబు, మోహన్లాల్, శరత్కుమార్, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటించగా, ప్రభాస్, అక్షయ్కుమార్, కాజల్ అగర్వాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఈ సినిమాలోని కిరాట పాత్రలో మోహన్లాల్ నటిస్తున్నారని వెల్లడించి, ఆయన ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ‘‘కన్నప్ప’ సినిమా ఈ తరం ప్రేక్షకులకైనా కొత్తగానే ఉంటుంది. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్మ్యం ఏంటి? అన్నది ఈ చిత్రంలో చూపించనున్నాం. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతోనే ఈ సినిమా తీస్తున్నాం’’ అన్నారు మోహన్బాబు. -
పదహారేళ్ల తర్వాత...
మోహన్లాల్, మమ్ముట్టి కాంబినేషన్లో దాదాపు యాభైకి పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే 2008లో రిలీజైన ‘ట్వంటీ 20’ చిత్రం తర్వాత మోహన్లాల్, మమ్ముట్టి కలిసి ఓ పుల్ లెంగ్త్ సినిమా చేయలేదు. పదహారేళ్ల తర్వాత మోహన్లాల్, మమ్ముట్టి ఓ సినిమాలో నటిస్తున్నారు. మలయాళంలో ‘మాలిక్, టేకాఫ్, సీ యూ సూన్’ వంటి సినిమాలతో దర్శకుడిగా పేరు సంపాదించుకున్న మహేశ్ నారాయణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కుంచాకో బోబన్ ఓ కీలకపాత్రలో నటిస్తుండగా, మరో కీలకపాత్రలో ఫాహద్ ఫాజిల్ నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ శ్రీలంకలో మొదలైంది. మమ్ముట్టి, మోహన్లాల్, కుంచాకోల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... మమ్ముట్టి హీరోగా నటించిన ‘కాదల్ కదన్ను ఒరు మాతుకుట్టి’ (2013) చిత్రంలో మోహన్లాల్ నటించారు. కానీ ఈ చిత్రంలో మోహన్లాల్ది అతిథిపాత్ర. ఈ ఇద్దరు స్టార్స్ కలిసి చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న తాజా ఫుల్ లెంగ్త్ చిత్రంపై అంచనాలు ఉన్నాయి. -
మోహన్ లాల్ డ్రీమ్ ప్రాజెక్ట్గా 'బరోజ్' ట్రైలర్ విడుదల
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ దర్శకుడిగా తొలిసారి మెగాఫోన్ పట్టాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్గా 'బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్స్' చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ ఫిల్మ్స్ బ్యానర్పై ఆయన నిర్మిస్తున్నారు. ఆంటోనీ పెరుంబావూర్ నిర్మాతగా ఉన్నారు. ఇందులో ఆయనే ప్రధాన పాత్రలో నటిస్తున్నారు కూడా.. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.మైథలాజికల్ థ్రిల్లర్గా జీజో పున్నూసే రచించిన నవల ఆధారంగా బరోజ్ చిత్రాన్ని తెరకెక్కించారు. వాస్కోడిగామాలో దాగి ఉన్న నిధిని 400ఏళ్లుగా కాపాడే జినీగా మోహన్ లాల్ ఇందులో కనిపించనున్నాడు. అయితే, ఆ సందను ఆయన ఎందుకు రక్షిస్తున్నాడు. చివరగా దానిని ఎవరికి అందించాలని ఆయన ప్రయత్నం చేస్తాడనేది ఈ చిత్ర కథ అని తెలుస్తోంది. ఎక్కువ వీఎఫ్ఎక్స్తో నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో క్రిస్మస్ కానుకగా ఈ డిసెంబరు 25న విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ్,కన్నడ,మలయాళం,హిందీలో ఈ మూవీ రిలీజ్ కానుంది. వాస్తవంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 3న విడుదల చేయాలని ఇది వరకే ప్రకటించారు. కానీ, నిర్మాణంతర పనులు పెండింగ్ ఉండటం వల్ల విడుదల విషయంలో జాప్యం ఏర్పడింది. -
కూలీ పనికి వెళ్తున్న స్టార్ హీరో తనయుడు!
మలయాళంలో ఆయనో ఓ పెద్ద స్టార్ హీరో. మాలీవుడ్లో రికార్డులు సృష్టించాలన్నా.. ఉన్న రికార్డులను బద్దలు కొట్టాలన్నా ఆయన తర్వాతే అందరు. వందల సినిమాలు తీసి వేల కోట్ల ఆస్తిని కూడా కూడబెట్టాడు. కొడుకుని హీరోగా ఇండస్ట్రీగా పరిచయం చేసి బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందించాడు. కట్ చేస్తే..ఆ వారసుడు ఇప్పుడు కూలీగా మారాడు. తండ్రి సంపాదించిన వేల కోట్ల ఆస్తిని వదిలేసి.. గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆ తనయుడి పేరే ప్రణవ్ మోహన్ లాన్. తండ్రి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. మోహన్ లాల్ కొడుకు కూలీ పని చేయడం ఏంటని షాకవుతున్నారా? అయితే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.ఆల్ రౌండర్ ప్రణవ్మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత స్క్రీన్ప్లే రైటర్గా మారాడు. కొన్నాళ్లకు మళ్లీ హీరోగా వెండితెరపై మెరిశాడు. ఆయన తీసిన ‘హృదయం’ మూవీ అప్పట్లో రికార్డులు సృష్టించింది. ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయన తర్వాత ఆయన నటించిన ‘వర్షంగళ్కు శేషం’ మూవీ కూడా ప్రణవ్కి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. హీరో కంటే ముందు పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పని చేశాడు. ఇలా ఒకవైపు నటనతో పాటు మిగిలిన విభాలన్నింటిలోనూ ప్రణవ్ మంచి పట్టు సాధించి ‘ఆల్ రౌండర్’గా గుర్తింపు పొందాడు. ఇలా కెరీర్లో దూసుకెళ్తున్న ప్రణవ్..సడెన్గా గ్యాప్ ఇచ్చి ఇండస్ట్రీకి దూరమైపోయాడు.స్పెయిన్లో కూలీగా..‘వర్షంగళకు శేషం’ తర్వాత ప్రణవ్ కాస్త గ్యాప్ తీసుకొని స్పెయిన్ వెళ్లాడు. స్టార్ హీరో కాబట్టి ఏ వివాహారానికో, ఎంజాయ్ చేయడానికి ప్రణవ్ విదేశాలకు వెళ్లలేదు. స్పెయిన్ వెళ్లి కూలీ పని చేస్తున్నాడు. అక్కడ ఓ ఫామ్ హౌస్లో ఉంటూ గొర్రెలు, గుర్రాల కాపరిగా చేరాడట. ఇందుకుగాను జీతం ఏమి లేదట. కేవలం భోజనం పెట్టి, షెల్టర్ ఇస్తారట.కష్టమైన పని చేయడం ఇష్టంప్రణవ్ కూలీ పనిచేయాల్సిన అవసరం లేదు. ఏ పని చేయకున్నా.. తండ్రి మోహన్ లాన్ సంపాదించిన ఆస్తితో జీవితాంతం కూర్చొని తినొచ్చు. అలా ఉండడం ఇష్టం లేకపోయినా.. తనలో మంచి టాలెంట్ ఉంది. హీరోగానూ రాణించాడు. ఆయన నటిస్తే చాలు కోట్ల రూపాయలు వచ్చేస్తాయి. ఇలాంటి లగ్జరీ లైఫ్ని వదిలేసి.. కూలీ పని చేయాల్సిన అవసరం ఏంటి? అంటే.. ప్రణవ్కి అలాంటి పని చేయడం ఇష్టం అట. గొర్రెలు, గుర్రాలను చూసుకునే పనిని ఆస్వాదిస్తున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ప్రణవ్ తల్లి, మోహన్ లాల్ సతీమణి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ‘కష్టమైన పని చేయడం ప్రణవ్కి ఇష్టం. కానీ నాకు మాత్రం ప్రణవ్ హీరోగా మరిన్ని సినిమాలు చేయాలని ఉంది’ అని ప్రణవ్ తల్లి అన్నారు. రంగుల ప్రపంచం(చిత్ర పరిశ్రమ) నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఇలా సాధారణ జీవితం గడపడడం నిజంగా గొప్ప విషయమే. View this post on Instagram A post shared by Pranav Mohanlal (@pranavmohanlal) -
తుదిదశలో ఎంపురాన్
మోహన్లాల్ హీరోగా నటించిన మలయాళ బ్లాక్బస్టర్ ఫిల్మ్ ‘లూసిఫర్’ (2019). ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఓ చిన్న రోల్లో నటించారు పృథ్వీరాజ్ సుకుమారన్. కాగా ‘లూసిఫర్’ సినిమాకు సీక్వెల్గా ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో కూడా మోహన్లాల్ హీరోగా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మేజర్ పార్టు చిత్రీకరణ పూర్తయింది. తాజాగా ‘ఎల్ 2 :ఎంపురాన్’ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుందని, ఫైనల్ షెడ్యూల్ మొదలైందని పృథ్వీరాజ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. ప్యాచ్ వర్క్స్తో సహా డిసెంబరులోపే మొత్తం చిత్రీకరణను పూర్తి చేయాలన్నది పృథ్వీరాజ్ టార్గెట్ అని మాలీవుడ్ సమాచారం. లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ నిర్మిస్తున్న ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా 2025 మార్చి 25న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. -
బాలూగారిపాట మనసుని హత్తుకుంది: మోహన్లాల్
అక్షయ్, మమితా బైజు జంటగా నటించిన చిత్రం ‘డియర్ కృష్ణ’. దినేష్ బాబు దర్శకత్వంలో పీఎన్ బలరామ్ నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాలోని ‘చిరు్రపాయం చేసుకున్న దోషమేంటో దైవమా...’ అంటూ సాగేపాట లిరికల్ వీడియోను మోహన్లాల్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘లెజండరీ సింగర్ బాలూగారు (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం)పాడిన ఈపాట నా మనసును హత్తుకుంది.ఈపాటలాగే ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘హృదయాన్ని బరువెక్కించే ఓ వాస్తవ ఘటనతో ఈ సినిమాని రూపొందించాం’’ అని తెలిపారు పీఎన్ బలరామ్. ‘చిరు్రపాయం..’పాటకు గిరిపట్ల లిరిక్స్ అందించారు. ఈ సినిమాకు హరిప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. -
ఖురేషీకి రైట్ హ్యాండ్
మోహన్లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ చిత్రం ‘లూసిఫర్’ (2019) బ్లాక్ బస్టర్ అయింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్గా ‘ఎల్ 2 ఎంపురాన్’ మూవీ రూపొందుతోంది. ఇందులో మోహన్లాల్ హీరోగా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. సుభాస్కరన్, ఆంటోని పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. టొవినో థామస్, మంజు వారియర్, నందు కీలక పాత్రలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే... బుధవారం (అక్టోబర్ 16) పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఎల్ 2 ఎంపురాన్’లో ఆయన పోషిస్తున్న జయేద్ మసూద్ పాత్ర ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ‘‘ఎల్ 2 ఎంపురాన్’లో ఖురేషి అబ్రమ్గా మోహన్లాల్, ఆయనకు రైట్ హ్యాండ్లా జయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. 2025లో మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
రిషబ్ శెట్టి తండ్రిగా మోహన్ లాల్.. కాంతారా 2 నుంచి లేటెస్ట్ అప్డేట్..
-
పదేళ్ల తర్వాత మళ్లీ ఒకే ఫ్రేమ్లో...
మలయాళ సినీ పరిశ్రమలో దిగ్గజ హీరోలైన మమ్ముట్టి, మోహన్ లాల్ దశాబ్దం తర్వాత మళ్లీ కలిసి నటించి ఫ్యాన్స్ను ఖుషీ చేయనున్నారు. మహేశ్ నారాయణ్ దర్శకత్వంలో త్వరలోనే వీళ్లిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. మమ్ముట్టి కంపెనీ, ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించనున్నాయి. 30 రోజుల పాటు శ్రీలంకలో ఈ చిత్రాన్ని షూట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.మూవీ స్టోరీలైన్కి తగ్గట్టు షూటింగ్ లొకేషన్ పర్మిషన్ కోసం నిర్మాతలు శ్రీలంక ప్రధానమంత్రితో కూడా చర్చలు జరిపినట్టు కేరళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎక్కువ శాతం షూటింగ్ శ్రీలంకలోనూ మిగతాది కేరళ, ఢిల్లీ, లండన్లోనూ జరిపేలా ప్లాన్ చేస్తున్నారు. మమ్ముట్టి, మోహల్ లాల్ కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగా స్క్రిప్ట్ను సిద్ధం చేసుకుంటున్నారు దర్శకుడు మహేశ్ నారాయణ్. 50 చిత్రాల్లో భిన్న పాత్రల్లో కలిసి నటించి, ప్రేక్షకులను మెప్పించిన మమ్ముట్టి, మోహన్లాల్ చివరిగా 2013లో ‘కాథల్ కదన్ను ఒరు మాతుకుట్టి’ అనే చిత్రంలో సిల్వర్ స్క్రీన్ను షేర్ చేసుకున్నారు. -
మాలీవుడ్ ను నాశనం చేయకండి అంటున్న మోహన్ లాల్.. సమంత సెన్సేషనల్ స్టేట్ మెంట్..
-
మలయాళ ఇండస్ట్రీని నాశనం చేయకండి: మోహన్లాల్
మలయాళ చిత్రపరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక దాడులకు సంబంధించి కేరళ ప్రభుత్వానికి హేమా కమిటీ నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 17 మంది మలయాళ సినీ ప్రముఖులపై కేసులు నమోదైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇలా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ‘అమ్మ’ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్) అధ్యక్షుడు మోహన్లాల్, ‘అమ్మ’ కమిటీ సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఈ వివాదంపై మోహన్లాల్ మాట్లాడలేదు. హేమా కమిటీ నివేదిక, ఇండస్ట్రీలో జరుగుతున్న తాజా పరిణామాల గురించి కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో మోహన్లాల్ ఈ విధంగా మాట్లాడారు. ఏ పవర్ గ్రూప్లోనూ లేను: హేమా కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం. నేను కూడా కమిటీ ముందు హాజరై, నాకు తెలిసిన అన్ని విషయాలను పంచుకున్నాను. వాటిని ఇక్కడ చర్చించలేను. అలాగే కమిటీ నివేదికలో పేర్కొన్న ఏ పవర్ గ్రూప్లోనూ నేను లేను. అయినా నివేదికలో చాలా అంశాలు ఉన్నాయి. అన్నింటికీ ‘అమ్మ’నే కారణం అంటూ మాట్లాడటం కరెక్ట్ కాదు. మలయాళ పరిశ్రమ అంతా కలిసి స్పందించాల్సి ఉంది (ఇండస్ట్రీలో ఉండే పలు విభాగాల దర్శక–నిర్మాతలు, నటీనటులు వంటి సంఘాలు). నిజంగా తప్పులు చేసిన వారిని కోర్టు శిక్షిస్తుంది. ప్రభుత్వం, పోలీసులు నివేదిక అంశాల పైనే పని చేస్తున్నారు.అందుకే కేరళ నుంచి బయటకు వెళ్లాను: సమాజంలో సినిమా అన్నది ఓ భాగమే. హేమా కమిటీ నివేదిక ప్రస్తావనల పైనే దృష్టి సారిస్తూ మలయాళ పరిశ్రమను నాశనం చేయకండి. మద్రాసులో ఉండి నేను సినిమాలు చేసే సమయంలో సరైన సౌకర్యాలు కూడా లేవు. చిన్న పరిశ్రమగా మొదలైన మలయాళ ఇండస్ట్రీ ఎదుగుతోంది. ఇతర భాషల్లో మలయాళ చిత్ర పరిశ్రమ కళకు గుర్తింపు లభిస్తోంది. దక్షిణాది సినిమాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తోంది.ఇలాంటి తరుణంలో ఇండస్ట్రీ నాశనం కాకూడదు. చాలామంది ఉపాధి కోల్పోతారు. కొందరు ‘అమ్మ’ ఇలా చేయకూడదు.. అలా చేయకూడదు అంటున్నారు. ‘అమ్మ’ కోసం జరిగే ఎన్నికల్లో సభ్యులెవరైనా పోటీ చేయొచ్చు. ‘అమ్మ’ అధ్యక్ష పదవికి నేను రాజీనామా చేసిన తర్వాత మీడియాకు కావాలని దూరంగా ఉన్నానన్న వార్తలు అవాస్తవం. నా భార్య సర్జరీ, నేను హీరోగా చేసిన సినిమాకు చెందిన పనుల్లో బిజీగా ఉండి కేరళ నుంచి బయటకు వెళ్లాను. -
మాలీవుడ్ మాత్రమే కాదు.. అన్ని చోట్లా ఉంది: భానుప్రియ సిస్టర్
మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ నివేదికపై టాలీవుడ్ నటి శాంతి ప్రియ స్పందించారు. ఇలాంటి వేధింపులు కేవలం మాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు.. అన్ని చోట్లా జరుగుతున్నాయని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునవరావృతం కాకుండా ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని తెలిపారు. మన భవిష్యత్ తరాలకు భరోసానిచ్చేలా చర్యలు ఉండాలని సూచించారు.అంతేకాకుండా మలయాళం మూవీ ఆర్టిస్ట్ల సంఘం అధ్యక్ష పదవికి మోహన్లాల్ రాజీనామా చేయడం ఎంతవరకు సబబు అని శాంతి ప్రియ ప్రశ్నించారు.హేమ కమిటీ నివేదిక తర్వాత ఆరోపణలు వస్తున్న సమయంలో తప్పుకోవడం సరైన నిర్ణయం కాదన్నారు. వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే బాధితులకు న్యాయం చేసేందుకు అండగా నిలబడాల్సిందని అన్నారు. బాధితులకు భరోసా కల్పించే బాధ్యత అమ్మ సభ్యులపై ఉందని ఆమె గుర్తు చేశారు. తనకెప్పుడు ఎదురవ్వలేదు..అయితే తనకు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎదురు కాలేదని.. తన అదృష్టమని శాంతి ప్రియ వెల్లడించారు. నేను భానుప్రియ సోదరురాలిని అయినందువల్లే ఎవరూ టచ్ చేయలేదని తెలిపింది. ఎందుకంటే ఇండస్ట్రీలో మా కుటుంబానికి ఉన్న గౌరవమేంటో అందరికీ తెలుసున్నారు. కాగా.. కాబోయే అల్లుడు తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శాంతి ప్రియ తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటించింది. 1980-90ల్లో స్టార్ హీరోయిన్గా రాణించింది. కాగా.. హేమ కమిటీ నివేదిక బయటకొచ్చాక మలయాళం మూవీ ఆర్టిస్ట్ల సంఘాన్ని రద్దు చేశారు. ఇందులో సభ్యులుగా ఉన్న 17 మంది మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిన దర్యాప్తు ప్రారంభించింది. -
మాలీవుడ్ సూపర్ ‘హీట్’.. ‘అమ్మ’ రాజీనామా!
కేరళ సినిమా రంగంలో భూకంపం పుట్టింది. నటీనటుల సంఘం ‘అమ్మ’ కార్యవర్గం పూర్తిగా రాజీనామా చేసింది. వీరిలో మోహన్లాల్ ఉన్నారు. గత కొన్ని రోజులుగా కేరళ సినిమా రంగంలో మహిళలపై దురాగతాలు బయటికి వస్తుండటంతో పరిశ్రమ వణుకుతోంది. కొందరు తమ పదవులకు రాజీనామాలు చేస్తుంటే మరికొందరు ముఖం చాటేస్తున్నారు. ఈ దావానలం బాలీవుడ్ వరకు పాకితే మరింత ప్రక్షాళనం జరగవచ్చు.మలయాళ సినీ పరిశ్రమలో గొలుసుకట్టు ఘటనలు జరుగుతున్నాయి. 2017లో మలయాళ నటి భావనా మీనన్పై లైంగిక దాడి జరగడం (కొచ్చి శివార్లలో కారులో కొందరు వ్యక్తులు చేశారని ఆరోపణ) వెనుక సూత్రధారి మలయాళ హీరో దిలీప్ అని రేగిన కార్చిచ్చు అక్కడి ప్రభుత్వం చేత జడ్జి హేమ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేయించింది. అయితే ఆ కమిటీ రి΄ోర్టు ఆలస్యంగా 2024 ఆగస్టులోగాని బయటకు రాలేదు. అది వచ్చిన వెంటనే మలయాళ పరిశ్రమలో కొంతమంది మహిళలు తమ అనుభవాలను బయటకు చెప్పసాగారు. దాంతో మలయాళ పరిశ్రమ కుదుపులకు లోనవుతోంది.నటుడు సిద్దిఖీ పై ఆరోపణమలయాళంలో టాప్ కేరెక్టర్ ఆర్టిస్ట్, అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)కు జనరల్ సెక్రటరీ అయిన సిద్దిఖీ పై రేవతి సంపత్ అనే జూనియర్ ఆర్టిస్ట్ అత్యాచార ఆరోపణలు చేసింది. హేమా కమిషన్ బయటకు వచ్చాక ఆమె తన ఆరోపణలను మరోసారి మీడియా ముందుకు తెచ్చింది. ‘2016లో అతను కొచ్చిలోని ఒక హోటల్లో నా పై అత్యాచారం చేశాడు. అప్పుడు నాకు 21 ఏళ్లు ఉంటాయి. నాకు సినిమా రంగం ఆసక్తి ఉందని తెలిసి హోటల్కు పిలిపించి హఠాత్తుగా లైంగికదాడి చేశాడు’ అని ఆమె చెప్పింది. ఈ ఆరోపణలు ఆమె 2019లో చేసినా ఇప్పుడు మళ్లీ శక్తి పుంజుకుని సిద్దిఖీని విమర్శల వలయంలో నిలబెట్టాయి. దాంతో అతడు ‘అమ్మ’ పదవికి రాజీనామా చేశాడు. అయితే అతడు తాజాగా ఆ జూనియర్ ఆర్టిస్టు తనపై లేని΄ోని అభాండాలు వేస్తోందని కేరళ డి.జి.పికి ఫిర్యాదు చేశాడు.ఎం.ఎల్.ఏ పేరుమరోవైపు నటుడు ముకేష్ (ఇతను సి.పి.ఎం ఎం.ఎల్.ఏ) పై కూడా టెస్ జోసఫ్ అనే కాస్టింగ్ డైరెక్టర్ అమర్యాదకరంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది. ‘అతను ఔట్డోర్లో తన రూమ్ పక్కన నా రూమ్ ఉండేలా కుట్ర చేశాడు. నా రూమ్ తలుపు పదే పదే కొట్టాడు’ అని ఆమె తెలియచేసింది. అయితే ముకేష్ ఇదంతా రాజకీయ కుట్ర అని అంటున్నాడు. ఈ దుమారం ఇలా ఉంటే ప్రభుత్వ చలచిత్ర అకాడెమీ ప్రస్తుత చైర్మన్, దర్శకుడు రంజిత్పై ఇలాంటి ఆరోపణలు రావడంతో అతనూ రాజీనామా చేశాడు. దీంతో ప్రభుత్వం సినిమా పరిశ్రమలో వస్తున్న ఫిర్యాదులపై విచారణకు 4 మహిళా ముగ్గురు పురుష ఐపిఎస్లతో ‘సిట్’ ఏర్పాటు చేసింది. ఈ ‘సిట్’ తనకు తానుగా ఫిర్యాదులు నమోదు చేయదని, ఫిర్యాదులను పరిశీలిస్తుందని ప్రభుత్వం చెప్పడంతో అంతా మసిపూసి మారేడుకాయ చేసే వ్యవహారంగా ఇది మిగలనుందని విమర్శలు వస్తున్నాయి.మేము న్యాయపోరాటాలు చేయలేంఫిర్యాదులు చేస్తున్న మహిళలు ‘మేము కేసులు పెట్టి కోర్టులు చుట్టు తిరగలేం’ అని చెప్పడం గమనార్హం. ‘మేం అంత పెద్దవారిని ఎదుర్కోలేం’ అని వారు అంటున్నారు. మలయాళ ఇండస్ట్రీలో ఉన్న 15 మంది శక్తిమంతులు పరిశ్రమలో ఎవరో పైకి రావాలో, ఎవరు వెనుక ఉండిపోవాలో నిర్ణయిస్తున్నారని హేమ కమిషన్ తెలియచేసింది. వీరు చెప్పినట్టు వినకపోతే ఇండస్ట్రీలో మనలేని పరిస్థితి ఉందని కమిషన్ పేర్కొంది. ‘స్త్రీలను ఎందుకు ఇబ్బంది పెడతారు? అని ప్రశ్నించే పురుషులను కూడా బ్యాన్ చేస్తున్నారు’ అని తెలపడం విశేషం. రాబోయే రోజుల్లో ఈ కందిరీగల తుట్టె ఏ మేరకు ఎవరిని కుట్టనుందో వేచి చూడాలి.కాంప్రమైజ్ – అడ్జస్ట్ఒక నటి సినిమా చేయడానికి అంగీకరించే ముందు మలయాళ పరిశ్రమలో వినిపించే రెండు పదాలు కాంప్రమైజ్, అడ్జస్ట్. వేషం తె ప్రొడక్షన్ మేనేజర్లు ‘రాజీ పడాలని’, ‘సర్దుకుపోవాలని’ కోరుతారు. ‘సరే’ అంటే వేషం. లేకుంటే లేదు. అంతటితో వదిలితే ఫరవాలేదు. కాని హేమా కమిషన్ ప్రకారం ఏ మహిళా ఆర్టిస్ట్ అయినా నో అంటే వెంటనే ఇండస్ట్రీ అంతటా వ్యాపిస్తుంది. ఆమెను ‘దారి’కి తెచ్చే పని ఇండస్ట్రీ అంతా తీసుకుంటుంది. ‘మా సారు (ఏ పెద్ద స్టారో దర్శకుడో ప్రొడ్యూసర్) అడిగితే కాదంటావా?’ అని ఎవరూ వేషం ఇవ్వరు. పస్తులతో మాడేలా చేస్తారు. అందుకే మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ముందుకొచ్చి‘మహిళలు చేసే ఏ ఫిర్యాదునైనా సీరియస్గా తీసుకోవాలి’ అని బహిరంగంగా మాట్లాడాడుఫ్యాన్స్ ఆర్మీలైంగిక దుశ్చర్యలు ఎదుర్కొన్న మహిళలు బయటకు చెప్పేందుకు భయపడటానికి మరో కారణం ఈ పెద్ద నటులు ఫ్యాన్స్ ఆర్మీలను దాడికి పురిగొల్పుతుండటమే. ఏ హీరోను ఎవరేమన్నా వారి అభిమానులు సోషల్ మీడియాలో బూతులు జోడిస్తూ మీమ్స్ తయారు చేస్తుండటంతో బాధితులు బెంబేలెత్తుతున్నారు. కొన్నిసార్లు భౌతికంగా దాడి చేస్తారనే భయం కూడా సృష్టిస్తున్నారు. అందుకే హేమా కమిషన్ ఫ్యాన్స్ను కట్టడి చేయాలని ప్రభుత్వానికి ప్రత్యేకంగా సూచించింది.తలుపు విరిగేలా బాదుతారు‘ఔట్డోర్ షూటింగ్లో అర్ధరాత్రి తాగేసి వచ్చి తలుపు విరిగేలా బాదుతారు. అందుకే ఔట్డోర్లో కుటుంబ సభ్యులను తోడు తీసుకొని వెళ్లాల్సి వస్తోంది’ అని చాలామంది మహిళా ఆర్టిస్టులు హేమా కమిషన్కు చెప్పారు. వేషం ఇచ్చేటప్పుడే ‘అడిగితే అంగీకరించాలనే’ డిమాండ్ ప్రోడక్షన్ మేనేజర్ చల్లగా చెపాడని తెలియచేశారు.మోహన్లాల్ రాజీనామా30 ఏళ్ల చరిత్ర కలిగిన ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్’ (అమ్మ) అధ్యక్ష పదవికి నటుడు మోహన్లాల్ రాజీనామా చేశారు. మలయాళ పరిశ్రమలో స్త్రీలపై సాగుతున్న లైంగిక దోపిడిని జస్టిస్ హేమా కమిషన్ బయట పెట్టాక వినవచ్చిన ఆరోపణల్లో ‘అమ్మ’ జనరల్ సెక్రటరీ సిద్దిఖీతో పాటు మరికొందరి పేర్లు ఉన్న దరిమిలా నైతిక బాధ్యత వహిస్తూ మొత్తం 17 మంది సభ్యులున్న కార్యవర్గం రాజీనామా చేసింది. హడావిడిగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ మీటింగ్లో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ‘మమ్మల్ని విమర్శకు, దిద్దుబాటుకు లోను చేసినందుకు కృతజ్ఞతలు’ అని రాజీనామా లేఖలో కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకూ మోహన్లాల్, మమ్ముట్టి తదితర సూపర్స్టార్లు హేమా కమిషన్ గురించి ఏమీ మాట్లాడక΄ోవడాన్ని ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ (డబ్లు్యసిసి) తప్పుబట్టింది. మలయాళ రంగంలోని మహిళా నటీమణులు ‘అమ్మ’తో విభేదించి ఈ గ్రూపును నియమించుకున్నారు. హేమా కమిషన్ రిపోర్టును బయటపెట్టమని ΄ోరాడింది వీరే. ‘తంగలాన్’ నటి ΄ార్వతి తిరువోతు ఈ గ్రూప్లో చురుగ్గా పని చేస్తోంది. మెంబర్షిప్కు వెళ్లినా‘మూడు సినిమాల్లో నటిస్తే అమ్మలో మెంబర్షిప్ తీసుకోవచ్చు. దానికోసం నేను ఫోన్ చేస్తే ఆ పనులు చూసే సభ్యుడు తన ఫ్లాట్కు రమ్మన్నాడు. నేను ఫ్లాట్కు వెళ్లి ఫామ్ ఫిలప్ చేస్తుంటే వెనుక నుంచి వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఔట్డోర్ షూటింగ్ లో ఒక నటుడు నా రూమ్కు వచ్చి తలుపు తీసిన వెంటనే మంచం మీదకు లాగే ప్రయత్నం చేశాడు. ఇంకో నటుడు రెస్ట్రూమ్ నుంచి బయటకు వస్తున్నప్పుడూ వదల్లేదు. కావలించుకున్నాడు. ‘అడ్జస్ట్’ అవమని అందరూ చెప్పడమే. ఎంత అడ్జస్ట్ అవుదామని చూసినా ఇది భరించలేనంతగా ఉండటం వల్ల మలయాళ ఇండస్ట్రీ వదిలిపెట్టి చెన్నైకి మారి΄ోయాను’ అని నటి మీను మునీర్ ఫేస్బుక్లో రాసింది. హేమా కమిషన్ బయటకు వచ్చాక ఈమె ఈ వివరాలు తెలిపింది. – ఫ్యామిలీ డెస్క్ -
మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ రాజీనామా
హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇప్పటికే పలువురు నటులు, డైరెక్టర్స్పై పెద్దఎత్తున ఆరోపణలు రావడంతో ఇండస్ట్రీ పెద్దలు చక్కదిద్దే పనిలో పడ్డారు. తాజాగా సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్పై (AMMA) మండిపడ్డారు. ఈ నివేదికపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్పై (AMMA) తీవ్రమైన విమర్శలు రావడంతో ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న మోహన్లాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు కమిటీ సభ్యులందరూ తమ రాజీనామాలను సమర్పించారు. ఇప్పటికే ఈ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక విషయంలో సీఎం పినరయి విజయన్ పోలీసు అధికారులతో కలిసి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ నివేదికపై దర్యాప్తు చేయడానికి ఏడుగురు సభ్యుల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా.. ఇప్పటికే దర్శకుడు రంజిత్ చలనచిత్ర అకాడమీకి రాజీనామా చేయగా.. నటుడు సిద్ధిక్ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ పదవి నుంచి నుంచి వైదొలిగారు. -
వయనాడ్లో పర్యటించిన మోహన్ లాల్
-
వయనాడ్ సహాయక చర్యల్లో మన్యం పులి.. రియల్ ‘హీరో’ అంటూ ప్రశంసలు (ఫొటోలు)
-
ఇండస్ట్రీ అంతా ఒక్క వెబ్ సిరీస్లో... ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలో క్రేజీ అంటే క్రేజీ వెబ్ సిరీస్ రిలీజ్కి రెడీ అయిపోయింది. ఇది ఎందుకు అంతలా స్పెషల్ అంటే.. ఏదైనా సినిమాలో గానీ సిరీస్లో మహా అయితే ఒకరిద్దరు స్టార్స్ నటిస్తారు. కానీ దీని కోసం మాత్రం దాదాపుగా ఇండస్ట్రీనే కదిలొచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సిరీస్లో అంతమంది స్టార్స్ ఉన్నారు. అసలు దీని సంగతేంటి? తాజాగా రిలీజైన ట్రైలర్ ఎలా ఉంది?(ఇదీ చదవండి: మ్యూజీషియన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్)ఈ ఏడాది ఏ ఇండస్ట్రీకి లేనంత సక్సెస్ రేట్ మలయాళ చిత్రపరిశ్రమ దక్కించుకుంది. మంజుమ్మల్ బాయ్స్, ఆవేశం, భ్రమయుగం, ప్రేమలు.. ఇలా వరసపెట్టి సినిమాలు హిట్ కొట్టాయి. వందల కోట్ల వసూళ్లు సొంతం చేసుకున్నాయి. స్వతహాగా మలయాళ సినిమాల్ని ప్రేక్షకులు బాగా ఇష్టపడుతుంటారు. ఇప్పుడు ఈ భాషలోని స్టార్ హీరోలైన మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ పాజిల్.. ఇలా టాప్ సెలబ్రిటీలు చాలామంది 'మనోరథంగల్' అనే వెబ్ సిరీస్ చేశారు.రెండేళ్లుగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సిరీస్.. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఆగస్టు 15 నుంచి జీ5 ఓటీటీలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళ స్టార్ రైటర్ ఎమ్టీ వాసుదేవర్ నాయర్ రాసిన స్టోరీతో ఈ సిరీస్ తీశారు. 9 భాగాల అంథాలజీని 8 మంది డైరెక్టర్స్ తెరకెక్కించారు. ఇందులో మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్, కమల్ హాసన్, బిజు మేనన్, పార్వతి తిరువత్తు, అపర్ణ బాలమురళి, అసిఫ్ అలీ, సిద్ధిఖీ.. ఇలా దాదాపు టాప్ సెలబ్రిటీలు అందరూ నటించడం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
ఖురేషిగా ఎందుకు మారాడు?
ఖురేషి అబ్రమ్గా స్టీఫెన్ నెడుంపల్లి ఎందుకు మారాడు? ‘లూసిఫర్’ సినిమా చూసిన ప్రేక్షకులకు ఈ సందేహం కలగడం సహజం. ఈ సందేహానికి ‘లూసిఫర్ 2’లో సమాధానం దొరకనుంది. స్టీఫెన్ నెడుంపల్లి అలియాస్ ఖురేషి అబ్రమ్గా మోహన్లాల్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ ‘లూసిఫర్’ (2019). హీరో, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ కాంబినేషన్లోనే ‘లూసిఫర్’కి సీక్వెల్గా ‘ఎల్2 ఎంపురాన్’ రూపొందుతోంది.ఈ చిత్రాన్ని లైకా ప్రోడక్షన్స్ సుభాస్కరన్, ఆశీర్వాద్ సినిమాస్ ఆంటోని పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. మంగళవారం (మే 21) మోహన్లాల్ బర్త్ డే సందర్భంగా ‘ఎల్ 2 ఎంపురాన్’లో ఖురేషి అబ్రమ్గా మోహన్లాల్ లుక్ను విడుదల చేశారు. స్టీఫెన్ నెడుంపల్లి అసలు ఖురేషి అబ్రమ్గా ఎలా మారాడు? అనే విషయాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. 2025లో మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
'లూసిఫర్2'లో మాఫియా డాన్గా మోహన్లాల్ లుక్ రివీల్
మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ నేడు (మే 21) 64వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా లూసిఫర్ సీక్వెల్ నుంచి ఆయన లుక్ను రివీల్ చేశారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ లూసిఫర్ 2 పోస్టర్ను డైరెక్టర్, హీరో పృథ్వీరాజ్ పోస్ట్ చేశాడు.మలయాళ ప్రముఖ హీరో పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం లూసిఫర్.. 2019వ విడుదలైన ఈ సినిమా రూ. 200 కోట్లు రాబట్టింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్గా 'లూసిఫర్2: ఎంపురాన్(రాజు కన్నా గొప్పవాడు)' అనే టైటిల్తో ఈ ఏడాదిలో విడుదల చేయనున్నారు. సీక్వెల్ కోసం మురళీ గోపి అందించగా పృథ్వీరాజ్నే దీనికి కూడా దర్శకత్వం వస్తున్నారు. గతేడాదిలోనే షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ చిత్రంలో మోహన్లాల్తో పాటు మంజు వారియర్, టోవినో థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.'లూసిఫర్'లో స్టీఫెన్ గట్టుపల్లి అనే రాజకీయ నాయకుడిగా మోహన్లాల్ కనిపించాడు. అయితే, ఆయన రాజకీయ ప్రవేశానికి ముందు ఈ ప్రపంచాన్నే శాసించే మాఫియాకు అధినేతగా ఉంటారు. మాఫియా డాన్ అబ్రహాం ఖురేషి సాధారణ వ్యక్తిగా జీవితం ప్రారంభించి అంత స్థాయికి ఎలా చేరుకున్నాడు. రాజకీయాలకు ముందు ఆయన ఏం చేశాడు..? ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు..? అనేది తెలియాలంటే లూసిఫర్2 వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే. లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ఫాదర్ పేరుతో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేసిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Prithviraj Sukumaran (@therealprithvi) -
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ బర్త్డే స్పెషల్ ఫోటోలు
-
ఇరవయ్యేళ్ల తర్వాత యాభైఆరవ చిత్రంలో...
మాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ హిట్ పెయిర్ మోహన్లాల్, శోభనల జోడీ రిపీట్ కానుంది. మోహన్లాల్ హీరోగా తరుణ్ మూర్తి దర్శకత్వంలో ఎమ్. రంజిత్ ఓ సినిమా నిర్మించనున్నారు. ఈ చిత్రంలో శోభన కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమాలో భాగమైనట్లుగా సోషల్ మీడియాలో శోభన ఓ వీడియో షేర్ చేశారు. ‘‘మోహన్లాల్గారి ఈ 360వ సినిమాలో నేను నటించనున్నాను. నాకు గుర్తు ఉన్నంతవరకు ఆయనతో నేను కలిసి చేయబోతున్న 56వ చిత్రం ఇది’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు శోభన. ఇక 1985లో వచ్చిన మలయాళ చిత్రం ‘అవిడతే పోలే ఇవిడెయుమ్’లో తొలిసారి కలిసి నటించారు మోహన్లాల్, శోభన. ఆ తర్వాత ఈ ఇద్దరూ ‘మణిచిత్ర తాళు’ (ఈ సినిమా ఆధారంగానే ‘చంద్రముఖి’ తీశారు), ‘నాడోడిక్కట్టు’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. 1994లో వచ్చిన మలయాళ చిత్రం ‘తేన్మావిన్ కొంబాట్’లో మెహన్లాల్, శోభన లీడ్ రోల్స్లో నటించారు. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మోహన్లాల్, శోభన కలిసి నటించనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. 2009లో వచ్చిన మలయాళ చిత్రం ‘సాగర్ ఆలియాస్ జాకీ రీలోడెడ్’లో మోహన్లాల్ హీరోగా నటించగా, శోభన ఓ అతిథి పాత్ర చేశారు. -
డైరెక్ట్గా ఓటీటీ స్టార్ హీరో మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ స్టార్ మోహన్లాల్ నటించిన చిత్రం తాజా చిత్రం మలైకొట్టై వాలిబన్. ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని షాకిచ్చింది. మోహన్లాల్, లిజో కాంబోలో వచ్చిన చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ డిజాస్టర్గా నిలిచింది. మోహన్లాల్ కెరీర్లో అత్యధిక బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం కేవలం రూ.25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే థియేటర్లలో ఈ మూవీ కేవలం మలయాళం భాషలో మాత్రమే రిలీజైంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్గా మారింది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయనున్నట్లు వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీలోనే రిలీజ్కు మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. మార్చి 1 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ హిస్టారికల్ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని లేటేస్ట్ టాక్. దాదాపు రూ.65 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రంలో.. మోహన్ లాల్ రాజస్థాన్కు చెందిన రెజ్లర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో డ్యుయల్ రోల్లో ఆకట్టుకున్నారు. బాలీవుడ్ భామ సోనాలి కులకర్ణి హీరోయిన్గా నటించింది. మోహన్ లాల్ కెరీర్లో మలయాళంలో అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది, కాగా.. గతేడాది జైలర్, నేరు సినిమాలతో అలరించిన మోహన్ లాల్.. ప్రస్తుతం బరోజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. -
'నెరు' సినిమా తెలుగు రివ్యూ (ఓటీటీ)
ఓటీటీలో ఓ మలయాళ డబ్బింగ్ సినిమా అదరగొడుతోంది. మూవీ పేరు 'నెరు'. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన మోహన్ లాల్, ప్రియమణి ఇందులో లాయర్లుగా నటించారు. కోర్టు రూమ్ డ్రామా కాన్సెప్ట్తో తీసిన ఈ మూవీ.. మలయాళంలో 'సలార్'కి పోటీగా రిలీజై ఏకంగా రూ.100 కోట్ల మేర వసూళ్లు సాధించాయి. అంతలా ఈ సినిమాలో ఏముంది? నిజంగా అంత బాగుందా? అనేది రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: చాన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) 'నెరు' కథేంటి? సారా మహమ్మద్ (అనస్వర రాజన్)కి కళ్లు కనిపించవు. ఓ రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈమెపై ఓ వ్యక్తి అత్యాచారం చేస్తాడు. తనపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి పోలికల్ని గుర్తుంచుకున్న సారా.. అతడి రూపాన్ని మట్టితో శిల్పంలా చేస్తుంది. దీంతో ఈ విగ్రహానికి దగ్గర పోలికలున్న మైకేల్ (శంకర్ ఇందుచూడన్)ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ అతడి బడా పారిశ్రామికవేత్త కొడుకు కావడంతో.. ఎలాంటి కేసు అయినా సరే గెలిచేసే లాయర్ రాజశేఖర్ వల్ల బెయిల్ వస్తుంది. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్ విజయ్ మోహన్ (మోహన్ లాల్)ని ఆశ్రయిస్తారు. చాన్నాళ్ల నుంచి అసలు కోర్టుకే రాని విజయ్ మోహన్.. సారా తరఫున నిలబడి న్యాయం చేశాడా? లేదా? చివరకు ఏమైందనేదే స్టోరీ. ఎలా ఉందంటే? 'నెరు' సినిమా కథ చూస్తే అస్సలు కొత్తది కాదు. ఓ సాధారణ అమ్మాయి.. ఊహించని విధంగా ఆమెపై బలత్కారం.. కేసు వేసినా సరే న్యాయం జరుగుతుందా అనే డౌట్.. ఇలాంటి టైంలో లాయర్ అయిన హీరో ఎంట్రీ.. వాదప్రతివాదనలు.. చివరకు న్యాయం గెలిచిందా లేదా అనేది క్లైమాక్స్. అయితే మూవీ చూస్తున్నప్పుడు తెలిసిన కథలానే అనిపిస్తుంది కానీ ప్రతి నిమిషం ఓ మంచి సినిమా చూస్తున్నామే అనుభూతి కలిగిస్తూ ఉంటుంది. స్టోరీ బాగుంది అనుకునేలోపు.. అద్భుతమైన నటనతో నటీనటులు విజృంభిస్తుంటారు. ఈ రెండు సూపర్ అనుకునేలోపు దర్శకుడు.. తన స్క్రీన్ ప్లే మేజిక్ చూపిస్తుంటాడు. అంత బాగుంటుంది ఈ సినిమా. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) హీరో బిల్డప్పులు.. ఎంట్రీ సాంగ్.. ఇలాంటి పనికిమాలిన రొటీన్ సీన్స్ ఏం లేకుండానే 'నెరు' కథని మొదలుపెట్టేశారు. కళ్లు కనిపించని అమ్మాయిపై అత్యాచారం జరగడం, దీంతో ఆమె తల్లిదండ్రులు కోర్టులో కేసు వేయడం.. అనుమానితుడు అయినా కుర్రాడిని అరెస్ట్ చేసి జైల్లో వేయడం.. అతడు తండ్రి కోటీశ్వరుడు కావడంతో ఫేమస్ క్రిమినల్ లాయర్ రంగంలోకి దిగడం.. అమ్మాయి తరఫు లాయర్ కన్ఫ్యూజన్.. దీంతో రేప్ చేశాడనే అనుమానమున్న కుర్రాడికి బెయిల్ రావడం.. ఇలా సీన్స్ అన్నీ చకాచకా పరుగెడుతుంటాయి. సరిగా అప్పుడు అమ్మాయి తరఫున వాదించేందుకు లాయర్ విజయ్ మోహన్ రంగంలోకి దిగుతాడు. అప్పటి నుంచి సినిమా మరింత థ్రిల్లింగ్గా మారుతుంది. చివరి వరకు అదే టెంపో మెంటైన్ చేస్తారు. ఇదే సినిమా విజయానికి కారణమైంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు అంతా తెలిసినట్లే ఉంటుంది. కానీ దర్శకుడు జీతూ జోసెఫ్ వాటిని రాసుకున్న విధానం మాత్రం వేరే లెవల్ ఉంటుంది. ఈ రోజుల్లో సాంకేతికతని ఎలా దుర్వినియోగపరుస్తున్నారు. తద్వారా నిందితుల్ని ఎలా తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారనేది క్లియర్ కట్గా చూపించారు. ఒకప్పటిలా కాకుండా అమ్మాయిలు ఇప్పుడు తమపై బలత్కారం జరిగితే ఎలా నిర్భయంగా ఎలా చెప్పగలుగుతున్నారో అనే సీన్ ఒకటి ఉంటుంది. చూస్తుంటే మీకు గూస్ బంప్స్ తో పాటు ఓ హై వస్తుంది. ఇక కేసు గెలిచిన తర్వాత విజయ్ మోహన్ ముఖాన్ని సారా తన చేతులతో తడిమి చూసే సీన్ కావొచ్చు. చివర్లో తన ముఖానికి ఉన్న స్కార్ఫ్ తీసి ధైర్యంగా బయటకు నడుచుకుంటే వచ్చే సీన్స్ కావొచ్చు. ఇలా బోలెడన్ని సన్నివేశాల మిమ్మల్ని విజిల్ వేసేలా చేస్తాయి. ఎవరెవరు ఎలా చేశారు? ఇందులో హీరోహీరోయిన్ అని ఎవరూ ఉండరు. నటించిన వాళ్లందరూ జస్ట్ పాత్రధారులంతే. మోహన్ లాల్ లాంటి స్టార్ ఉన్నప్పటికీ.. సారా పాత్రలో నటించిన అనస్వర రాజన్ ఆయన్ని డామినేట్ చేసేసింది. కళ్లు లేని అమ్మాయిగా అద్భుతమైన నటనతో చించి అవతల పడేసింది. సినిమా చూసిన తర్వాత మీరు కచ్చితంగా ఆమెతో ప్రేమలో పడిపోతారు. అంతా బాగుంది మరి. ఇక డిఫెన్స్ లాయర్స్గా నటించిన సిద్ధిఖ్, ప్రియమణి కూడా ఉన్నంతలో డీసెంట్గా చేశారు. మిగిలిన వాళ్లకు పెద్దగా చెప్పుకోదగ్గ సీన్స్ ఏం లేవు. చివరగా రైటప్ అండ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ గురించి చెప్పుకోవాలి. 'దృశ్యం' సినిమాలతో అందరికీ బుర్రతిరిగిపోయేలా చేసిన ఈ డైరెక్టర్.. ఇప్పుడు 'నెరు' మూవీతో కోర్టు రూమ్ డ్రామా సినిమాల్లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు. చివరగా ఒక్కమాట.. మన పవర్ రీమేక్ స్టార్ ఈ సినిమాని రీమేక్ చేసి చెడగొట్టే ముందే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 'నెరు' చూసేయండి. ప్రస్తుతం హాట్స్టార్లో తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంది -చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ (ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్) -
ఓటీటీలో మోహన్లాల్ సూపర్ హిట్ మూవీ.. నెలరోజులకే..
ఓటీటీలు వచ్చాక ఇక్కడి సినీప్రియులు తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాలనూ ఆదరిస్తున్నారు. అటు సినిమా మేకర్స్ కూడా తమ చిత్రాన్ని ఓటీటీలో వీలైనన్ని ఎక్కువ భాషల్లో విడుదల చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఫలితాలతో సంబంధం లేకుండా కొన్ని చిత్రాలు ఓటీటీలో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా తమిళ, మలయాళ సినిమాలు చూసేందుకు జనాలు గత కొంతకాలంగా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో అనేక సినిమాలు ఇక్కడ కూడా డబ్ అవుతున్నాయి. ఓటీటీలోకి నేరు తాజాగా మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించిన 'నేరు' మూవీ ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియమణి, అనస్వర రాజన్, శాంతి మాయాదేవి, సిద్దిఖి జగదీష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన నేరు గతేడాది డిసెంబర్ 21న థియేటర్లలో విడుదలైంది. ఓటీటీలో రిలీజ్ ఇప్పటివరకుప్రపంచవ్యాప్తంగా రూ.85 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. థియేటర్లో రిలీజైన నెలరోజులకు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. జనవరి 23 నుంచి హాట్స్టార్లో ప్రసారం కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. View this post on Instagram A post shared by Disney+ Hotstar (@disneyplushotstar) చదవండి: జై శ్రీరామ్ అంటూ.. క్షమాపణ చెప్పిన నయనతార -
PM Modi: గురువాయూరు గుడిలో ప్రధాని మోదీ పూజలు.. నూతన దంపతులకు ఆశీర్వాదం (ఫొటోలు)
-
సూపర్స్టార్ కొత్త మూవీ.. టీజర్ మాత్రం అదుర్స్!
మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ హీరోగా నటించిన కొత్త సినిమా 'మలైకోట్టై వాలిబన్'. లిజో జోస్ పల్లిచోలి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జాన్ మేరీ క్రియేటివ్, సెంచరీ ఫిలిమ్స్, మ్యాక్స్ ల్యాబ్, సరిగమ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. పీరియాడికల్ డ్రామాగా తీసిన ఈ చిత్ర షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. మొత్తంగా 33 రిలీజ్!) ఈ సినిమాని వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ.. దర్శకుడి అద్భుత పనితనమని హీరో మోహన్ లాల్ చెప్పుకొచ్చారు. టీజర్లో చూపించిన సన్నివేశాలకు ఏమాత్రం తగ్గకుండా మూవీ ఉంటుందని అన్నారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అంటూ శివాజీ చిల్లర వ్యాఖ్యలు) -
సూపర్ హిట్ మూవీ సీక్వెల్లో పాక్ నటి.. ఫోటో వైరల్!
ఇటీవలే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన పాకిస్తాన్ నటి మహీరా ఖాన్. ఆమె త్వరలోనే మాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ నటిస్తోన్న ఎల్2: ఎంపురాన్లో ఆమె హీరోయిన్గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా.. మహీరా ఇప్పటికే ఈ ప్రాజెక్ట్పై సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మోహన్లాల్ సరసన కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై మేకర్స్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈనేపథ్యంలో పృథ్వీరాజ్తో ఉన్న మహీరా పాత ఫోటో కూడా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ఎల్2: ఎంపురాన్ చిత్రాన్ని యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నారు. 2019లో విడుదలైన లూసిఫర్ పార్ట్-2గా ఎల్2: ఎంపురాన్ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా.. మహీరా ఖాన్ విషయానికొస్తే.. 2017 బాలీవుడ్ చిత్రం రయీస్లో షారుఖ్ ఖాన్ సరసన ప్రధాన పాత్ర పోషించింది. అయితే 2016 యూరీ ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ ఆరిస్టులను ఇండియాలో పని చేయకుండా నిషేధించారు. దీంతో నిషేధం తర్వాత ఆమె ఇండియాలో ఏ సినిమాలోనూ కనిపించలేదు. అయితే ఇటీవలే పాకిస్థానీ కళాకారులపై ఉన్న నిషేధాన్ని ముంబై హైకోర్టు ఎత్తివేసింది. దీంతో మహీరా ఖాన్ మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే మేకర్స్ నుంచి ప్రకటన రావాల్సిందే. Is this an old photo?#PrithvirajSukumaran with #Mahirakhan pic.twitter.com/SvVMQG5MQD — AKV (@AnandKr13834547) November 26, 2023 View this post on Instagram A post shared by Mahira Khan (@mahirahkhan) -
శివకార్తికేయన్ సినిమా.. రంగంలోకి పాన్ ఇండియా స్టార్లు!
ప్రస్తుతం మంచి రైజింగ్లో ఉన్న నటుడు శివకార్తికేయన్. ఇటీవల ఈయన నటించిన మావీరన్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఇతడు.. విశ్వ నటుడు కమల్ హాసన్ తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుండగా రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తర్వాత ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి శివకార్తికేయన్ సిద్ధమవుతున్నారు. కార్తికేయన్తో సీతారామం బ్యూటీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను గత సెప్టెంబర్లోనే నిర్మాతలు ప్రకటించారు. ఇందులో సీతారామం చిత్రం ఫేమ్ మృణాల్ఠాగూర్ కథానాయికగా నటించబోతున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఆమె తెలుగులో రెండు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. వీరి కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రంలో మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్, అదేవిధంగా బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ ముఖ్య పాత్రలు పోషించబోతున్నట్లు తాజా సమాచారం. నటుడు మోహన్లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పుడు తుపాకీలో విలన్గా.. ఇప్పుడు.. ఇకపోతే విద్యుత్ జమ్వాల్ ఇంతకుముందు విజయ్ కథానాయకుడిగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన తుపాకీ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించారన్నది గమనార్హం. కాగా అనిరుధ్ సంగీతాన్ని అందించనున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని శ్రీలక్ష్మీ మూవీస్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. చిత్ర షూటింగ్ డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. చదవండి: ‘మంగళవారం’ మూవీ రివ్యూ -
Viral Pics: కేరళీయం 2023 వేడుకలు: ఒకే ఫ్రేమ్లో దిగ్గజాలు (ఫొటోలు)
-
వృషభ రిలీజ్ డేట్ వచ్చేది అప్పుడే! ఆ సన్నివేశాలు హైలైట్!
మలయాళం సూపర్స్టార్ మోహన్లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన జాతీయస్థాయి నటుడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నటించారు. తాజాగా ఈయన నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం వృషభ: ది వారియర్స్ అరైస్. రోషన్ మేకా, షనాయా కపూర్, సహారా ఎస్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నందకిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. కనెక్ట్ మీడియా, బాలాజీ తెలుగు ఫిలిమ్స్ ఏవీఎస్ స్టూడియోస్ బ్యానర్లపై వరుణ్ మందుర్, సౌరవ్ మిశ్రా, ఏక్తా ఆర్ కపూర్, శోభాకపూర్, విశాల్ కుర్నానీ, జూసీ పరేక్ మేతా, అభిషేక్ వ్యాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమవగా ప్రస్తుతం రెండవ షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ చిత్ర వివరాలను నిర్మాతలు తెలుపుతూ తండ్రి కొడుకుల మధ్య డ్రామా, ఎమోషన్, ప్రేమ, పగ, ప్రతీకారంతో కూడిన పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుందన్నారు. చిత్రంలో వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు హైలైట్గా ఉంటాయన్నారు. ఇది 2024లో విడుదలయ్యే అత్యంత భారీ చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్ర విడుదల తేదీని నవరాత్రి సందర్భంగా వెల్లడించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా తమిళం, హిందీ తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చెప్పారు. చదవండి: మ్యాచ్ చూసేందుకు వెళ్లి గోల్డ్ ఐఫోన్ పోగొట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ -
లూసిఫర్ సీక్వెల్ రెడీ.. మాలీవుడ్లో లైకా ప్రొడక్షన్స్ ప్లాన్
కోలీవుడ్లో చిన్న చిత్రాల నుంచి భారీ చిత్రాల వరకు కేరాఫ్గా మారిన చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షనన్స్. ఈ సంస్థ అధినేత సుభాస్కరన్ ఇప్పుడు మాలీవుడ్లోకి అడుగు పెట్టారు. కంప్లీట్ యాక్టర్గా పేరుగాంచిన మోహన్లాల్ బహుభాషా నటుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. గత నాలుగు దశాబ్దాలుగా కథానాయకుడిగా నటిస్తూ మాలీవుడ్లో (మలయాళం) అత్యధిక పారితోషికం తీసుకున్న నటుల్లో ఈయన ఒకరు. (ఇదీ చదవండి: వాళ్లు అయితే నా దుస్తులు తొలగించేవారు.. ఊసరవెల్లి బ్యూటీ కామెంట్లు) 350 చిత్రాలకు పైగా చేసిన మోహన్ లాల్ ఈమధ్య నటించిన చిత్రం లూసిఫర్. దీనికి మరో మలయాళ ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించి అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. లూసిఫర్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. కాగా దానికి సీక్వెల్గా లూసిఫర్ 2 చిత్రం రూపొందుతోంది. ఇది కూడా మోహన్ లాల్, పృథ్విరాజ్ సుకుమారన్లో కాంబినేషన్లోనే తెరకెక్కడం విశేషం. కాగా విచిత్రాన్ని ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ సినిమాస్ అధినేత ఆంటోని పెరంబలూర్తో కలిసి లైకా ప్రొడక్షనన్స్ సుభాస్కరన్ నిర్మిస్తుండడం మరో విశేషం. దీని గురించి లైకా ఫిలిమ్స్ సంస్థ అధినేత సుభాస్కరన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ దైవ దేశంగా భావించే మలయాళ చిత్ర పరిశ్రమంలోకి ప్రవేశించడం సంతోషంగా ఉందన్నారు. అంకితభావంతో పనిచేసే కళాకారులు సహజత్వంతో కూడిన సంస్కృతికి అద్దం పట్టే చిత్రాలను రూపొందించే మలయాళ చిత్ర పరిశ్రమలో లూసిఫర్ 2 చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యే అవకాశాన్ని తాము పొందామని చెప్పారు. ఈ చిత్త పరిశ్రమ అభివృద్ధిని, ఈ చిత్రాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నదే తమ ధ్యేయంగా పేర్కొన్నారు. ఈ చిత్ర విజయం పదికాలాలపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే విధంగా ఉంటుందని సుభాస్కరన్ పేర్కొన్నారు. -
మంచు విష్ణు ‘కన్నప్ప’లో మరో స్టార్ హీరో
‘కన్నప్ప’ విషయంలో ఎక్కడ తగ్గట్లేదు డైటమిక్ హీరో మంచు విష్ణు. టెక్నీషియన్లను మొదలుకొని నటీనటుల వరకు పెద్ద పెద్ద వాళ్లనే తీసుకుంటున్నాడు. దీంతో కన్నప్ప మీద రోజు రోజు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రభాస్ నటించబోతున్న విషయం తెలిసిందే. సినిమాలో కీలకపై శివుని పాత్రలో ప్రభాస్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్కి జోడిగా..అంటే పార్వతిగా నయనతార నటించబోతున్నట్లు నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ప్రాజెక్ట్లో మరో స్టార్ హీరో వచ్చి చేరాడు. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ సైతం కన్నప్ప సినిమాలో ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్నారు. ఈ మేరకు మంచు విష్ణు రీసెంట్గా మోహన్ లాల్ను కలిశారు. ఈ మేరకు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ టెలివిజన్ రంగంలో సూపర్ హిట్ మహాభారత సిరీస్ ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సుమారు రూ. 150 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందించనున్నారు. Har Har Mahadev! ❤️ https://t.co/Q62cakbibp — Vishnu Manchu (@iVishnuManchu) September 30, 2023 -
విజయ్ ‘లియో’కి బాయ్కాట్ సెగ.. కారణం ఆ గొడవేనా?
వారసుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’. విక్రమ్తో కమల్హాసన్కు భారీ విజయాన్ని అందించిన లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చాలాకాలం తర్వాత విజయ్కి జోడీగా త్రిష నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై హైప్ని క్రియేట్ చేశాయి. తమిళ్ ప్రేక్షకులే కాదు ఆలిండియా సినీ అభిమానులు సైతం లియో చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలాంటి తరుణంలో ఈ చిత్రానికి కేరళలో బాయ్కాట్ సెగ తగిలింది ట్రెండింగ్లో #KeralaBoycottLEO హ్యాష్ట్యాగ్ విజయ్కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన సినిమాలు తెలుగు, కన్నడ, కేరళలో డబ్ అయి విజయం సాధించాయి. అందుకే లియో చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషలతో పాటు పాన్ ఇండియా వైడ్గా విడుదల చేస్తున్నారు. కేరళలో కూడా విజయ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కేరళలో లియో సినిమాకు వ్యతిరేకత ఎదురవుతుంది. లియో సినిమాను బహిష్కరించాలంటూ కొంతమంది కేరళ వాసులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ వ్యతిరేకతను తెలియజేయడంతో.. #KeralaBoycottLEO హ్యాష్ట్యాగ్ ఎక్స్(ట్విటర్)లో ట్రెండ్ అవుతోంది. మోహన్లాల్ అభిమానులే ఈ చిత్రాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కారణమేంటి? పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ ఉన్న లియో సినిమాకు కేరళలో వ్యతిరేకత ఎదురవడానికి మోహన్లాల్ అభిమానులే కారణం. వాళ్లు అలా ట్రోల్ చేయడానికి కూడా కారణం ఉంది. 2014లో మోహన్లాల్, విజయ్ కలిసి ‘జిల్లా’ అనే సినిమాలో నటించారు. ఆ చిత్రం విడుదలయ్యాక కొంతమంది విజయ్ ఫ్యాన్స్.. మోహన్లాల్ నటనను అవమానిస్తూ ట్వీట్లు చేశారు. అప్పట్లో ఆ ట్వీట్స్ బాగా వైరల్ అయ్యాయి. తమ హీరోని అవమానించారు కాబట్టే.. విజయ్ సినిమాను ఇక్కడ ఆడనివ్వమని మోహల్లాల్ ఫ్యాన్స్ చెబుతున్నారు. విజయ్కి వ్యతిరేకంగా #Kerala Boycott Leo అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రానికి బాయ్కాట్ హీట్ తగిలితే మాత్రం నిర్మాతలకు ఇబ్బందులు తప్పవు. -
వెండితెరపై యుద్ధానికి సిద్ధం అవుతున్న స్టార్ హీరోలు
వెండితెరపై కథానాయకుడు కత్తి దూస్తే.. గుర్రపు స్వారీ చేస్తూ యుద్ధం చేస్తే... విల్లు ఎక్కుపెడితే చూసే ప్రేక్షకులకు ఓ థ్రిల్. రెగ్యులర్గా వచ్చే ఫైట్స్కి భిన్నంగా సిల్వర్ స్క్రీన్పై ‘వార్’ కనిపిస్తే ‘వావ్’ అనకుండా ఉండలేరు. కొందరు హీరోలు వెండితెరపై యుద్ధం చేయడానికి రెడీ అయ్యారు. ఆ వారియర్స్ గురించి ఓ లుక్ వేయండి. దిక్కులెల్ల గెలిచినోడు.. ‘కొండల కోనల్లో కోటి పులులు పట్టినోడు, ముక్కోటి చుక్కలెక్కి దిక్కులెల్ల గెలిచినోడు.. ఒక్కడే ఒక్క వీరుడురా.. వాడే కంగ’.. కంగువా’ సినిమాలో హీరోగా సూర్య పాత్రను చిత్రబృందం వివరించిన తీరు ఇది. దీన్నిబట్టి ఈ సినిమాలో సూర్య పాత్రను ఈ చిత్రదర్శకుడు శివ చాలా పవర్ఫుల్గా తీర్చిదిద్ది ఉంటారని ఊహించవచ్చు. ఈ పీరియాడికల్ ఫిల్మ్లో కొన్ని సన్నివేశాల్లో కంగ అనే యోధుడి పాత్రలో కనిపిస్తారు సూర్య. ఇప్పటికే ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. అంతేకాదు..‘కంగువా’ సినిమాలో ఈ సీన్స్ హైలైట్గా ఉంటాయని కోలీవుడ్ సమాచారం. 17వ శతాబ్దానికి చెందిన ఓ వీరుడు సమకాలీన పరిస్థితులకు కనెక్ట్ అయ్యే ఓ పాయింట్తో ‘కంగువా’ చిత్రాన్ని దర్శకుడు శివ తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్గా నటించారు. ‘కంగువా’ తొలి భాగం ఏప్రిల్లో విడుదల కానుంది. ది వారియర్ విభిన్న సినిమాలు, వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తూ ఎప్పుడూ బిజీగా ఉంటారు హీరో మోహన్లాల్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వృషభ’. ‘ది వారియర్ అరైజ్’ అనేది ఉపశీర్షిక. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. తొలి షెడ్యూల్ పూర్తయింది. కాగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఓ లుక్ కొన్ని సీన్స్లో మోహన్లాల్ వారియర్గా కనిపిస్తారన్నట్లుగా స్పష్టం చేస్తోంది. దీనికి తోడు క్యాప్షన్లో ‘వారియర్’ ప్రస్తావన ఉండటంతో మోహన్లాల్ వారియర్గా కనిపించే నిడివి కూడా ఎక్కువే అని ఊహిస్తున్నారు ఆయన అభిమానులు. తెలుగు, మలయాళం భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రోషన్ ఓ హీరోగా నటిస్తున్నాడు. జహ్రా ఖాన్, శనయ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నందకిశోర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే మోహన్లాల్ నటించి, తొలిసారి దర్శకత్వం వహించిన పీరియాడికల్ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ ‘బరోజ్’. ఈ చిత్రంలో ఓ నిధిని కాపాడే యోధుడిగా కనిపిస్తారాయన. స్వయంభూ వియత్నాంలో మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం.. వంటి యుద్ధ విద్యల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు హీరో నిఖిల్. ఎందుకంటే ‘స్వయంభూ’ సినిమా కోసం. ఈ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్లో నిఖిల్ యుద్ధ వీరుడిగా కనిపిస్తారు. నిఖిల్ శిక్షణ పూర్తయిన తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పూర్తి స్థాయిలో ్రపారంభం కానుంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇలా ‘వార్’ బ్యాక్డ్రాప్లో దక్షిణాదిన మరికొన్ని చిత్రాలు రూపొందుతున్నాయి. -
సినిమాల్లో ‘గుండు’ కలిసొస్తుందా?, సక్సెస్ రేటెంత?
ఒకప్పుడు హీరో అంటే.. 6 అడుగల హైట్..మంచి హెయిర్ స్టయిల్, డ్రెసింగ్ కచ్చితంగా ఉండాలి. అభిమానులు కూడా తమ హీరోలో ఈ క్వాలిటీస్ కచ్చితంగా ఉండాలని కోరుకునే వారు. కానీ ఇప్పుడు అవేవి పట్టించుకోవడం లేదు. గుండుతో కనిపించినా సరే.. తమను అలరిస్తే బా‘గుండు’ను అంటున్నారు. అందుకే ఈ మధ్య స్టార్ హీరోలే గుండుతో బాక్సాఫీస్ డీ కొడుతున్నారు. సినిమా సక్సెస్లోనూ ‘గుండు’ కీలక పాత్ర పోషిస్తోంది. షారుఖ్ సాహసం షారుఖ్ హెయిర్ స్టైల్ అంటే అభిమానులకు పిచ్చి. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే మొదలు మొన్నటి పఠాన్ వరకు ప్రతి సినిమాలోనూ వైవిధ్యమైన హెయిర్ స్టైల్తో అభిమానులను అలరించాడు. అలాంటి షారుఖ్.. ‘జవాన్’ కోసం పెద్ద సాహసమే చేశాడు. తొలిసారి గుండుతో కనిపించి షాకిచ్చాడు. జవాన్లో కీలకమైన మెట్రో ట్రైన్ హైజాక్ సీన్లో షారుఖ్ గుండుతో దర్శనమించాడు. తెరపై గుండుతో షారుఖ్ కనిపించగానే అభిమానులు ఈలలు వేశారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. గుండుతో ధనుష్ ఢీ ధనుష్ తన 50వ చిత్రానికి తనే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో గుండుతో కనిపించబోతున్నాడు. ఇది గ్యాంగ్స్టర్ డ్రామా అట. ధనుష్, విష్ణు విశాల్, ఎస్జే సూర్య అన్నదమ్ములుగా కనిపిస్తారని టాక్. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంతో ధనుష్ గుండుతోనే విలన్లను ఢీకొడుతాడట. గుండు, గుబురు గడ్డంతో మోహన్లాల్ మోహన్లాల్ టైటిల్ రోల్లో రూపొందుతున్న చిత్రం ‘బర్రోజ్’. వాస్కో డి గామా నిధిని రక్షించడానికి నియమించబడిన 400 ఏళ్ల నాటి ఆత్మ కథ బర్రోజ్. ఈ చిత్రానికి మోహన్లాలే దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడిగా ఇది ఆయనకు తొలి చిత్రం. ఇందులో గుండు, గుబురు గడ్డంతో మోహన్లాల్ కనిపించబోతున్నాడు. బాస్..గుండూ బాస్ మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై ఇప్పటి వరకు గుండుతో కనిపంచలేదు. అయితే భోళాశంకర్ కోసం గుండులో కనిపిస్తాడని అంతా భావించారు. ఎందుకంటే చిరంజీవియే స్వయంగా ఈ విషయాన్ని చెబుతూ..అప్పట్లో ఓ వీడియో వదిలాడు. అందులో చిరు..జుట్టు తీయించకుండా ప్రొస్టేటిక్ మేకప్తో గుండు లుక్ని మౌల్డ్ చేయించుకున్నాడు. అయితే సినిమాలో మాత్రం ఆ లుక్లో కనిపంచలేదు. కలిసొచ్చిన ‘గుండు’ చిత్ర పరిశ్రమలో ‘గుండు’ సక్సెస్ రేటు ఎక్కువనే చెప్పాలి. స్టార్ హీరోలు గుండుతో కనిపించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. శివాజీ చిత్రంలో రజనీకాంత్ గుండుతో సరికొత్త లుక్లో కనిపించాడు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ‘గజనీ’ సినిమాలో సూర్య గుండుతో కనిపించారు. అదీ సూపర్ హిట్టే. ఇదే సినిమా హిందీ రీమేక్లో అమీర్ గుండుతో కనిపించాడు. అభయ్ చిత్రంలో కమల్ హాసన్ కూడా గుండుతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. మోహన్ బాబు శివశంకర్ చిత్రంతో గుండుతో కనిపించగా.. ఆ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. వర్సటైల్ యాక్టర్ విక్రమ్ 'సేతు' సినిమాలో పాత్ర డిమాండ్ మేరకు గుండు చేయించుకున్నారు. -
వృషభ.. మళ్లీ ఆ రేంజ్లో యాక్షన్ సీన్స్!
మోహన్లాల్, రోషన్ మేకా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ద్విభాషా (తెలుగు, మలయాళం) చిత్రం ‘వృషభ’. ‘ది వారియర్ అరైజ్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో జహ్రా ఖాన్, శనయ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నంద కిషోర్ దర్శకత్వంలో అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మథూర్, సౌరభ్ మిశ్రా నిర్మాతలు. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. ‘‘తండ్రీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ఉంటుంది. ‘మన్యం పులి’ తర్వాత మోహన్లాల్, పీటర్ హెయిన్స్ కాంబినేషన్లో ఆ తరహా యాక్షన్ సీన్స్ అలరిస్తాయి. హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో మా సినిమాకు వర్క్ చేస్తున్నారు’’ అని యూనిట్ పేర్కొంది. శ్రీకాంత్ మేకా, రాగిణి ద్వివేది తదితరులు కీలక పాత్రల్లో తెలుగు, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం హిందీ, కన్నడ, తమిళ భాషల్లో 2024లో రిలీజ్ కానుంది. -
అసాధారణ ప్రయాణం
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. అభిలాష్ జోషి దర్శకత్వంలో జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్ నిర్మించాయి. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళ, తమిళ ట్రైలర్స్ని హీరోలు నాగార్జున, షారుక్ ఖాన్, మోహన్ లాల్, సూర్య విడుదల చేశారు. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘కింగ్ ఆఫ్ కోత’ ఒక అసాధారణ ప్రయాణం. గొప్ప పాత్రలు, క్లిష్టమైన కథతో రూపొందించాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు జీ స్టూడియోస్ సౌత్ హెడ్ అక్షయ్ కేజ్రీవాల్. -
గుండెపోటుతో స్టార్ డైరెక్టర్ కన్నుమూత
ఇండస్ట్రీలో మరో విషాదం. ఎన్నో అద్భుతమైన సినిమాల తీసి, స్టార్ డైరెక్టర్గా పేరు గడించిన సిద్ధిఖీ (63) కన్నుమూశారు. గత రెండు రోజులుగా అనారోగ్య సమస్యలతో సీరియస్ కండీషన్లో ఉన్న ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో మలయాళ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హీరోయిన్ కీర్తి సురేశ్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, హీరో మోహన్లాల్ తదితరలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధిఖీతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఏం జరిగింది? సోమవారం మధ్యాహ్నం దర్శకుడు సిద్ధిఖీకి గుండెపోటు వచ్చింది. దీంతో కేరళలోని కొచ్చిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. లివర్ సంబంధిత సమస్యలతోపాటు న్యూమోనియా ఉన్నట్లు డాక్టర్స్ గుర్తించారు. మరోవైపు ఈయన ఆరోగ్యం విషమించింది. ఎక్మో సాయంతో చికిత్స అందించినట్లు మాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ఆయనకు ఏం కాదని, త్వరగా కోలుకుంటారని అనుకున్నారు. కానీ పరిస్థితి చేయి దాటిపోవడంతో ప్రాణాలు వదిలేశారు. (ఇదీ చదవండి: బెడ్పై కదల్లేని స్థితిలో.. మాట రాక కంటనీరు..: రాజీవ్ కనకాల ఎమోషనల్) సిద్దిఖీ ఎవరు? సిద్ధిఖీ అసలు పేరు సిద్ధిఖీ ఇస్మాయిల్. డైరెక్టర్ కమ్ స్క్రీన్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్. మలయాళంలో మోహన్లాల్కు సిద్దిఖీ బెస్ట్ ఫ్రెండ్. వీళ్లిద్దరి కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. అద్భుతమైన సక్సెస్లు అందుకున్నాయి. విచిత్రం ఏంటంటే సిద్దిఖీ తీసిన తొలి సినిమా 'రాంజీరావు స్పీకింగ్'. చివరి సినిమా 'బిగ్ బ్రదర్'. ఈ రెండింటిలోనూ మోహన్లాల్ హీరో కావడం విశేషం. దీన్నిబట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. వీళ్లిద్దరి బాండింగ్ ఎలా ఉండేదోనని.. తెలుగులోనూ అలానే మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోని అద్భుతమైన సినిమాల్లో ఒకటైన 'హిట్లర్' కథ ఈయనదే. మలయాళంలో అదే పేరుతో మమ్ముట్టి హీరోగా తీసిన సినిమానే చిరు.. తెలుగులో రీమేక్ చేశారు. పలు భాషల్లో రీమేక్ అయిన 'బాడీగార్డ్' ఒరిజినల్కు దర్శకుడు ఈయనే. తెలుగులోనూ నితిన్ హీరోగా 'మారో' అనే మూవీ తీశాడు. కాకపోతే ఇది ఆడలేదు. దీంతో సిద్దిఖీ మరో తెలుగు సినిమా చేయలేదు. 20కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన సిద్దిఖీ ఇలా చనిపోవడం ఇండస్ట్రీకి తీరనిలోటు. 💔 pic.twitter.com/DJrV2IKZc6 — Keerthy Suresh (@KeerthyOfficial) August 8, 2023 RIP Deepest condolences to the family 🙏 pic.twitter.com/LXjkvvxxBl — Prabhudheva (@PDdancing) August 8, 2023 (ఇదీ చదవండి: అనాథలా రేకుల షెడ్డులో దుర్భర జీవితం గడిపిన స్టార్ హీరోయిన్!) -
వృషభ నాకో అందమైన జర్నీ
‘మూన్ లైట్ (2016), త్రీ బిల్ బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ’ (2017) వంటి పలు హాలీవుడ్ చిత్రాలకు నిర్మాతగా, సహనిర్మాతగా వ్యవహరించిన నిక్ తుర్లో తొలిసారి భారతీయ భాషా చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. మోహన్ లాల్, రోషన్ మేక తండ్రీ కొడుకులుగా, శనయ కపూర్, జహ్రా ఖాన్ కీ రోల్స్లో నటిస్తున్న ‘వృషభ’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు నిక్. ఈ సందర్భంగా నిక్ మాట్లాడుతూ – ‘‘వృషభ’ నా ఫస్ట్ ఇండియన్ మూవీ. నేను చేస్తున్న తొలి బహు భాషా సినిమా కూడా ఇదే. ‘వృషభ’ నాకో అందమైన జర్నీ అవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. నంద కిషోర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మథూర్, సౌరభ్ మిశ్రాలు నిర్మిస్తున్నారు. తెలుగు, మలయాళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ రిలీజ్ కానుంది. -
రోషన్ లీడ్ రోల్లో వృషభ షురూ
మోహన్ లాల్ ప్రధాన పాత్రలో, రోషన్ లీడ్ రోల్లో నటిస్తున్న ద్విభాషా చిత్రం (తెలుగు, మలయాళం) ‘వృషభ’. నందకిశోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, రాగిణి ద్వివేది, జహ్రా ఎస్ ఖాన్ , షానయ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ వ్యాస్, ఏక్తా కపూర్, విశాల్గుర్నాని, జుహీ పరేహ్ మెహతా, శ్యామ్ సుందర్, శోభాకపూర్, వరుణ్ మాథుర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటి ఊహ క్లాప్ కొట్టారు. మోహన్ లాల్, రోషన్ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట నందకిశోర్. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలిసింది. తెలుగు, మలయాళంతో పాటు తమిళం, కన్నడం, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. -
రోషన్ చేతిలో రెండు పాన్ ఇండియా చిత్రాలు
‘నిర్మలా కాన్వెంట్’ (2016)లో లీడ్ రోల్ చేసి, ‘పెళ్లి సందడి’ (2021)తో హీరోగా మంచి మార్కులు తెచ్చుకున్నారు నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా. ఇప్పుడు పర్ఫెక్ట్ ప్లానింగ్తో హీరోగా సినిమాలు సైన్ చేశారు. రోషన్ ఒకేసారి రెండు పాన్ ఇండియా చిత్రాలు అంగీకరించడం విశేషం. కన్నడ దర్శకుడు నందకిశోర్ దర్శకత్వంలో రోషన్–మోహన్లాల్ కాంబినేషన్లో రూపొందనున్న పాన్ ఇండియా చిత్రం షూటింగ్ ఈ నెలాఖరులో ఆరంభం కానుంది. తండ్రీ–కొడుకుల అనుబంధం నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ మూవీగా రూపొందనుంది. రోషన్ నటించనున్న మరో పాన్ ఇండియా చిత్రం వైజయంతీ మూవీస్–స్వప్నా సినిమా బేనర్లపై రూపొందనుంది. నూతన దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. -
గుండుతో ఢీ కొట్టేందుకు రెడీ అయిన స్టార్స్
హీరో అంటే ఫ్యాన్స్కి స్టయిలిష్గా కనబడాలి.. హెయిర్ స్టయిల్, డ్రెస్సింగ్, వాకింగ్... ఇలా అన్నీ స్టయిలు స్టయిలులే.. ఇది సూపర్ స్టయిలులే అన్నట్లు ఉండాలి. ఫ్యాన్స్ ఇలానే కోరుకుంటారు. కానీ తమ హీరోని ‘గుండు’లో చూడాలనుకోరు. ఒకవేళ గుండులో కనిపించే క్యారెక్టర్ చేస్తున్నారని తెలిస్తే ‘బాగుండునా!’ అని చర్చించుకుంటారు. చివరికి లుక్ చూశాక ఈ క్యారెక్టర్ చేస్తే ‘బాగుండు’ అనుకుంటారు. మరి.. గుండులోనూ స్టయిలిష్గా కనిపిస్తే ఎందుకు కాదంటారు. ఇక ఈ లుక్లో చిరంజీవి, మోహన్లాల్, ధనుష్ కనిపించనున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. భోళా శంకర్లో... వెండితెరపై ఇప్పటివరకూ చిరంజీవి గుండుతో కనిపించలేదు.. ఎందుకంటే క్యారెక్టర్ డిమాండ్ చేయలేదు. ఇప్పుడు ఒక క్యారెక్టర్ డిమాండ్ చేసింది.. అంతే.. గుండుతో కనిపించడానికి రెడీ అయ్యారు. ఆ సినిమా ‘భోళా శంకర్’. అజిత్ నటించిన తమిళ చిత్రం ‘వేదాళం’కి రీమేక్ ఇది. తమిళ వెర్షన్లో అజిత్ పూర్తి గుండుతో కనిపించలేదు... అయితే దాదాపు ‘హెడ్ షేవ్’ చేసుకున్నారు. కానీ చిరంజీవి మాత్రం నున్నటి గుండుతో కనిపించనున్నారు. అయితే జుట్టు తీయించకుండా ప్రొస్టేటిక్ మేకప్తో చిరంజీవి గుండు లుక్ని మౌల్డ్ చేశారు టెక్నీషియన్స్. ఆ వీడియోను చిరంజీవి షేర్ చేసి, నిపుణుల పని తీరుని మెచ్చుకున్నారు కూడా. ఇక మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి ఫ్లాష్బ్యాక్లో గుండుతో కనిపిస్తారట. ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా కథానాయికగా, ఆయన చెల్లెలి పాత్రను కీర్తీ సురేష్ చేస్తున్నారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. నిధిని కాపాడే బర్రోజ్ ఒక నిధిని కాపాడే పని మీద ఉంటాడు బర్రోజ్. వాస్కోడగామా దాచిన నిధి అది. వాస్కోడగామా నిజమైన వారసునికి మాత్రమే ఆ సంపద దక్కాలి. వారికి నిధిని అప్పగించే బాధ్యతను తీసుకున్న బర్రోజ్ 400 ఏళ్లుగా ఆ నిధిని కాపాడుకుంటూ వస్తాడు. ఈ కథతో రూపొందుతున్న చిత్రం ‘బర్రోజ్’. టైటిల్ రోల్లో నటిస్తూ, ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు మోహన్ లాల్. దర్శకుడిగా ఇది ఆయనకు తొలి చిత్రం. గుండు, గుబురు గడ్డంతో మోహన్లాల్ గెటప్ ఈ సినిమాలో డిఫరెంట్గా ఉంటుంది. బాలల చిత్రంలా రూపొందిస్తున్నారనీ, పెద్దలనూ ఆకట్టుకునే విధంగా ఉంటుందని సమాచారం. భారతీయ తొలి త్రీడీ చిత్రం ‘మై డియర్ కుట్టి సైతాన్’ దర్శకుడు జీజో పున్నూస్ ఈ త్రీడీ ‘బర్రోజ్’కి కథ, స్క్రీన్ప్లే అందించారు. ఈ ఏడాది ఓనమ్ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. యాభైయ్యవ సినిమాలో గుండుతో... నటుడిగా కెరీర్లో 50వ మైల్ స్టోన్ చేరుకున్నారు ధనుష్. ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. అయితే డైరెక్టర్గా ఆయనకిది తొలి చిత్రం కాదు. దర్శకుడిగా ‘పవర్ పాండీ’ (2017) మొదటి చిత్రం. ఆ చిత్రంలో ఓ అతిథి పాత్ర కూడా చేశారు. ఐదేళ్ల తర్వాత ధనుష్ మళ్లీ దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. ఈ చిత్రంలో గుండుతో కనిపించనున్నారట. ఈ సినిమా షూటింగ్ ఇటీవల ఆరంభమైంది. చిత్రీకరణ ఆరంభించక ముందు తిరుమల వెళ్లి ధనుష్ తలనీలాలు సమర్పించుకున్నారు. ఎలానూ ఈ చిత్రంలో గుండుతో కనిపిస్తారు కాబట్టి దైవాన్ని దర్శించుకుని, తల నీలాలు సమర్పించి ఉంటారని కోలీవుడ్ అంటోంది. ఇది గ్యాంగ్స్టర్ డ్రామా అట. ధనుష్, విష్ణు విశాల్, ఎస్జే సూర్య అన్నదమ్ములుగా కనిపిస్తారని టాక్. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. -
మోహన్ లాల్ బర్త్ డే.. ఖరీదైన కారు కొనిచ్చిన ఫ్రెండ్!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్కు సర్ప్రైజ్ ఇచ్చాడు అతని ప్రాణ స్నేహితుడు. మే 21న ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఖరీదైన బహుమతి ఇచ్చి అభిమానం చాటుకున్నారు. మోహన్ లాల్కు సరికొత్త కియా ఈవీ-6 ఎలక్ట్రిక్ కారును గిప్ట్గా ఇచ్చాడు. ఈ లగ్జరీ ఎస్యూవీ కారు విలువ దాదాపు రూ. 65 లక్షలకు పైగానే ఉంది. సూపర్ స్టార్ తన భార్యతో కలిసి కారు డెలివరీ తీసుకుంటున్న వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. (ఇది చదవండి: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత) మోహన్ లాల్ ఆదివారం తన 63 వ పుట్టినరోజును జరుపుకున్నారు. తెలుగులోనూ పలు చిత్రాలో నటించారు. ఆయన తన పుట్టిన రోజును కొంతమంది నిరుపేద పిల్లల సమక్షంలో జరుపుకున్నారు. వారితో కాసేపు సరదా మాట్లాడి కేక్ కట్ చేశారు. అంతే కాకుండా 2019 వరద రెస్క్యూ ఆపరేషన్లో ప్రాణాలు కోల్పోయిన కోజికోడ్కు చెందిన వ్యక్తికి మోహన్లాల్ ఇంటిని కూడా విరాళంగా ఇచ్చారు. (ఇది చదవండి: వెయిటర్గా మారిన 'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోని) కాగా.. మోహన్లాల్ ప్రస్తుతం 'మలైకోట్టై వాలిబన్'లో చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ రాజస్థాన్కు చెందిన రెజ్లర్ పాత్రలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by TOI ETimes Malayalam (@etimesmalayalam) -
కొరియాలో దృశ్యం
భారతీయ ‘దృశ్యం’ కొరియా తెరపైకి వెళ్లనుంది. మోహన్లాల్ హీరోగా, మీనా, ఆశా శరత్, అన్సిబా హాసన్, సిద్ధిఖ్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘దృశ్యం’. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించిన ఈ చిత్రం 2013లో విడుదలై అద్భుత విజయం సాధించింది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ రీమేక్ అయి హిట్ అయింది. ‘దృశ్యం’ తర్వాత మోహన్లాల్–జీతూజోసెష్ కాంబోలో వచ్చిన ‘దృశ్యం 2’ కూడా వీక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. ఇక దృశ్యం సినిమా హిందీ రీమేక్లో అజయ్ దేవగన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. కాగా ‘దృశ్యం’ ఫ్రాంచైజీ కొరియాలో రీమేక్ కానుంది. సౌత్ కొరియా ఆంథాలజీ స్టూడియోస్, ఇండియన్ పనోరమ స్టూడియోస్ పతాకాలపై చోయ్ జే వోన్, కుమార్ మంగత్ పాఠక్ హిందీ ‘దృశ్యం’ ని కొరియాలో రీమేక్ చేయనున్నారు. ఫ్రాన్స్లో జరుగుతున్న 76వ కాన్స్ చలన చిత్రోవత్సాల్లో ఈ విషయాన్ని చోయ్ జే, మంగత్ పాఠక్ ప్రకటించారు. ఇండియన్, కొరియన్ ప్రొడక్షన్ హౌస్లు కలిసి ఓ సినిమాను నిర్మిస్తుండటం ఇదే తొలిసారి. ‘‘సాధారణంగా కొరియన్ చిత్రాలు భారతీయ భాషల్లో రీమేక్ అవుతుంటాయి. కానీ, ఇప్పుడు ఓ ఇండియన్ సినిమా కొరియాలో రీమేక్ అవుతుంది’’ అన్నారు పాతక్. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ నిర్మాత పీకేఆర్ పిళ్లై(92) కన్నుమూశారు. మాలీవుడ్లో ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన అనారోగ్యంతో సమస్యలతో త్రిసూర్ జిల్లా మందన్చిరలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మోహన్ లాల్తో ఎక్కువగా సినిమాలు నిర్మించారు. (ఇది చదవండి: నాకు పునర్జన్మ నిచ్చింది ఆమెనే: విజయ్ ఆంటోని) షిర్డిసాయి క్రియేషన్స్ బ్యానర్పై అమృతం గమ్య (1987), చిత్రం (1988), వందనం (1989), కిజక్కునరుమ్ పక్షి (1991, అహం (1992)తో సహా మోహన్లాల్ బ్లాక్బస్టర్ హిట్లను అందించారు. పిళ్లై చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమా చిత్రమ్. దీనికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించగా.. మోహన్లాల్ నటించారు. ఈ సినిమా రెండు థియేటర్లలో 300 రోజులకు పైగా ఆడిన ఘనత సాధించింది. ఈ చిత్రం తరువాత తెలుగు, హిందీ, కన్నడ, తమిళంలో వరుసగా అల్లుడుగారు, ప్యార్ హువా చోరీ చోరీ, రాయరు బండారు మావన మానేగే, ఎంగిరుంధో వందన్గా రీమేక్ చేశారు. (ఇది చదవండి: లావణ్య త్రిపాఠితో వరుణ్తేజ్ ఎంగేజ్మెంట్?) పన్నెండు సంవత్సరాల క్రితం ముంబైలోని తన వ్యాపారాన్ని వదిలేసి కేరళాకు వచ్చారు పిళ్లై. 1984లో మలయాళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. సొంత చిత్ర నిర్మాణ సంస్థ షిర్డీ సాయి క్రియేషన్స్పై వేప్రాళం అనే చిత్రాన్ని నిర్మించాడు. మొదట ఎర్నాకులం లో ఉన్నప్పటికీ ఆయన కుటుంబ సభ్యులు త్రిస్సూర్ లో స్థిరపడ్డారు. ఆయనకు భార్య రమ్య, పిల్లలు రాజేష్, ప్రీతి, సోను ఉన్నారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
మోహన్ లాల్ గ్యారేజిలో ధీరూభాయ్ అంబానీ కారు
ప్రముఖ మలయాళీ నటుడు 'మోహన్ లాల్' గురించి దాదాపు అందరికి తెలుసు. తనదైన నటనతో ప్రేక్షలకులను ఆకట్టుకున్న ఈయన తెలుగు ప్రేక్షలకులకు కూడా సుపరిచయమే. మోహన్ లాల్ ఇతర సెలబ్రిటీల మాదిరిగానే ఎప్పటికప్పుడు లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ కారణంగానే అతని గ్యారేజిలో చాలా కార్లు ఉన్నాయి. ఇందులో ధీరూభాయ్ అంబానీకి చెందిన పాతకాలపు కాడిలాక్ కారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మోహన్ లాల్ గ్యారేజిలో ఎన్ని కార్లు ఉన్నప్పటికీ హిందూస్తాన్ అంబాసిడర్, కాండిలాక్ కార్లు చాలా ప్రత్యేకం. eisk007 ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడైన ఫొటోలో ఈ పాతకాలపు కారుని చూడవచ్చు. ఆ కారు పక్కన ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ బాలాజీ ఉండటం కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. దీనిని బాలాజీ కొనుగోలు చేసినట్లు చెబుతారు. ఆయన స్వయానా మోహన్ లాల్ మామగారు. ఆయన నిర్మించిన చాలా సినిమాల్లో ఈ కారు ఉపయోగించినట్లు సమాచారం. ఫొటోలో కనిపించే ఈ కారు 1958 మోడల్ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కాడిలాక్ సెడాన్ అని తెలుస్తోంది. ఇది ఒకప్పుడు ధీరూభాయ్ అంబానీ ఉపయోగించినట్లు చెబుతున్నారు. ఇది పాతకాలపు కారు అయినప్పటికీ ఇప్పటికీ కొత్తగా కనిపిస్తోంది. దీనికి MAS 2100 నెంబర్ ఉంది. ఈ కారుని ఎప్పుడు కొనుగోలు చేశారనేదానికి ఖచ్చితమైన అధరాలు లేవు. ప్రస్తుతం ఈ మోడల్ కారు మార్కెట్లో లేదు. (ఇదీ చదవండి: భారత్లో ఆరు ఎయిర్ బ్యాగులు కలిగి టాప్ 5 కార్లు - ధరలు ఎలా ఉన్నాయంటే?) భారతీయ మార్కెట్లో ఒకప్పుడు కాడిలాక్ కారు వివిధ రకాల ఇంజిన్ ఆప్షన్లలో లభించేది. అయితే మోహన్ లాల్ గ్యారేజిలో ఉన్న ఆ కారు ఇంజిన్ స్పెషిఫికేషన్స్ కూడా వెలుగులోకి రాలేదు. కానీ ఇప్పటికీ మంచి కండిషన్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మోహన్ లాల్ గ్యారేజిలో టొయోట వెల్ఫైర్, ఇన్నోవా క్రిష్టా, టయోటా ల్యాండ్ క్రూయిజర్, మెర్సిడెస్ బెంజ్ జిఎల్350, లంబోర్ఘిని ఉరుస్ వంటి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by Eisk007 (@eisk007) -
వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమి?
దాగుడు మూతలాట ఆడుకోని వాళ్లుండరు... కళ్లకు గంతలు కట్టి పేర్లు అడిగితే చెప్పాలి. ఇది రియల్ ఆట. రీల్ గేమ్ విషయానికి వస్తే.. గంతలు కట్టకుండా.. ఆర్టిస్ట్ని ఎదురుగా నిలబెట్టి, ‘వీరి పేరేమి’ అని అడిగితే.. ఆ ఆర్టిస్ట్నిగుర్తుపట్టడానికి కాస్త టైమ్ పడుతుంది. అసలు గుర్తు పట్టకపోవచ్చు కూడా. అంతలా కొందరు స్టార్స్ క్యారెక్టర్లలో ఒదిగిపోయారు. ఫిజికల్ మేకోవర్తో, మేకప్తో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆ హీరోల గురించి తెలుసుకుందాం. ♦ పాత్రల కోసం రూపా న్ని మార్చుకోవడానికి ఏమాత్రం వెనకడుగు వేయరు విక్రమ్. ‘శివపుత్రుడు, అపరిచితుడు, ఐ’ వంటి చిత్రాలు అందుకు నిదర్శనం. తాజాగా ‘తంగలాన్’లో కొత్త అవతారంలో కనిపించనున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్ (కేజీఎఫ్) నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మాస్ లుక్లో కనిపించనున్నారు విక్రమ్. గనుల తవ్వకాల పనులు చేసే వ్యక్తుల జీవితాల నేపథ్యంలో దర్శకుడు పా . రంజిత్ పా న్ ఇండియా మూవీగా ‘తంగలాన్’ని తెరకెక్కిస్తున్నారు. ♦ క్యారెక్టర్ ఎలా డిమాండ్ చేస్తే అలా మారిపోవాలనుకుంటారు అల్లు అర్జున్. గతంలో ‘దేశ ముదురు’ సినిమా కోసం సిక్స్ ΄్యాక్ చేశారు. తాజాగా ‘పుష్ప’ కోసం ఫిజికల్ మేకోవర్తో పా టు మేకప్ పరంగానూ వ్యత్యాసం చూపించారు. స్మగ్లర్ పుష్పరాజ్గా తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’లో రెచ్చి పోయారు అల్లు అర్జున్. మలి భాగం ‘పుష్ప:ది రూల్’ చిత్రీకరణ జరుగుతోంది. కాగా.. పుష్పరాజ్గా గుర్తు పట్టలేనంతగా అల్లు అర్జున్ మారలేదు. కానీ రెండో భాగంలో జాతర బ్యాక్డ్రాప్లో వచ్చే ఒక ఫైట్లో గుర్తు పట్టలేని విధంగా మారిపోయారు. పండగ చివరి రోజు స్త్రీ వేషధారణలో పురుషులు చెడును నాశనం చేసే గంగమ్మ తల్లిగా మారతారని, ఈ ఫైట్లో అల్లు అర్జున్ గెటప్ అదే అని తెలిసింది. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ♦ దుర్గ, పరశురామ్, డీజే.. ఈ మూడు పా త్రల్లో సుధీర్బాబు కనిపించనున్న చిత్రం ‘మామా మశ్చింద్ర’.. వీటిలో దుర్గ పా త్ర డిఫరెంట్. ఏజ్డ్ గ్యాంగ్స్టర్ అన్నమాట. మామూలుగా సు«దీర్బాబు చాలా స్లిమ్గా, ఫిట్గా ఉంటారు. అయితే ఈ పా త్రలో అందుకు భిన్నంగా బొద్దుగా కనబడతారు. హర్షవర్ధన్ దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది, ♦ అటు మలయాళంకి వెళితే సీనియర్ హీరో మోహన్లాల్, యంగ్ హీరో పృథ్వీ రాజ్కుమారన్లు డిఫరెంట్ లుక్స్లో కనిపించనున్నారు. మోహన్లాల్ టైటిల్ రోల్లో రూపొందుతున్న చిత్రం ‘బర్రోజ్’. వాస్కో డి గామా నిధిని రక్షించడానికి నియమించబడిన 400 ఏళ్ల నాటి ఆత్మ బర్రోజ్. ఆ నిధిని వాస్కో అసలు వారసునికి అప్పగించడానికి ఆ ఆత్మ వేచి ఉంటుంది. కాల్పనిక కథతో త్రీడీ చిత్రంగా ‘బర్రోజ్’ రూపొందుతోంది. కాగా ఈ చిత్రంలో టైటిల్ రోల్ చేయడంతో పా టు మోహన్ లాల్ దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ♦ మరో మలయాళ హీరో–దర్శకుడు పృథ్వీ రాజ్కుమారన్ గొర్రెల కాపరిగా కనిపించనున్న చిత్రం ‘ఆడు జీవితం’. 2008లో ఇదే పేరుతో వచ్చిన నవల నేపథ్యంలో బ్లెస్సీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నజీబ్ అనే మలయాళీ వలస కార్మికుడి పా త్రలో పృథ్వి రాజ్ కనిపిస్తారు. సౌదీ అరేబియాకి వలస వెళ్లిన నజీబ్ను గొర్రెల కాపరిని చేసి, బలవంతంగా బానిసత్వంలోకి నెట్టివేస్తారు. నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రం సాగుతుంది. సవాళ్లను ఇష్టపడని స్టార్స్ ఉండరు. అయితే సవాళ్లు అరుదుగా వస్తుంటాయి. అందుకే చాలెంజింగ్ రోల్స్ వచ్చి నప్పుడు ‘సై’ అంటూ ఎంత కష్టపడటానికైనా సిద్ధపడిపోతారు. ఈ సవాళ్లు స్టార్స్కి కిక్కే.. అభిమానులకూ కిక్కే. సినిమా సరిగ్గా క్లిక్ అయితే బాక్సాఫీస్కీ కిక్కే. -
Malaikottai Vaaliban: మోహన్లాల్ యువకుడు!
ఆరు పదుల వయసులో ఉన్న మోహన్లాల్ని యువకుడు అంటున్నారు దర్శకుడు లిజో జోస్ పెల్లిసరీ. మోహన్లాల్ టైటిల్ రోల్లో లిజో జోస్ పెల్లిసరీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మలైకోట్టై వాలిబన్’ (మలైకోట యువకుడు అని అర్థం). ఈ చిత్రంలోని మోహన్లాల్ లుక్ని విడుదల చేశారు. ఓ యాక్షన్ సీన్కి సంబంధించిన లుక్ ఇది. ‘‘జనవరి 18న రాజస్థాన్లోని జై సల్మేర్లో ఈ చిత్రం షూటింగ్ని ఆరంభించాం. హై బడ్జెట్తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు ఇతర ప్రముఖ భాషల్లో విడుదల చేస్తాం’’ అని చిత్రనిర్మాతలు షిబు బేబీ జాన్, కొచుమొన్, అనూప్ పేర్కొన్నారు. -
లగ్జరీ కారు కొన్న స్టార్ హీరో మోహన్ లాల్ (ఫొటోలు)
-
లగ్జరీ కారు కొన్న మోహన్ లాల్.. వామ్మో అన్ని కోట్లా?
మలయాళ సీనియర్ నటుడు మోహన్లాల్ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశారు. బ్రిటన్కు చెందిన కార్ల తయారీ సంస్థ రేంజ్ రోవర్ కొత్త మోడల్ ఆటో బయోగ్రఫీని తన ఇంటికి తీసుకొచ్చారు. ఈ కారు ధర దాదాపుగా రూ.4 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాాగా.. మోహన్లాల్ వద్ద ఇప్పటికే 3 కోట్ల రూపాయల ఖరీదు చేసే లంబోర్గినీ కారును కలిగి ఉన్నాడు. టయోటా వెల్ఫైర్ రూ. 1 కోటి, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ 350(సుమారు రూ. 80 లక్షలు), టయోటా ల్యాండ్ క్రూయిజర్ (సుమారు రూ. 2 కోట్లు) మోహన్ లాల్ వద్ద ఉన్నాయి. ప్రస్తుతం అతని గ్యారేజీలో ఉన్న అత్యంత ఖరీదైన కారుగా రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ నిలవనుంది. కాగా.. మోహన్లాల్ ఇటీవలే రాజస్థాన్లో తన రాబోయే చిత్రం మలైకోట్టై వాలిబన్ షెడ్యూల్ను ముగించారు. ఈ చిత్రానికి లిజో జోస్ పెల్లిసేరి దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ లాల్ రజనీకాంత్ జైలర్లో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్లాల్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. New one to the garage 🚗#RangeRover @Mohanlal #Mohanlal #MalaikottaiVaaliban pic.twitter.com/2bZBuBKL3K — Mohanlal Fans Club (@MohanlalMFC) April 10, 2023 -
నేను చనిపోయేలోపు మోహన్లాల్ బండారం బయటపెడతా: నటుడు
మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు సీనియర్ నటుడు శ్రీనివాసన్. దివంగత నటుడు ప్రేమ్ నజీర్ డైరెక్ట్ చేయాలనుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమాను మోహన్లాల్ తిరస్కరించాడని, కానీ మీడియా ముందు మాత్రం మాట మార్చాడని ఆరోపణలు గుప్పించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీనివాసన్ మాట్లాడుతూ.. 'ప్రేమ్ నజీర్కు మోహన్లాల్తో ఓ సినిమా తీయాలని ఎంతో కోరికగా ఉండేది. కడతనందన్ అంబాడీ సినిమా సెట్లో ప్రేమ్ నాకు ఈ విషయం చెప్పాడు. మరింకే, మోహన్లాల్కు సూటయ్యేలా మంచి కథ రాసుకోమని సూచించాను. దీంతో ఓ కథ సిద్ధం చేసుకుని మోహన్లాల్కు వినిపిస్తే అతడు ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. తర్వాత నేను ఓసారి నడరాజన్ అనే మధ్యవర్తి ద్వారా కథ వినిపిస్తే ఏకంగా అతడిని తిట్టాడు కూడా! అదే కథ 'సందేశం'గా రిలీజైంది. నిజానికి ఈ సినిమా కోసం ప్రేమ్.. మోహన్లాల్కు ముందుగానే అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. అప్పుడు ఆయన ఎంగేజ్మెంట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికే ప్రేమ్ కన్నుమూశాడు. అతడు చనిపోయినప్పుడు మాత్రం మోహన్లాల్.. ప్రేమ్ సినిమాలో నటించాలనుకున్నాను, కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది అని కపట మాటలు మాట్లాడాడు. నేను చచ్చేలోపు కచ్చితంగా అతడి నిజస్వరూపాన్ని మొత్తం బయటపెడతా' అని పేర్కొన్నాడు. శ్రీనివాసన్ వ్యాఖ్యలపై ప్రేమ్ నజీర్ తనయుడు షానవాజ్ స్పందిస్తూ.. 'నాన్నగారు మోహన్లాల్తో సినిమా చేయాలనుకున్న మాట వాస్తవమే! మోహన్లాల్ ఎప్పుడూ ప్రియదర్శన్ను వెంటేసుకుని స్క్రిప్ట్ డిస్కషన్స్కు వస్తుండేవారు. మరి ఆ కథ ఎందుకు పట్టాలెక్కలేదనేది ఎవరికీ తెలియదు. కానీ ఓ విషయం మాత్రం చెప్పగలను.. శ్రీనివాసన్ చెప్పాడంటే కచ్చితంగా అందులో నిజం ఉండే ఉంటుంది. ఆయన మాటలను నమ్మకుండా ఉండలేం' అని చెప్పుకొచ్చాడు. నటుడు ప్రేమ్ నజీర్ -
కొచ్చిలో జైలర్
కొచ్చికి మకాం మార్చారు ‘జైలర్’. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘జైలర్’. శివ రాజ్కుమార్, సునీల్, రమ్యకృష్ణ, తమన్నా కీలక పాత్రధారులుగా, ఓ అతిథి పాత్రలో మోహన్లాల్ నటిస్తున్నారు. ‘జైలర్’ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఇటీవల కొచ్చిలో ప్రారంభమైంది. రజనీకాంత్ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరో పది రోజులు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని సమాచారం. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. -
‘గెస్ట్’గా వచ్చేస్తున్న స్టార్ హీరోలు!
ఒక స్టార్ సినిమాలో మరో స్టార్ కనిపిస్తే.. ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్కి పండగే పండగ. అలా కాకుండా ఓ మామూలు బడ్జెట్ సినిమాలో ఒక స్టార్ గెస్ట్గా కనిపించినా ఆ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతారు. ఇలా ఫ్యాన్స్ పండగ చేసుకునే ‘గెస్ట్’ రోల్స్లో కొందరు స్టార్స్ కనిపించనున్నారు. ఈ ‘స్టార్ గెస్ట్’ల గురించి తెలుసుకుందాం. గ్రౌండ్లో తలైవర్ క్రికెట్ గ్రౌండ్లో అతిథిగా ‘లాల్ సలామ్’ అంటున్నారు తలైవర్ (నాయకుడు) రజనీకాంత్. తమిళ హీరోలు విష్ణు విశాల్, విక్రాంత్ ముఖ్య తారలుగా రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘లాల్ సలామ్’. క్రికెట్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ చిత్రంలో రజనీకాంత్ గెస్ట్ రోల్ చేయనున్నారు. అలాగే ఈ చిత్రంలో రజనీకాంత్కు చెల్లెలి పాత్రలో నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ నటించనున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అతిథిగా ఖైదీ ‘జైలర్’ కోసం రజనీకాంత్కు గెస్ట్ అయ్యారు మోహన్లాల్. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్లాల్ గెస్ట్ రోల్ చేశారు. ఇందులో ఆయన ఓ ఖైదీ పాత్రలో కనిపిస్తారట. ఆల్రెడీ మోహన్లాల్ పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. భాయ్కి గెస్ట్ సిల్వర్ స్క్రీన్పై సల్మాన్ భాయ్కి గెస్ట్ అయ్యారు రామ్చరణ్. సల్మాన్ ఖాన్, వెంకటేశ్, పూజా హెగ్డే, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రంజాన్ సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో రామ్చరణ్ ఓ గెస్ట్ రోల్ చేశారు. సల్మాన్ ఖాన్, వెంకటేశ్లపై చిత్రీకరించిన ఓ పాటలో రామ్చరణ్ గెస్ట్గా కనిపిస్తారు. నిర్మాతే అతిథి! సూర్య కెరీర్లో ఘనవిజయం సాధించిన చిత్రాల్లో ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశమే హద్దురా..!) ఒకటి. సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీలో రీమేక్ అవుతోంది. బాలీవుడ్ కిలాడి అక్షయ్కుమార్ హీరోగా నటిస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ను తెరకెక్కించిన సుధానే హిందీ రీమేక్కూ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ వెర్షన్లో హీరోగా నటించిన సూర్య హిందీ రీమేక్కి ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతే కాదు... ఈ రీమేక్లో సూర్య ఓ గెస్ట్ రోల్ కూడా చేశారు. కబ్జా కోసం... ఉపేంద్ర ‘కబ్జా’కు సాయం చేశారు శివ రాజ్కుమార్. ఉపేంద్ర, సుదీప్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ ‘కబ్జా’. ఆర్. చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్కుమార్ ఓ గెస్ట్ రోల్ చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా ‘స్టార్ గెస్ట్’ లిస్ట్లో మరికొందరు స్టార్స్ ఉన్నారు. -
ఇది కదా అసలు సిసలైన పాన్ ఇండియా కథ!
ఒక ‘దృశ్యం’... మలయాళంలో బంపర్ హిట్. అదే ‘దృశ్యం’... తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలోనూ సూపర్ హిట్. అందుకే ఈ ‘దృశ్యం’ దేశం దాటింది. అటు చైనా.. ఇండోనేషియాలోనూ ‘దృశ్యం’ బాక్సాఫీస్ రికార్డులు సాధించింది. ఇలా మలయాళంలో వచ్చిన ‘దృశ్యం’ ఏ భాషలో రీమేక్ అయితే ఆ భాషలో హిట్. ఇప్పుడు ఇంగ్లీష్ ‘దృశ్యం’ రానుంది. ఇంకా పలు విదేశీ భాషల్లో రీమేక్ కానుంది. ప్రపంచ వ్యాప్తంగా చూసే సినిమాలను ‘పాన్ ఇండియా’ అంటున్నాం. ‘పాన్ ఇండియా మూవీ’ అంటే కథ కూడా ‘పాన్ ఇండియా’ది అయ్యుండాలి.‘దృశ్యం’ అలాంటి కథే. ఇది కదా... పాన్ ఇండియా కథ! ఇక ఈ ‘దృశ్యం’ గురించి తెలుసుకుందాం. తొమ్మిదేళ్ల క్రితం హీరో మోహన్లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్లో మలయాళంలో ‘దృశ్యం’ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో మీనా, అన్సిబా హాసన్, ఎస్తర్ అనిల్, ఆశా శరత్, సిద్ధిక్ కీలక పాత్రలు పోషించారు. ఐదు కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమాను ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించారు. 2013 డిసెంబరు 19న విడుదలై సంచలన విజయం సాధించిందీ చిత్రం. ఫ్యామిలీ ఎమోషన్స్కు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి జీతూ జోసెఫ్ తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చింది. ఎంతగా నచ్చిందంటే.. కేరళ బాక్సాఫీస్ చరిత్రలో యాభై కోట్ల రూపాయల వసూళ్లను సాధించిన తొలి చిత్రంగా ‘దృశ్యం’ చరిత్ర సృష్టించింది. మొత్తంగా 75 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా షూటింగ్ని కేవలం 44 రోజుల్లోనే పూర్తి చేశారు. ఇక ‘దృశ్యం’ సూపర్ డూపర్ హిట్ సాధించడంతో 2020 సెప్టెంబర్లో ‘దృశ్యం 2’ షూటింగ్కు శ్రీకారం చూట్టారు మోహన్లాల్, జీతూ జోసెఫ్ అండ్ ఆంటోనీ పెరుంబవూర్. తొలి భాగంలానే పర్ఫెక్ట్ ప్లానింగ్తో 46 రోజుల్లో షూటింగ్ను పూర్తి చేసి 2021 ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ‘దృశ్యం 2’ కూడా సూపర్ డూపర్ హిట్. అయితే ఓ వెలితి. అదేంటంటే.. ‘దృశ్యం 2’ థియేటర్స్లో కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. దీనికి కారణం కరోనా. ఒకవేళ థియేటర్స్లో విడుదలై ఉంటే కొత్త బాక్సాఫీస్ రికార్డ్స్ నమోదై ఉండేవేమో! 2016లో విడుదలై దాదాపు రూ. 150 కోట్ల వసూళ్లను సాధించిన ‘పులిమురుగన్’(ఇందులో మోహన్లాల్ హీరో) రికార్డును ‘దృశ్యం 2’ బ్రేక్ చేసి ఉండేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయయపడ్డాయి. తొలి ఇండియన్ మూవీ! ‘దృశ్యం’ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు పలు ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శితమై వీక్షకుల, విమర్శకుల ప్రసంశలను పొందింది. దీంతో ఈ సినిమా రీమేక్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మలయాళ ‘దృశ్యం’ సినిమాను 2014లో తెలుగులో ‘దృశ్యం’గా (ఇందులో వెంకటేశ్ హీరోగా నటించారు), కన్నడంలో ‘దృశ్య’ (ఇందులో రవిచంద్రన్)గా రీమేక్ చేశారు. ఆ తర్వాత 2015లో తమిళంలో ‘పాపనాశం’గా (కమల్హాసన్ హీరో), హిందీలో ‘దృశ్యం’ (అజయ్ దేవగన్)గా రీమేక్ చేశారు. అంతేకాదు.. ఆ తర్వాత శ్రీలంక భాషలో ‘ధర్మయుద్దాయ’ (2017)గా, చైనాలో ‘షీప్ వితవుట్ షెపర్డ్’(2019)గా ఆ తర్వాత ఇండోనేషియాలో ‘దృశ్యం’గా రీమేక్ అయ్యింది. ఇలా చైనా, ఇండోనేషియా భాషల్లో రీమేక్ అయిన తొలి ఇండియన్ మూవీ కూడా ‘దృశ్యం’ కావడం విశేషం. రీమేక్ కావడమే కాదు.. అక్కడ బాక్సాఫీస్ పరంగా హిట్ సాధించింది. కాగా, ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్గా 2021లో విడుదలైన మలయాళ ‘దృశ్యం 2’కి కూడా డిజిటల్ వీక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ‘దృశ్యం 2’ను తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ చేశారు. ‘దృశ్యం’ రీమేక్లో నటించిన వెంకటేశ్నే ‘దృశ్యం 2’లోనూ నటించారు. కోవిడ్ వల్ల ఈ చిత్రం 2021 నవంబరు 25న ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. కాగా ‘దృశ్యం 2’ హిందీ రీమేక్ గత ఏడాది నవంబరు 18న థియేటర్స్లో విడుదలై రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, 2022లో అత్యధిక వసూళ్లను సాధించిన టాప్ టెన్ హిందీ మూవీస్లో ఒకటిగా నిలిచింది. హిందీ ‘దృశ్యం’లో నటించిన అజయ్ దేవగనే ‘దృశ్యం 2’లోనూ నటించారు. అలాగే హిందీ చిత్రం ‘దేవదాస్’ (1955) తర్వాత ఇతర భాషల్లో ఎక్కువగా రీమేక్ అవుతున్న చిత్రం ‘దృశ్యం’ అని టాక్. మాలీవుడ్ నుంచి హాలీవుడ్కి... ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలకు సంబంధించిన ఇంగ్లిష్, నాన్ ఇండియన్ లాంగ్వేజెస్ రీమేక్ హక్కులను పనోరమ స్టూడియోస్ ఇంటర్నేషనల్ సంస్థ దక్కించుకుంది (ఫిలిప్పినో, ఇండోనేషియా, సింహళ భాషల హక్కులు మాత్రం కాదు.. ఎందుకంటే ఈ భాషల్లో ఆల్రెడీ ‘దృశ్యం’ రీమేక్ అయ్యింది). ‘‘దృశ్యం’, ‘దృశ్యం 2’ల ఫారిన్ లాంగ్వేజెస్ హక్కులను దక్కించుకున్నాం. జపాన్, కొరియా, హాలీవుడ్లో ‘దృశ్యం’ను రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాం. ‘దృశ్యం 2’కు చెందిన చైనీస్ రీమేక్ హక్కులు కూడా మా వద్దే ఉన్నాయి’’ అని పనోరమ స్టూడియోస్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కథ ఏంటంటే... సినిమాల పట్ల విపరీతమైన ఆసక్తి ఉన్న ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తండ్రి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన పెద్ద కుమార్తెను ఊహించని ఆపాయం నుంచి ఎలా రక్షించుకోగలిగాడు? ఈ ప్రయత్నంలో ఓ పోలీసాఫీసర్ కుమారుడి హాత్య కేసును చేధించాలనుకునే పోలీస్ డిపార్ట్మెంట్ వ్యూహాలకు ఎటుంవంటి ప్రతివ్యూహాలు రచించి, ఆ తండ్రి సక్సెస్ అయ్యాడు అన్నదే ఈ చిత్రకథ. మోహన్లాల్, జీతూ జోసెఫ్, ఆంటోనీల కాంబినేషన్లో ‘దృశ్యం 3’ కూడా రానుంది. గత ఏడాది ఆగస్టులో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్లో ‘దృశ్యం 3’ ఉంటుందన్నారు ఆంటోనీ. చదవండి: నాకు బుద్ధి తక్కువై అలా చేశాను.. చీటింగ్పై స్పందించిన సింగర్ -
Mohanlal: వందల కోట్ల స్టార్ హీరోకి దారుణ పరిస్థితి!
మాలీవుడ్ స్టార్ హీరోల్లో మోహన్లాల్ ఒకరు. ఆరు పదుల వయస్సులో కూడా కుర్ర హీరోలు సైతం షాక్ అయ్యేలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అక్కడ లాల్ నటించిన చిత్రాలను టాలీవుడ్లో రీమేక్ చేస్తున్నాం. అయితే ఇదంత కాయిన్కి ఒకవైపే. మరోవైపు మాలీవుడ్లో మోహన్లాల్ పరిస్థితి దారుణంగా ఉంది. ఒకప్పుడు లాల్ సినిమా అంటే వంద కోట్ల కలెక్షన్స్.. కాని ఇప్పుడు కనీసం కోటి రూపాయల కలెక్షన్స్ కూడా దాటడం లేదు. రెండేళ్ల క్రితం వరకు మోహన్లాల్ మాలీవుడ్ బాక్సాఫీస్ను శాసిస్తూ వచ్చాడు. పులి మురుగన్ సినిమాతో మాలీవుడ్కు రూ.100 కోట్లు, లూసీఫర్ తో రూ.150 కోట్ల వసూళ్లను చూపించాడు. అయితే కరోనా తర్వాత మోహన్లాల్కు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ స్టార్ హీరో గతేడాది మాన్స్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. ఇక ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసిన అలోన్ (Alone) సినిమాకు అయితే తొలి రోజే గెటివ్ టాక్ రావడం అభిమానులను షాక్కు గురిచేసింది. అసలు ఇలాంటి కథను మోహన్లాల్ లాంటి స్టార్ హీరో ఎలా అంగీకరించారంటూ కొంత మంది విమర్శకులు కామెంట్ చేశారు. ఫలితంగా ఈ చిత్రం తొలి రోజు వసూళ్లు రూ.40 లక్షలు కూడా దాటలేదు. దీంతో లాల్ ఫ్యూచర్పై మాలీవుడ్లో టెన్షన్ మొదలైంది. కానీ ఈ బిగ్స్టార్ త్వరలోనే స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇస్తాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మోహన్లాల్ చేతిలో లూసీఫర్ 2, దృశ్యం3 చిత్రాలు ఉన్నాయి. అలాగే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. -
జైలర్కు అతిథిగా...
సూపర్స్టార్ రజనీకాంత్ సినిమాలో మలయాళ స్టార్ మోహన్లాల్ కనిపించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ‘జైలర్’ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కన్నడ స్టార్ శివరాజ్కుమార్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో, తమన్నా కీ రోల్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో మోహన్లాల్ కూడా నటిస్తున్నట్లు తెలిసింది. మోహన్లాల్ అతిథి పాత్రలో కనిపించనునున్నారని, ఈ వారంలోనే షూటింగ్లో జాయిన్ అవుతారని కోలీవుడ్ సమాచారం. కాగా ‘జైలర్’ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేయాలని అనుకుంటున్నారు. -
మెగాస్టార్ కోసం మరో రీమేక్ ను సిద్ధం చేసిన చరణ్
-
మోహన్ లాల్ తో వెరీ బోల్డ్ క్యారెక్టర్ చేస్తున్న : మంచు లక్ష్మి
-
ఓ కంక్లూజన్తో మోహన్ లాల్ 'దృశ్యం 3'.. ఆసక్తిగా ఫస్ట్ లుక్
Mohanlal Drishyam 3 First Look Poster Released: మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్, సీనియర్ హీరోయిన్ మీనా ప్రధాన పాత్రల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రాలు దృశ్యం, దృశ్యం 2. మొదటగా వచ్చిన 'దృశ్యం' మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మాసీవ్ హిట్ను సొంతం చేసుకుంది. దీంతో తెలుగు, తమిళంలో కూడా రీమేక్ కాగా అక్కడ కూడా మంచి విజయం సాధించింది. తెలుగులో విక్టరీ వెంకటేష్, మీనా నటించిన విషయం తెలిసిందే. ఇక దీనికి సీక్వెల్గా తెరకెక్కిన 'దృశ్యం 2' కూడా ఎంతపెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్న కూతురును, కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓ తండ్రి చేస్తున్న యుద్ధమే ఈ సిరీస్ల కథగా చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఈ సిరీస్లో మూడో చిత్రం రానుంది. ఈ రెండు పార్ట్లకు కొనసాగింపుగా 'దృశ్యం 3' రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'దృశ్యం 3: ది కంక్లూజన్' పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో మోహన్ లాల్ సంకెళ్లతో ధీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించడం ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా పోస్టర్పై ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. కాగా మొదటి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన జీతూ జేసేఫ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. మరీ ఈ మూడో చిత్రంలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో వేచి చూడాల్సేందే. అలాగే ఈ మూడో భాగంతో ఓ కంక్లూజన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. #Drishyam3 The Conclusion offical announcement soon#Mohanlal @Mohanlal pic.twitter.com/X8dVERlaTR — Shivani Singh (@lastshivani) August 13, 2022 #Drishyam3 George Kutty & Family are coming back! pic.twitter.com/VUoT6m0gLF — Christopher Kanagaraj (@Chrissuccess) August 13, 2022 -
మోహన్ లాల్కు ఈడీ నోటీసులు.. ఎందుకంటే ?
Mohanlal Questioned By Ed In Money Laundering Case With Monson Mavunkal: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చిక్కుల్లో పడ్డారు. మనీ లాండరింగ్కు పాల్పడినట్లు మోహన్ లాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మోహన్ లాల్కు నోటీసులు పంపింది. వచ్చే వారం కొచ్చి ఈడీ కార్యాలయంలో మోహన్లాల్ను అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం. పురాతన వస్తువుల వ్యాపారి మాన్సన్ మాన్కల్తో కలిసి మోహన్ లాల్ మనీ లాండరింగ్కు పాల్పడినట్లు అభియోగాలు వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే ప్రజలను రూ. 10 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై మాన్సన్ను గత సెప్టెంబర్లోనే కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కేరళలో ఉన్న మాన్సన్ ఇంటికి మోహన్ లాల్ ఒకసారి వెళ్లినట్లు సమాచారం. అయితే అలా మోహన్ లాల్ వెళ్లడానికి కారణాలు తెలియరాలేదు. 'కేరళకు చెందిన మాన్సన్ మాన్కల్ కొన్నేళ్లుగా పురాతన కళాఖండాలు, అవశేషాలను సేకరించేవాడిగా నటిస్తూ వాటిని అమ్మి రూ. 10 కోట్ల వరకు మోసం చేశాడు. అతని దగ్గర టిప్పు సుల్తాన్ సింహాసనం, మోసెస్ సిబ్బంది, ఔరంగజేబు ఉంగరం, ఛత్రపతి శివాఝీ భగవద్గీత కాపీ, సెయింట్ ఆంటోనీ వేలిగోరు వంటి వస్తువులు ఉన్నాయని చెప్పాడం అబద్ధం.' అని కేరళ పోలీసులు తెలిపారు. కాగా కేరళలోని అలప్పుజా జిల్లాలో నకిలీ పురాతన వస్తువులు విక్రయిస్తున్నాడని 52 ఏళ్ల యూట్యూబర్ను కూడా కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4431454862.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మోహన్ లాల్ మరో క్రైమ్ థ్రిల్లర్ '12th మ్యాన్'.. నేరుగా ఓటీటీలోకి
12th Man: Jeethu Joseph Mohanlal Locked Thriller Trailer Released: క్రైమ్ థ్రిల్లర్ జానర్స్తో ప్రేక్షకులను కట్టిపడేసే చిత్రాలను తెరకెక్కించే మలయాళ దర్శకులలో జీతు జోసేఫ్ ముందుంటారు. ఆయన తెరకెక్కించిన దృశ్యం, దృశ్యం 2 సినిమాలు ఎంతటి హిట్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఆయన మరో క్రైమ్ థ్రిల్లర్ను రూపొందించారు. విలక్షణ నటుడు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కింది '12th మ్యాన్' చిత్రం. (చదవండి: వావ్.. సినీ ప్రియులకు ఇక పండగే.. ఓటీటీలో ఏకంగా 40) ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా మే 20 నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ అధికారికంగా ప్రకటిస్తూ ట్రైలర్ విడుదల చేసింది. 11 మంది స్నేహితులు వెకేషన్కు వెళ్లినప్పుడు వారితో 12వ మనిషి కలుస్తాడు. ఆ 12వ మనిషి ఎవరు ? మిగతా 11 మందికి అతనికి ఉన్న సంబంధం ఏంటి ? అనే విషయాలతో ట్రైలర్ ఉత్కంఠగా సాగింది. ట్రైలర్ చూస్తుంటే క్రైమ్తోపాటు, లాక్డ్ థ్రిల్లర్లా ఉంది. ఈ మూవీ కూడా దృశ్యం, దృశ్యం 2 సినిమాల్లానే భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని తెలుస్తోంది. చదవండి: గుడ్న్యూస్ చెప్పిన ఆహా, మేలో ఏకంగా 40+ మూవీస్! 12th Man Official Trailer Out Now!!! Watch Here👉 https://t.co/5oyPiQhpH3#12thMan streaming from May 20 on @DisneyPlusHS #12thManOnHotstar @Mohanlal @aashirvadcine @KurupSaiju @Iamunnimukundan @JeethuJosephDir @12thManMovie @sethusivanand @SshivadaOffcl @DisneyplusHSMal pic.twitter.com/tUxENWUIKz — DisneyPlus Hotstar Malayalam (@DisneyplusHSMal) May 3, 2022 -
తెలుగులో విడుదల కానున్న మోహన్లాల్ సినిమా
మూడు జాతీయ అవార్డులు (బెస్ట్ పిక్చర్, బెస్ట్ వీఎఫ్ఎక్స్, బెస్ట్ కాస్ట్యూమ్స్) సాధించిన మలయాళ చిత్రం ‘మరక్కార్: ది అరబికడలింటే సింహం’ చిత్రం తెలుగులో విడుదల కానుంది. మోహన్లాల్ టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రాన్ని ‘మరక్కార్: అరేబియా సముద్ర సింహం’ టైటిల్తో సురేష్ ప్రొడక్షన్స్ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేయనుంది. ఈ చిత్రం ఈ డిసెంబరు 2న రిలీజ్ కానుంది. అర్జున్, సునీల్ శెట్టి, సుదీప్, ప్రభు, మంజు వారియర్, కీర్తీ సురేష్, కల్యాణీ ప్రియదర్శన్, ప్రణవ్ మోహన్లాల్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. ‘‘ఈ చిత్రం నుంచి విడుదలైన ‘కనులను కలిపినా’ పాటకు మంచి స్పందన లభి స్తోంది. సినిమాకూ మంచి ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
మోహన్లాల్ మరక్కర్ చిత్రం థియేటర్లోనే..
Mohanlals Marakkar To Release In Theatres: ‘మరక్కర్’ థియేటర్స్కే వస్తున్నాడు. ప్రచారంలో ఉన్నట్లు ఓటీటీలోకి కాదు. ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్లాల్ టైటిల్ రోల్లో నటించిన మలయాళ చిత్రం ‘మరక్కర్: అరబికడలింటే సింహమ్’. 15వ శతాబ్దానికి చెందిన న్యావల్ చీఫ్ మహ్మద్ అలీ మరక్కర్ అలియాస్ కుంజాలి మరక్కర్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. అర్జున్, సునీల్ శెట్టి, కీర్తీ సురేశ్, మంజు వారియర్, కల్యాణీ ప్రియదర్శన్ ఈ చిత్రంలో కీలక పాత్రధారులు. ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందనే వార్తలకు ఫుల్స్టాప్ పడేలా.. ‘‘ఇంతకాలం సీల్ చేసి ఉన్న విషయాన్ని బ్రేక్ చేసి, స్టన్నింగ్ సర్ప్రైజ్గా చెబుతున్నాం. ‘మరక్కర్’ చిత్రం థియేటర్స్లో ఈ ఏడాది డిసెంబరు 2న విడుదల కానుంది’’ అని శుక్రవారం మోహన్లాల్ స్పష్టం చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అనువాదమై ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. 67వ జాతీయ అవార్డ్స్లో ఈ చిత్రం మూడు (బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ కాస్ట్యూమ్) విభాగాల్లో అవార్డులు సాధించిన విషయం తెలిసిందే. -
ఓ సౌత్ ఇండియా సినిమా మూడు విదేశీ భాషల్లోకి..
ఓ భాషలో హిట్ అయిన కథలను మరో భాషలో రీమేక్ చేయడం సినీ పరిశ్రమల్లో మాములుగా జరిగేదే. కానీ ఓ భారతీయ సినిమా విదేశీ భాషల్లో రీమేక్ అవడం మాత్రం అరుదనే చెప్పాలి. అది ఓ సౌత్ ఇండియన్ మూవీ అవడం చాలా తక్కువ. ఇప్పుడు మాలయాళం సూపర్ హిట్ సినిమా ‘దృశ్యం’ త్వరలో ఇండోనేషియా లాంగ్వేజ్లోకి వెళ్లనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘మోహన్లాల్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ‘దృశ్యం’ ఇప్పటి వరకు 4 భారతీయ భాషలు, 2 విదేశీ భాషల్లో రీమేకైంది. ఇండియన్ లాంగ్వేజేస్తోపాటు చైనీస్, శ్రీలంకన్ భాషల్లో విడుదలై మంచి స్పందన సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇండోనేషియా భాషలో నిర్మితం కానుంది. ఇలా మా సినిమా సరిహద్దులను చెరిపేస్తూ దూసుకుపోవడం ఎంతో సంతోషాన్నిస్తోంది’ అని ఆంటోని తెలిపాడు. ఈ చిత్రాన్ని ఇండోనేషియాలో జకార్తాలోని పీటీ ఫాల్కన్ అనే సంస్థ నిర్మించనుంది. చైనీస్లో రీమేక్ అయిన మొదటి మలయాళ చిత్రం ఇదే కావడం విశేషం. చదవండి: ‘దృశ్యం 2’ అరుదైన రికార్డు, ఇండియన్ సినిమాల్లో అత్యధిక రేటింగ్ కాగా, ఈ సినిమాకి సీక్వెల్గా వచ్చిన ‘దృశ్యం 2’ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్లో ఈ ఫిబ్రవరి విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ చిత్రం కూడా తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్లు అవుతోంది. View this post on Instagram A post shared by Antony Perumbavoor (@antonyperumbavoor) -
ఒకే ఫ్రేమ్లో మోహన్లాల్, మల్లిక.. డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్
‘ఒకే ఫ్రేమ్లో గొప్ప నటుడిని, గొప్ప తల్లిని చూడడం, దానికి నేను దర్శకత్వం వహించడం ఎంతో ఆనందంగా ఉంది’అని సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు మలయాళ ప్రముఖ దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజాగా చిత్రం ‘బ్రో డాడీ’. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ తల్లి మల్లిక సుకుమారన్, మళయాళ సూపర్స్టార్ మెహన్లాల్ నటిస్తున్నారు. మంగళవారం ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫోటోని తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేస్తూ పై వ్యాఖ్యలు చేశాడు డైర్టెర్ పృథ్వీరాజ్. దీనికి "చివరికి ఇది జరగడం ఆనందంగా ఉంది" అంటూ పృథ్వీరాజ్ భార్య సుప్రియ కామెంట్ పెట్టారు. (చదవండి: బిగ్బాస్: ఐదో సీజన్లో కీలక మార్పులు.. సక్సెస్పై అనుమానాలెన్నో!) కాగా, పృథ్వీరాజ్ తల్లిదండ్రులు లేట్ సుకుమారన్, మల్లిక ఇద్దరు మళయాళ సినీ పరిశ్రమలో గుర్తింపుపొందిన నటీనటులే. అంతేకాకుండా గతంలో మెహన్లాల్ నటించిన లూసిఫర్ సినిమాలో పృథ్వీరాజ్ ముఖ్యపాత్రలో నటించారు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న "బ్రో డాడీ"లో కళ్యాణి ప్రియదర్శన్, మీనా వంటి గుర్తింపు పొందిన నటీనటులతో పాటు పృథ్వీరాజ్ సైతం ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Prithviraj Sukumaran (@therealprithvi) -
విషాదం: ప్రముఖ నిర్మాత మృతి.. సీఎం సంతాపం
తిరువనంతపురం: ప్రఖ్యాత చెఫ్, మలయాళ సినీ నిర్మాత నౌషద్(55) మరణించారు. తిరువల్లలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఇటీవలే కోవిడ్ బారిన పడిన నౌషద్.. ఉదర సంబంధిత నొప్పితో రెండు వారాల క్రితం నౌషద్ ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో నేటి ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఈ నెల 12న నౌషద్ భార్య షీబా గుండెపోటుతో మరణించారు. 15 రోజుల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ మృతి చెందడంతో కుటుంబలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులను కోల్పోయిన నౌషద్ కూతురు నష్వా(13)ను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నౌషద్ ది బిగ్ చెఫ్ పేరిట నౌషద్ నెలకొల్పిన రెస్టారెంట్, కాటెరింగ్ గ్రూపునకు మంచి గుర్తింపు ఉంది. అతడు చేసే రుచికరమైన వంటలంటే సెలబ్రిటీలకు మహా ప్రీతి. ఇక పలు స్థానిక టీవీ చానెళ్లలో కుకరీ షోలతో అలరించే నౌషద్ మమ్ముట్టి నటించిన కజా సినిమా(2005)తో నిర్మాతగా మారారు. చట్టంబి నాడు, లయన్, బెస్ట్ యాక్టర్, స్పానిష్ మసాలా వంటి చిత్రాలను నిర్మించారు. సీఎం విజయన్, సినీ ప్రముఖులు సంతాపం నౌషద్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అదే విధంగా మమ్ముట్టి, మోహన్లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితర సినీ ప్రముఖులు నౌషద్ లేనిలోటు తీరనిదని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. చదవండి: Amitabh Bachchan : తన జీతంపై క్లారిటీ ఇచ్చిన బిగ్బీ బాడీగార్డు Rest in peace. #Noushad 🙏 pic.twitter.com/r3cbCVMTIf — Prithviraj Sukumaran (@PrithviOfficial) August 27, 2021 Dearest Naushad, The food that you served became Celestial because of the love that you bestowed upon the served. Adieu, my friend. pic.twitter.com/CU2R8AkGiu — B Unnikrishnan (@unnikrishnanb) August 27, 2021 -
దర్శకుడిగా మారిన మలయాళ స్టార్ హీరో
యాక్టర్ మోహన్ లాల్ మెగాఫోన్ పట్టి డైరెక్టర్గా మారారు. మోహన్ లాల్ దర్శకత్వం వహిస్తున్న ‘బరోజ్: గార్డియన్ ఆఫ్ డీ గామా ట్రెజర్’ సినిమా ప్రారంభోత్సవం కొచ్చిలో జరిగింది. మలయాళ దర్శకుడు, నటుడు జిజో పున్నూస్ రచించిన ‘బరోజ్: గార్డియన్ ఆఫ్ డీ గామా ట్రెజర్’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ లాల్, పృథ్వీరాజ్, స్పానిష్ యాక్టర్లు పాజ్ వేగా, రాఫెల్ అమర్గో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘‘జీవితం నన్ను నటుడిని చేసింది. ఈ ప్రయాణంలో సినిమాయే నా జీవితం.. నా జీవనాధారం అని అర్థమైంది. నటుడిగా అద్భుతమైన ప్రయాణం చేసిన నేను ఇప్పుడు దర్శకుడిగా మరో ప్రయాణాన్ని మొదలుపెట్టాను’’ అని పేర్కొన్నారు మోహన్ లాల్. ఈ సినిమా ప్రారంభోత్సవంలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి పాల్గొన్నారు. చదవండి: ఖమ్మం నుంచి వచ్చి సోనాలి సూద్ పేరు చెప్పగానే.. విజయ్ దేవరకొండ పాటకి సిగ్గు పడుతూ వీడియో -
రిలీజ్ కాకముందే జాతీయ అవార్డు, అలా ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ: 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనావైరస్ మహమ్మారి కారణంగా అవార్డులను ఒక సంవత్సరం పాటు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో మోహన్లాల్ నటించిన మరక్కార్ మళయాళ చిత్రానికి గాను ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, స్పెషల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్ కేటగిరీల్లో అవార్డు లభించింది. అసలు విషయమేంటంటే.. ఈ చిత్రం ఇంకా రిలీజ్ అవ్వలేదు. విడుదల కాకముందే అవార్డును ఎలా ప్రకటించారని అందరు నివ్వెరపోయారు. ఈ చిత్రం గత ఏడాది మార్చి 26న విడుదలకావాల్సింది. లాక్ డౌన్ కారణంగా చిత్రం విడుదలకు నోచుకోలేదు. గత ఏడాదే సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ రావడంతో ఈ చిత్రాన్ని 2020లో వచ్చిన చిత్రంగా జ్యూరీ పరిగణించింది. ఈ ఏడాది మే 19న మూవీని చిత్ర బృందం రిలీజ్ చేయనుంది. కాగా, జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు 4 అవార్డులు దక్కాయి. జాతీయ స్థాయిలో వినోదం అందించిన బెస్ట్ పాపులర్ ఫిల్మ్గా మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ ఎంపికైంది. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నాని నటించిన ‘జెర్సీ’ (దర్శకత్వం గౌతమ్ తిన్ననూరి) అవార్డు గెలిచింది. ‘మహర్షి’ చిత్రానికి నృత్యాలు సమకూర్చిన రాజు సుందరం ఉత్తమ కొరియోగ్రాఫర్గా, ‘జెర్సీ’కి ఎడిటింగ్ చేసిన నవీన్ నూలి ఉత్తమ ఎడిటర్గా జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు. (చదవండి: మోహన్ లాల్ కసరత్తులు.. నెటిజన్లు ఫిదా) -
దృశ్యం త్రీ కూడా ఉంది
మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన మలయాళ థ్రిల్లర్ చిత్రం ‘దృశ్యం’. 2013లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్ భాషల్లోకి రీమేక్ అయింది. ఇటీవలే ‘దృశ్యం’ చిత్రానికి సీక్వెల్గా ‘దృశ్యం 2’ తెరకెక్కించారు జీతు. ఈ సినిమా నేరుగా అమేజాన్ ప్రై మ్లో విడుదలయింది. ఈ సినిమా కూడా విశేష ప్రశంసలు అందుకుంటోంది. జీతు జోసెఫ్ దర్శకత్వంలోనే మలయాళ ‘దృశ్యం 2’ రీమేక్లో వెంకటేశ్ నటించనున్నారు. తాజాగా ‘దృశ్యం 3’ కూడా ఉంటుందని ప్రకటించారు దర్శకుడు జీతు. ఆల్రెడీ మూడో భాగం కై్లమాక్స్ రాసుకున్నానని తెలిపారు. కానీ ‘దృశ్యం 3’ తెరకెక్కడానికి మరో మూడేళ్ల సమయం పడుతుందని స్పష్టం చేశారు. -
దృశ్యం సీక్వెల్లో వెంకటేశ్: ఛాన్స్ ఉందా?
మలయాళంలో 2013లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ చిత్రం దృశ్యం. థ్రిల్లర్ కథాంశం, సస్పెన్స్ అంశాలు ఈ సినిమాను పెద్ద హిట్ చేశాయి. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనేక భాషల్లో రీమేక్ అయింది. గత దశాబద్ధంలో ఎక్కువ భాషల్లో రీమేక్ అయిన సినిమాల్లో దృశ్యం ఒకటి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, సింహళీ (శ్రీలంక) భాషలో రీమేక్ అయింది. చైనీస్ భాషలోనూ రీమేక్ అయిన తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. ఏడేళ్ల తర్వాత దృశ్యానికి సీక్వెల్ తెరకెక్కించాడు దర్శకుడు జీతూ జోసెఫ్. మొదటి భాగంలో నటించిన మోహన్లాల్, మీనా ఇందులోనూ భార్యాభర్తలుగా నటించారు. ఈ మధ్యే సినిమా ట్రైలర్ రిలీజవగా ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేస్తున్నారు. థియేటర్లు ఓపెన్ అయినా కూడా ముందస్తు ఒప్పందం ప్రకారం ఓటీటీలో విడుదల చేయక తప్పట్లేదు. దృశ్యం తెలుగు రీమేక్లో నటించిన వెంకటేశ్ ఇప్పుడు దాని సీక్వెల్పైనా దృష్టి సారించాడు. కానీ డైరెక్టర్ జీతూ దృశ్యం 2ను తెలుగులో డబ్ చేస్తుండటంతో వెంకటేశ్కు దాదాపు రీమేక్ ఛాన్స్ లేకుండా పోయింది. పైగా మరికొద్ది రోజుల్లో ఈ సినిమా ఓటీటీలో అందరికీ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో వెంకీ దీన్ని వదిలేసుకునే అవకాశమే అధికంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ సీక్వెల్ తెలుగు రీమేక్ ఉందా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం వెంకీ 'నారప్ప' సినిమాతో బిజీబిజీగా ఉన్నాడు. 'అసురన్' రీమేక్గా వస్తోన్న ఈ చిత్రం మే 14న విడుదల కానుంది. వరుణ్ తేజ్తో కలిసి చేస్తున్న 'ఎఫ్ 3' ఆగస్టు 27న థియేటర్లలో నవ్వులు పూయించేందుకు వస్తోంది. చదవండి: వేసవిలో నారప్ప రిలీజ్.. కేజీఎఫ్ 2 బిజినెస్ మాములుగా లేదుగా.. అన్ని కోట్లా? -
బిగ్బాస్: మోహన్లాల్కు అన్ని కోట్లా?
బిగ్బాస్ రియాలిటీ షో.. ఏ భాషలో అడుగు పెట్టినా విశేష ఆదరణ దాని సొంతం. సెలబ్రిటీలు ఎలా ఉంటారు? వారి జీవితంలో ఏం జరిగింది? అని తెలుసుకోవాలన్న కుతూహలం ప్రేక్షకులను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. ఈ కారణం వల్లే ఎన్నో భారతీయ భాషల్లో బిగ్బాస్ షో పలు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అటు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్తో పాటు అందులో పాల్గొన్న సెలబ్రిటీలకు గుర్తింపు, అవకాశాలను తెచ్చి పెట్టింది. తెలుగులో నాగార్జున, తమిళంలో కమల్ హాసన్, కన్నడలో కిచ్చా సుదీప్, హిందీలో సల్మాన్ ఖాన్ బిగ్బాస్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా మలయాళంలో మోహన్లాల్ హోస్ట్గా చేస్తున్నారు. ఇప్పటికే మలయాళ బిగ్బాస్ రెండు సీజన్లను పూర్తి చేసుకోగా త్వరలోనే మూడో సీజన్ను ప్రారంభించే పనిలో ఉన్నారు. ఫిబ్రవరి 14 నుంచి సీజన్ 3 ప్రసారం కానుందట. ఈ క్రమంలో మోహన్లాల్ రెమ్యూనరేషన్ గురించి పలు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బిగ్బాస్ షోకు హోస్ట్గా చేసేందుకు ఈ సీనియర్ నటుడు రూ.12 కోట్లు తీసుకునేవారట. కానీ ఈసారి తన రెమ్యూనరేషన్ను మరో ఆరు కోట్లు పెంచినట్లు టాక్ వినిపిస్తోంది. అంటే ఈసారి ఏకంగా రూ.18 కోట్లు తీసుకోబోతున్నారన్నమాట. మరి ఈ పారితోషికం ఒక్క ఎపిసోడ్కా? ఓవరాల్ సీజన్కా? అన్నది మాత్రం తెలియరాలేదు. ఇక ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక విషయానికొస్తే.. ఎప్పటిలాగే ఈసారి కూడా టీవీ సెలబ్రిటీలకే పెద్ద పీట వేసినట్లు కనిపిస్తోంది. ఐశ్వర్య రామ్సాయి, నూబిన్ జానీ, అనుమోల్ ఆర్ఎస్, శ్రీజిత్ విజయ్, అనిల్ ఆర్ మీనన్, రాజీవ్ పరమేశ్వర్, గిలు జోసెఫ్, శాంతివిల దినేష్ షోలో పాల్గొననున్నట్లు సమాచారం. చదవండి: రామ్గోపాల్ వర్మను కలిసిన బోల్డ్ బ్యూటీ అవును.. రిలేషన్షిప్లో ఉన్నా: నటి -
ఫ్యాన్స్కు మోహన్లాల్ న్యూ ఇయర్ గిఫ్ట్
సూపర్ స్టార్ మోహన్ లాల్, మీనా నటించిన సూపర్ హిట్ థ్రిల్లర్ 'దృశ్యం2' న్యూ ఇయర్ కానుకగా అమెజాన్ ప్రైమ్లో విడుదల అయ్యింది. దీనికి సంబంధించి ఇప్పటికే అర్థరాత్రి టీజర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మోహన్లాల్ మాట్లాడుతూ..జార్జ్ కుట్టి, అతని కుటుంబం కథతో ముందుకు వస్తున్నామని, ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎంతో ఆసక్తితో ఉన్నట్లు పేర్కొన్నారు. జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనా, సిద్దిక్, ఆశా శరత్, మురళి గోపీ, అన్సిబా, ఎస్తేర్, సైకుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2013లో విడుదలైన దృశ్యం మొదటి పార్ట్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మలయాళంలో బాక్సాఫీస్ వద్ద రూ .50 కోట్లు వసూలు చేసిన మొదటి చిత్రంగా రికార్డుకెక్కింది. మొదటి పార్ట్లో ఎక్కడైతే కథ ఆగిందో సెకండ్ పార్ట్లో అక్కడినుంచి కంటిన్యూ కానుంది. థ్రిల్లర్ కథాంశం, సస్పెన్స్ ఈ సినిమాను పెద్ద హిట్ చేశాయి. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, సింహళీ (శ్రీలంక) భాషల్లో ఈ చిత్రం రీమేక్ అయిన సంగతి తెలిసిందే. అది కాకుండా గత దశాబ్దంలో ఎక్కవ భాషల్లో రీమేక్ అయిన సినిమాల్లో ‘దృశ్యం’ ఒకటి. చైనీస్ భాషలో రీమేక్ అయిన తొలి భారతీయ సినిమా కూడే ఇదే కావడం విశేషం. మోహన్ లాల్ మే 21న తన 60 వ పుట్టినరోజు సందర్భంగా దృశ్యం సీక్వెల్ ప్రకటించినా కరోనా కారణంగా షూటింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యింది. కాగా మోహన్లాల్ తదనంతరం జీతు జోసెఫ్ దర్శకత్వంలోనే ‘రామ్’ అనే మరో చిత్రానికి సైన్ చేశారు. Georgekutty and his family are coming soon on @PrimeVideoIN#Drishyam2OnPrime #HappyNewYear2021 #MeenaSagar #JeethuJoseph @antonypbvr @aashirvadcine @drishyam2movie #SatheeshKurup pic.twitter.com/5l7cfCdCS3 — Mohanlal (@Mohanlal) December 31, 2020 -
భారీగా బరువు తగ్గిన స్టార్ హీరో కూతురు
మలయాళ ప్రముఖ నటుడు మోహన్లాల్ కూతురు విస్మయ భారీగా బరువు తగ్గి అభిమానులకు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం థాయ్లాండ్లో నివసిస్తున్న ఆమె ఇప్పటి వరకు చాలా లావుగా, బొద్దుగా ఉండేవారు. ఇలా ఒక్కసారిగా సన్నబడి నెటిజన్లకు సర్ప్రైజ్ ఇచ్చారు. బరువు తగ్గడం కోసం తీవ్రంగా శ్రమించి ప్రత్యేక వ్యాయామాలు, మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకున్నారు. దీంతో ఏకంగా 22 కిలోలు బరువు తగ్గారు. ఈ క్రమంలో శుక్రవారం బరువుతో ఉన్న ఫోటోను, ఇప్పటి ఫోటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతోపాటు మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్కు సంబంధించిన వీడియోను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు విస్మయ కష్టాన్ని గుర్తిస్తూ, ఆమెను పొగడ్తలతో ముంచెస్తున్నారు. చదవండి: హిట్లర్ టు లూసిఫర్ విస్మయ తన ఇన్స్టాగ్రామ్లో ఇలా రాసుకొచ్చింది. థాయ్లాండ్లో ప్రతిక్షణం సంతోషంగా గడిపాను. ఇక్కడి శిక్షణ బృందం చాలా మంచివారు. ఇక్కడకు వచ్చాక ఏం చేయాలో తోచలేదు. కొన్నేళ్ల క్రితం నేను నాలుగు మెట్లు ఎక్కుతుంటేనే ఊపిరాడక ఇబ్బందిపడేదాని. దీంతో బరువు తగ్గాలనే ఆలోచన వచ్చింది. ఇప్పుడు, శిక్షణ తీసుకుని 22 కిలోల బరువు తగ్గాను. చాలా ఆనందంగా ఉంది. ఇదంతా నా కోచ్ వల్లే సాధ్యమైంది. తను లేకుంటే నేనేం చేయలేకపోయేదాన్ని. ప్రతిరోజు నేను బెస్ట్ ఇచ్చేలా ఎంకరేజ్ చేశారు. నా మీద నాకు నమ్మకం పెంచారు. తను నాకెంతో సాయం చేశారు. నేను చేయలేను అనే ఆలోచన నుంచి ఏదైనా చేయగలిగేలా చేశారు. అని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Maya Mohanlal (@mayamohanlal) -
హిట్లర్ టు లూసిఫర్
‘హిట్లర్’ (1997) టు తాజా ‘లూసిఫర్’ వరకూ చిరంజీవి చాలా సినిమాలు చేశారు. వీటిలో ‘ఠాగూర్’, ‘స్టాలిన్’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ వంటి తమిళ, హిందీ రీమేక్ చిత్రాలున్నాయి. కానీ మలయాళ రీమేక్ లేదు. ‘హిట్లర్’ చిత్రం మలయాళంలో మమ్ముట్టి నటించిన ‘హిట్లర్’కి రీమేక్. ఇప్పుడు చిరంజీవి నటించనున్నæమోహన్ లాల్ మలయాళ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ని బుధవారం ప్రకటించారు. విశేషం ఏంటంటే.. చిరంజీవి ‘హిట్లర్’కి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు. ఆయన తండ్రి ఎడిటర్ మోహన్ ‘హిట్లర్’ రీమేక్కి నిర్మాత. చిరంజీవి రాబోయే సినిమాగా ‘లూసిఫర్’ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, ఎన్.వి.ఆర్ సినిమా పతాకంపై ఎన్.వి. ప్రసాద్ నిర్మించనున్నారు. చిరంజీవి మాట్లాడుతూ – ‘‘మన నేటివిటీకి తగ్గట్టు ఈ స్క్రిప్టును మోహన్ రాజా బాగా న్యారేట్ చేశాడు. సంక్రాంతి తర్వాత సెట్స్కి వెళతాం. ఏప్రిల్తో షూటింగ్ పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘చిరంజీవిగారిని డైరెక్ట్ చేసే అవకాశం, అదృష్టం దక్కడం పూర్వజన్మ సుకృతం’’ అన్నారు మోహన్ రాజా. ‘‘బాస్తో (చిరంజీవి) సినిమా అంటేనే అందరిలో కొత్త ఉత్సాహం నెలకొంది. భారీ బడ్జెట్తో నిర్మిస్తాం’’ అన్నారు ఎన్.వి. ప్రసాద్. -
ఐఏఎస్ ఆఫీసర్గా..
‘జెర్సీ’ చిత్రంలో మిడిల్క్లాస్ హౌస్వైఫ్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శ్రద్ధా శ్రీనాథ్. తాజాగా మలయాళంలో ఓ సినిమా అంగీకరించారు. మోహన్లాల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా ఐఏఎస్ ఆఫీసర్గా కీలక పాత్ర చేయబోతున్నారు. ఈ చిత్రానికి ‘పులిమురుగన్’ ఫేమ్ బి. ఉన్నికృష్ణన్ దర్శకుడు. శ్రద్ధాకు ఫోన్లో ఈ కథను చెప్పారట దర్శకుడు. మంచి కథ, నటనకు అవకాశం ఉన్న పాత్ర కావడంతో ఎక్కువ డేట్స్ను ఈ సినిమాకు కేటాయించారట శ్రద్ధా. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ నవంబర్లో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం విశాల్తో ‘చక్ర’, మాధవన్తో ‘మారా’ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలతో శ్రద్ధా శ్రీనాథ్ బిజీ బిజీగా ఉన్నారు. -
యుద్ధానికి వెళ్తున్నట్లనిపించింది
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణం అంటే యుద్ధానికి వెళ్తున్న భావన కలుగుతోంది’’ అంటున్నారు మీనా. మలయాళ చిత్రం ‘దృశ్యం’కి సీక్వెల్గా ‘దృశ్యం 2’ తెరకెక్కుతోంది. మోహన్ లాల్, మీనా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం ఏడు నెలల తర్వాత విమానయానం చేశారు మీనా. పీపీఈ కిట్ ధరించి ప్రయాణం చేశారామె. దీని గురించి మీనా మాట్లాడుతూ –‘‘ఈ దుస్తులన్నీ చూస్తుంటే అంతరిక్షానికి వెళ్తున్నట్టు అనిపించింది. అలాగే ఏదో యుద్ధానికి వెళుతున్న ఫీల్ కలిగింది. విమానాశ్రయం చాలా ఖాళీగా ఉంది. నాలా ఎవ్వరూ డ్రెస్ (పీపీఈ కిట్స్) చేసుకోకపోవడం భలే ఆశ్చర్యంగా అనిపించింది. ఈ డ్రెస్లో ప్రయాణం చాలా కష్టం. బయట చల్లగా ఉన్నప్పటికీ లోపల ఒకటే ఉక్కపోత. వీటితో రోజూ మన కోసం కష్టపడుతున్న అందరికీ నా సెల్యూట్’’ అన్నారు. -
డిఫరెంట్ లుక్లో మోహన్లాల్..
తిరువనంతపురం : మాలీవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ విభిన్న నటనతో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మోహన్ లాల్ ఆధ్యాత్మిక లుక్ లో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన మైండ్, శరీరం కోసం తాను డీటాక్స్ జర్నీలో ఉన్నానని క్యాప్షన్ ఇచ్చాడు. అయితే చాలా కాలం తర్వాత అభిమాన హీరోను విభిన్నంగా చూడటం చాలా సంతోషంగా ఉందని ఆయన అభిమానులు అంటున్నారు. మోహన్ లాల్ ప్రస్తుతం చారిత్రక(హిస్టారికల్) డ్రామాగా తెరకెక్కుతున్న మరాక్కర్..అరిబికడలింటే సింహం. కోవిడ్ ప్రభావంతో ఈ సినిమా విడుదల కావడానికి మరింత సమయం పడుతుందని చిత్ర యూనిట్ పేర్కొంది. కాగా టాలీవుడ్లో యంగ్ టైగర్ హీరోగా నటించిన జనతా గ్యారేజీ సినిమాలో మోహన్ లాల్ కీలక పాత్ర పోషించి ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. -
మరీ అంత దరిద్రంగా లేను: హీరోయిన్
ఫొటో చూస్తుంటేనే తెలుస్తోంది ఇది ఎన్నో ఏళ్ల క్రితం నాటిదని. కానీ మలయాళ స్టార్ హీరో మోహన్లాల్ అప్పటికీ ఇప్పటికీ అలానే ఉన్నారు. కాకపోతే ఆ పక్కన ఉన్న అమ్మాయి మాత్రం ఇప్పుడు కాస్త బొద్దుగా, ముద్దుగా మారిపోయింది. ఇంతకీ ఆమెవరనుకుంటున్నారు, బాలీవుడ్లో తనకంటూ ఓ స్టార్డమ్ను సంపాదించుకున్న హీరోయిన్ విద్యాబాలన్. మలయాళంలో ఆమె నటించిన తొలి చిత్రం షూటింగ్ సమయంలో తీసిన ఫొటో ఇది. దీన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకున్నారు. (బరువు తగ్గాలమ్మాయ్ అన్నారు!) "అది 2000 సంవత్సరం. నేను మోహన్లాల్తో కలిసి నటించిన తొలి మలయాళ చిత్రం చక్రం షూటింగ్ సమయంలో దిగిన ఫొటో ఇది. కానీ మొదటి షెడ్యూల్ ముగిసిన తర్వాత ఆ సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది.. చూస్తుంటే ఈ ఫొటోలో నేను అనుకున్నంత దరిద్రంగా ఏమీ లేను" అని విద్యాబాలన్ రాసుకొచ్చారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా విద్యాబాలన్ 'భాలో టేకో' అనే బెంగాలీ చిత్రంతో వెండితెరపై ప్రవేశించారు. ఈ సినిమా విడుదలైన రెండేళ్లకు, అంటే 2005లో నవల ఆధారంగా నిర్మితమైన 'పరిణీత' చిత్రంలో నటించేందుకు సంతకం చేశారు. ఆ తర్వాత పలు భాషల్లో నటిస్తూ గొప్ప నటిగా ఎదిగారు. ఆమె చివరిసారిగా మహిళా ప్రధాన చిత్రం 'శకుంతల దేవి'లో నటించారు. ఓటీటీలో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచే కాక విమర్శకుల నుంచి కూడా మెప్పును పొందింది. కాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు నటిస్తున్న 'సర్కారువారి పాట'లో హీరో అక్క క్యారెక్టర్ కోసం విద్యాబాలన్ను సంప్రదించారని సమాచారం. (ప్రణవ్, కల్యాణి లవ్లో ఉన్నారా?) -
ఉత్తమ థ్రిల్లర్ సీక్వెల్కు రెడీ!
తిరువనంతపురం: 2013 లో విడుదలైన మోహన్ లాల్ ‘దృశ్యం’ చిత్రం భారతీయ సినిమాల్లో ఇప్పటివరకు చేసిన ఉత్తమ థ్రిల్లర్లలో ఒకటి. ఈ సినిమా మలయాళంలో బాక్సాఫీస్ వద్ద రూ .50 కోట్లు వసూలు చేసిన మొదటి చిత్రంగా రికార్డుకెక్కింది. మోహన్ లాల్ మే 21న తన 60 వ పుట్టినరోజు సందర్భంగా దృశ్యం సీక్వెల్ ఉండబోతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి జీతు జోసెఫ్ దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. ఆగస్టు 17 నుంచి ఈ చిత్రం షూటింగ్కు మోహన్లాల్ అంగీకరించారని, దీనికి సంబంధించి ఈ వారాంతంలో పరిశ్రమలోని నిపుణులు, నిర్మాతలతో సమావేశం నిర్వహించే ఆలోచనల్లో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. (ఆ వార్తల్లో నిజం లేదు : కత్తి మహేష్) ఈ సమావేశంలో కరోనా సంక్షోభ పరిస్థితిని అధిగమించడానికి తీసుకోవలసిన భద్రతా చర్యలు, ఇతర ఆర్థిక విషయాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం దృశ్యం 2 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నటించబోయే మిగిలిన తారాగణాన్ని త్వరలో ప్రకటించనున్నారు. గత నెలలో కేరళ ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలను సడలించిన క్రమంలో సినిమా షూటింగ్ల కోసం అనుమతించింది. సునామి అనే మలయాళ చిత్రం జూన్ మధ్యలోనే కొంతమంది సిబ్బందితో తిరిగి షూట్ ప్రారంభించింది. ఇదిలావుండగా, మోహన్ లాల్ ‘మరక్కర్: అరబికడాలింటే సింహాం’ సినిమా ఏప్రిల్లో తెరపైకి రావాల్సి ఉండగా కరోనా కారణంగా ఈ చిత్రం వాయిదా పడింది. దీని తరువాత జీతు జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న ‘రామ్’ అనే మరో చిత్రానికి సంతకం చేశారు. ఈ చిత్రంలోని ప్రధాన భాగాలను విదేశాలలో చిత్రీకరించాల్సిన అవసరం ఉన్నందున వచ్చే ఏడాది షూటింగ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. (బై ముంబై.. వెళ్లిపోతున్నా: హీరోయిన్) -
దృశ్యం 2
మోహన్లాల్ హీరోగా మలయాళంలో తెరకెక్కిన చిత్రం ‘దృశ్యం’ (2013). థ్రిల్లర్ కథాంశం, సస్పెన్స్ అంశాలు ఈ సినిమాను పెద్ద హిట్ చేశాయి. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చాలా భాషల్లో రీమేక్ అయింది. గత దశాబ్దంలో ఎక్కవ భాషల్లో రీమేక్ అయిన సినిమాల్లో ‘దృశ్యం’ ఒకటి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, సింహళీ (శ్రీలంక) భాషలో రీమేక్ అయింది. చైనీస్ భాషలో రీమేక్ అయిన తొలి భారతీయ సినిమా కూడే ఇదే కావడం విశేషం. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్టు జీతూ జోసెఫ్ ప్రకటించారు. మొదటి భాగంలో నటించిన మోహన్లాల్, మీనా ఇందులోనూ భార్యాభర్తలుగా నటిస్తారట. మిగతా నటీనటులు మారతారని తెలిపారు. కేరళలో సినిమా చిత్రీకరణలకు అనుమతి ఇచ్చిన వెంటనే ఈ సినిమాను ఆరంభించాలనుకుంటున్నారట. -
అమ్మకి అమ్లెట్ వేసిన డీఎస్పీ..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం టాలీవుడ్లో ‘బి ది రియల్ మ్యాన్’ చాలెంజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఇంటి పనుల్లో ఆడవాళ్లకు సాయం చేయడం ద్వారా ఈ చాలెంజ్ను విజయవంతంగా పూర్తిచేశారు. తాజాగా దర్శకుడు సుకుమార్ నుంచి ఈ చాలెంజ్ను స్వీకరించిన.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇంటి పనుల్లో తన తల్లికి సాయం అందించాడు. ఇంటిని శుభ్రం చేయడంతో పాటుగా తన తల్లికి అమ్లెట్ వేసి పెట్టాడు. అంతేకాకుండా ప్లేట్ కూడా శుభ్రం చేశాడు. చివరిగా తన తండ్రి ఫొటో వద్ద నివాళులర్పించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన డీఎస్పీ.. మనల్ని రియల్ మ్యాన్గా తయారు చేస్తున్న ప్రతి ఒక్క తల్లికి దీనిని అంకితం ఇస్తున్నట్టుగా చెప్పారు. అలాగే ఈ చాలెంజ్ను ముందకు తీసుకెళ్లాల్సిందిగా హీరోలు అల్లు అర్జున్, యష్, కార్తి, దర్శకుడు హరీష్ శంకర్, మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ను డీఎస్పీ కోరారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి, దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, సందీప్రెడ్డి వంగల మాదిరి వినోదాన్ని జోడించే ప్రయత్నం చేశానని చెప్పారు. ఈ వీడియోలో తొలుత బి ది రియల్ మ్యాన్ చాలెంజ్ చేసిన సినీ ప్రముఖల క్లిప్స్ చూపించారు. చదవండి : జ్యోతిక వ్యాఖ్యలను సమర్థించిన సూర్య.. -
డైరెక్టర్ ఎవరు?
మలయాళంలో మోహన్లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్హిట్ మూవీ ‘లూసీఫర్’ తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. ఈ పొలిటికల్ థ్రిల్లర్ తెలుగు రీమేక్ హక్కులను నటుడు–నిర్మాత రామ్చరణ్ దక్కించుకున్నారు. ఇందులో చిరంజీవి హీరోగా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించనున్నారు? అనే ప్రశ్నకు సమాధానంగా సుకుమార్, హరీష్ శంకర్ ఇలా కొంతమంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా యువ దర్శకుడు సుజిత్ పేరు వినిపిస్తోంది. ‘లూసీఫర్’ తెలుగు స్క్రిప్ట్ను రెడీ చేయాల్సిందిగా సుజిత్కు చిరంజీవి చెప్పారట. ఇంతకు ముందు శర్వానంద్ ‘రన్ రాజా రన్’, ప్రభాస్ ‘సాహో’ చిత్రాలకు సుజిత్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. -
చిరు ఇంట్లో అలనాటి తారల సందడి
దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన 80వ దశకపు తారలంతా ప్రతి ఏటా ఏదో ఒకచోట చేరి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి రీయూనియన్కు మెగాస్టార్ చిరంజీవి ఇల్లు వేదికైంది. ఇందుకోసం చిరంజీవి తన ఇంట్లో అతిథులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అలనాటి ప్రముఖ నటీనటులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఈ వేడుకలో రాధిక, శరత్కుమార్, ప్రభు, భానుచందర్, మోహన్లాల్, రెహమాన్, వెంకటేశ్, సరిత, లిజీ, సుభాషిణితో పాటు పలువురు తారలు పాల్గొన్నారు. ఈ వేడుకలో చిరంజీవితో కలిసి దిగిన ఫొటోను ప్రముఖ మలయాళ నటుడు మోహన్లాల్ తన ట్విటర్లో పోస్ట్ చేశారు. అలాగే రాధిక శరత్కుమార్ కూడా తన తోటి తారలతో కలిసి ఎయిర్పోర్ట్లో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. 80వ దశకపు తారలు అందరు ఇలా రీయూనియన్ కావడం ఇది పదోసారి. అప్పట్లో తీరిక లేకుండా గడిపిన వీరంతా ఇలా ఒకచోట చేరి సందడి చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చైనీస్కు దృశ్యం
ఒక భాషలో విజయవంతమైన చిత్రాలు మరో భాషలో రీమేక్ కావడం సాధారణం. ఈ మధ్య కాలంలో మలయాళ హిట్ సినిమా ‘దృశ్యం’ ఎక్కువ భాషల్లో రీమేక్ అయింది. తాజాగా చైనీస్ భాషకి వెళ్లడం విశేషం. మోహన్లాల్ హీరోగా జీతూ జోసెఫ్ రూపొందించిన థ్రిల్లర్ ‘దృశ్యం’. తెలుగులో వెంకటేశ్ (దృశ్యం), తమిళంలో కమల్ హాసన్ (పాపనాశనం), కన్నడంలో రవిచంద్రన్ (దృశ్య), హిందీలో అజయ్ దేవగన్ (దృశ్యం) హీరోలుగా రీమేక్ చేశారు. అంతేకాదు.. సింహళీ (శ్రీలంక)భాషలో ‘ధర్మయుద్య’గా రీమేక్ అయింది. ఇప్పుడు చైనీస్లో ‘షీప్ వితౌట్ ఏ షెపర్డ్’ ౖటñ టిల్తో రీమేక్ అయింది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 20న విడుదలవుతోంది. -
అతడినే పెళ్లి చేసుకుంటాను: హీరోయిన్
సాక్షి, చెన్నై : నటుడి కొడుకు ప్రేమలో... నటి కూతురు అనగానే ఇదేదో సినిమా టైటిల్ అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు ‘తప్పు’లో కాలేసినట్లే. ప్రేమ అన్నది ఎవరికి? ఎప్పుడు? ఎలా? ఎవరి మీద పుడుతుందో చెప్పడం కష్టం. ఎక్కడో? ఏదో సందర్భంలో? అనుకోకుండా కలిగేదే ప్రేమ. అయితే ఇద్దరు చిన్ననాటి స్నేహితుల మధ్య కూడా ప్రేమ కలగవచ్చు. అలాంటిదే నటి కల్యాణి ప్రేమ కూడా అనే ప్రచారం ఇప్పుడు సినీ పరిశ్రమలో హల్చల్ చేస్తోంది. సంచలన సినీ జంట దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీల కూతురు కల్యాణి అన్న సంగతి తెలిసిందే. ఈ చిన్నది రెండేళ్ల క్రితం ‘హలో’ చిత్రంతో టాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమైంది. ఇటీవలే చిత్రలహరి సినిమాతో మంచి హిట్ కొట్టి ఫుల్ జోష్లో ఉంది. ఇక తాజాగా శివకార్తికేయన్కు జంటగా ‘హీరో’ అనే చిత్రం ద్వారా కోలీవుడ్లోనూ ఎంట్రీ ఇవ్వనుంది. కాగా కల్యాణి ఇప్పుడు ప్రేమలో మునిగిపోయిందన్న ప్రచారం హోరెత్తుతోంది. ఈ బ్యూటీ మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ కొడుకు ప్రణవ్తో ప్రేమలో పడిందట. మోహన్లాల్, దర్శకుడు ప్రియదర్శన్ కళాశాల రోజుల నుంచి మిత్రులు. వీరిద్దరి కాంబినేషన్లో ఏకంగా 43 చిత్రాలు వచ్చాయి. ఇది ఒక రికార్డు. అంతే కాదు మోహన్లాల్, ప్రియదర్శన్ కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో మోహన్లాల్ కొడుకు ప్రణవ్, ప్రియదర్శన్ కూతురు కల్యాణిల మధ్య బాల్యం నుంచే స్నేహం కొనసాగుతూ వచ్చింది. అది ఇప్పుడు ప్రేమగా మారిందనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. ప్రస్తుతం ప్రణవ్, కల్యాణి తమ సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రేమ వ్యవహారం గురించిన ప్రశ్నకు నటి కల్యాణి స్పందిస్తూ చాలా తెలివిగా బదులిచ్చింది. ‘నేను ఒకరిని ప్రేమిస్తున్న మాట నిజం. భవిష్యత్లో అతన్నే పెళ్లి చేసుకుంటాను. నేను ఎవరిని ప్రేమిస్తున్నానన్న విషయం నా కుటుంబసభ్యులకు తెలుసు. మా ప్రేమకు ఎలాంటి సమస్య లేదు. నేను ప్రేమిస్తున్న వ్యక్తి పేరు, వివరాలను ప్రస్తుతానికి చెప్పను’ అని కల్యాణి పేర్కొంది. -
‘కాప్పాన్’తో సూర్య అభిమానులు ఖుషీ
చాలా కాలం తరువాత నటుడు సూర్య అభిమానుల్లో ఆనందం తాండవిస్తోంది. కారణం సూర్య నటించిన తాజా చిత్రం కాప్పాన్. సూర్యకు జంటగా నటి సాయేషా సైగల్ నటించిన ఈ సినిమాలో మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్, ఆర్య ప్రదాన పాత్రలను పోషించారు. కేవీ.ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించింది. శుక్రవారం భారీ అంచనాల మధ్య తెరపైకి వచ్చిన కాప్పాన్ చిత్రం సూర్య అభిమానుల్ని యమ ఖుషీ చేస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడు కొత్త నేపథ్యాన్ని ఎంచుకున్నారు. పలు ఆసక్తికరమైన మలుపులతో చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించే దర్శకుడిగా ఈయన కాప్పాన్ చిత్రంలోనూ తనదైన దర్శకత్వ శైలిని ప్రదర్శించారు. సినిమాలో దర్శకుడు చాలా విషయాలను చెప్పారు. దేశ భద్రత, దేశ అభివృద్ధి కోసం ప్రధానమంత్రిగా మోహన్లాల్ పడే తపన, అందు కోసం చేసే కృషి, పాకిస్థాన్ ఉగ్రవాదుల దురాగతాలు, స్వదేశంలోని కార్పొరేట్ల స్వార్థం, కొందరు మంత్రుల అక్రమ రాజకీయాలు, బయోవార్, రైతుల సంరక్షణ, ప్రేమ వంటి అంశాలను టచ్ చేశారు. బడా కార్పొరేట్ శక్తులు తన స్వార్థం కోసం రైతుల కడుపు కొట్టాలని ప్రయత్నిస్తారు. అందుకు ప్రధాని అంగీకరించకపోవడంతో ఆయన్నే మట్టు పెట్టే ప్రయత్నానికి పాల్పడతారు. దాన్ని ప్రధాని సెక్యూరిటీ సూర్య ఎలా ఎదుర్కొన్నాడు..? రైతుల భూములను ఎలా కాపాడాడు? లాంటి పలు ఆసక్తికరమైన సన్నివేశాలతో కాప్పాన్ ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. సూర్య తనదైన శైలిలో ఆకట్టకున్నారు. మోహన్లాల్ ప్రధానమంత్రిగా హుందాగా నటించారు. కథానాయకిగా నటి సాయేషా సైగల్ తన పరిధిలో నటించింది. ఆర్య తనదైన హాస్యధోరణిలో కథలో కీలకంగా నిలిచారు. చిత్రానికి ఛాయాగ్రహణ హైలైట్. హరీస్ జయరాజ్ నేపథ్య సంగీతం బాగా కలిసివచ్చింది. -
మోహన్లాల్కు భారీ షాక్
మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్కు అటవీ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. తన ఇంట్లో అక్రమంగా ఏనుగు దంతపు కళాఖండాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఎర్నాకుళంలోని కోర్టులో అతనిపై చార్జిషీట్ దాఖలు చేసింది. పెరుంబవూరులోని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో శుక్రవారం అటవీ శాఖ ఈ చార్జ్షీటు నమోదు చేసింది. కోదనాడ్ రేంజ్లోని మేకప్పల ఫారెస్ట్ స్టేషన్లో మోహన్లాల్పై 2012లో క్రిమినల్ కేసు నమోదైన ఏడు సంవత్సరాల తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. కేసు నమోదైన అనంతరం ఈ కళాఖండాలను కలిగి వుండేందుకు ధృవీకరణ పొందినట్టు కోర్టుకు తెలిపారు. కె కృష్ణన్ అయ్యర్ అనే వ్యక్తినుంచి 65వేల రూపాయలకు కొనుగోలు చేశానని మోహన్లాల్ వివరణ ఇచ్చారు. అయితే అతనికి ఈ అనుమతి ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ ఎర్నాకుళంకు చెందిన పౌలోస్ అనే పిటిషనర్ హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై స్పందించిన కేరళ ప్రభుత్వం దంతపు కళాఖండాలను ఉంచుకునేందుకు మోహన్లాల్కు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (వైల్డ్లైఫ్) ఎటువంటి అనుమతి ఇవ్వలేదని కేరళ ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో కోర్టుకు తెలిపింది. దీంతో వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ 39 (3) తో మోహన్లాల్పై అభియోగాలు మోపవచ్చని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా పిటిషనర్ హైకోర్టును అభ్యర్థించారు. కాగా 2012లో ఆయన ఇంట్లో సోదాలు జరిపిన ఐటీ అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మోహన్లాల్తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసిన అటవీ శాఖ అధికారులు దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ను పెరుంబవూర్లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట దాఖలు చేశారు. భారతీయ వన్య ప్రాణి చట్టంలోని సెషన్ 44(6) కింద కేసు నమోదు చేసి, మోహన్లాల్ను ప్రధాన నిందితుడుగా చేర్చిన సంగతి తెలిసిందే. -
మళ్లీ మలయాళంలో..
కెరీర్ ఆరంభించిన పదహారేళ్లకు త్రిష మలయాళంలో గత ఏడాది తొలి సినిమా (హే జ్యూడ్) చేశారు. ఈ ఏడాది మళ్లీ కేరళ ప్రేక్షకులను పలకరించనున్నారని సమాచారం. మోహన్లాల్ సరసన ఓ సినిమా చేయడానికి అంగీకరించారట. దాదాపు ఆరేళ్ల క్రితం మోహన్లాల్ హీరోగా ‘దృశ్యం’ వంటి సూపర్ హిట్ మూవీ అందించిన జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘దృశ్యం’ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అయిన విషయం తెలిసిందే. జీతు జోసెఫ్ తెరకెక్కించే కథలు అలా అన్ని భాషలకూ సరిపోతుంటాయి. తాజా చిత్రాన్ని మలయాళ, తమిళ భాషల్లో రూపొందించనున్నారట. నవంబరులో చిత్రీకరణ మొదలుపెట్టనున్నారని తెలిసింది. ఈ సినిమాకి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ ఫారిన్లో జరుగుతుందట. ఈజిప్ట్, యూకె, కెనడా లొకేషన్స్లో చిత్రీకరణ ప్లాన్ చేశారని మాలీవుడ్ టాక్. -
బందోబస్త్ రెడీ
‘గజిని, సూర్య సన్నాఫ్ కృష్ణన్, సింగం’ సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సూర్య నటించిన తాజా చిత్రం ‘బందోబస్త్’. సాయేషా సైగల్ కథానాయికగా నటించారు. ‘రంగం’ ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సినిమాని నిర్మాత ఎన్వీ ప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 13న ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రమిది. కమాండోగా, రైతుగా సూర్య గెటప్పులు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెంచాయి. ‘ఎన్నో తారల సంగమం... అంబరం ఒకటే...’ అంటూ సాగే దేశభక్తి గీతానికి, ‘చెరుకు ముక్కలాంటి...’ అనే మాస్ పాటకు మంచి స్పందన వచ్చింది. పాకిస్తాన్ తీరును ఎండగడుతూ ప్రధాని పాత్రలో మోహన్లాల్ చెప్పిన డైలాగ్స్, సూర్య నటన సినిమాపై అంచనాలను మరింత పెంచాయి’’ అన్నారు. ఆర్య, బొమన్ ఇరానీ, సముద్రఖని, పూర్ణ, నాగినీడు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎం.ఎస్. ప్రభు, సంగీతం: హ్యారీస్ జైరాజ్. -
సూర్య చిత్రానికి అడ్డంకులు
నటుడు సూర్య చిత్రానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. కోలీవుడ్లో కథలు కాపీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలే విజయ్ నటించిన బిగిల్ చిత్ర కథ తనదంటూ ఒక వ్యక్తి కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. తాజాగా నటుడు సూర్య కథానాయకుడిగా నటించిన కాప్పాన్ చిత్రం కథా అపహరణ ఆరోపణలను ఎదుర్కొంటోంది. కాప్పాన్ చిత్ర కథ తనదంటూ ఒక వ్యక్తి కోర్టుకెక్కాడు. వివరాలు.. సూర్య, సయోసా సైగల్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం కాప్పాన్. నటుడు ఆర్య, మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. కాగా షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో క్రోంపేటకు చెందిన జాన్ సార్లెస్ అనే వ్యక్తి కాప్పాన్ చిత్ర విడుదలపై నిషేధం విధించాలని కోరుతూ చెన్నై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. అందులో తాను 10 ఏళ్లుగా సినిమారంగంలో పని చేస్తున్నానని పేర్కొన్నాడు. పలు కథలను రాశానని తెలిపాడు. తాను సరవెడి పేరుతో రాసిక కథలో పాత్రికేయుడైన హీరో ప్రధానమంత్రిని ఇంటర్యూ చేస్తాడన్నారు. ఆ సందర్బంగా నదుల అనుసంధానం, నీటి పంపకాలు, వ్యవసాయం సంక్షేమం గురించి ప్రశ్నిస్తాడన్నాడు. ఈ కథను దర్శకుడు కేఎస్.రవికుమార్కు వినిపించానని తెలిపాడు. అదే విధంగా దర్శకుడు కేవీ.ఆనంద్కు తన కథను చెప్పాననీ, ఆయన క్షణంగా విన్నారనీ చెప్పాడు. తనకు అవకాశం కల్సిస్తానని మాట కూడా ఇచ్చారని అన్నాడు. అలాంటి సమయంలో తన సరవేడి కథను కాప్పాన్ పేరుతో సూర్య హీరోగా కేవీ.ఆనంద్ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసి దిగ్భ్రాంతికి గురైయ్యానన్నాడు. తన కథలోని సన్నివేశాలే చోటు చేసుకున్నాయని తెలిపాడు. కాబట్టి కాప్పాన్ చిత్ర విడుదలపై నిషేధం విధించాలని కోరాడు. ఈ విచారణ సోమవారం న్యాయమూర్తి కృష్ణన్రామసామి సమక్షంలో వచ్చింది. ఇరు వైపుల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. -
మెగాస్టార్ కోసం సూపర్ స్టార్!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం సైరా నరసింహారెడ్డి. చారిత్రక కథాశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ హిందీ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్. అన్ని భాషల్లో సినిమాకు హైప్ తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా తెలుగు టీజర్కు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ అందించగా మలయాళ వర్షన్కు మోహన్ లాల్ వాయిస్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మలయాళ, హిందీ వర్షన్లకు కూడా టాప్ స్టార్స్ గాత్రదానం చేయనున్నారట. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ టీజర్ ఆగస్టు 20న రిలీజ్ చేస్తున్నారు. చిరు సరసన నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలతో అమితాబ్ బచ్చన్, తమన్నా, సుధీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, రవి కిషన్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
సెప్టెంబర్ 20న సూర్య ‘బందోబస్త్’
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ ‘బందోబస్త్’. తమిళంలో ‘కాప్పాన్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాకు రంగం ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకుడు. తెలుగు ప్రేక్షకులకు నవాబ్, 2.0 చిత్రాలు అందించిన లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ తమిళ నిర్మాత సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో భారత ప్రధానిగా మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్, కీలక పాత్రలో ఆర్య, సయేషాలు నటిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నట్టు చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. బందోబస్త్ తమిళ వెర్షన్ కాప్పాన్ పాటలు ఇటీవలే సూపర్స్టార్ రజనీకాంత్ చేతుల మీదుగా విడుదల అయ్యాయి. త్వరలో తెలుగు వెర్షన్ పాటల్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. డిఫరెంట్ గెటప్పుల్లో సూర్య నటన, పాకిస్తాన్ తీరును ఎండగడుతూ మోహన్లాల్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్, కథా నేపథ్యం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుగుతోంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను భారీ రేటుకు సన్ నెట్వర్క్ సంస్థ సొంతం చేసుకుంది. -
వెనక్కి తగ్గిన సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం కాప్పాన్. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే సాహో రిలీజ్ అదే రోజంటూ ప్రకటన రావటంతో తప్పని సరి పరిస్థితుల్లో కాప్పాన్ను ఆగస్టు 30కి వాయిదా వేశారు. కానీ తరువాత సాహో కూడా వాయిదా పడింది. దీంతో కాప్పాన్ టీం మరోసారి ఆలోచనలో పడింది. అయితే ముందుగా ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రావాలని భావించినా ఇప్పుడు మనసు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. భారీ అంచనాలున్న సాహోతో పోటి పడే కన్నా రిలీజ్ వాయిదా వేస్తేనే బెటర్ అని భావిస్తున్నారట. అందుకే సెప్టెంబర్ 13 లేదా 20 తేదిల్లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాప్పాన్ వాయిదాపై ఇంకా అధికారిక ప్రకటన లేకపోయినా వాయిదా పడటం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. మలయాళ నటుడు మోహన్లాల్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై సూర్య చాలా ఆశలు పెట్టుకున్నాడు. అందుకే రిలీజ్ విషయంలో భారీ పోటి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా తెలుగులో బందోబస్త్ పేరుతో రిలీజ్ కానుంది. -
సైమాకు అతిథులుగా..!
దక్షిణాది భాషల్లో రూపొందుతున్న సినిమాలకు ఒకే వేదికపై అవార్డులను అందిస్తున్న సంస్థ సైమా(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్). ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ వేడుకలను ఈ ఏడాది ఖతర్లో నిర్వహించనున్నారు. ఆగస్టు 15న తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డులను, ఆగస్టు 16న తమిళ, మలయాళ చిత్రాలకు సంబంధించిన అవార్డులను అందించనున్నారు. ఈ వేడుకలకు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మాలీవుడ్ నుంచి కంప్లీట్ యాక్టర్ మోహన్లాల్లు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. 15న చిరు, 16న మోహన్లాల్లు సైమా వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని సైమా ప్రతినిథులు అధికారికంగా ప్రకటించారు. ఖతర్లోని దోహలో జరగనున్న ఈ వేడుకకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీల నుంచి తారలు తరలివెళ్లనున్నారు. -
మెగాఫోన్ పట్టనున్న సూపర్ స్టార్
దక్షిణాదిలో నటుడిగా టాప్ ఇమేజ్ సొంతం చేసుకున్న సూపర్ స్టార్ మోహన్లాల్. అద్భుతమైన నటనతో కంప్లీట్ యాక్టర్గా పేరు తెచ్చుకున్న మోహన్లాల్ మరో అవతారం ఎత్తేందుకు రెడీ అవుతున్నాడు. నటుడిగా ఎన్నో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మోహన్లాల్ మెగాఫోన్ పట్టనున్నారు. చాలా కాలంగా దర్శకుడిగా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్న మోహన్లాల్, సరైన కథ దొరకటంతో డైరెక్టర్గా మారే పనిలో బిజీ అయ్యారు. తొలి ప్రయత్నంగా ఓ భారీ ప్రాజెక్ట్ను ఎంచుకున్నారు. బరోజ్ పేరుతో 3డీ బహు భాషా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. వాస్కోడ గామా దగ్గర ట్రెజరర్గా పనిచేసిన బరోజ్ అనే వ్యక్తి కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. జూన్లో ఈ సినిమా సెట్స్మీదకు వెళ్లే అవకాశం ఉంది. -
ఇక్కడికి ‘గీతా ఛలో’.. అక్కడికి ‘అర్జున్ రెడ్డి’..!
ఒక హీరోకో, హీరోయిన్కో పక్క ఇండస్ట్రీలో క్రేజ్ ఏర్పడితే వాటిని క్యాష్ చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకప్పటి సినిమాలను ప్రస్తుతమున్న క్రేజ్తో జతచేసి వేరే భాషల్లో రిలీజ్ చేస్తుంటారు. అయితే ఇది ఎవరి పని అని కచ్చితంగా చెప్పలేం. దీని వెనక సదరు నిర్మాతలే ఉండొచ్చు.. లేక హీరో, హీరోయిన్లే ఉండొచ్చు. తాజాగా అలాంటి సినిమాలే డబ్బింగ్ రూపంలో దాడి చేసేందుకు రెడీ అయ్యాయి. మహానటి సినిమాతో దుల్కర్ సల్మాన్కు క్రేజ్ ఏర్పడగా.. అతడు గతంలో నటించిన రెండు (జనతా హోటల్, అతడే) సినిమాలను తెలుగులో రిలీజ్ చేశారు. అయితే ఆ సినిమాలు వచ్చినట్టుగా కూడా ఎవరికీ తెలీదు. ఇక ఇదే వరుసలో మోహన్లాల్ కూడా జనతాగ్యారేజ్తో వచ్చిన క్రేజ్ను వాడుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు ఎన్ని డబ్బింగ్ సినిమాలతో పలకరించినా.. ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోతున్నారు. తాజాగా వచ్చిన లూసిఫర్ కూడా అదే బాటలో నడుస్తోంది. ఇక టాలీవుడ్ సెన్సేషన్ స్టార్విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం లాంటి చిత్రాలతో ఇమేజ్ పెరగ్గా.. పక్క భాషలపై కన్నేశాడు. నోటా చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్తో మొత్తం దక్షిణాదిపై కన్నేశాడు. అయితే విజయ్ నటించిన ద్వారకా మూవీ ఇక్కడ తేలిపోయింది. అయితే విజయ్కు ఉన్న క్రేజ్ను అడ్డంపెట్టుకుని ద్వారకా మూవీని తమిళంలో అర్జున్ రెడ్డి పేరుతో తమిళంలోకి డబ్ చేయనున్నారు. ఛలో, గీతగోవిందం సినిమాలతో స్టార్హీరోయిన్గా మారింది కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న. ఇక రష్మికకు ఏర్పడిన ఈ క్రేజ్ను వాడుకునేందుకు అక్కడి వారు కూడా రెడీ అయ్యారు. 2017లో రష్మిక నటించిన కన్నడ చిత్రం చమక్ను.. తెలుగులో గీతా..ఛలోగా డబ్ చేస్తున్నారు. ఇలా డబ్బింగ్ చిత్రాలతో దాడి చేస్తే.. సదరు హీరోహీరోయిన్లుకు మైనస్గా మారొచ్చు. అవి హిట్ అయితే లెక్కవేరేలా ఉంటుంది కానీ.. ప్లాఫ్ అయితేనే వారి కెరీర్గ్రాఫ్పై ప్రభావం చూపొచ్చు. -
ఆ భారీ బడ్జెట్ చిత్రం ఆగిపోయింది!
మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ ప్రధాన పాత్రలో దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో మహా భారతగాథను తెరకెక్కిస్తున్నట్టుగా చాలా కాలం క్రితమే ప్రకటించారు. ప్రముఖ రచయిత ఎమ్టీ వాసుదేవన్ నాయర్ రచించిన రంధమూలం నవల ఆధారం సినిమాను రూపొందించాలని ప్లాన్ చేశారు. యూఏఈకి చెందిన వ్యాపార వేత్త బీఆర్ శెట్టి, శ్రీకుమార్ దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ను తెరకెక్కించేందుకు నిర్ణయించారు. సినిమాను తెరకెక్కించేందుకు వీలుగా నవలను మార్చి స్క్రీన్ప్లేను కూడా వాసుదేవన్ నాయరే సమకూర్చారు. అయితే సినిమా ప్రకటించి మూడేళ్లు గడుస్తున్న ఇంత వరకు సినిమా ప్రారంభించకపోవటంపై రచయిత అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కేవలం మూడేళ్లకే చేయించుకున్నారని.. అయినా తాను మరో ఏడాది పాటు ఎక్కువగా ఎదురుచూసినా షూటింగ్ పనులు ఇంకా ప్రారంభించలేదంటూ చాలా రోజుల కిందటే నాయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా నిర్మాత బీఆర్ శెట్టి అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ మహా భారతం ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా ప్రకటించారు. రచయితం దర్శకుల మధ్య వచ్చిన అభిప్రాయభేదాల కారణంగా ప్రస్తుతానికి ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా ప్రకటించారు. -
వాట్సప్తో కటీఫ్
ఇంట్లో వాళ్లు, ఫ్రెండ్స్ ఎప్పుడు టచ్లో ఉండాలన్నా.. ఆఫీస్ పనులు అన్నింటికీ టచ్లో ఉండాలన్నా సులువైన మార్గం వాట్సప్. ‘‘అన్ని పనులకు దగ్గరగా ఉంటున్న ఈ యాప్కు దూరంగా ఉంటున్నాను’’ అన్నారు మలయాళ నటుడు మోహన్లాల్. ఈ విషయం గురించి మోహన్లాల్ మాట్లాడుతూ – ‘‘ఉదయం లేవగానే ప్రేయర్ చేయడం నాకు అలవాటు. ఈ మధ్య ఫోన్ చూడటం అలవాటైంది. కొన్ని వీడియోలు, ఫొటోలు డిస్ట్రబ్ చేస్తున్నాయి. అలాగే ప్రయాణాల్లో కారు కిటికిలో నుంచి చెట్లు, బిల్డింగ్లను గమనిస్తూ ఉండేవాణ్ణి. కానీ ఇప్పుడు ఫోన్లోనే ఉంటున్నాను. ఎయిర్పోర్ట్లో కొత్త స్నేహితులను కలవడం, వాళ్లతో కబుర్లు చెప్పడం వంటి వాటికి ఫుల్స్టాప్ పడింది. అందుకే వాట్సప్కు బైబై చెప్పాను. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఉదయాన్నే మళ్లీ న్యూస్పేపర్తో రోజుని మొదలుపెడుతున్నాను. సగం చదివిన పుస్తకాల్ని పూర్తి చేస్తున్నాను. నా ఆలోచనల్ని విశ్లేషించుకోవడానికి చాలా సమయం దొరుకుతోంది. పనిలో ఉన్నప్పుడు కొన్ని వీడియోలు నెగటివ్ ఇంపాక్ట్ చూపించేవి. అలాగే ప్రేమను పంచుకోవడానికి మెయిల్స్ కూడా ఉన్నాయి. వాట్సప్కి దూరంగా ఉండమని నాతో ఎవరూ అనలేదు. మిగతా వాళ్లను కూడా అలా చేయమని అనడం లేదు’’ అని పేర్కొన్నారాయన. ప్రస్తుతం ‘మరక్కార్’ అనే పీరియాడికల్ భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు మోహన్లాల్. -
స్టార్ హీరోకు ‘పద్మ’ అవార్డుపై సెటైర్లు
న్యూఢిల్లీ: మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించడంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొంతమంది ఆయనను అభినందిస్తుంటే, మరికొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసినందుకు ‘ఫలితం’ దక్కిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని నెలల క్రితం మోదీని మోహన్లాల్ కలిశారు. తాను నిర్వహిస్తున్న సేవా సంస్థ విశ్వశాంతి ఫౌండేషన్ కార్యక్రమాల కోసం ప్రధానమంత్రిని కలిసినట్టు అప్పట్లో ఆయన చెప్పారు. సానుకూలంగా తమ భేటీ జరిగిందన్నారు. ‘సానుకూల సమావేశం వృధాగా పోలేదు. పద్మభూషణ్ పురస్కారం తెచ్చిపెట్టింద’ని నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్పై పోటీ చేయాలని చూస్తున్న గౌతమ్ గంభీర్, మోహన్లాల్ పద్మపురస్కారాలు దక్కించుకున్నారని మరొకరు వ్యాఖ్యానించారు. 40 ఏళ్లుగా సినిమాల్లో కొనసాగుతున్న మోహన్లాల్ నటనకు స్వస్తిచెప్పి కేరళ ప్రజలకు సేవ చేయాలని సూచించారు. కాగా, తనకు దక్కిన పద్మభూషణ్ పురస్కారాన్ని తనను అభిమానించే వారికి అంకితం చేస్తున్నట్టు మోహన్లాల్ ప్రకటించారు. #Mohanlal and #GautamGambir Awarded with #Padmabhusan And #Padmashri both are waiting for ticket to contest in upcoming election 2019 for #BJP Lightsonmedia New Cable Sankar Suresh Eav — sundhara krishna (@sundhartrader) January 27, 2019 His positive energy trip was not wasted!#mohanlal #PadmaAwards2019 @VTBALRAM pic.twitter.com/YBEP4t5dnr — Mohammed Rafeeq Thalangara (@MrqThalangara) January 27, 2019 Sir I reckon u met hon'ble PM just few months back... Sir congrats the meeting didn't go invain.. pic.twitter.com/tXnzJr6VBI — Arif shaikh (@Arifshaikh1910) 26 January 2019 Is it true 40 years??... Really??..When u gonna stop acting romance in movie.. sometime its look ugly both u and mammooka.... now time to serve people of kerala who hardly find their food everyday... — Fazal (@Fazalvellur) 26 January 2019 -
నాతో ప్రయాణించినవాళ్లకు ప్రేమతో...
మలయాళ సూపర్ స్టార్, ఫ్యాన్స్ అభిమానంగా పిలుచుకునే ‘కంప్లీట్ యాక్టర్’ మోహన్లాల్కు శుక్రవారం కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ గౌరవాన్ని తనతో ప్రయాణం చేసినవాళ్లందరకు పంచారాయన. ‘‘నాది 40 ఏళ్ళ సుదీర్ఘ సినిమా ప్రయాణం. ఈ ప్రయాణంలో కొన్నివేల మంది శ్రేయోభిలాషులను నా దారిలో కలిశాను. సెట్లో లైట్బాయ్ కావచ్చు, మా పక్కనే యాక్ట్ చేసిన ధృవతారలు కావచ్చు. మమ్మల్ని తెర మీద చూసి అభిమానించిన ప్రేక్షకులు కావచ్చు. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి కృషి చేసే ప్రయత్నంలో వాళ్ల ప్రేమాభిమానాలే మాకు ఉత్సాహాన్నిచ్చే మంత్రాలయ్యాయి. ఈ పురస్కారాన్ని నాకు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఇదో ఆశీర్వాదంలా భావిస్తున్నా. నాతో ప్రయాణం చేసిన వాళ్లందరికీ ప్రేమతో ఈ అభినందనను అంకితమిస్తున్నాను. ఈ గౌరవం, గుర్తింపునకు చాలా సంతోషిస్తున్నాను. ఈ ప్రయాణంలో నాతో భాగమైన వారందరికీ కృతజ్ఞుడిని’’ అని పేర్కొన్నారు మోహన్లాల్. -
లవ్ యు అచ్చా
అచ్చా.. అంటే హిందీలో బాగుంది అని అర్థం. మరి లవ్ యు అచ్చా అంటే.. లయ్ యు నాన్నా అని అర్థం. అచ్చా అంటే నాన్న. పూర్తిగా చెప్పాలంటే ‘అచ్చన్’. మనం నాన్న అని పిలిచినట్లు మలయాళంలో ‘అచ్చన్’ అని పిలుస్తారు. గారాబం ఎక్కువైతే ‘అచ్చా’ అని పిలుస్తారు. ఇప్పుడు ‘హలో’ ఫేమ్ కల్యాణీ ప్రియదర్శన్ తన తండ్రి, దర్శకుడు ప్రియదర్శన్ని ‘లవ్ యు అచ్చా’ అన్నారు. ఎందుకంటే తండ్రి డైరెక్షన్లో వర్క్ చేసినందుకు ఆమె∙ఫుల్ ఖుషీ అవుతున్నారు. మోహన్లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘మరక్కార్: అరబికడలింటే సింహమ్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 16వ శతాబ్దం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో సునీల్ శెట్టి, అర్జున్, ప్రణవ్ మోహన్లాల్, కీర్తీ సురేష్, కల్యాణీ ప్రియదర్శన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో తన వంతు షూటింగ్ను పూర్తి చేశారు కల్యాణీ ప్రియదర్శన్. ‘‘నాన్నగారితో వర్క్ చేస్తానని రెండేళ్ల క్రితం ఊహించలేదు. కానీ నిజమైంది. ‘అమ్మూ... నువ్వు సరిగా చేయడం లేదని ఈ సినిమా ఫస్ట్ డే షూట్లో నాన్నగారు సెట్లో నాపై అరిచినప్పుడు కాస్త నెర్వస్గా ఫీలయ్యా. ఆ తర్వాత సూపర్బ్.. బాగా చేశావ్’ అన్నప్పుడు నాకు అమితానందం కలిగింది. లవ్ యు అచ్చా. ఈ సినిమాలో నా భాగస్వామ్యం ఉన్నందుకు సంతోషంగా ఉంది’’ అని కల్యాణీ ప్రియదర్శన్ పేర్కొన్నారు. ‘‘మా అమ్మాయిని నేను డైరెక్ట్ చేస్తానని అనుకోలేదు. అయితే తనతో సినిమా చేశాను. చాలా ఆనందంగా ఉంది’’ అని ప్రియదర్శన్ అన్నారు. ఇందులో యంగ్ మోహన్లాల్ పాత్రలో ఆయన కొడుకు ప్రణవ్ మోహన్లాల్ కనిపిస్తారు. వందకోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజవుతుంది. లొకేషన్లో తండ్రి ప్రియదర్శన్తో కల్యాణి -
లవ్ యు అచ్చా
అచ్చా.. అంటే హిందీలో బాగుంది అని అర్థం. మరి లవ్ యు అచ్చా అంటే.. లయ్ యు నాన్నా అని అర్థం. అచ్చా అంటే నాన్న. పూర్తిగా చెప్పాలంటే ‘అచ్చన్’. మనం నాన్న అని పిలిచినట్లు మలయాళంలో ‘అచ్చన్’ అని పిలుస్తారు. గారాబం ఎక్కువైతే ‘అచ్చా’ అని పిలుస్తారు. ఇప్పుడు ‘హలో’ ఫేమ్ కల్యాణీ ప్రియదర్శన్ తన తండ్రి, దర్శకుడు ప్రియదర్శన్ని ‘లవ్ యు అచ్చా’ అన్నారు. ఎందుకంటే తండ్రి డైరెక్షన్లో వర్క్ చేసినందుకు ఆమె∙ఫుల్ ఖుషీ అవుతున్నారు. మోహన్లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘మరక్కార్: అరబికడలింటే సింహమ్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 16వ శతాబ్దం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో సునీల్ శెట్టి, అర్జున్, ప్రణవ్ మోహన్లాల్, కీర్తీ సురేష్, కల్యాణీ ప్రియదర్శన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో తన వంతు షూటింగ్ను పూర్తి చేశారు కల్యాణీ ప్రియదర్శన్. ‘‘నాన్నగారితో వర్క్ చేస్తానని రెండేళ్ల క్రితం ఊహించలేదు. కానీ నిజమైంది. ‘అమ్మూ... నువ్వు సరిగా చేయడం లేదని ఈ సినిమా ఫస్ట్ డే షూట్లో నాన్నగారు సెట్లో నాపై అరిచినప్పుడు కాస్త నెర్వస్గా ఫీలయ్యా. ఆ తర్వాత సూపర్బ్.. బాగా చేశావ్’ అన్నప్పుడు నాకు అమితానందం కలిగింది. లవ్ యు అచ్చా. ఈ సినిమాలో నా భాగస్వామ్యం ఉన్నందుకు సంతోషంగా ఉంది’’ అని కల్యాణీ ప్రియదర్శన్ పేర్కొన్నారు. ‘‘మా అమ్మాయిని నేను డైరెక్ట్ చేస్తానని అనుకోలేదు. అయితే తనతో సినిమా చేశాను. చాలా ఆనందంగా ఉంది’’ అని ప్రియదర్శన్ అన్నారు. ఇందులో యంగ్ మోహన్లాల్ పాత్రలో ఆయన కొడుకు ప్రణవ్ మోహన్లాల్ కనిపిస్తారు. వందకోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజవుతుంది. లొకేషన్లో తండ్రి ప్రియదర్శన్తో కల్యాణి -
మాకో టైటిల్ పెట్టండి
సూర్య ఫ్యాన్స్కు భలే చాన్స్ ఇచ్చారు దర్శకుడు కేవీ ఆనంద్. సూర్యతో ఈ దర్శకుడు ఓ స్టైలిష్ థ్రిల్లర్ రూపొందిస్తున్నారు. కథానుసారంగా ఆ చిత్రానికి మూడు టైటిల్స్ను అనుకున్నారు చిత్రబృందం. అయితే ఏది ఫిక్స్ చేయాలో అర్థం కాలేదు. దాంతో నిర్ణయాన్ని అభిమానులకే వదిలేశారు. ‘‘మేం మూడు టైటిల్స్ అనుకున్నాం. అందులో ఏ టైటిల్ బావుంటుందో చెప్పండి’’ అంటూ ‘మీట్పాన్, కాప్పాన్, ఉయిర్కా’.. ఈ మూడు టైటిల్స్ను పెట్టి ఓ పోల్ నిర్వహించారు. ఆ మూడు టైటిల్స్ అర్థం దగ్గరదగ్గరగా ఒకటే. కాపాడటం, రక్షించడం అనే అర్థాలు వస్తాయి. ఫస్ట్ రెండు టైటిల్స్ కంటే మూడో టైటిల్ విభిన్నంగా ఉందని ‘ఉయిర్కా’ అనే టైటిల్కు ఎక్కువ ఓట్లు వేశారు. మరి ఫైనల్గా చిత్రబృందం ఏ టైటిల్ ఫిక్స్ చేస్తుందో చూడాలి. జనవరి 1న టైటిల్ను అనౌన్స్ చేయనున్నారు. ఇందులో సూర్య రక్షణ శాఖ అధికారిగా కనిపిస్తారు. సయేషా కథానాయిక. మోహన్లాల్ ముఖ్య పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ఆర్య విలన్గా నటిస్తున్నారు. వచ్చే ఏడాదిలో రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. -
నిప్పులాంటివాడు
మోహన్లాల్, నిఖిత, షీలు అబ్రహాం ముఖ్య తారలుగా ఎం. పద్మకుమార్ దర్శకత్వంలో రూపొందిన మలయాళ చిత్రం ‘కనల్’. ఇప్పుడీ చిత్రం ‘మహా పల్లవ’ అనే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. కె.వి.ఎస్ మూవీస్ పతాకంపై కల్లూరు సుబ్బయ్య సమర్పణలో కల్లూరు శేఖర్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ– ‘‘కనల్’ అంటే నిప్పులాంటివాడు, నిజాయితీపరుడు అని అర్థం. కొందరు సంఘవిద్రోహ శక్తుల ఆటను ఓ వ్యక్తి ఎలా ముగించాడన్నదే ఈ చిత్రకథ. రాజస్థాన్లోని థార్ ఎడారి, దుబాయ్, అమెరికా లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. ఇందులో ఐదు పాటలు, మూడు ఫైట్లు ఉన్నాయి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయాలనుకుంటున్నాం. మలయాళంలో పెద్ద విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని అన్నారు. -
2020లో మరాక్కర్
సముద్రయానం చేస్తున్నారు మోహన్లాల్. రీసెంట్గా ఆయన హీరోగా నటించిన ‘ఒడియన్’ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది కదా. అందుకే హాయిగా హాలీడేని ఎంజాయ్ చేస్తున్నారేమో? అని అనుకుంటే పొరపాటే. ఆయన సముద్రయానం చేస్తోంది ‘మరాక్కర్: అరబికడల్లింటే సింహం’ అనే సినిమా కోసం. ఈ సినిమాకు మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. 16వ శతాబ్దంలో భారతీయ సముద్రతీరంలో కాలికట్ రాజు జామెరిన్కు, పోర్చగీసు వారికి యుద్ధం జరిగింది (ఇప్పటి కేరళ పాత్రం). ఈ వార్లో ఓ కీలక పాత్ర వహించిన ముస్లిం నేవల్ చీఫ్ కుంజలి మరక్కార్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతుందని మాలీవుడ్ సమాచారం. సునీల్ శెట్టి, అర్జున్, ముఖేష్, కీర్తీ సురేష్, కల్యాణి ప్రియదర్శన్ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాను దాదాపు వంద కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ కోసం దాదాపు అరడజను సెట్లను ప్రిపేర్ చేశారు ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్. ప్రస్తుతం హైదరాబాద్లో ఓ ప్రముఖ స్టూడియోలో వేసిన సెట్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని సమాచారం. తాజాగా ఈ సినిమాలో తన లుక్ను రివీల్ చేశారు మోహన్లాల్. ఈ సినిమా 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అప్పుడు జింకలా మారతా!
మోహన్లాల్... నటుడిగా 41 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. వయసేమో 58కి పైనే. పాత్ర ప్రేమగా అడిగితే పాతికేళ్ల యువకుడిగానూ మారిపోతారు. భాష తెలియదంటే నేర్చుకుని మరీ నటిస్తారు. అభిమానులు అభిమానంగా ‘కంప్లీట్ యాక్టర్’ అని పిలుచుకుంటారు. నా సినిమాలు, నా దర్శకులే ఆ కంప్లీట్నెస్కి కారణం అని మోహన్లాల్ అంటారు. మోహన్లాల్ హీరోగా వీఏ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఒడియన్’. ప్రకాష్రాజ్, మంజు వారియర్ కీలక పాత్రలు చేసిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా మోహన్లాల్ పంచుకున్న పలు విశేషాలు.... ► ‘ఒడియన్’ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తోంది? కేరళ నుంచి మంచి స్పందన వస్తోంది. మంచి ఒపెనింగ్స్ వస్తున్నాయి. హైదరాబాద్లో కూడా వస్తోందని అనుకుంటున్నాను. ఒక నటుడిగా సంతృప్తినిచ్చిన సినిమా ఇది. ► శ్రీకుమార్మీనన్కు దర్శకునిగా పెద్దగా అనుభవం లేదు. ఆయన ఇంత పెద్ద సినిమాను తీయగలరని ఎలా నమ్మారు? శ్రీకుమార్ మీనన్ ఫీచర్ ఫిల్మ్ ఏదీ తీయకపోయినా అతను చాలా యాడ్ ఫిల్మ్స్ చేశాడు. నాతో కూడా కొన్ని యాడ్స్ చేశాడు. తను చేయగలడనే నమ్మకంతోనే ఈ సినిమా చేశాను. ► ‘ఒడియన్’ కోసం ఎలాంటి పరిశోధన చేశారు? ప్రత్యేకంగా ఏ పరిశోధన చేయలేదు. కానీ సినిమా కోసం కష్టపడ్డాం. కాన్సెప్ట్ గురించి బాగా ఆలోచించాం. ఇది యాక్షన్ సినిమా కాదు. ఎమోషనల్ సినిమా. స్పిరిచ్యువల్ డెస్టినేషన్ ఉంది. ఎద్దు, పులి.. ఇలా ఎలా కావాలంటే ఆ విధంగా మారిపోయే శక్తులు ఉన్న ఒడియన్ అనే వ్యక్తి కథ. ► సినిమాలో ఎలా కావాలనుకుంటే అలా మారిపోతారు. ఒకవేళ నిజంగా అలా మారిపోవాలనుకుంటే? (నవ్వేస్తూ).. సినిమాలో చేసినట్టు మారే విషయం గురించి నేను ఆలోచించలేదు. అది మిలియన్ డాలర్ ప్రశ్న. (కాసేపు మౌనం) జింకలా మారతాను. ► నటుడిగా 41 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నారు. ఇంత సుదీర్ఘ కెరీర్కు ఇన్స్పిరేషన్ ఏంటి? ఇంత సుదీర్ఘ ప్రయాణం ఆశీర్వాదం అని నమ్ముతాను. నేను ఇలా చేశాను. అలా చేశాను.. దాని వల్లే ఇలా కొనసాగుతున్నాను అనుకోను. మంచి పాత్రలు లభించాయి. మంచి దర్శకులతో పని చేశాను. ఇవన్నీ నన్ను నిలబెట్టాయి. ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకు, ఇండస్ట్రీకు థ్యాంక్స్. ► ఈ ఏజ్లో కూడా యాక్షన్ సినిమాలు చేస్తున్నారు? రిస్క్ అనిపించడంలేదా? యాక్షన్ సినిమాలంటే నాకు ఇష్టం. నా కెరీర్లో ఎన్నో యాక్షన్ సినిమాలు చేశాను. రీసెంట్గా ‘పులిమురుగన్’ (తెలుగులో ‘మన్యంపులి’) చేశాను. అందులో పులులతో యాక్షన్ ఉంటుంది. ‘ఒడియన్’ క్యారెక్టర్ యాక్షన్ సన్నివేశాలను చేసి తీరాలి.. లేదా సినిమా చేయలేనని చెప్పాలి. యాక్షన్ సినిమాలు నేను చేయలేను అని నాకు అనిపించినప్పుడు తప్పకుండా ఆపేస్తాను. కానీ ఇప్పుడు చేయగలనన్న నమ్మకం ఉంది. సో.. చేస్తూనే ఉంటాను. ► ఈ మధ్య భాషా బేధాలు తొలగిపోయాయి అనిపిస్తోంది. అన్ని భాషల సినిమాలను అందరూ చూస్తున్నారు... కేరళలో ఇతర భాషల సినిమాలకు ఆదరణ ఉంది. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్స్ కూడా పెరిగాయి. నా కెరీర్ స్టార్టింగ్లో కేరళలో ఇతర భాషల సినిమాలు కూడా అనువాదం అయి విడుదలయ్యేవి. చిరంజీవిగారి సినిమాలు వచ్చేవి. బాగా ఆడేవి. ఈ మధ్య ఆ హద్దులు పూర్తిగా తొలగిపోయాయి అనిపిస్తోంది. ► తెలియని భాషలో నటించనని కొన్ని సందర్భాల్లో చెప్పారు. తెలుగులో నటిస్తున్నారు కదా? అవును. ఇప్పుడు తెలుగులో సినిమా చేస్తున్నప్పుడు తెలుగు భాష పై కమాండ్ ఉంటే నటించడం సులభంగా ఉంటుంది. కొంచెం ఫ్రీగా ఉంటుంది. క్యారెక్టర్పై కమాండ్ కూడా వస్తుంది. యాక్ట్ చేసేటప్పుడు ట్రైనింగ్ తీసుకుంటాం కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ అనిపించదు. ఇప్పుడు మాట్లాడమంటే మలయాళంలో అనర్గళంగా మాట్లాడతాను. కానీ తెలుగులో సినిమా చేసేప్పుడు డైలాగ్లు మాత్రమే చెప్పగలం. అంతవరకూ అయినా కమాండ్ ఉంది కాబట్టే చేస్తున్నాను. ► ఇటీవల మీరు వరుసగా హిస్టారికల్ బ్యాక్డ్రాప్ సినిమాలు చేస్తున్నట్లున్నారు? ప్లాన్ చేయలేదు. అలా జరుగుతున్నాయి అంతే. అయినా ‘ఒడియన్’ హిస్టారికల్ ఫిల్మ్ కాదు. నివిన్ పౌలితో ‘కాయమ్కులమ్ కొచ్చిన్’ సినిమా చేశాను. అది హిస్టారికల్ మూవీ. ఇప్పుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘మరాక్కర్’ అనే హిస్టారికల్ మూవీ. చేస్తున్నాను. ► ఆర్టిస్టుల దాహం తీరదంటారు. మీ ఫ్యాన్స్ అంతా మిమ్మల్ని ‘కంప్లీట్ యాక్టర్’ అని సంబోధిస్తారు. మిమ్మల్ని మీరు కంప్లీట్ యాక్టర్గా భావిస్తారా? కంప్లీట్ యాక్టర్ అనేది ఫ్యాన్స్ పిలుచుకునేది. అలాంటి బిరుదులు ఇచ్చేశారని పరిపూర్ణంగా అయిపోయాం అనుకోకూడదు. లక్కీగా నాకు మంచి పాత్రలు వస్తున్నాయి. దర్శకులు నా కోసం అలాంటి పాత్రలు ఇస్తుండటాన్ని బ్లెసింగ్గా భావిస్తున్నాను. ప్రేక్షకులు ఆదరించే ఆసక్తికరమైన సినిమాలు చేస్తున్నప్పుడు పేర్లు అవే వస్తాయి. నాకు ఫలానా పాత్రలు కావాలనుకుంటే రావు. వచ్చిన పాత్రలనే బాగా చేస్తున్నాను అంతే. ► ఈ వయసులోనూ స్పీడ్గా సినిమాలు చేస్తున్నారు? ఒక సినిమాను కంప్లీట్ చేసిన వెంటనే ఇంకో సినిమాను స్టార్ట్ చేస్తున్నాను. సినిమాలను ప్రేమిస్తాను. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. నేను వర్క్హాలిక్ని (అతిగా పని చేసే వ్యక్తి) సెట్లో సీన్ ఎంత ఆలస్యం అయినా వెయిట్ చేయాలి. ఒక నటుడిగా దర్శక–నిర్మాతలకు మనం ఇచ్చే గౌరవం అది. నా వర్క్ని ఎంజాయ్ చేస్తాను. నీ పనిని నువ్వు ప్రేమించనప్పుడు అందులో ఎక్కువకాలం ఎలా కొనసాగుతావు? పనిని ఎంజాయ్ చేయలేకపోతున్నాను అని అనిపించినప్పుడు చేయకపోవడమే మంచిది. ► టాలీవుడ్తో మీకు ఉన్న అనుబంధం? ‘గాంఢీవం’ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేశాను. ఎన్టీఆర్తో ‘జనతా గ్యారేజ్’ చేశాను. ‘మనమంతా’ చేశాను. నా సినిమాలు కొన్ని తెలుగులో డబ్ అవుతుంటాయి. అలాగే కొన్ని సినిమాలను రీమేక్ చేశారు. మోహన్బాబు, చిరంజీవిలతో మంచి రిలేషన్ ఉంది. వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఇంకొందరితో మంచి స్నేహం ఉంది. ► ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలు పెరుగుతున్నాయి. వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? హాలీవుడ్ సినిమాలు చూస్తుంటాం. ఎందుకు? భారీ బడ్జెట్, భారీ కాన్వాస్, లార్జర్ దాన్ లైఫ్లా ఆ సినిమాలు ఉంటాయని. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దొరుకుతుంది. మంచి మార్కెట్ క్రియేట్ అవుతంది. ఆ విషయాన్ని ‘బాహుబలి’ నిరూపించింది. ఇప్పుడు ‘మరాక్కర్’ అనే చిత్రం చేస్తున్నాం. బిగ్ బడ్జెట్ సినిమాలు తప్పనిసరిగా రావాలి. అవకాశం, సామర్థ్యం ఉన్నప్పుడు చేయడంలో తప్పు లేదు. ► మీ తనయుడు ప్రణవ్ మోహన్లాల్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు.. ప్రణవ్ చైల్డ్ ఆర్టిస్టుగా కూడా చేశాడు. ఫస్ట్ సినిమా ‘ఆది’లో హీరోగా బాగా నటించాడు. మంచి హిట్ అయింది. ఇప్పుడు రెండో సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. ‘మరాక్కర్’లో నా చిన్ననాటి పాత్ర చేస్తున్నాడు. అయితే సినిమాల్లో కొనసాగలని ప్రణవ్ ఇంకా నిర్ణయించుకోలేదు. ఇంకో 3,4 సినిమాలు చేసి ఒక నిర్ణయానికి వస్తాడేమో. ► మమ్ముట్టి, మీ మధ్య ఎలాంటి అనుబంధం ఉంది? మేము మంచి మిత్రులం. ఇద్దరం కలిసి దాదాపు 54 సినిమాలు చేశాం. ‘ఒడియన్’ చిత్రానికి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారాయన. ► మాలీవుడ్ యంగ్ హీరోలు (దుల్కర్ సల్మాన్, నివిన్ పౌలి) కూడా తెలుగులో ఫ్యాన్స్ సంపాదించుకోవడంపై మీ ఒపీనియన్? మంచి మంచి పాత్రలు చేస్తూ వాళ్లను వారు నిరూపించుకుంటున్నారు. వారికి మరిన్ని ఆసక్తికరమైన పాత్రలు రావాలని నేనూ కోరుకుంటున్నాను. ► ప్రస్తుతం మలయాళంలో ‘అమ్మ’ అసోసియేషన్లో నటుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దాని గురించి... అక్కడ ఏం జరిగిందో బయట వాళ్ళకు పూర్తిగా అవగాహన లేదు. అందుకే దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఒడియన్లో.. -
ఆయన అలా మాట్లాడకూడదు
‘మీటూ’ ఓ ఫ్యాషన్ లాంటిది. ఎక్కువ కాలం నిలబడదు’ అనే వ్యాఖ్యలు చేశారు మోహన్లాల్. అయితే ప్రకాశ్రాజ్ ఈ స్టేట్మెంట్తో ఏకీభవించలేదు. ‘‘మోహన్లాల్ ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడి ఉంటారని నేను అనుకోను. ఆయన చాలా సున్నితమైన వ్యక్తి. కానీ ఇలాంటి విషయాలు మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాంటి స్థాయి వ్యక్తి నుంచి సొసైటీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది’’ అన్నారు. మీటూ గురించి మాట్లాడుతూ– ‘‘ఇలాంటి ఉద్యమాలు స్త్రీలను మరింత ధైర్యవంతులను చేస్తాయి. సాధికారత వైపు నడిచేలా చేస్తాయి. చాలా మంది, నాతో సహా ఏదో ఒక సమయంలో స్త్రీలపై తెలిసో, తెలియకో దాడి చేసి ఉండొచ్చు. స్త్రీలు లైంగిక వేధింపులకు గురైనప్పుడు మౌనంగా ఉన్నారంటే తప్పు చేసిన వాళ్లను ప్రోత్సహించినట్టే. ఈ విషయంలో వాళ్లు పడుతున్న బాధ నిజమైంది. మనం గుడ్డివాళ్లలాగా ప్రవర్తించొద్దు. ‘మీటూ’ లాంటి ఉద్యమాల్లోని లోతుని అర్థం చేసుకోవాలి’’ అని పేర్కొన్నారు. -
గ్రహాంతరవాసులై ఉంటారు
‘‘మీటూ ఓ ఫ్యాషన్. ఇది ఎక్కువ కాలం నిలబడదు’’ అని ఇటీవలే మలయాళ నటుడు మోహన్లాల్ కామెంట్ చేశారు. మోహన్లాల్ పేరుని ప్రస్తావించకపోయినా ఆయన వ్యాఖ్యలకు స్పందించినట్లుగా నటి రేవతి చేసిన ఓ ట్వీట్ స్పష్టం చేస్తోంది. ‘‘మీటూ ఓ ఫ్యాషన్ అంటూ ఓ పాపులర్ యాక్టర్ సంబోధించారు. అలాంటి వాళ్లలో సున్నితత్వం ఎలా తీసుకురాగలం? దర్శకురాలు అంజలీ మీనన్ చెప్పినట్టు ‘వేధింపులకు గురి అవ్వడం ఎలా ఉం టుందో వాళ్లకేం తెలుసు? బహుశా వాళ్లంతా గ్రహాంతరవాసులు అయ్యుండొచ్చు. జరిగిన చేదు అనుభవాలు బయటకు చెప్పడానికి ఎంత ధైర్యం కావాలో వాళ్లకు తెలియదు. అది ఎలాంటి మార్పు తీసుకొస్తుందో కూడా వాళ్లకు తెలియదు కదా’’ అని ట్వీట్ చేశారు రేవతి. మలయాళ నటి భావనపై జరిగిన లైంగిక దాడిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దిలీప్ను మళ్లీ అమ్మ (అసోసియేషన్ ఫర్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్)లో సభ్యుడిగా తీసుకున్నారని నటి రేవతి, పార్వతి, రీమా కళ్లింగల్ మరికొందరు ప్రశ్నించారు. ఆ తర్వాత వీళ్లంతా కలిసి డబ్ల్యూసీసీ (ఉమెన్ ఇన్ సినిమా కలెక్టీవ్) ఏర్పాటు చేసి ఇండస్ట్రీలో స్త్రీల సంరక్షణ, వివక్ష లేని వాతావరణం కోసం పోరాటం చేస్తున్నారు. -
మీటూ ఫ్యాషన్ అయిపోయింది
‘మీటూ’ ఉద్యమానికి చాలామంది నటీనటులు మద్దతు తెలుపుతుంటే మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ మాత్రం ‘మీటూ’ను మూణ్ణాళ్ల ముచ్చటగా సంబోధించారు. దుబాయ్లో జరగబోయే మలయాళ యాక్టర్స్ ఛారిటీ ఈవెంట్ గురించి మాట్లాడటానికి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్’ (అమ్మ) ప్రెసిడెంట్గా మోహన్లాల్ ‘మీటూ’ గురించి మాట్లాడారు. ‘‘మలయాళ ఇండస్ట్రీలో ఎటువంటి సమస్యా లేదు. లైంగిక వేధింపులు ఎక్కడైనా జరుగుతాయి. కేవలం సినిమా ఇండస్ట్రీలో అని అనుకోవడం కరెక్ట్ కాదు. అయినా ‘మీటూ’ అనేది ఓ ఫ్యాషన్లా తయారైంది. ఇలాంటివి ఎక్కువ కాలం నిలబడలేవు. కేవలం మూణ్ణాళ్ల ముచ్చట అవుతాయి. అయినా ‘మీటూ’ మీద నేను కామెంట్ చేయలేను. దాన్ని అనుభవిస్తేగాని మాట్లాడకూడదు’’ అని పేర్కొన్నారు. అలాగే లైంగిక వేధింపులు ఎదుర్కొన్న నటుడు దిలీప్ ఈ వేడుకలకు హాజరవుతారా? అని అడగ్గా – ‘‘దిలీప్ ‘అమ్మ’లో సభ్యుడు కాదు కాబట్టి హాజరుకారు’ అని సమాధానం ఇచ్చారు. -
వయసు తగ్గింది...
అదేంటీ? ఎవరికైనా వయసు పెరుగుతుంది కానీ తగ్గడమేంటి? అనేగా మీ డౌట్. మోహన్లాల్ అక్కడ. పాత్రకు తగ్గ వయసుకి మారిపోతుంటారాయన. తాజాగా ‘ఒడియన్’ సినిమా కోసం 55 సంవత్సరాల మోహన్లాల్ 35 సంవత్సరాల యువకునిలా కనిపించేలా శరీరాన్ని మార్చుకొని నటించడం విశేషం. శ్రీ కుమార్ మీనన్ దర్శకత్వంలో మోహన్లాల్ లీడ్ రోల్లో నటించిన మలయాళ చిత్రం ‘ఒడియన్’. ఈ చిత్రం తెలుగు హక్కుల్ని దగ్గుపాటి అభిరామ్, సంపత్ కుమార్ సొంతం చేసుకున్నారు. మలయాళం, తెలుగు భాషల్లో డిసెంబర్ 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం ఫస్ట్లుక్ని డైరెక్టర్ వీవీ వినాయక్ రిలీజ్ చేసి, చిత్ర యూనిట్ను అభినందించారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మోహన్లాల్గారి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెట్టించిన ఉత్సాహంతో ఆయన నటిస్తున్న ‘ఒడియన్’ చిత్రం తెలుగు హక్కుల్ని మా దగ్గుబాటి క్రియేషన్స్ సొంతం చేసుకుంది. శ్రీ కుమార్ మీనన్గారు ఆయన్ని 35ఏళ్ల వైవిధ్యమైన పాత్రలో చూపించనున్నారు. పీటర్ హెయిన్స్ యాక్షన్, అద్భుతమైన గ్రాఫిక్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి’’ అన్నారు. -
మాట సాయం
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, తెలుగు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ మోహన్ లాల్ ‘ఒడియన్’ సినిమాకు మాట సాయం చేయనున్నారని టాక్. మోహన్లాల్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన భారీ బడ్జెట్ పీరియాడికల్ చిత్రం ‘ఒడియన్’. కేరళలోని పూర్వకాలంలో నివసించిన ఒడియన్ల తెగకు సంబంధించిన వ్యక్తి ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. ఇందులో మోహన్లాల్ వివిధ గెటప్స్లో కనిపిస్తారు. దానికోసం ఫిజికల్గా చాలా కష్టపడ్డారు కూడా. యంగ్ లుక్లో కనిపించడానికి సుమారు 18 కిలోలకు పైగా బరవు తగ్గారాయన. వీఏ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాను దక్షిణాది భాషలన్నింట్లో రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. దాంతో ఆయా భాషల హీరోలతో వాయిస్ ఓవర్ చెప్పించి, క్రేజ్ తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. తమిళంలో ఈ చిత్రం పరిచయ డైలాగ్స్ను రజనీకాంత్ చెబుతారట. అలాగే తెలుగులో ఈ సినిమాకు సంబంధించిన వాయిస్ ఓవర్ ఎన్టీఆర్ అందిస్తారని టాక్. ఆల్రెడీ ఎన్టీఆర్, మోహన్లాల్ కలసి ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సమయంలో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అందుకే అడిగితే కాదనకుండా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెబుతారని ఊహించవచ్చు. -
తెలుగులో తారక్.. తమిళ్లో రజనీ
మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఓడియన్. డిఫరెంట్ కాన్సప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. జిల్లా, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలతో సౌత్ స్టార్గా ఎదిగి మోహన్లాల్ ఇప్పుడు తన సినిమాలన్నింటినీ తెలుగు, తమిళ్లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. డిసెంబర్లో రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా కు తెలుగులో ఎన్టీఆర్, తమిళ్లో రజనీకాంత్లు వాయిస్ అందించనున్నట్టుగా తెలుస్తోంది. పగలు ఒకలా రాత్రి ఒకలా ప్రవర్తించే వ్యక్తికథతో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రకాజ్ రాజ్, మంజు వారియర్, ఇన్నేసెంట్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
చిక్కుల్లో 1000 కోట్ల ‘మహాభారతం’
మహాభారతగాథని వెండితెరకెక్కించేందుకు చాలా మంది ఫిలిం మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. టాలీవుడ్లో రాజమౌళి, బాలీవుడ్ నుంచి ఆమిర్ ఖాన్, మాలీవుడ్ నుంచి మోహన్లాల్ ఇలా చాలా మందే ఈ ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే వీటితో అధికారికంగా ప్రకటించిన సినిమా మాత్రం ఒక్క మోహన్లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మహాభారతం మాత్రమే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా అటకెక్కినట్టుగా తెలుస్తోంది. ప్రముఖ వ్యాపార వేత్త బీఆర్ శెట్టి 1000 కోట్ల బడ్జెట్తో శ్రీకుమార్ దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ను తెరకెక్కించేందుకు నిర్ణయించారు. ప్రముఖ రచయిత ఎమ్టీ వాసుదేవన్ నాయర్ రచించిన రంధమూలం నవల ఆధారం సినిమాను రూపొందించాలని ప్లాన్ చేశారు. అందుకు కావాల్సిన స్క్రీన్ప్లేను కూడా వాసుదేవన్ నాయరే సమకూర్చారు. అయితే నాలుగేళ్లు గడుస్తున్న ఇంత వరకు సినిమా ప్రారంభించకపోవటంపై రచయిత అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కేవలం మూడేళ్లకే చేయించుకున్నారని.. అయినా తాను మరో ఏడాది పాటు ఎక్కువగా ఎదురుచూసినా షూటింగ్ పనులు ఇంకా ప్రారంభించలేదంటూ దర్శక నిర్మాతలపై ఫైర్ అయ్యారు. నాయర్.. తన కథా కథనాలు తిరిగి ఇప్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించనున్నట్టుగా తెలుస్తోంది. -
రాజకీయ నాయకుడు!
హీరో సూర్యతో రాజకీయాలు చేస్తున్నారు మలయాళ నటుడు మోహన్లాల్. కానీ ఇది వెండితెరపై మాత్రమే. మరి.. ఈ రాజకీయ లబ్ధి ఎవరికి? అనేది తెలుసుకోవడానికి సమయం పడుతుంది. కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సాయేషా కథానాయికగా నటిస్తున్నారు. మోహన్లాల్, ఆర్య, బొమన్ ఇరానీ కీలక పాత్రలు చేస్తున్నారు. ఇందులో హీరో సూర్య నేషనల్ సెక్యూరిటీ కమాండో పాత్రలో కనిపిస్తారు. మోహన్లాల్ రాజకీయ నాయకుడి పాత్ర చేస్తున్నారని టాక్. మోహన్లాల్ లుక్కు చెందిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పై ఫొటో అదే. -
ప్రయాణానికి సిద్ధం
కుంజాలి మరాక్కర్ షిప్లో ప్రయాణించడానికి ఒక్కొక్కరుగా రెడీ అవుతున్నారు. హీరో మోహన్లాల్, దర్శకుడు ప్రియదర్శన్ ఈ షిప్ జర్నీకి శ్రీకారం చూట్టారు. ఇటీవలే బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, యాక్షన్ కింగ్ అర్జున్ ఈ షిఫ్ జర్నీకి ఓకే చెప్పారు. ఇప్పుడు ‘హలో’ ఫేమ్ కల్యాణీ ప్రియదర్శన్ కూడా వీరితో జాయిన్ అవుతాను అంటున్నారు. మోహన్లాల్ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘మరాక్కర్: అరబికడలింటే సింహమ్’ అనే సినిమా రూపొందనుంది. 16వ శతాబ్దం బ్యాక్డ్రాప్లో ఈ సినిమా కథనం ఉంటుంది. అప్పటి నేవల్ అధికారి కుంజలి మరాక్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో యంగ్ మోహన్లాల్గా ఆయన కొడుకు ప్రణవ్ మోహన్లాల్ నటిస్తారు. ఇందులోనే కల్యాణీ ప్రియదర్శన్ కూడా ఓ కీలక పాత్ర చేయబోతున్నారు. ప్రణవ్ మోహన్లాల్, కల్యాణి.. ఇద్దరూ తమ ఫాదర్స్తో ఒకే మూవీలో వర్క్ చేయబోతుండటం విశేషం. అంతేకాదండోయ్.. ఈ సినిమాలోని ఓ స్పెషల్ రోల్కి కీర్తీ సురేశ్ కూడా ఓకే చెప్పారట. క్యారెక్టర్ ప్రకారం ఆమె చియాంగ్ జువాన్ అనే చైనీస్ వ్యక్తిని లవ్ చేస్తారట. ఈ సినిమా షూటింగ్ నవంబర్ 1న స్టార్ట్ అవుతుంది. ఇదిలా ఉంటే.. తెలుగులో శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్ ఓ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే -
మోదీతో భేటిపై క్లారిటీ ఇచ్చిన స్టార్హీరో
తిరువనంతపురం : ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మలయాళం సూపర్స్టార్ మోహన్లాల్ భేటీ కావడం.. రాజకీయంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. మోహన్లాల్ బీజేపీలో చేరబోతున్నారని, 2019 లోక్సభ ఎన్నికల్లో ఆయనను తిరువనంతపురం నుంచి బరిలోకి దింపాలని ఆరెస్సెస్ గట్టిగా పట్టుబడుతోందని అనేక కథనాలు వెలువడ్డాయి. మోహన్లాల్ మోదీని కలవడంపై ఆయన అభిమానులు సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు మద్దతు తెలుపగా.. మరికొందరు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఊహాగానాలకు తెరదించుతూ మోహన్లాల్.. ప్రధానితో భేటీపై ఫేస్బుక్ వేదికగా వివరణ ఇచ్చారు. ‘ప్రధానితో నేను భేటి అయిన నేపథ్యంలో అనేక వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఓ భారత పౌరుడిగా నేను ఎప్పుడైనా ప్రధానిని కలవొచ్చు. ఈ భేటిలో ప్రధాని మోదీ నాతో ఒక్క పదం కూడా రాజకీయం గురించి మాట్లాడలేదు’ అని స్పష్టం చేస్తూ మలయాళంలో రాసిన 8 పేజీలను పోస్ట్ చేశారు. శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా మోహన్లాల్ ప్రధాని మోదీని కలిసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే ట్విటర్ వేదికగా ప్రధాని మోదీని కలువడం అదృష్టంగా భావిస్తున్నానని, తనకు చెందిన విశ్వశాంతిఫౌండేషన్ ద్వారా చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలను ఆయనకు వివరించానని వెల్లడించారు. -
జర్నలిస్టుకు క్షమాపణ చెప్పిన మోహన్లాల్
తిరువనంతపురం: మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్లాల్ ఓ జర్నలిస్టు ప్రశ్నకు తాను స్పందించిన తీరుపై క్షమాపణ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం కొచిలో కేరళ వరద బాధితుల సహాయర్థం విశ్వశాంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మోహన్లాల్ హాజరయ్యారు. ఆ సమయంలో ఓ జర్నలిస్టు క్రైస్తవ నన్పై జరిగిన అత్యాచారం ఘటన గురించి స్పందించాల్సిందిగా మోహన్లాల్ను కోరారు. దీనిపై ఒకింత ఆగ్రహానికి లోనైనా మోహన్లాల్.. ఇలాంటి కార్యక్రమం జరగుతున్నప్పుడు అలాంటి ప్రశ్న అడగటం సిగ్గుగా లేదా అని ఆ జర్నలిస్టుపై విరుచుకుపడ్డారు. మీరు అడిగినదానికి, ఈ కార్యక్రమానికి ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు. మోహన్ లాల్ వ్యాఖ్యలు వైరల్గా మారడంతో పలువురు నెటిజన్లు ఆయన వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపించారు. దీంతో ఈ ఘటనపై మోహన్లాల్ ఆదివారం తన ఫేస్బుక్లో స్పందిచారు. ‘నా సమాధానం మిమ్మల్ని బాధించి ఉంటే.. నన్ను మీ పెద్ద అన్నగా భావించి నా క్షమాపణను స్వీకరించగలరు. ఒక వ్యక్తినిగానీ, సంస్థనిగానీ కించపరచాలనే ఉద్దేశంతో నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. వరద బాధితుల సహాయక చర్యల గురించి నేను మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ ప్రశ్న ఎదురైంది. మీరు అడిగిన ప్రశ్న ప్రస్తుతం చర్చించాల్సిన అంశమే.. కానీ నేను ఆ సమయంలో ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా లేను. ఓ మనిషిగా, కొడుకుగా నేను వేరే ఆలోచనల్లో ఉండటం వల్ల అటువంటి సమాధానం వచ్చి ఉంటుంద’ని మోహన్ లాల్ ఆ పోస్ట్లో పేర్కొన్నారు. తన తల్లిదండ్రుల పేరిట మోహన్లాల్ విశ్వశాంతి ఫౌండేషన్ అనే ఎన్జీవోను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
న్యూలుక్లో సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కేవీ ఆనంద్ దర్శకత్వంలో తన 37వ సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్యతో పాటు మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, తమిళ యంగ్ హీరో ఆర్య, బాలీవుడ్ సీనియర్ యాక్టర్ బొమన్ ఇరానీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల లండన్ షూట్ ముంగించుకొని వచ్చిన చిత్రయూనిట్ ప్రస్తుతం చెన్నై సెకండ్ షెడ్యూల్ పనుల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈసినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో సూర్య కమాండోగా కనిపించనున్నాడు. కేవీ ఆనంద్ స్టైల్లో యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ ఫేం సయేషా సైగల్ హీరోయిన్గా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతమందిస్తున్నారు. -
మోదీతో సూపర్స్టార్ భేటీ.. వెల్లువెత్తిన ఊహాగానాలు!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మలయాళం సూపర్స్టార్ మోహన్లాల్ భేటీ కావడం.. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా మోహన్లాల్ సోమవారం ప్రధాని మోదీని కలిశారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించిన ఆయన.. ప్రధాని మోదీని కలువడం అదృష్టంగా భావిస్తున్నానని, తనకు చెందిన విశ్వశాంతిఫౌండేషన్ ద్వారా చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలను ఆయనకు వివరించానని తెలిపారు. ఈ పరిణామం పలు ఊహాగానాలకు తెరలేపింది. మోహన్లాల్ బీజేపీలో చేరబోతున్నారని, 2019 లోక్సభ ఎన్నికల్లో ఆయనను తిరువనంతపురం నుంచి బరిలోకి దింపాలని ఆరెస్సెస్ గట్టిగా పట్టుబడుతోందని కథనాలు వస్తున్నాయి. తిరువనంతపురం నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ నేత శశిథరూర్ ఎంపీగా ఉన్నారు. ఆయన మీద పోటీకి మోహన్లాల్ దింపాలని ఆరెస్సెస్ భావిస్తోంది. కేరళలో బీజేపీకి పెద్దగా పట్టులేదు. ఈ నేపథ్యంలో మోహన్లాల్ చేరిక పార్టీకి ఊపునిస్తుందని, ఇప్పటికే మలయాళం నటుడు సురేశ్ గోపీ బీజేపీలో చేరగా.. మోహన్లాల్ కూడా కమలం గూటికి చేరితే.. ఇక్కడ బలమైన పార్టీగా ఎదగవచ్చునని కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారని తెలుస్తోంది. It has been a privilege to meet our Honourable Prime Minister Shri. @narendramodi ji on this auspicious day of Janmashtami. Briefed him about @ViswaSanthiFndn and our multifaceted social initiatives. pic.twitter.com/Bj70R1g8nA — Mohanlal (@Mohanlal) 3 September 2018 -
అమ్మతో పెట్టుకుంటే అంతే సంగతులా?
ఈ ప్రపంచంలో ఎవరు మన మేలు కోరుకున్నా కోరుకోకపోయినా మనం బాగుండాలని కోరుకునే ఏకైక వ్యక్తి ‘అమ్మ’. తప్పు చేసినా క్షమించే గుణం అమ్మకి ఉంటుంది. మరి.. అమ్మతో పెట్టుకుంటే అంతే సంగతులా? అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. ఈ ‘అమ్మ’ వేరు. ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్’ (అమ్మ). కేరళ నటీనటుల సంఘం అన్నమాట. కథానాయిక భావనపై జరిగిన లైంగిక దాడిలో జోక్యం ఉందనే కారణంగా నటుడు దిలీప్పై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనివల్ల ‘అమ్మ’లో దిలీప్ సభ్యత్వం రద్దయింది. బెయిల్ మీద బయటికొచ్చిన దిలీప్ని మళ్లీ అసోసియేషన్లో చేర్చుకోవాలని ‘అమ్మ’ అధ్యక్షుడు మోహన్లాల్, ఇతర సభ్యులు నిర్ణయం తీసుకోవడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన నటీమణుల్లో రమ్యా నంబీసన్ ఒకరు. బాధిత నటికి అండగా ఉండటం కోసం ‘అమ్మ’కు ఆమె రాజీనామా చేసిన వెంటనే రమ్యా నంబీసన్, రీమా కల్లింగల్ వంటి తారలు తామూ రాజీనామా చేశారు. ఆ తర్వాత అవకాశాలు తగ్గుటున్నట్లు అనిపించిందని ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రమ్యా నంబీసన్ పేర్కొన్నారు. ‘‘అమ్మ’ నుంచి బయటికొచ్చాక అభద్రతాభావం ఏర్పడింది. అవకాశాలు తగ్గుతున్నాయని గ్రహించాను. అది మాత్రమే కాదు.. నేను షూటింగ్స్కి సరిగ్గా రానని, నిర్మాతలను ఇబ్బంది పెడతానని, అందుకని నన్ను తీసుకోకూడదనీ ప్రచారం చేస్తున్నారు. కానీ నేనెప్పుడూ ఎవర్నీ ఇబ్బందిపెట్టలేదు. ‘అమ్మ’ తీసుకున్న నిర్ణయాన్ని తోటి నటీమణులతో కలసి వ్యతిరేకించాను కానీ నేను ఏం మాట్లాడినా అది మొత్తం మగవాళ్లందర్నీ వ్యతిరేకిస్తున్నట్లు కాదు కదా. ఒక సమస్య ఉంది.. పరిష్కరించండి అన్నాం. అది తప్పా’’ అని రమ్యా నంబీసన్ అన్నారు. నిజమే కదా. నిర్భయంగా మాట్లాడితే లేనిపోని నిందలు వేయడం న్యాయమా? -
వెయ్యి కోట్లు.. రెండు భాగాలు
వెయ్యి కోట్ల భారీ చిత్రానికి వచ్చే ఏడాది జూలైలో ముహూర్తం కుదిరింది. మోహన్లాల్ ప్రధాన పాత్రలో రూపొందనున్న బహు భాషా చిత్రం ‘రన్డామూళమ్’. జ్ఞానపీuŠ‡ అవార్డు గ్రహీత ఎమ్టీ వాసుదేవన్ నాయర్ నవల ‘రన్డామూళమ్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. వీఏ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో బీఆర్ శెట్టి నిర్మించనున్నారు. ఈ సినిమాకు మలయాళంలో ‘రన్డామూళమ్’, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, కన్నడ, తమిళ్, తెలుగు భాషల్లో ‘ది మహాభారత’ అనే పేరును పరిశీలిస్తున్నారు. ‘‘ఈ సినిమా వచ్చే ఏడాది జూలైలో సెట్స్పైకి వెళ్లనుంది. కొందరు ఇండియన్ ఫేమస్ యాక్టర్స్ ఇందులో నటిస్తారు’’ అన్నారు నిర్మాత. రెండు భాగాలుగా రూపొందనున్న ఈ సినిమా తొలి పార్ట్ను 2020లో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. -
2018లో రెండోసారి
ఈ ఏడాది జనవరిలో ‘ఆది’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు మలయాళ నటుడు మోహన్లాల్ తనయుడు ప్రణవ్ మోహన్లాల్. ఈ సినిమాలో ప్రణవ్ నటన ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ప్రణవ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘ఇరుపతియొన్నామ్ నూటాన్డు’. రీసెంట్గా ‘రామాలీలా’ సినిమాతో మాలీవుడ్కు దర్శకునిగా పరిచయం అయిన అరుణ్గోపీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శనివారం మొదలైంది. ఇందులో కల్యాణీ ప్రియదర్శని కథానాయికగా నటించనున్నారన్న వార్తలు కూడా గతంలో వచ్చాయి. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. షూటింగ్ స్పీడ్గా జరిపి ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారని టాక్. సో.. ఈ ఏడాది రెండోసారి ప్రణవ్ కనిపిస్తారన్న మాట. ఈ సినిమా కాకుండా తండ్రి మోహన్లాల్ హీరోగా నటించనున్న ‘మరార్కర్’ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు ప్రణవ్. -
నటికి అన్యాయం.. సూపర్స్టార్కు షాక్!
తిరువనంతపురం : మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్కు చేదు అనుభవం ఎదురైంది. కేరళ ప్రభుత్వం ప్రకటించే సినిమా అవార్డుల ఫంక్షన్కు ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరుకానివ్వరాదని ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే వాదనలు వినిపిస్తున్నాయి. 100కు పైగా సినీ సెలబ్రిటీలు మోహన్లాల్కు వ్యతిరేకంగా మాట్లాడటం ఇండస్ట్రీలో చర్చనీయాశంగా మారింది. జాతీయ అవార్డు సాధించిన దర్శకుడు బిజుకుమార్ దామోదరణ్ అలియాస్ డీఆర్ బిజు ఇందుకు సంబంధించి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఓ నటికి అన్యాయం చేసిన నటుడికి ఆ గౌరవం ఇవ్వరాదని తన ఫేస్బుక్ పోస్ట్లో రాసుకొచ్చారు. నటీనటులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఈ సినీ అవార్డులను ఆహ్లాదకర వాతావరణంలో ఇవ్వాలి. అంతేకానీ ఆర్టిస్టులు వ్యతిరేకిస్తున్న వ్యక్తి సమక్షంలో, అందులోనూ ఆయన చీఫ్ గెస్ట్గా అవార్డు తీసుకోవడానికి ఎవ్వరూ ఇష్ట పడటం లేదు. అంతగా కావాలంటే సాంస్కృతికశాఖ మంత్రి సమక్షంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా సినీ అవార్డులు అందివ్వడం ఉత్తమమని’ డైరెక్టర్ డీఆర్ బిజు తన ఫేస్బుక్లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రకాష్రాజ్, ఎన్ఎస్ మాధవన్, సచిదానందన్, కేజీ శంకరన్ పిళ్లై, రాజీవ్ రవి, బినా పాల్, రిమా కల్లింగల్, శృతి హరహరన్, పలువురు సెలబ్రిటీలు మోహన్లాల్ను చీఫ్ గెస్ట్గా పిలవడాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో ఉన్నారని తెలిపారు. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మావీ ఆర్టిస్ట్స్(అమ్మ) అధ్యక్షుడిగా మోహన్లాల్ ఉన్నారు. అయితే నటి భావన కిడ్నాప్, వేధింపుల కేసు విచారణలో ఉండగానే నటుడు దిలీప్ను ‘అమ్మ’లో తిరిగి చేర్చుకోవడాన్ని అసోసియేషన్కు చెందిన పలువురు బహిరంగంగానే విమర్శించారు. నటికి సాయం చేయాలన్నా, ఆమెకు నిజంగా న్యాయం జరగాలంటే దిలీప్ను అసోసియేషన్ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని మలయాళ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు కోరినా ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో జరగనున్న అవార్డు పంపిణీ కార్యక్రమానికి మోహన్లాల్ను చీఫ్ గెస్ట్గా పిలవొద్దని డిమాండ్ చేస్తున్నారు. -
పొల్లాచ్చి పోదాం
లండన్ నుంచి పొల్లాచ్చికి షిఫ్ట్ అయ్యారు సూర్య. లండన్లో ఆపేసిన ఆపరేషన్ను పొల్లాచ్చిలో తిరిగి స్టార్ట్ చేయనున్నారట. కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్ను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నారు. మోహన్లాల్, ఆర్య కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాలో సాయేషా కథానాయిక. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ లండన్లో స్టార్ట్ అయింది. లేటెస్ట్ షెడ్యూల్ను పొల్లాచ్చిలో జరపనున్నారు. ఈ షెడ్యూల్లో సూర్యతో పాటు మిగతా చిత్రబృందం కూడా పాల్గొననున్నారు. -
నేనూ బాధితురాలినే: నటి
సాక్షి, సినిమా: నటి పార్వతీ మీనన్ నేనూ అలాంటి బాధితురాలినే అని అంటున్నారు. పూ, బెంగుళూర్ డేస్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ మలయాళీ భామ ఇటీవల మలయాళ సినీ సంఘం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. అంతకు ముందు సంఘం నుంచి తొలగించబడ్డ హీరో దిలీప్ను మళ్లీ సంఘంలోకి తీసుకోవడాన్ని పలువురు నటీమణులు తీవ్రంగా వ్యతిరేకించి సంఘం నుంచి బయటకొచ్చారు. అందులో నటి పార్వతీ మీనన్ కూడా ఉంది. నటి భావన కిడ్నాప్, అత్యాచారయత్నం కేసు విచారణలో ఉండగానే నటుడు దిలీప్ను సంఘంలో చేర్చుకోవడాన్ని పార్వతి ఖండించింది. దీని గురించి ఆమె ఒక భేటీలో పేర్కొంటూ.. సహ నటి కిడ్నాప్నకు గురైన సంఘటన గురించి తెలిసి తాను షాక్ అయ్యానన్నారు. ఆమెకు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని, ఇది తనను మరింత దిగ్బ్రాంతికి గురి చేసిందని తెలిపారు. తనకూ అలాంటి సంఘటన ఎదురైందని చెప్పారు. తనను కిడ్నాప్ చేసినవారెవన్నది ఇప్పుడు వెల్లడించి కూడా శిక్ష పడేలా చేయగలనని, అయితే అలా చేయడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. వారు ఏం చేయడానికైనా తెగిస్తారని, తనకు జరిగిన సంఘటనకు తాను మూలన కూర్చుని ఏడవలేదని, దాని నుంచి బయటపడగలిగానని అన్నారు. ఇలాంటి విషయాల్లో స్త్రీలు అవగాహనతోనూ, హెచ్చరికగానూ మసలుకోవాలని పార్వతీమీనన్ హితవు పలికారు. -
‘మలయాళ వెండితెర’పై మరక!
‘అమ్మ’ నిర్ణయం మలయాళ సినీ పరిశ్రమ ‘మాలీవుడ్’ గురించి ఏం చెబుతోంది? ఇది స్త్రీలకు అనుకూలం కాదు. ఇది పురుషాధిక్య భావజాలంతో మహిళలను ద్వేషించే రీతిలో నడుస్తోంది. నటులు తమ మేకప్ తీసేయగానే సినీ పరిశ్రమ సుందర దృశ్యం కానేకాదని మోహన్లాల్, ఆయన సహచరుల బృందం ప్రవర్తన నిరూపించింది. ఈ రంగంలో స్త్రీల స్థానం పురుషులతో పోల్చితే కింది స్థాయిలోనే ఉంది. దిలీప్ వంటి శక్తిమంతులైన మగాళ్లే మాలీవుడ్లో పెత్తనం చెలాయిస్తున్నారు. ఇది బాధితుల పక్షాన లేదని తేలిపోయింది. నటీమణులు, మహిళా సాంకేతిక నిపుణులు తమకు ఈ రంగంలో భద్రత ఉందనే భావనతో ఉండేలా చేయడంలో ‘అమ్మ’ విఫలమైంది. చేతులకు బేడీలతో ప్రసిద్ధ హాలీవుడ్ నిర్మాత హారీ వెయిన్స్టీన్ సోమవారం న్యూయార్క్ కోర్టులో నిలబడి ఉన్న దృశ్యాలను ప్రపంచ ప్రజలందరూ చూశారు. సినిమా అవకాశాల పేరుతో తమను లైంగికంగా, శారీరకంగా లొంగదీసు కున్నాడని వెయిన్స్టీన్పై 80 మందికి పైగా మహిళలు కిందటేడాది అక్టోబర్ నుంచీ ఆరోపణలు చేయ డంతో అతను కోర్టు విచారణను ఎదుర్కొంటు న్నాడు. ఈ ఆరోపణల ఫలితంగా అమెరికాలో, ప్రపం చవ్యాప్తంగా ఇలాంటి లైంగిక వేధింపులు, బలత్కా రానికి గురయ్యామంటూ వందలాది మంది స్త్రీలు ‘మేము సైతం’ (మీ టూ) పేరుతో సామాజిక మాధ్య మాల్లో తమకు జరిగిన అన్యాయాలను ధైర్యంగా వెల్ల డించారు. చివరికి ఈ అభియోగాలను పరిగణనలోకి తీసుకుని అత్యాచారం నేరంపై హాలీవుడ్కు చెందిన అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ నుంచి వెయిన్ స్టీన్ను బహిష్కరించారు. కానీ, లైంగిక వేధింపులు, రేప్ ఆరోపణలపై మాటలకే పరిమితమైన భారత చలన చిత్ర పరిశ్రమ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేరళలో ప్రముఖ నటి లైంగిక వేధింపులకు గురైన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. అనేక ప్రయోగాత్మక, ప్రగతిశీల సినిమాలకు పుట్టి నిల్లయిన మలయాళ సినీరంగంలో ఇలాంటిది జర గడం ఎందరినో కలవరపెట్టింది. బడా నిర్మాత అయిన వెయిన్స్టీన్పై ఆరోపణలు వచ్చిన విధంగానే కేరళ సినీ పరిశ్రమలో ఇలాంటి నేరానికి పాల్పడిన మలయాళ సూపర్స్టార్ దిలీప్పై కూడా లైంగిక వేధిం పుల కేసు నమోదైంది. ఆయన తనతో నటించిన ప్రముఖ నటిని అపహరించి, ఆమెను లైంగికంగా వేధించేలా కుట్రపన్నారనేది ఆయనపై కిందటి జూలైలో ఆరోపణలు వచ్చాయి. కేరళలోని కొచ్చి సమీ పంలో ఓ సినిమా షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా ఆమెను అపహరించి లైంగిక దాడికి పాల్ప డ్డాడు. హీరో దిలీప్ను అరెస్ట్ చేశాక 85 రోజులు జైల్లో గడిపాడు. 24 ఏళ్ల సినీ జీవితంలో 130కి పైగా సిని మాల్లో నటించిన దిలీప్ను అత్యంత శక్తిమంతమైన మలయాళీ సినీ కళాకారుల సంఘం (ఏఎంఎంఏ– అమ్మ) నుంచి బహిష్కరించారు. దిలీప్ను ఈ సంఘం నుంచి వెలివేయాలని నిర్ణయించినప్పుడు మలయాళ అగ్రశ్రేణి హీరోలు మమ్ముట్టి, మోహన్లాల్ ‘అమ్మ’ నాయకత్వ స్థానాల్లో ఉన్నారు. అంటే లైంగిక దాడికి గురైన నటికి మద్దతుగా సినీరంగ ప్రముఖులంతా తమ విభేదాలు విస్మరించి ఏకమయ్యారనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, చివరికి జరిగింది వేరు. ఈ పెద్దలపై పెట్టుకున్న నమ్మకం వమ్మయింది. ‘అమ్మ’ అధ్యక్షునిగా మోహ న్లాల్ నాయకత్వాన జరిగిన తొలి సమావేశంలో అనూహ్యంగా దిలీప్ను మళ్లీ సంఘంలోకి తీసుకోవా లని నిర్ణయించారు. దిలీప్పై బహిష్కరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలనే అంశం సమావేశం ఎజెం డాలో ఉందని మోహన్లాల్ చెబుతున్నా, అది నిజం కాదని ఇతర సభ్యులు అంటున్నారు. దిలీప్కు ‘అమ్మ’లో మళ్లీ స్థానం కల్పించాలని ‘ఏకగ్రీవంగా’ నిర ్ణయించినట్టు ప్రకటించడంతో వారు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ‘అమ్మ’ నిర్ణయంపై వెంటనే తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. బుధవారం నలు గురు నటీమణులు ‘అమ్మ’ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సంఘం తమ ఆశయాలకు అనుగు ణంగా పనిచేయడం లేదనే విషయం అందరికీ చెప్ప డమే వారి రాజీనామా లక్ష్యం. లైంగిక దాడి నుంచి బయట పడిన నటి తొలుత ఈ నటీనటుల సంఘం సభ్యతం వదులుకున్నారు. నా ఫిర్యాదును పట్టించుకోలేదన్న నటి హీరో దిలీప్ కుట్రకు బలైన నటి తన రాజీనామా లేఖలో తన బాధ వ్యక్తం చేశారు. ‘‘నాపై ఈ దాడికి ముందు నా సినిమా అవకాశాలను ఈ హీరో నాకు దక్కకుండా చేశాడు. అప్పుడు ఈ విషయమై నేను చేసిన ఫిర్యాదుపై ‘అమ్మ’ తగిన చర్య తీసుకోలేదు. ఇలాంటి దుర్మార్గమైన ఘటన జరిగినపుడు నేరం చేశాడనే ఆరోపణ వచ్చిన వ్యక్తిని ఈ సినీ నటుల సంఘం కాపాడడానికి ప్రయత్నించింది. ఇలాంటి సంఘంలో నేను సభ్యత్వం కలిగి ఉండడంలో ఎలాంటి ప్రయోజనం లేదని తెలుసుకుని నేను రాజీ నామా చేస్తున్నాను’’ అని ఆమె వివరించారు. దిలీప్కు మళ్లీ సభ్యత్వం ఇవ్వాలన్న ‘అమ్మ’ నిర్ణయం చట్టపరంగా చూస్తే ఆక్షేపణీయం కాదు. ఎందుకంటే, నేరం రుజువయ్యే వరకూ నిందితుడు అమాయకుడి కిందే లెక్క. కాని నిర్ణయం పూర్తిగా తప్పే. మళ్లీ సభ్య త్వం ఇవ్వడం ద్వారా ఆయన పక్షాన ఉన్నట్టు ఈ సంఘం చెప్పిందనే అభిప్రాయం కలుగుతోంది. దాదాపు ఏడాది పాటు ఈ సంస్థకు దూరంగా పెట్టడం ద్వారా దిలీప్కు వేసిన శిక్ష సరిపోతుందని తానే న్యాయమూర్తిననే భావనతో ‘అమ్మ’పై నిర్ణ యం తీసుకున్నట్టు కనిపిస్తోంది. అయితే, ఈ సంఘం నిర్ణయంపై వ్యతిరేక స్పందన రావడంతో దిలీప్ తాను నిర్దోషిగా తేలే వరకూ ‘అమ్మ’కు దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే, ఇది దిలీప్ సమస్య కాదు. ఇది అమ్మ, మలయాళ సినీ పరిశ్రమ, అత్యంత వైవిధ్యభరి తమైన నటునిగా పేరున్న మోహన్లాల్ పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం. ఈ సంఘటన జరిగిన వెంటనే కిందటేడాది ఫిబ్రవరిలో మోహన్ లాల్ దాడికి గురైన నటిపై ఎంతో సానుభూతితో, నిందితులపైన, అత్యాచారంపైన తీవ్ర ఆగ్రహంతో మాట్లాడిన తీరు చూశాక ఇప్పుడు ‘అమ్మ’ ఇలా వ్యవహరించడం తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ‘‘ఈ దాడికి పాల్పడిన నేరస్తులు జంతువుల కన్నా హీనం. వారికి తగిన శిక్ష విధించాలి. ఈ శిక్ష ఇలాంటి నేర మనస్తత్వమున్న దుర్మార్గులకు గుణపాఠంగా ఉండాలి. ఇలాంటి వ్యక్తులను మనుషులని కూడా నేను పిలవను. ఇలాంటి దుర్మార్గాలు జరిగినప్పుడు మనం కేవలం కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసన తెలిపే పద్ధతులకు స్వస్తి చెప్పాలి. ఇలాంటి పనులు చేయాలనే ఆలోచన కూడా ఎవరికీ రాకుండా మనం చట్టాల అమలు కట్టుదిట్టంగా జరిగేలా చూడాలి. ఇంతటి సంక్షోభ సమయంలో ఆమెకు నా హృద యపూర్వక సానుభూతి వ్యక్తం చేస్తున్నా. ఎలాంటి జాప్యం లేకుండా ఆమెకు న్యాయం జరగాలి,’’ అంటూ మోహన్లాల్ తన ఫేస్బుక్ పేజీలో ఉద్వే గపూరితంగా రాశారు. అయితే, దిలీప్ను మళ్లీ ‘అమ్మ’లోకి తీసుకోవాలన్న నిర్ణయంపై ఆయన వివరణ ఇస్తూ, ‘‘సంస్థ సర్వసభ్య సమావేశం ఏక గ్రీవ అభిప్రాయం ప్రకారం నడుచుకోవాలన్న మౌలిక ప్రజాస్వామిక మర్యాదకు అనుగుణంగా మాత్రమే ‘అమ్మ’ నాయకత్వం ఈ నిర్ణయం తీసు కుంది’’ అని చెప్పిన కారణం దారుణంగా కనిపి స్తోంది. ఈ నటిపై దాడి చేసిన వారు జంతువుల కన్నా ఘోరమైన వ్యక్తులని ఈ సంఘటన జరిగిన వెంటనే వ్యాఖ్యానించిన మోహన్లాల్ 16 నెలల్లో తన అభిప్రాయం మార్చుకోవడానికి కారణం ఏమి టి? ‘అమ్మ’ తన నిర్ణయం ద్వారా తనకేమీ నైతిక విలువలు లేవని నిరూపించుకుంది. ఈ సంస్థ సన్మా ర్గంలో నడపడానికి మోహన్లాల్ చేసిందేమీ లేదు.తనను విపరీతంగా అభిమానించే కేరళ ప్రజల ముందు ఈ మలయాళ సూపర్స్టార్ పలుచన య్యారు. మరీ ముఖ్యంగా ఈ దాడికి గురైన నటి కళ్ల ముందు ఆయన ఇమేజ్ దిగజారిపోయింది. మహిళా వ్యతిరేక సంస్థ ‘అమ్మ’! ‘అమ్మ’ నిర్ణయం మలయాళ సినీ పరిశ్రమ ‘మాలీ వుడ్’ గురించి ఏం చెబుతోంది? ఇది స్త్రీలకు అను కూలం కాదు. ఇది పురుషాధిక్య భావజాలంతో మహిళలను ద్వేషించే రీతిలో నడుస్తోంది. నటులు తమ మేకప్ తీసేయగానే సినీ పరిశ్రమ సుందర దృశ్యం కానేకాదని మోహన్లాల్, ఆయన సహచ రుల బృందం ప్రవర్తన నిరూపించింది. ఈ రంగంలో స్త్రీల స్థానం పురుషులతో పోల్చితే కింది స్థాయిలోనే ఉంది. దిలీప్ వంటి శక్తిమంతులైన మగాళ్లే మాలీ వుడ్లో పెత్తనం చెలాయిస్తున్నారు. ఇది బాధితుల పక్షాన లేదని తేలిపోయింది. నటీమణులు, మహిళా సాంకేతిక నిపుణులు తమకు ఈ రంగంలో భద్రత ఉందనే భావనతో ఉండేలా చేయడంలో ‘అమ్మ’ విఫలమైంది. ఈ దురదృష్టకర సంఘటన జరిగాక మలయాళ చిత్ర పరిశ్రమలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరుకు స్థాపించిన ‘విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ అనే సంస్థను ‘అమ్మ’ తన తాజా నిర్ణ యంతో వెక్కిరించినట్టయింది. నిజం చెప్పాలంటే దిలీప్పై మాలీవుడ్ నిర్ణయం ఆశ్చర్యం కలిగించడం లేదు. ఆయన బాగా జనాదరణ కలిగిన నటుడేగాక నిర్మాత, అనేక సినీ థియేటర్ల యజమాని. అరెస్టుకు ముందు ఐక్య కేరళ సినీ ఎగ్జిబిటర్ల సంఘం ఆయన ఆధ్వర్యంలోనే పనిచేసేది. ఇక్కడి సినీ పరిశ్రమను ‘అమ్మ’, ఈ చిత్ర ప్రదర్శకుల సంఘంతోపాటు కేరళ ఫిల్మ్ ఉద్యోగుల సమాఖ్య నియంత్రిస్తున్నాయి. ఈ పరిశ్రమ చిన్నదే కావడంతో దానిపై గుత్తాధిపత్యా నికి వీలవుతోంది. ఈ మూడు సినీ సంఘాలూ సూప ర్స్టార్ల నియంత్రణలో మాఫియాలా వ్యవహరిస్తు న్నాయని ప్రఖ్యాత నటుడు తిలకన్ ఆరోపించాక, ఆయనకు రెండేళ్ల పాటు సినిమాల్లో అవకాశాలు లేకుండా చేశారు. 2012లో ఆయన కన్నుమూసే వరకూ ఆయనను వెలేసినంత పనిచేశారు. కిందటే డాదే, మాలీవుడ్కు చెందిన అనేక మంది దిలీప్కు బహిరంగంగానే మద్దతు తెలిపారు. వారిలో ‘అమ్మ’ ఉపాధ్యక్షుడు, పాలక ఎల్డీఎఫ్ ఎమ్మెల్యే కేబీ గణేశ్కు మార్ కూడా ఉన్నారు. గతంలో దిలీప్ సాయం పొందినవారంతా ఆయనకు బాసటగా నిలవాలని కూడా ఆయన కోరడం దిగ్భ్రాంతి కలిగించింది. అదృష్టవశాత్తూ, కేరళ రాజకీయ నాయకులు మాత్రం బాధితురాలి పక్షానే నిలబడ్డారు. ‘అమ్మ’ నిర్ణయాన్ని కేరళ ఆర్థికమంత్రి థామస్ ఇసాక్ వ్యతిరేకించారు. ఇది ‘అమ్మ’ అంతర్గత వ్యవహారంగా చూడడానికి సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు ఎంఏ బేబీ నిరాక రిస్తూ, ‘ఈ సంస్థ సభ్యుల ప్రతి చర్యా మలయాళ సమాజాన్ని ప్రభావితం చేస్తుంది,’ అని తన ఫేస్ బుక్ పోస్ట్లో హెచ్చరించారు. ఇప్పుడు జరిగిన తప్పును సరిదిద్దుకోవడానికి మోహన్లాల్ నానా పాట్లు పడుతున్నారు. వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, టీఎస్ సుధీర్ ఈ–మెయిల్ : tssmedia10@gmail.com -
బిగ్బాస్లో ఆమెకు రోజుకు లక్ష రూపాయలు
ప్రాంతీయ భాషల్లో బిగ్బాస్ షో దూసుకెళ్తుంది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో బిగ్బాస్ రెండో సీజన్ నడుస్తుండగా.. మళయాళంలో బిగ్బాస్ తొలి సీజన్ ఇటీవలే మొదలైంది. ఈ షోకు వ్యాఖ్యాతగా మళయాళ సూపర్స్టార్ మోహన్లాల్ వ్యవహరిస్తున్నారు. సాధారణంగా బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టే సెలబ్రిటీలకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా సాధారణ ప్రజల్లో నెలకొంది. మళయాళం బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన 16మంది సెలబ్రిటీలకు భారీగానే పారితోషికాలు అందుతున్నాయని టాక్. బిగ్బాస్ నిర్వహకులు ప్రముఖ నటి శ్వేతా మీనన్కు హౌస్లో అందరికంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె బిగ్బాస్ హౌస్లో కొనసాగినన్ని రోజులు రోజుకు లక్ష రూపాయలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. మాజీ మిస్ కేరళ, ప్రముఖ యాంకర్ రంజిని హరిదాస్, శ్వేతా మీనన్ తర్వాతి స్థానంలో నిలిచారు. రంజినికి రోజుకు 80వేల రూపాయలు అందజేస్తున్నారు. మిగత కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్(రోజుకు) ప్రముఖ హాస్యనటుడు అనూప్ చంద్రన్- 71,000 నటి పర్ల్ మానే- 50,000 టీవీ నటి ఆర్చన సుశీలన్- 30,000 నటి హిమా శంకర్- 20,000 మిగతా కంటెస్టెంట్లు దీపన్, సాబు, మనోజ్ వర్మలు రోజుకు 10వేల వరకు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా మిగతా హౌస్ సభ్యులు శ్రీ లక్ష్మీ, దివ్య సన, సురేశ్, అదితి రాయ్, శ్రీనిష్ ఆరవింద్, బషీర్లు ఎంత తీసుకుంటున్నరనేది తెలియలేదు. -
అమ్మ వివాదం.. సూపర్ స్టార్ రిప్లై
తిరువనంతపురం: తీవ్ర దుమారం రేపిన అసోసియేషన్ ఆఫ్ మళయాళం మావీ ఆర్టిస్ట్స్(అమ్మ) నిర్ణయంపై అధ్యక్షుడు మోహన్లాల్ ఎట్టకేలకు స్పందించారు. నటుడు దిలీప్ ఆ నిర్ణయం ఏకపక్షంగా తీసుకుంది కాదని ఆయన స్పష్టం చేశారు. లండన్లో ఉన్న ఆయన ఈమేరకు మీడియాకు శనివారం ఓ లేఖ రిలీజ్ చేశారు. ‘‘‘అమ్మ’ మహిళా వ్యతిరేకి అన్న ఆరోపణలు సబబు కాదు. అసోషియేషన్లో ఏకీకృత విధానాలే అమలవుతుంటాయి. దిలీప్పై వేటు ఎత్తివేత నిర్ణయం నేనొక్కడినే తీసుకోలేదు. అది సభ్యులంతా సమీక్షించి తీసుకుంది. దీనివెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్నది నిజం కాదు’’ అంటూ ఓ పెద్ద వివరణతో కూడిన లేఖను మోహన్లాల్ విడుదల చేశారు. కాగా, అమ్మ అధ్యక్షుడిగా కొలువుదీరిన వెంటనే మోహన్లాల్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ దుమారం రేపింది. భావన ఉదంతం సమయంలో మోహన్లాల్ స్పందిస్తూ.. ఇండస్ట్రీలో ఆడపడుచులంతా తన అక్కచెల్లెళ్లతో సమానమని, వారికి ద్రోహం జరిగితే చూస్తూ ఉపేక్షించబోనని వ్యాఖ్యానించారు. అంతేకాదు దిలీప్ అరెస్ట్ అయిన వెంటనే అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. అయితే ఎనిమిది నెలల తర్వాత దిలీప్ బయటకు రావటం, తిరిగి సినిమాలు చేసుకుంటుండటంతో తిరిగి ఇప్పుడు నిషేధం ఎత్తేశారు. అయితే ఈ నిర్ణయం వెనుక కొందరు నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలు వినిపించాయి. పైగా అమ్మ సభ్యుల సంభాషణతో కూడిన ఓ ఆడియో క్లిప్ వాట్సాప్ వైరల్ అయి దుమారం రేపింది. రాజీనామాల పేరుతో హీరోయిన్లు బ్లాక్మెయిలింగ్కు దిగుతున్నారంటూ ఆ క్లిప్లో ఉంది. దీంతో వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్(డబ్ల్యూసీసీ) అమ్మపై మండిపడింది. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత ముదరక ముందే మోహన్లాల్ స్పందించారు. -
‘బిగ్బాస్’కు భారీ పారితోషికం..!
తిరువనంతపురం : ఇప్పటికే పలు భాషల్లో క్రేజీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్బాస్ ఈ ఏడాది మాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. తొలి సీజన్తోనే ప్రేక్షకులకు చేరువ అయ్యేందుకు మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ను హోస్ట్గా ఎంచుకుంది బిగ్బాస్ టీమ్. ఆదివారం (జూన్ 24న) ప్రారంభమైన బిగ్బాస్ మొదటి రోజున 16 మంది పోటీదారులను మోహన్లాల్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. కేరళ సంస్కృతికి అద్దం పట్టేలా బిగ్బాస్ హౌజ్ను రూపొందించారు. తన సినిమాల్లోని ఫేమస్ డైలాగ్స్తో ప్రారంభమైన షోను ఆద్యంతం తనదైన స్టైల్లో ముందుకు నడిపించారు మోహన్లాల్. ‘లాల్ సలామ్’ అనే చిట్చాట్ షోతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన మోహన్లాల్.. ప్రస్తుతం బిగ్బాస్ హోస్ట్గా వ్యవహరిస్తున్నందుకు భారీ పారితోషికం అందుకుంటున్నారని సమాచారం. మలయాళ నాట మోహన్లాల్కు ఉన్న క్రేజ్ దృష్ట్యా 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు బిగ్బాస్ టీమ్ ఒప్పుకుందని ఓ జాతీయ మీడియా పేర్కొంది. -
కొత్త డ్రామా
రాజవంశానికి చెందిన ఓ పెద్దాయన కన్ను మూస్తాడు. అంత్యక్రియలు ఘనంగా మొదల య్యాయి. అంతలో ఏదో డ్రామా జరిగిందట. మరి... ఈ డ్రామా సూత్రధారి ఎవరో తెలియాలంటే ‘డ్రామా’ సినిమా చూడాల్సిందే అంటున్నారు మోహన్లాల్. రంజిత్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘డ్రామా’ అనే టైటిల్ను ఖరారు చేశారు. కనిహా, కోమల్ శర్మ, అరుంధతి నాగ్, నిరంజ్, సిద్ధిక్ కీలక పాత్రధారులు. రంజాన్ సందర్భంగా టైటిల్ను ప్రకటించారు. ముందుగా ఈ సినిమాకు రిప్ (ఆర్.ఐ.పి) అనే టైటిల్ అనుకున్నప్పటికీ ఫైనల్గా ‘డ్రామా’ టైటిల్ను ఫిక్స్ చేశారట. మూడేళ్ల క్రితం వచ్చిన ‘లోహం’ చిత్రం తర్వాత మోహన్లాల్, రంజిత్ కాంబోలో వస్తున్న చిత్రమిది.