'జయలలిత త్వరగా కోలుకోవాలి' | After Hospital Visit, Amit Shah, Arun Jaitley Tweet 'Speedy Recovery' For Jayalalithaa | Sakshi
Sakshi News home page

'జయలలిత త్వరగా కోలుకోవాలి'

Published Wed, Oct 12 2016 4:52 PM | Last Updated on Mon, May 28 2018 3:58 PM

'జయలలిత త్వరగా కోలుకోవాలి' - Sakshi

'జయలలిత త్వరగా కోలుకోవాలి'

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రిని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బుధవారం సందర్శించారు. జయలలిత ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇరువురు నేతలు 20 నిమిషాల పాటు ఆస్పత్రిలో గడిపారు. తర్వాత మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

జయలలిత ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు చెన్నై అపోలో ఆస్పత్రికి వెళ్లామని ట్విట్టర్ ద్వారా వారు తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న జయలలిత 20 రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సెప్టెంబర్ 22న ఆమె ఆస్పత్రిలో చేరారు. బ్రిటన్, ఢిల్లీ ఎయిమ్స్ వైద్య బృందం పర్యవేక్షణలో ఆమెకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement