మెదక్ తరహాలో మరో దుర్ఘటన.. రైలు ప్రమాదంలో 20 మంది మృతి | 20 killed in train accident in Bihar | Sakshi
Sakshi News home page

మెదక్ తరహాలో మరో దుర్ఘటన.. రైలు ప్రమాదంలో 20 మంది మృతి

Published Mon, Aug 18 2014 9:15 PM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM

మెదక్ తరహాలో మరో దుర్ఘటన.. రైలు ప్రమాదంలో 20 మంది మృతి

పాట్నా: మెదక్ రైలు ప్రమాద సంఘటన తరహాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. బీహార్లో రైల్వే క్రాసింగ్ వద్ద  రైలు ఆటోను ఢీకొన్న సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 20 మంది మరణించారు. తూర్పు చంపారన్ జిల్లాలో సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది.

ముజఫర్ పూర్- రప్తి గంగ ఎక్స్ ప్రెస్ రైలు ఆటోను ఢీకొన్న తర్వాత కొన్ని మీటర్ల మేర ఆటోను ఈడ్చుకుంటూ వెళ్లింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారు నుజ్జునుజ్జయ్యారు. ప్రయాణికుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. మృతుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడటంతో  ఆ ప్రాంతంలో భయానక వాతావరణం తలపిస్తోంది. మృతుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారు. ప్రమాద సంఘటనపై బీహార్ ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా మూసాయిపేట వద్ద ఇటీవల కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద రైలు స్కూలు బస్సును ఢీకొన్న సంఘటనలో 16 మంది విద్యార్థులు మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement