
రోడ్డు ప్రమాదంలో 20 మంది దుర్మరణం
జమ్ము: జమ్ము కశ్మీర్లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదంపూర్ జిల్లా మరోతి లో ఓ బస్సు అదుపు లోయలోకి పడిపోయిన ఘటనలో 20మంది దుర్మరణం చెందారు. బస్సు జమ్ము నుంచి బద్రాస్కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సీనియర్ పోలీసు అధికారి సురీందర్ గుప్త ఆధ్వర్యంలో సహాయక చర్యలుకొనసాగుతున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.