చిక్బల్లాపూర్: కర్ణాటకలో చిక్బల్లాపూర్ జిల్లాలోని బాజేపల్లిలోని ఆస్పత్రిలో ఉద్రిక్తత నెలకొంది. చికిత్స పొందుతూ నందీష్(9) అనే బాలుడు మంగళవారం మృతి చెందాడు. చికిత్స చేయడంలో నిర్లక్షంగా వ్యవహరించారంటూ వైద్యులపై బాధితుడి బంధువులు దాడికి దిగారు. ఆస్పత్రిపై బంధువులు దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు.