
‘సుప్రీం’ ఆదేశాలను అపహాస్యం చేయడమే
న్యూఢిల్లీ: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో తెలపాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాష్ర్ట ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు.
ఆయన సోమవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో ఈ నెల 8వ తేదీలోపు చెప్పాలని సుప్రీం కోర్టు శాసనసభ స్పీకర్ను ఆదేశించిందన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు అఫిడవిట్ దాఖలు చేయలేదన్నారు. ఇది రాజ్యాంగంపై ప్రభుత్వానికి ఎంత గౌరవం ఉందో తెలియజేస్తున్నదన్నారు. అత్యున్నత ధర్మాసనం ఆదేశించినా ప్రభుత్వం స్పందించకుండా అనైతిక చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు.