విభిన్న నేపథ్యంతో...
‘‘ఇప్పటివరకూ రక రకాల నేపథ్యాలతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో ఎవరూ ఊహించని నేపథ్యం కనిపించి, ఆశ్చర్యానికి గురి చేస్తుంది’’ అని నిర్మాత బొడ్డు దేవికిరణ్ చెప్పారు. శ్వేతామీనన్, బిజుమీనన్, సునీల్శెట్టి ముఖ్యతారలుగా జాతీయ ఉత్తమ దర్శకుడు బ్లెస్సీ దర్శకత్వంలో తమిళం, మలయాళంలో రూపొందిన చిత్రం తెలుగులో ‘మల్లెతీగ’గా అనువాదమైంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని సమర్పకులు బొడ్డు చంద్రశేఖర్రావు తెలిపారు. ఈ చిత్రానికి పాటలు: ఛత్రపతి శ్రీనివాస్, మాటలు: నౌండ్ల శ్రీనివాస్.