ఎయిరిండియా జీఎంగా కేఎస్ రెడ్డి | Air India appoints K S Reddy as new GM, Commercial | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా జీఎంగా కేఎస్ రెడ్డి

Published Tue, Mar 24 2015 6:13 PM | Last Updated on Sat, Sep 2 2017 11:19 PM

ఎయిర్ ఇండియా సంస్థ దక్షిణాది ప్రాంతీయ జనరల్ మేనేజర్గా కేఎస్ రెడ్డి నియమితులయ్యారు.

ఎయిర్ ఇండియా సంస్థ దక్షిణాది ప్రాంతీయ జనరల్ మేనేజర్గా కేఎస్ రెడ్డి నియమితులయ్యారు. ఎయిరిండియా వాణిజ్య విభాగానికి ఆయన జీఎంగా ఉంటారు. ఎయిరిండియాలో 32 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న రెడ్డి.. ఇంతకుముందు కంపెనీ ప్రధాన కార్యాలయంలో జనరల్ మేనేజర్ (మార్కెట్ ప్లానింగ్)గా వ్యవహరించారు.

1983లో ఎయిరిండియాలో మేనేజ్మెంట్ ట్రైనీగా చేరిన కేఎస్ రెడ్డి (57) సంస్థలో వివిధ హోదాల్లో పనిచేశారు. నాగ్పూర్, అహ్మదాబాద్ నగరాల్లో స్టేషన్ మేనేజర్గాను, బ్యాంకాక్లో కంట్రీ మేనేజర్గా కూడా ఆయన ఉండేవారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement