నాకా హక్కు ఉంది | Trisha Krishnan out from Saamy 2 | Sakshi

నాకా హక్కు ఉంది

Nov 29 2017 8:21 AM | Updated on Nov 29 2017 9:55 AM

Trisha Krishnan out from Saamy 2 - Sakshi

తమిళసినిమా: నాకా హక్కు ఉంది అంటోంది చెన్నై చిన్నది నటి త్రిష. సంచలనాలకు కేంద్రబిందువుగా పేరొందిన నటీమణుల్లో ముందుండే ఈ బ్యూటీ సమీపకాలంలో కాస్త సైలెంట్‌ అయ్యిందనుకుంటున్న సమయంలో అలా ఉండడం నా వల్లకాదు అన్నట్లుగా మళ్లీ వివాదాల్లోకి వచ్చేసింది. విక్రమ్, త్రిష నటించిన సామి చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. హరి దర్శకత్వం వహించిన ఆ చిత్రానికి తాజాగా సీక్వెల్‌ తెరకెక్కుతోంది. ఇందులో విక్రమ్‌కు జంటగా నటి త్రిష, కీర్తీసురేశ్‌లను నాయికలుగా ఎంపిక చేశారు. ఇంతకు ముందు విక్రమ్‌తో ఇరుముగన్‌ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన శిబు తమీన్‌ ఈ సామి–2ను రూపొందిస్తున్నారు. చిత్రం షూటింగ్‌కు రెడీ అవుతున్న సమయంలో అనూహ్యంగా త్రిష మీతో నాకు సెట్‌ కాలేదంటూ వైదొలిగింది. దీంతో షాక్‌కు గురైన చిత్ర నిర్మాత, నిర్మాతల మండలిలో త్రిషపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో వివరణ కోరుతూ నిర్మాతల మండలి త్రిషకు నోటీసులు జారీ చేసింది. 

చిత్రంలో నటి కీర్తీసురేశ్‌ ప్రాముఖ్యత ఉన్నట్టు, ఆమె కంటే తనకు సన్నివేశాలు తక్కువగా ఉన్నాయని, అందుకే చిత్రం నుంచి తప్పుకున్నట్లు త్రిష పేర్కొన్నట్లు ప్రచారం జరిగింది. అయితే అసలు కారణం అదికాదట. సోమవారం నిర్మాతల మండలి నోటీస్‌కు బదులిచ్చిన త్రిష అందులో పేర్కొంటూ తాను సామి– 2 చిత్రంలో ఒక్క సన్నివేశంలో కూడా నటించలేదని, అందువల్ల ఆ చిత్రం నుంచి వైదొలిగే హక్కు తనకు ఉందని అంది. అంతే కాదు తాను తీసుకున్న అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేస్తానని, వ్యక్తిగత కారణాల వల్లే తాను సామి–2 చిత్రం నుంచి తప్పుకున్నట్లు వివరణ ఇచ్చిందట. అయితే త్రిష వివరణకు నిర్మాతల మండలి సంతృప్తి చెందిందో లేదో తెలియదుగానీ, సామి–2 చిత్రంలో ఆమెను నటింపజేయడానికి సామరస్య చర్చలు మాత్రం జరుగుతున్నాయని సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement